వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ముచ్చటగా మూడో సారి కూడా గద్దెనెక్కాలనే ఆశతో ఉంది. ఆ దిశగా పట్టుదలతో సాగుతోంది. కానీ అదంత సులభం కాదని ఆ పార్టీకి తెలుసు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి తగ్గుతున్న ఆదరణ.. ప్రభుత్వ వైఫల్యాలు.. కరోనా కట్టడిలో విఫలం.. పెరుగుతున్న ఇంధన ధరలను కట్టడి చేయలేకపోవడం.. ఇలా ప్రజల్లో మోడీపై వ్యతిరేకత పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ …
Read More »వైసీపీ ఎంపీపై ట్రోలింగ్ మామూలుగా లేదే!
ఇప్పటి వరకు ఒకరిద్దరు ఎమ్మెల్యేల దూకుడుతో అధికార పార్టీ వైసీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వీరి వల్ల పార్టీ అధిష్టానం సమాధానం చెప్పుకొనే వరకు పరిస్థితి వచ్చింది. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేలను పక్కన పెడితే.. ఎంపీ కారణంగా పార్టీ పరువు.. జాతీయస్థాయిలో ఇరుకున పడుతోందని అంటున్నారు వైసీపీనేతలు. ఈ చర్చ.. సొంత పార్టీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. ఆయనే రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ఉన్నత విద్యావంతుడు అయిన మార్గాని.. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి …
Read More »అందుకే ఏపీలో అభివృద్ధి లేదు: వైసీపీ నేత
వైసీపీ పాలనపై కొంతకాలంగా సొంత పార్టీ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో టెర్రరిజం, నక్సలిజం పోయాయని కానీ, లోకల్ మాఫియా పెరిగిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు…ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న …
Read More »పేర్ని నాని, వర్మల మధ్య రాజీ
ఏపీలో సినిమా టికెట్ల వివాదం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాకతో రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రులు వర్సెస్ వర్మగా జరుగుతున్న మాటల యుద్ధం తార స్థాయికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానాలివ్వడం…దానికి బదులుగా వర్మ మరికొన్ని ప్రశ్నలు సంధించడంతో….ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చినికి చినికి గాలివానగా మారిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని …
Read More »నడ్డా అడ్డా ఎర్రగడ్డ: KTR
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. సంజయ్ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో, టీఆర్ఎస్ సర్కార్ పై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని నడ్డా …
Read More »పవన్ ఓట్ల శాతం పెరిగే ఛాన్స్?
ఏపీలో రాజకీయాలు చూస్తుంటే రేపే పోలింగా అనేటట్లుగా ఉంది. అంత స్పీడయిపోయాయి పాలిటిక్స్. ముఖ్యంగా ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాపు నేతలు పార్టీలకు అతీతంగా వేగం పెంచారు. వరుస భేటీలు జరుగుతున్నాయి.. సంచలన ప్రకటనలు వస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు అయిదు జిల్లాల్లో కాపు నేతల కదలికలు మహా స్పీడుగా ఉంది. కాపు నేతలు ఒక్కసారిగా వేగం పెంచడంతో ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. వంగవీటి రాధా పార్టీ …
Read More »బాబు.. లోకేష్.. ప్రజల్లోకి ఎలా?
టీడీపీకి రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో గెలవడం అత్యవసరం. ఆ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోతే ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి అంతే. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానం ముగింపునకు చేరుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై బాబు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. …
Read More »మంత్రి నాని మరిచిన ఒక లాజిక్
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన సమస్యల మీద జనాల దృష్టి నిలవకూడదని, వాళ్లను డైవర్ట్ చేయాలని చూస్తున్నారో ఏమో తెలియదు కానీ.. కొంత కాలంగా అక్కడ సినిమా టికెట్ల ధరల వ్యవహారమే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. చిన్న స్థాయి నాయకుల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఈ అంశం గురించి తెగ స్పందించేస్తున్నారు. ఈ విషయం మీదే ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లో కూడా మంత్రులు పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు …
Read More »టీడీపీ-జనసేన: నాదెండ్లకు తెనాలి సీటు..?
ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అవుతుందో లేదో తెలియదు గానీ..ఆ రెండు పార్టీల పొత్తు గురించి చర్చలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అసలు రెండు పార్టీలు కలిస్తేనే జగన్కు చెక్ పెట్టడం సాధ్యం అవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మేరకు టీడీపీ – జనసేన పార్టీ నేతల అంతర్గత చర్చల్లోనూ ఇదే …
Read More »మోడీ భేటీతో ఏపీకి మరో అప్పు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆ సందర్భంగా ఆయన పాత డిమాండ్లను సరికొత్తగా ఆయన ముందు పెట్టటం.. వాటిని పరిశీలిస్తానని చెప్పటం.. అదే విషయం మీడియాలో రావటం తెలిసిందే. మోడీతో సీఎం జగన్ భేటీ తర్వాత ఏం జరిగింది? అన్న విషయానికి వస్తే.. ఏపీకి రూ.2500 కోట్ల కొత్త అప్పునకు ఓకే చెప్పటమే కాదు.. గంటల వ్యవధిలోనే …
Read More »కాపుల్లో ఆధిపత్య గొడవలు?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. కాపులకు రాజ్యాధికారం దక్కాలనే డిమాండ్ ఎప్పటినుండో వినిపిస్తున్నదే. ఇదే విషయమై ఇప్పటికి కాపుల్లోని ప్రముఖులతో చాలా సమావేశాలే జరిగాయి. అయితే సమావేశాలు సమావేశాల్లాగే మిగిలిపోయాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇపుడు కాపు ప్రముఖుల మధ్య సమావేశాలు మొదలయ్యాయి. గడచిన నెలరోజుల్లో మూడుసార్లు సమావేశమయ్యారు. ఇక్కడే అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. అదేమిటంటే కాపులకు నాయకత్వం వహించేందుకు పోటీ మొదలైనట్లే అనుమానంగా …
Read More »గట్టి అభ్యర్ధుల కోనం టీడీపీ వేట
తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధుల కోసం వేట మొదలుపెట్టింది. తొందరలోనే 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ కారణాలతో 22 మున్సిపాలిటీలకు అప్పట్లో ఎన్నికలు జరగలేదు. కాలపరిమితి ముగియని కారణంగా, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 22 మున్సిపాలిటీలకు తొందరలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇదే విషయమై చంద్రబాబు నాయుడు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎన్నికలు జరగాల్సిన 22 మున్సిపాలిటీల పరిధిలోని నేతలు కూడా ఈ సమావేశంలో …
Read More »