ఏపీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై సినీ నిర్మాత.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. ‘డైమండ్ రాణి-పులుసుపాప’- అంటూ ఆయన కామెంట్లు చేశారు. “రోజా డైమండ్ రాణి.. పులుసు పాప.. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్” అన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు చేపల పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అయ్యారని.. దీనిలో తప్పేముందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేపోమాపో …
Read More »ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా భావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సైన్యంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కోసం, ఆరుగాలం కష్టపడే రైతుల కోసం ఆయన తన ఆదాయం నుంచి ఎన్ని కోట్లు ఇచ్చారో చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఎలా సంపాదిద్దాం అనే చూస్తారు కానీ.. చేతిలో ఎముక లేని విధంగా జనం కోసం డబ్బులు ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. …
Read More »పార్టీ ఏదైనా బీసీలకే టాప్ ప్రయారిటీ ?
రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరు అనుకుంటున్నదే. అందుకనే ఏ పార్టీ అయినా బీసీలకే టాప్ ప్రయారిటి ఇస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు టీడీపీ, జనసేన కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 99 మంది మొదటిజాబితాలో ఉత్తరాంధ్ర విషయం తీసుకుందాం. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. …
Read More »పవన్ కు జోగయ్య లేఖ..చంద్రబాబునూ ఇరికించారు
టీడీపీ-జనసేన పొత్తుల నేపథ్యంలో విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై కొంతమంది టీడీపీ-జనసేన నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలకు అసంతృప్త నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కొందరు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు …
Read More »జనసైనికులకు ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాస్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించడంపై జనసైనికుల్లో ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సీట్ల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండాలని, పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ రచ్చ నడుస్తోంది. ఐతే ఈ విషయంలో టీడీపీని విమర్శిస్తూ.. పవన్ కళ్యాణ్ను కూడా తప్పుబడుతున్న …
Read More »బ్రదర్ అనిల్ రంగం లోకి దిగారు
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ సువార్తీకుడు.. బ్రదర్ అనిల్ కుమార్ పరోక్షంగా సీఎం జగన్ ప్రభుత్వంపైనా.. జగన్పైనా విమర్శలు గుప్పించారు. “అన్యాయాన్ని ఆ దేవుడే ఓడిస్తాడు“ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికలకు ముందు ప్రత్యేక పర్యటనలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కీలకమైన ప్రాంతాలలో చర్చలకు వెళ్లి ప్రత్యేక `ప్రార్థన`లు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ చిత్తూరు జిల్లాలోని ఎస్సీ …
Read More »వైసీపీలో చేతులు దులిపేసుకున్న వైవీ!
వైసీపీ కీలక నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సమన్వయ కర్త.. వైవీసుబ్బారెడ్డి వివాదాలకు నిలయంగా మారారనే టాక్ వినిపిస్తోంది. ఈయన పార్టీ ని ఏమేరకు డెవలప్ చేశారో తెలియదు కానీ, పార్టీని మాత్రం నిలువెత్తు వివాదాలలో కప్పెట్టారని అంటున్నారు వైసీపీ నేతలు. వరుస విమర్శలతో ఆయన వైసీపీని ఇరుకున పెడుతున్నారు. ఏపీకి మరో రెండేళ్లు హైదరాబాద్ నే రాజధానిగా కోరుకుంటున్నామని.. కేంద్రానికి ఈ మేరకు నివేదిక కూడా సీఎం జగన్ …
Read More »షర్మిల ఫస్ట్ మీటింగ్.. కాంగ్రెస్కు జోష్ పెరిగినట్టేనా?
ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన.. తొలి ఎన్నికల సభ ఫుల్లుగా సక్సెస్ అయిందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అనంతపురంలో సోమవారం రాత్రి నిర్వహించిన న్యాయ సాధన సభ ఆ పార్టీలో జోష్ నింపింది. అయితే.. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షాలు సహా అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటి వరకు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలితే.. తాము లబ్ధి పొందుతామని.. ప్రతిపక్షాలు …
Read More »అర్ధరాత్రి నిర్ణయం.. ఎనిమిది మందిపై అనర్హత వేటు!
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వీరంతా పార్టీలు మారిన వారే కావడం గమనార్మం. ఇటీవల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపి, టీడిపి పార్టీలు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై న్యాయ నిపుణుల సలహా …
Read More »మా పార్టీకి ఓటేస్తే ప్రతినెలా ఇంటింటికీ 5 వేలు
ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల పథకాన్ని ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. ఏపీలో పేద కుటుంబాలకు నెల కు రూ.5 చొప్పున ఆర్థికసాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్న ఖర్గే.. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఏపీలోనూ పథ కాలు సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి …
Read More »కేసీయార్ కీలక సమావేశం
కేసీయార్ తన ఫాం హౌజ్ లో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితతో చాలాసేపు భేటీ అయ్యారట. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రచారం, ఎంపిక చేయాల్సిన అభ్యర్ధులు, క్యాడర్ను నడిపించే బాధ్యతలు, అభ్యర్ధులకు నేతల మధ్య సమన్వయం తదితరాలపైనే చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత నలుగురితో ఒకేసారి కేసీయార్ …
Read More »10 వేల కోట్లపైన కన్నేసిందా ?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 10 వేల కోట్ల పై కన్నేసింది. అర్జంటుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను అమలుచేయాలంటే ఏడాదికి రు. 1.53 లక్షల కోట్లు అవసరం. అయితే అంతటి ఆదాయం ప్రభుత్వానికి లేదన్నది వాస్తవం. అందుకనే మొన్నటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలుకు కేటాయించింది రు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates