అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ మాత్రం వాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందులోకి విజయవాడ లాంటి బడా సిటీకి నగర మేయర్ గా ఉండటం అంటే మాటలా? చెప్పండి. అందుకే కాబోలు తన సత్తా అందరూ మాట్లాడుకోవాలని డిసైడ్ అయ్యారో ఏమో కానీ.. బెజవాడ టౌన్ లోని మల్టీఫ్లెక్సుల యజమానులకు ఆమె రాసిన లేఖ గురించి తెలిసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. అందులో విషయం అలాంటిది మరి.విజయవాడ నగరపాలక సంస్థ …
Read More »ఏపీలో ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు.. బడ్జెట్లో వెల్లడి
ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పింది. గతంలో అసెంబ్లీ వేదికగా.. సీఎం జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నెరర్చింది. ఎమ్మెల్యేలకు ఇక కాసుల వర్షం కురియనుంది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రతి ఎమ్మెల్యేకి.. రూ.2 కోట్ల రూపాయలను కేటాయించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు ఈ నిధులు అందించనున్నామని.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్లు భారం పడుతుందని మంత్రి …
Read More »ప్రజలు మెచ్చిన కమెడియన్.. 11 ఏళ్లలోనే సీఎం
తన జోకులతో.. నటనతో.. ప్రజలను నవ్వించిన హాస్యనటుడు ఇప్పుడు పంజాబ్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. కమెడియన్గా ప్రజల మనసు దోచుకున్న ఆయన.. ఇప్పుడు ఓట్లు కూడా కొల్లగొట్టి తొలిసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనే ఆమ్ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీని పాలించేది ఆయనే. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టిన 11 ఏళ్లకే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం విశేషం. …
Read More »సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత.. క్షేమం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు. వైద్యులు కేసీఆర్కు పలు పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్కు గుండె, యాంజియో, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించినట్లు సీఎంవో వెల్లడించింది. విషయం తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ సైతం.. సోమాజిగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను …
Read More »సంక్షేమానికే జగన్ పెద్దపీట.. బడ్జెట్లో భారీ కేటాయింపులు
ఏపీ ప్రభుత్వం తాజాగా 2022-23 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. దీనిలో ఎక్కువగా వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. భారీ ఎత్తున నిధులు కేటాయించింది. పింఛన్లు, రైతు భరోసా, ఉన్నత విద్య, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ వివరాలు.. ఇలా ఉన్నాయి.. కేటాయింపులు.. *వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు*వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 …
Read More »ప్రముఖులందరినీ ఒకేసారి ఊడ్చేసిన ఆప్
ఎన్నికల్లో పాల్గొన్న ప్రముఖులు ఒక్కోసారి ఓడిపోవటం సహజంగా జరుగుతున్నదే. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. కానీ పోటీచేసిన ప్రముఖులంతా ఒకే పద్దతిలో ఓడిపోవటం అన్నది మాత్రం దేశంలోని ఏ రాష్ట్రంలోను జరిగినట్లు లేదు. ఈ రికార్డు పంజాబ్ లో మొట్టమొదటిసారి నమోదైంది. విషయం ఏమిటంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ప్రముఖులంతా ఆప్ చేతిలోనే ఓడిపోవటం విచిత్రంగా ఉంది. ఓడిన ప్రముఖులు మామూలు ప్రముఖులు కాదు. అత్యంత …
Read More »కేసీఆర్ కింకర్తవ్యం.. ఫ్రంట్కా? వెనక్కా?
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటే.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా అనుకునే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి దెబ్బ పడుతుందని, ఒకవేళ యూపీలో గెలిచినా ఆదరణ తగ్గుతుందని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ క్రమంగా బలహీనపడడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. మోడీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతుందని భావించిన ఆయన.. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీపై పోరు సై అన్నారు. కానీ ఇప్పుడు ఆయన …
Read More »వికటించిన పంజాబ్ ఫార్ములా.. భట్టి ఆశలు గల్లంతు!
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయోగించిన పంజాబ్ ఫార్ములా వికటించిందా..? ఈ ఫార్ములాతో విజయం సాధించి మిగతా రాష్ట్రాల్లో కూడా జెండా ఎగరేయాలన్న ఆశలకు గండిపడిందా..? మరోసారి దీనికి మొగ్గు చూపే సాహసం చేస్తుందా..? ఈ ఫార్ములాపైనే ఆశలు పెట్టుకున్న తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశలు ఆదిలోనే అడుగంటాయా..? అంటే పొలిటికల్ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. పంజాబ్ పై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని …
Read More »చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ కూడా నన్నే అడుగుతున్నారు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు బామ్మర్ది కూడా హిందూపూర్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ తమను కోరారని, చంద్రబాబు కూడా తన సొంత నియోకవర్గం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని అడుగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఈ రెండు ఘటనలతో ఎవరికి ఎంత విజన్ ఉందో అర్ధమవుతోందని, దీనిని ప్రజలు గమనించాలని చంద్రబాబు, బాలకృష్ణలకు …
Read More »బొత్స ఇంటి వేడుకల్లో టీడీపీ యువ నేత
రాజకీయాల్లో శత్రుత్వం ఏమీ ఉండదు.. జస్ట్ పైకి మాట్లాడినంత కోపాలూ తాపాలూ లోపల ఉండవు. ఉండకూడదు కూడా! నిన్నటి వేళ బొత్స ఇంటి వేడుకలకు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. కుమారుడు డాక్టర్ సందీప్ వెడ్డింగ్ రిసెప్షన్ కు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. ఓ టీడీపీ యువ నేత మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయనే మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున. వచ్చే …
Read More »బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయి: రాజా సింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని …
Read More »నిరుద్యోగుల థ్యాంక్స్ కేసీఆర్కా? ప్రశాంత్ కిషోర్కా?
తెలంగాణలో కొంత కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తు వచ్చిన ఆయన ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ భర్తీ ప్రక్రియ ఎప్పటి వరకూ సాగుతుందో తెలీదు కానీ మొత్తానికి కేసీఆర్ నుంచి ఆ ప్రకటన రావడంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మరి దీనికి వాళ్లు సీఎం …
Read More »