Political News

టికెట్ల గొడవపై మంచు విష్ణు మాట

Manchu Vishnu

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్ని నెలలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. దీని గురించి ఇండస్ట్రీ తరఫున చాలామంది మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో పరిశ్రమ తరఫున పెద్దలు వెళ్లి చర్చలు జరిపారు. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని గురించి రోజూ సోషల్ మీడియాలో మంచు విష్ణు మీద కౌంటర్లు పడుతూనే …

Read More »

మాయావతి, మమత తెలిసే ఇలా చేస్తున్నారా?

ఇపుడిదే అంశం జాతీయ రాజకీయాల్లో చాలా మందికి అర్థం కావడం లేదు. పైకేమో నరేంద్ర మోడీని గద్దె దింపాల్సిందే అంటు భీకరమైన ప్రకటనలు చేస్తుంటారు. కానీ చేసే పనులేమో మోడీకి అనుకూలంగానే కనబడుతున్నాయి. దాంతో వీరిద్దరి వైఖరి ఏమిటో మిగిలిన పార్టీల అధినేతలకు అర్థం కావటం లేదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా ? వాళ్ళే దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్లుగా పాపులరైన మమతాబెనర్జీ, మాయావతి. వీళ్ళద్దరు ఘనమైన …

Read More »

ఏం జరుగుతోందో జగన్ చూస్తున్నారా ?

సొంత జిల్లాలో ఏమి జరుగుతోందో జగన్మోహన్ రెడ్డికి తెలుస్తోందో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కన పెట్టేసినా కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో రెగ్యులర్ గా నేతల మధ్య జరుగుతున్న గొడవలు పెద్దవైపోయాయి. ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంఎల్సీ రమేష్ యాదవ్ మధ్య గొడవలు చినికి చినికి గాలివానలా పెరిగిపోతున్నాయి. తాజాగా వీరిద్దరి వర్గాల మధ్య జరిగిన గొడవలో ఎంఎల్సీ మద్దతుదారుడు తీవ్రంగా గాయపడటమే ఆశ్చర్యంగా ఉంది. …

Read More »

వైసీపీ ఎంపీకి షాకిచ్చిన సైబర్ చీటర్

మాయమాటలు చెప్పి డబ్బులు దోచేసే వాళ్లు ఈ మధ్యన ఎక్కువయ్యారు. ఆశ వల విసరడం… అందులోకి తేలిగ్గా చిక్కుకుపోయే వారు సామాన్యులే కాదు ప్రముఖులు ఉంటున్నారు. ఈజీగా వచ్చే డబ్బుల మీద ఉండే ఆశే దీనంతటికి కారణం. ఇలాంటి సైబర్ చోరులు ప్రముఖుల్ని టార్గెట్ చేసి.. భారీ మొత్తాలకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే ఒకటి వైసీపీ ఎంపీకి ఎదురైంది. అయితే.. ఆయన అప్రమత్తంగా ఉండటంతో సైబర్ దొంగ చేతిలో …

Read More »

ఎంపీ రఘురామ హత్యకు కుట్ర జరిగిందా ?

తనను హత్య చేయించేందుకు ఏపీలో కుట్ర జరిగిందని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని ప్రభుత్వంపైన, జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణల్లో తాజాగా చేసిన తన హత్య కుట్ర అనే ఆరోపణలు చాలా కీలకమైనవి. హత్యకు ఎవరు కుట్ర చేశారంటే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేశారట. జగన్ తో పాటు సునీల్ నుండి తనకు ప్రాణహాని ఉందంటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకే ఎంపీ లేఖ రాశారు. …

Read More »

జ‌గ‌న్ ద‌గ్గ‌ర అంత `సీన్‌` ఉందా..

ఏపీ సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర చ‌నువు అంటే మాట‌లు కాదు. ఎంతో సీనియ‌ర్ అయిన నాయ‌కుడు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి .. జంకుతాడు. జ‌గ‌న్ ప‌క్క‌న కూర్చొనేందుకు, ఆయ‌న‌తో మాట్లాడేందుకు కూడా ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే నాయ‌కులు ఉన్నారు. కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల‌కు మాత్ర‌మే.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర చ‌నువు ఉంది. ఇలాంటివారిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్యనారాయ‌ణ‌, కొడాలి నాని వంటివారు ఉన్నారు. అయితే.. …

Read More »

ఏపీ మంత్రుల మ‌ధ్య ఆసక్తికరమైన చర్చ

రాజ‌కీయాల్లో చాలా విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. అవి ప్ర‌జ‌ల‌కు నేరుగా సంబంధించిన‌వి అయినా.. కాక పోయినా.. నేత‌లు చేసే వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మార‌తాయి. ఇలానే తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, తూర్పు గోదావ‌రికి చెందిన‌ మంత్రి ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాధార‌ణంగా.. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులంటే నే నేత‌లు విరుచుకుప‌డుతుంటారు. ఇది స‌హ‌జం కూడా. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థుల‌ను కార్న‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ వారిని …

Read More »

కార్యకర్త పాడె మోసిన చంద్రబాబు

మరో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 33 మంది టీడీపీ నేతలు.. కార్యకర్తలు హత్యకు గురి కావటం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు స్వయంగా వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన.. హతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. …

Read More »

కుప్పంలో ఆప‌రేష‌న్ క్లీన‌ప్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరులోని కుప్పంలో పార్టీని సంస్క‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఆప‌రేష‌న్ క్లీన్ అప్ పేరుతో కుప్పంలో పార్టీని గాడిలో పెట్టే ప‌నిచేప‌ట్టారు. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కుఉన్న నాయ‌కుల‌ను న‌మ్మి తాను మోస‌పోయాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు కొత్త‌గా మ‌ధ్య‌స్థాయి నేత‌ల‌ను, నాయ‌క‌త్వాన్నితీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు. ఒక్క కుప్పంలోనే కాకుండా.. అన్ని ముఖ్య నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చంద్ర‌బాబు.. పార్టీని గాడిలో పెట్టే చ‌ర్య‌లుచేప‌ట్టారు. అయితే.. త‌న …

Read More »

జ‌న‌సేనాని.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు మ‌రో చిక్కు వ‌చ్చి ప‌డిందా?  ఆయ‌న ఎటూ తేల్చుకోలేక పోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నేత‌లు. తాజాగా ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూ.. పొత్తుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, …

Read More »

జగన్ నమ్మకం పోగుట్టుకున్నాడా?

అభివృద్ధి, విజన్ అనే పదాలు  టీడీపీ అధినేత చంద్ర‌బాబు కి సూటవుతాయని అంటుంటారు. అలాగే డబ్బులు, పథకాలు పంచే విషయంలో  ప్ర‌స్తుత సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సూటవుతాయని అంటారు. ఒకరు పని ఇంకొకరు చేస్తామన్నా జనం పెద్దగా నమ్మడం లేదు. దీనికి ఒక మంచి ఉదాహరణ… హ్యాపీనెస్ట్ వర్సెస్ ఎంఐజీ. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. ఇప్పుడు జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు.. తీసుకున్న నిర్ణ‌యాలివి.  అప్ప‌ట్లో అమ‌రావ‌తి స‌మీపంలో …

Read More »

రైతులకు పెన్షన్ పథకమా ?

తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద …

Read More »