Political News

మా అన్నకు ఓటు వేయొద్దు: వైఎస్ సునీత

తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు శిక్ష పడాలని వైఎస్ సునీతా రెడ్డి గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే తనకు న్యాయం జరగడం లేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సునీత పలుమార్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ పై సునీత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ …

Read More »

రెండుసార్లు సర్వే చేయించుకున్నారా ?

రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలోసస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీచేయబోతున్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంనై ప్రచారం జరిగినా మళ్ళీ ఎందుకో మరుగునపడిపోయింది. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ ప్రచారం …

Read More »

సెగలు పుట్టిస్తున్న ‘మేడిగడ్డ’ రాజకీయం

తెలంగాణాలో మేడిగడ్డ బ్యారేజి రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. బ్యారేజీ నాసిరకం నిర్మాణం కారణంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరగటమే కాకుండా బ్యారేజి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజి పనికిరాకుండా పోతే దీని ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పనికిరాదని మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతిని, నాసిరకం నిర్మాణంపై క్షేత్రస్ధాయి …

Read More »

ఉద‌యం టీడీపీ.. రాత్రికి వైసీపీ.. ఖానా మజాకా!!

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకున్నాయి. ఇక్క‌డ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలను ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డి టికెట్‌ను టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంలో భాగంగా జ‌న‌సేన‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ విష‌యంపై ఇంకా అదికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అయితే.. దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న రాక‌ముందే.. జ‌లీల్ ఖాన్‌.. త‌న‌దైన శైలిలో మారాం …

Read More »

రాజ‌కీయ పార్టీలోకి చేరిన ద‌స్త‌గిరి.. పోటీపై క్లారిటీ

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి.. ఆయ‌ననే ఓడిస్తానంటూ.. వ్యాఖ్య‌లు చేసిన ద‌స్త‌గిరి తాజాగా ఓ రాజ‌కీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హ‌త్య చేసిన నిందితుల్లో ద‌స్త‌గిరి ఒక‌డు. అయితే.. త‌ర్వాత కాలంలో అప్రూవ‌ర్‌గా మారిపోవ‌డం.. బెయిల్ రావ‌డంతో ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు ఉన్నాడు. అయితే.. ఆయ‌న రెండు రోజుల కింద‌ట హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ.. తాను …

Read More »

ఢిల్లీ టూర్‌కు మిత్ర ధ్వ‌యం.. పొత్తు ఖాయ‌మేనా?

టీడీపీ, జనసేన పార్టీల అధ్య‌క్షులు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తుపై వారు చ‌ర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై రెండు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టి ఇప్ప‌టికే బీజేపీతో పొత్తు ఖరారు అయినట్లు చెబుతున్నారు. మ‌రోవైపు చివ‌రి విడ‌త చ‌ర్చ ల కోసం వెళ్తున్నార‌ని మ‌రికొందరు అంటున్నారు. ఇదిలావుంటే.. ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మార్చి …

Read More »

ఇవే చివ‌రి ఎన్నిక‌లు.. వైసీపీ యువ నేత

వైసీపీ యువ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రెండో కుమారుడు మిథున్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం రాత్రి రాజంపేట‌లో నిర్వ‌హించిన వైసీపీ నేత‌ల ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని వ్యాఖ్యానించారు. తాను రెండు సార్లు రాజంపేట ఎంపీగా విజ‌యం ద‌క్కించుకోవ‌డంలో నాయ‌కులు, కార్య‌కర్త‌లు ఎంతో శ్ర‌మించార‌ని.. వారిని తాను మ‌రిచిపోలేన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని అన్నారు. “రాజంపేట అభివృద్ధికి …

Read More »

కురుక్షేత్ర యుద్ధంలో మీరు ఎటు వైపు?

మ‌రికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జ‌ర‌గ‌బోతోంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. ఈ యుద్ధంలో మీరు(మ‌హిళ‌లు) ఎటువైపు నిల‌బ‌డుతున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు. రాజ‌కీయంగా రాష్ట్రాన్ని నాశ‌నం చేసిన వైసీపీ వైపు నిల‌బ‌డితే.. మీ కు భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. చంద్ర‌బాబు కోసం నిల‌బ‌డితే.. మీ పిల్ల‌ల భ‌విత‌వ్యం బంగారు బాట ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. నిజం గెలవాలి పేరుతో నారా భువ‌నేశ్వ‌రి యాత్ర‌లు చేస్తున్న …

Read More »

కొడుకు ‘యువగళం’.. తండ్రి ‘ప్ర‌జాగ‌ళం’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోవినూత్న కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నారు. వ‌చ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేలా పార్టీ రూప‌క‌ల్ప‌న చేసింది. దీనికి ప్ర‌జా గ‌ళం అని పేరుపెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐదు రోజుల పాటు నిర్విరామంగా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌నున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాద‌యాత్ర‌లు కూడా చేయ‌నున్నారు. ప్ర‌జాగ‌ళం కార్య‌క్ర‌మంలో కేవ‌లం చంద్ర‌బాబు …

Read More »

జ‌న‌సేన‌కు మెగా ఫ్యామిలీ స్టార్ క్యాంపెయిన‌ర్‌

జ‌న‌సేన పార్టీకి మ‌రో స్టార్ క్యాంపెయిన‌ర్ రెడీ అయ్యారు. అది కూడా మెగా కుటుంబం నుంచే కావ‌డం గ‌మ నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని కూడా చెప్ప‌డం విశేషం. అయితే.. ఆ స్టార్ క్యాంపెయిన‌ర్‌.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె కొణిదెల నిహారిక‌. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ మేర‌కు వ్యాఖ్య‌లు చేశారు. బాబాయి(జ‌న‌సేనాని ప‌వ‌న్‌)తో క‌లిసి …

Read More »

నిజంగెల‌వాలి.. ఎన్నిక‌లు వ‌చ్చేదాకా!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువనేశ్శరి పరామర్శిస్తున్నారు. ఇప్పటివరకూ 8 టూర్లలో కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి చెక్కులు ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో భువనేశ్వరి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైన ఆమె.. రాజ‌కీయంగా కూడా దూకుడు పెంచారు. వైసీపీని అంతం చేసేందుకు క‌లిసి …

Read More »

నారా లోకేష్ ఎందుకు రాలేదు?

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖరారై సీట్ల పంపిణీలో కూడా ఒక అవగాహనకు వచ్చాక కొన్ని రోజుల కిందటే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఉమ్మడి ప్రెస్ మీట్‌తోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లయింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం ‘జెండా’ పేరుతో తొలి ఉమ్మడి బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం యువనేత, నారా చంద్రబాబు …

Read More »