Political News

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల పాటు సాగడం విశేషం. కానీ.. ఎక్క‌డా బ‌య‌ట‌కు కూడా పొక్క‌కుండా మొత్తం క్ర‌తువును పూర్తి చేశారు. చివ‌రి రోజు పూర్ణాహుతి సంద‌ర్భంగా మాత్ర‌మే మీడియాకు ఫొటోలు విడుద‌ల చేశారు. బుధ‌వారం చివ‌రి రోజు నిర్వ‌హించిన పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఒక్క‌రే ఈ యాగంలో పాల్గొని క్ర‌తువులు పూర్తి …

Read More »

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది. ఆంధ్రాలో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా ? వైసీపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఎవరు గెలుస్తారు ? ఎంత మెజారిటీ వస్తుంది ? అన్న ప్రాతిపదికన …

Read More »

ఉండిలో త్రిముఖ పోరు.. ర‌ఘురామ ఫేట్ ఎలా ఉంది?

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో అంద‌రినీ ఆక‌ర్షించిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నారా లోకేష్ బ‌రిలో ఉన్న‌ మంగ‌ళ‌గిరి, చంద్ర‌బాబు పోటీ చేసిన కుప్పం, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల పోటీ చేసిన క‌డ‌ప పార్ల‌మెంటు స్థానంతోపాటు.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. టీడీపీ నాయ‌కుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పోటీ చేసి ఉండి అసెంబ్లీ స్థానం. ఈ ఐదు స్థానాల‌పైనా.. ఎక్కువ …

Read More »

మా కోసం ప్ర‌చారం చేస్తారా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. ప్ర‌ధాని మోడీ బిగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. మోడీ వ‌రుస‌గా మూడోసారి కూడా.. ప‌ర‌మ ప‌విత్ర కాశీ నియోజ‌క‌వ‌ర్గం(వార‌ణాసి) నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేష‌న్ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల‌కు కూడా ఆయ‌న ఆహ్వానం పంపించారు. దీంతో చంద్ర‌బాబు కూడా అక్క‌డ‌కు వెళ్లారు. నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీని చంద్ర‌బాబు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ స‌మ‌యంలో …

Read More »

పోటెత్తిన ఓట‌రు 81.6 శాతం ఓటింగ్‌.. ఎవ‌రికి ప్ల‌స్‌?

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు సాగింది. ఇది నిర్ణీత స‌మ‌యం క‌న్నా 1గంట ఎక్కువ‌. ఇక‌, ఇత‌ర 47 పోలింగ్ బూతుల్లో రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు, 34 చోట్ల రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు కూడా జ‌రిగింది. దీంతో పోలింగ్ శాతం 70 అనుకున్న‌ది కూడా.. …

Read More »

కేజ్రీ బెయిల్ లాభమా ? నష్టమా ?

మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెయిల్ మీద బయటకు రావడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదరవుతాయి అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కేజ్రివాల్ ఈ రోజు లక్నో, 16న జమ్‌షెడ్‌పూర్‌, …

Read More »

బీజేపీకి మ్యాజిక్‌ ఫికర్‌ !

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏడు దశల పోలింగ్ లో నాలుగు దశలు పూర్తయ్యాయి. జూన్ 1తో ఏడో దశ పోలింగ్ ముగియనున్నది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే 400 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని విపరీతంగా చెమటోడుస్తున్న బీజేపీ పార్టీ ఈ సారి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదన్న వార్తలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల …

Read More »

హింసపై కదిలిస్తున్న రొంపిచెర్ల వాసి ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో గతంలో ఎన్నికలు అంటే గ్రామాలు రణరంగంగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో నెలకొన్న హింసను చూసి గతంలో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాసిన కథనం అందరినీ కదిలిస్తుంది. “ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తుకొస్తోంది. 1995-96 సమయంలో …

Read More »

అఫీషియల్..ఏపీలో 80.66 శాతం పోలింగ్

ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ ఓటర్లలో భారీగా చైతన్యం కనిపించిందని, అందుకే పోలింగ్ శాతం భారీగా నమోదైందని మీనా ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ 1.07 శాతం కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే మొత్తం పోలింగ్ 79.80 నమోదైంది. 2019 …

Read More »

చంద్రబాబు సూపర్ అలర్ట్

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. అంతా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్ గురించి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి, గ‌వ‌ర్న‌ర్ కు సైతం బాబు లేఖ‌లు రాశారు. ఆయా లేఖ‌ల్లో జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విష‌యం ఏంటంటే.. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచి లబ్ధిదారులకు ఇవ్వల్సిన …

Read More »

జగన్ కు జెండా ఊపిన సీబీఐ కోర్టు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో!

“సేమ్ టు సేమ్‌..! అప్పుడు కూడా ఇంతే.. ఈ ఓట‌ర్లు మ‌హా ముదుర్లు బ్రో”- ఇదీ.. ఇప్పుడు ఏపీ పోలింగ్ స‌ర‌ళిపై ఏ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాట‌. 2019లోనూ ఇదే త‌ర‌హా పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. అర్ధ‌రాత్రి 12 నుంచి 1 గంట వ‌ర‌కు కూడా పోలింగ్ జ‌రిగింది. క్యూలైన్ల‌లో మ‌హిళ‌లు వేచి ఉన్నారు. పైగా 2014తో పోల్చుకుంటే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2014లో 77 శాతం …

Read More »