ఏపీలో జరుగుతున్న కల్తీసారా మరణాలు, జేబ్రాండ్స్ అమ్మకాలు వంటి అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు సభలు కూడా ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. జనసేన కీలక నేత … నాగబాబు స్పందించారు. సీఎం జగన్పై తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం …
Read More »జగన్ చెప్పిందే నిజమైతే.. దేశంలో మిగిలేది మద్యమేనా?
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాను ప్రవేశ పెట్టిన, అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే కారణమని చెప్పారు. దీనిని చాలా మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికలకు ముందు మద్య నిషేధం అంటూ జగన్ పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు …
Read More »కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి?.. జగన్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. పరిపాలన వికేంద్రీకర ణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమ తులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు. కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే …
Read More »మూడు రాజధానులే.. మడమ తిప్పేది లేదు.. అసెంబ్లీలో జగన్ ప్రకటన
మూడు రాజధానుల (వికేంద్రీకరణ) విషయంలో వెనకడుగు వేయబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గమన్నారు. అందరికీ మంచి చేయడమే ప్రభుత్వం ముందన్న మార్గమని, రాబోయే తరాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం, గౌరవం ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. …
Read More »రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో చర్చ..
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత పురాతన లిఖిత రాజ్యంగం 1788లో అమెరికాది. మన దేశంలో రాజ్యాంగం 72 ఏళ్ల కింద 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం తమను కాపాడుతుందన్న భరోసాలో ప్రతీ ఒక్కరు ఉంటారు. మన లక్ష్యం ఎంత గొప్పదో.. మార్గం కూడా అంత గొప్పగా ఉండాలని గాంధీ చెప్పారు. ఎవరి …
Read More »TDP: పొత్తులు వద్దే వద్దు.. ఒంటరిపోరే ముద్దు
ఏపీ ప్రధాన పప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికలపై తీవ్రస్తాయిలో కసరత్తు చేస్తోంది. ఎలా వెళ్లాలి? ఏవిధంగా పోటీ చేసి విజయం దక్కించుకోవాలి? వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా గద్దె దింపాలి? అనే అంశాలపై తీవ్రం గానే ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకుపా ర్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. మెజారిటీ తమ్ముళ్లు మాత్రం.. వద్దని అంటున్నారు. అందునా.. …
Read More »తెలంగాణ: విద్యుత్ ఛార్జీలతో షాక్
తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. పేద, మధ్య, ధనిక వర్గాలనే తేడా లేకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా భావించి ఛార్జీల పెంపుతో బాదేసింది. యూనిట్ కు సగటున 10 పైసల నుండి 50 పైసలవరకు వీరబాదుడు బాదింది. నివాసలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలన్న తేడా లేకుండా అన్నీ క్యాటగిరిల వాడకానికి చార్జీలను పెంచేసింది. దీనివల్ల బిల్లులు భారీగా రాబోతున్నట్లు జనాల్లో టెన్షన్ మొదలైపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఛార్జీల …
Read More »అసెంబ్లీలో టీడీపీ మాస్టర్ స్ట్రోక్
అటు వైపు చూస్తే అధికార పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు. అందులో మెజారిటీ సభ్యులు సభలో ఉంటారు. ఇటు చూస్తే తెలుగు దేశం పార్టీ తరఫున 20 మంది కూడా ఉండరు అసెంబ్లీలో. దీంతో మూడేళ్లుగా వైకాపా అసెంబ్లీలో తిరుగులేని ఆధిపత్యం సాగిస్తోంది. స్పీకర్ పూర్తిగా అధికార పక్షం వహిస్తూ ప్రతిపక్షానికి పెద్దగా అవకాశం లేకుండా చేస్తుండటంతో టీడీపీ వాయిసే పెద్దగా వినిపించట్లేదు సభలో. కీలకమైన విషయాలపై మాట్లాడుతున్నపుడు, …
Read More »వైసీపీలో కొత్త కుంపటి.. సెగలు రేపుతున్న జగన్ నిర్ణయం
మంత్రి వర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన వారిని సంతృప్తి పరిచేందుకు సీఎం జగన్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎవరూ పదవులు పోయాయని బాధప డొద్దు.. అందరికీ న్యాయం చేస్తాను. అయితే.. పమంత్రి వర్గంలో కాకపోతే.. జిల్లాలకు ఇంచార్జ్లుగా నియమిస్తాను.. అని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కొత్త కుంపటికి దారితీసింది. ఎందుకంటే.. ఇప్పటికే.. సదరు మంత్రులతో చాలా మంది నేతలకు పడడం లేదు. మంత్రులే పైచేయి సాధించేందుకు …
Read More »జే బ్రాండ్స్ కావు.. బాబు బ్రాండ్స్: సీఎం జగన్
ఏపీలో కల్తీసారా మరణాలు.. కల్తీసారా.. చీపు లిక్కరు వంటి అంశాలపై ప్రతిపక్ష టీడీపీ, అధికార పక్షం వైసీపీ మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా స్పందించారు.. చంద్రబాబు చెబుతున్న జె బ్రాండ్స్.. నిజానికి చెప్పాలంటే అవి బాబు బ్రాండ్స్, ఎల్ బ్రాండ్స్.. ఎందుకంటే లోకేష్ కూడ ఉన్నారు కాబట్టి వారి పేర్లతో ఎందుకు పిలవకూడదని అన్నారు. “ఎందుకంటే అవన్నీ మనం …
Read More »కల్తీ సారాపై చర్చకు రండి.. నిజాలు నిరూపిస్తాం.. లోకేష్ సవాల్
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. కల్తీ సారా, కల్తీ మద్యంపై చర్చ పెట్టమని అడిగినందుకే అసెంబ్లీ నుంచి తమ సభ్యులను సస్పెన్షన్ చేశారని విమర్శించారు. సారా నామూనాల్లో రాసాయనాలున్నాయని అసెంబ్లీలో సీఎం జగన్ ఒప్పుకున్నారని.. ఆ తర్వాత అవి కల్తీ సారా మరణాలు కాదు.. సహజ మరణాలని అనడం దారుణమన్నారు. కల్తీ సారాపై మండలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్ విసిరారు. కల్తీ నాటు …
Read More »కాపుల రిజర్వేషన్ ఏపీ ఇష్టం: కేంద్రం
కాపుల రిజర్వేషన్ అంశంపై ఇప్పటి వరకు దోబూచులాడుతోందని బావించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈవిషయంపై అసలు విషయం వెల్లడించింది. కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాపు రిజర్వేషన్ బిల్లు అంశంపై.. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పింది. దీని ప్రకారం.. రాష్ట్ర …
Read More »