రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన విరాళాల వివరాలను బయట పెట్టి తీరాల్సిం దేనని సుప్రీంకోర్టు మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు.. ఎంతెంత ఇచ్చారు? ఎవరెవరు దీనిని తీసుకున్నారు. వంటివివరాలను వెల్లడించాల్సిందే. దీనిలో మినహాయింపు లేదు అని తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి ఈ కేసును గత వారమే విచారించిన కోర్టు.. బాండ్ల వివరాలను …
Read More »గ్రీన్ మ్యాట్లా.. ఇది మరీ విడ్డూరం
సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు కొంత కాలంగా ఊదరగొట్టేస్తున్నారు. ఆ పేరుతో సభలు నిర్వహించడంతో పాటు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐతే ‘సిద్ధం’ సభలన్నీ జగన్ జన బలాన్ని చూపించే లక్ష్యంతోనే సాగుతున్నాయి. తొలి సభకు 3 లక్షల మంది హాజరైతే.. రెండో సభకు 6 లక్షల మంది వచ్చారన్నారు. మూడో సభకు 10 లక్షల టార్గెట్ …
Read More »జగన్, మమతా.. సేమ్ టు సేమ్!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అయితే.. వీటిలో కొన్ని పార్టీలు వ్యూహాలకు సంబంధించి సంస్థలను పెట్టుకున్నాయి. వీటిలో ఐప్యాక్ కీలకంగా పనిచేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. ఈయన మాట ఎలా ఉన్నా.. ఐప్యాక్ మాత్రం ప్రాంతీయంగా చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్, ఏపీ అధికార పార్టీ వైసీపీకి, తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి కూడా పనిచేస్తోంది. దీంతో …
Read More »నేటితో లెక్కలు తేలిపోనున్నాయి
గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పొత్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్లుగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్తో పాటు తమ …
Read More »‘వైసీపీ మళ్లీ వస్తే.. రాయలసీమ రాజస్థానే!’
“వైసీపీ మళ్లీ వస్తే.. రాయలసీమ రాజస్థానే!”అని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అని వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఒక్క రాయల సీమ నుంచే 53 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఉరవకొండలో 3వేల మందికి …
Read More »“రా.. తేల్చుకుందాం.. మొగోడు ఎవరో”
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ మరోసారి సవాల్ రువ్వారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఎవరు మొగోడు ఎవరో తేల్చుకుందాం రావాలంటూ.. కామెంట్సు చేశారు. తన సవాల్కు స్పందించి మల్కాజ్గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. …
Read More »సిద్ధం సభలో తొక్కిసలాట.. ఒకరు మృతి
ఏపీ అధికార పార్టీ వైసీపీ బాపట్ల జిల్లాలోని మేదరమెంట్ల శివారు ప్రాంతంలో నిర్వహించిన సిద్ధం నాలుగో విడత, చివరిదైన సిద్ధం సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో సభకు వచ్చిన తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సభలో తీవ్ర అలజడి చెలరేగింది. సిద్ధం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. నాలుగో సభ కావడంతో గత మూడు సభలకు మించి జనాలను …
Read More »చంద్రబాబుకు కలలో కూడా నేనే కనిపిస్తున్నా: జగన్
“టీడీపీ అధినేత చంద్రబాబుకు కలలో కూడా నేనే కనిపిస్తున్నా.. ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదంట.. పాపం ఈ వయసులో చాలా కష్టపడుతున్నారు” అని వైసీపీ అదినేత, సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా బాపట్లలోని మేదర మెట్లలో నిర్వహించిన సిద్ధం చివరి సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ గుండెల్లో జగన్ రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. వారికి కనీసం నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. “నన్ను …
Read More »కేసీఆర్కు షాక్.. నలుగురు కీలక నేతల జంప్!
తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వాస్తవానికి వీరు ముందుగానే పార్టీ మారుతారని తెలిసినా.. కేసీఆర్, కేటీఆర్ …
Read More »ఈ సారి జగన్ పంచ్లు ఇవే!
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. సిద్ధం సభలలో మహాభారతంలోని పేర్లను, ఘట్టాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. తొలి సభలో అర్జునుడు, అభిమన్యుడు పేర్లు ప్రస్తావించగా, రెండో సభలో దుర్యోధనుల గుంపు అని ప్రతిపక్షాలను ఎండగట్టారు. ఇక, మూడో సభలో మయ సభ, మాయా జూదం గురించి ప్రస్తావించారు. ఇక, తాజాగా శకుని, పాచికలు, జమ్మిచెట్టు, కురుక్షేత్రం వంటివాటిని ప్రస్తావించారు. జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని …
Read More »ఇదంతా ఎవరి డబ్బు జగన్?
సీఎం జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలకు ప్రజల సొమ్ములు ఖర్చు పెడుతున్నారని.. దీనిని అందరూ నిలదీయాలని ఆమె అన్నారు. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలకు జగన్ గారు 600 కోట్లరూపాయల ప్రజల సొమ్మును తగలబెడుతున్నారు. ఇది ఆయన జేబులో సొమ్ము కాదు.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు. దీనిని …
Read More »యువ నేతను టెన్షన్ పెడుతున్న చంద్రబాబు!
టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్రెడ్డి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం అందుకోవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆయన తిరుగుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు. యువతను కూడా కూడగడుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజలకు చేరువ అవుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు బొజ్జల సుధీర్రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates