తెలంగాణలో తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలు రేవంత్ రెడ్డికి పెద్ద సవాలనే చెప్పాలి. జాతీయస్థాయిలో ఎన్డీయేనే మూడోసారి అధికారంలోకి రాబోతోందని జాతీయ మీడియా సంస్థలు సర్వేలు జోస్యాలు చెబుతున్నాయి. అలాగే గెలుపు మీద నరేంద్రమోడి నూరుశాతం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇదే సమయంలో ఇండియా కూటమి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బాగా డీలా పడిపోతోంది. కూటమిలో పోటీచేయాల్సిన సీట్ల సర్దుబాటుపై నానా అవస్తలు పడుతున్నాయి. కూటమిలోని భాగస్తులైన ఆప్ కన్వీనర్ అరవింద్ …
Read More »ఈ ఇంజనీరుకు టికెట్ దక్కుతుందా ?
కడప జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమి టికెట్లను ప్రకటించలేదు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మొదటిజాబితాలో ప్రకటించిన సీట్లు నాలుగుమాత్రమే. పులివెందులలో బీ టెక్ రవి, రాయచోటిలో రామ్ ప్రసాద్ రెడ్డి, కడపలో మాధవీరెడ్డి, మైదుకూరులో సుధాకర్ యాదవ్ పోటీచేయబోతున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. మిగిలిన ఆరుసీట్లలో ఎన్ని సీట్లలో టీడీపీ పోటీచేస్తుంది పొత్తులో జనసేనకు ఎన్నిసీట్లు ఇస్తుందనే విషయం సస్పెన్సుగా మిగిలింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రైల్వేకోడూరు, బద్వేలు …
Read More »జనసేన అభ్యర్ధిని మారుస్తున్నారా ?
పార్టీలో ఇపుడి విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. విషయం ఏమిటంటే విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుండి పోటీచేయాలని టీడీపీ సీనియర్ నేత కళావెంకటరావు చాలా ప్రయత్నాలు చేసినా కుదరలేదు. సీట్ల సర్దుబాటులో నెల్లిమర్ల జనసేన ఖాతాలోకి వెళ్ళింది. దాంతో ఇక్కడి నుండి లోకం మాధవి పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రకటనకు ముందునుండే మాధవి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. …
Read More »మోడీ 2 వేల విరాళం ఎందుకు అడిగారో తెలుసా?.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలనే పిలుపు వింటూనే ఉన్నాం. ఒక్క బీజేపీ అనేకాదు.. ఏ రాజకీయ పార్టీ అయినా.. ఇదే కోరుతుంది. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకు వేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆర్థికంగా కూడా ప్రజలే బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాను భూరి విరాళం ఇస్తున్నట్టు ప్రకటించుకున్నారు. చెప్పినట్టుగానే ఆయన రూ.2000 లను బీజేపీ జాతీయ నిధికి విరాళంగా అందించారు. …
Read More »ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం: కేసీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత ఖాయమని, ప్రజలే తిరగబడతరని అన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశా నిర్దేశం …
Read More »పవన్ని కలిస్తే.. జగన్ ఊరుకుంటాడా
వైసీపీకి జనసేనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు ఆరణి శ్రీనివాసులు నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశారు. తన రాజకీయ భవితవ్యంపై చర్చించారు. అంతే.. ఈ విషయం బయటకు లీక్ కాగానే వైసీపీ అధినేత, సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. ఆరణిని …
Read More »పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవు
ఏపీలో త్వరలో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని, ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని, టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని టీడీపీ, జనసేన నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఐప్యాక్ మాజీ …
Read More »400 కోట్ల రూపాయల ఫామ్ హౌస్ నాశనం!
“ఆ.. ఎంతో మంది అక్రమాలకు పాల్పడుతున్నారు.. నేను ఈ మాత్రం తీసుకుంటే తప్పేంటి?” అనే మాట తరచుగా వినిపిస్తుంది. కానీ, పాపపు సొమ్ము ఎప్పుడూ నిలబడదు. చివరకు.. అది ఎక్కడకు చేరాలో.. ఎవరికి వెళ్లాలో.. అక్కడికే వెళ్లిపోతుంది. జనాల్ని దోచుకుని.. అక్రమ మార్గాలు, వక్రమ మార్గాల్లో సంపాయించిన సొమ్ము..చివరకు సర్కారుకు చేరిన ఘటన ఢిల్లీలో జరిగింది. దాదాపు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తిని సర్కారు బలగాలను పెట్టి మరీ …
Read More »కీలక నేతలకు క్లాసు ?
రాబోయే ఎన్నికల్లో పార్టీలోని కీలక నేతలంతా తప్పకుండా పోటీ చేయాల్సిందే అని బీజేపీ ఏపీ ఇన్చార్జి శివప్రకాష్ స్పష్టంగా చెప్పేశారు. ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే విషయమై అవలంభించాల్సిన విధివిధానాలపై రెండురోజుల పాటు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం శని, ఆదివారాల్లో పార్టీ ఆఫీసులోనే జరుగుతోంది. ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ చాలామంది నేతలు మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకం …
Read More »ఏపీ సచివాలయం తాకట్టు.. బాబు రియాక్షన్ ఇదే!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ్యాన్ని రూ.370 కోట్ల అప్పు కోసం తాకట్టు పెట్టడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇంతకన్నా తప్పుడు పని, దుర్మార్గం మరొకటి లేదని పేర్కొ న్నారు. ఇది రాష్ట్రానికి అత్యంత అవమానకరమని పేర్కొన్నారు. ‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను నాశనం చేశారు. …
Read More »అసమ్మతి నేతలను బీజేపీ పట్టించుకోలేదా ?
తెలంగాణాలో విడుదలైన బీజేపీ ఎంపీ అభ్యర్ధుల మొదటిజాబితాను చూసిన తర్వాత ఇదే విషయం అర్ధమవుతోంది. మొదటిజాబితాలో పార్టీ అగ్రనేతలు తొమ్మిది స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సికింద్రాబాద్ నుండి కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ కు టికెట్లు దక్కాయి. వీరుముగ్గురు ప్రస్తుతం పై నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగో స్ధానం ఆదిలాబాద్ లో ఎంపీ …
Read More »సీనియర్ తమ్ముళ్ళు అడ్డం తిరుగుతున్నారా ?
నియోజవర్గాలను మార్చి పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. రాబోయే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు చేయాల్సిన అవసరం అధినేతకు వచ్చింది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దాంతో వాళ్ళని అకామిడేట్ చేయటం కోసం సీనియర్ తమ్ముళ్ళని నియోజకవర్గాలు మారమని చంద్రబాబు అడుగుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గాల్లోనే తాము పోటీ చేస్తామని గట్టిగానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates