Political News

క‌న్నాకు అందుకే నో!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీఎం చంద్ర‌బాబు సార‌థ్యంలో కొత్త మంత్రివ‌ర్గం కొలువుతీరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి అంద‌రికీ ఆమోదయోగ్యంగా కేటినేట్‌ను ఏర్పాటు చేసుకుంది. మంత్రివ‌ర్గ ఏర్పాటులో చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేసి ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు. కానీ మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించిన సీనియ‌ర్ నాయ‌కుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ మాత్రం కాస్త నిరాశ‌కు లోన‌యిన‌ట్లు తెలిసింది. కానీ ఎలాంటి స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం చూసినా క‌న్నాకు బాబు …

Read More »

జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం.. క్యాంపు ఆఫీసుపై విచార‌ణ‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం ముసురుకుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా శివారులోని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాల‌యం నుంచే ఆయ‌న ఐదేళ్లు పాల‌న సాగించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఇంద్ర భ‌వ‌నంగా తీర్చిదిద్దుకున్నారు. క‌ళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగులు, శుభ్రంగా క‌డిగిన చేతుల‌తో ముట్టుకున్న మ‌ర‌క‌లు ప‌డ‌తాయా? అని అనిపించేంత రాయితో త‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, …

Read More »

10 నిమిషాలు.. జగన్ బాబుని చూసి నేర్చుకోవాలి

రాజ‌కీయాల‌కు.. మీడియాకు అవినాభావ సంబంధం. నేత‌లు ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాలన్నా.. మీడియానే వార‌ధి. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారికి మీడియా మ‌రింత స్నేహంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. సీఎంగా జ‌గ‌న్ ప‌దినిమాషాల స‌మ‌యం మీడియాకు వెచ్చించలేక పోయారు. ఫ‌లితంగా.. ఆయ‌న త‌న‌పై వ‌చ్చిన వ్య‌తిరేక వార్త‌ల‌ను కూడా ఖండించుకునే ప‌రిస్థితి.. త‌మ మ‌న‌సులో ఏముందో ప్ర‌జ‌ల‌కు చెప్పే అవ‌కాశం కోల్పోయారు. నిజానికి మీడియాకు.. స‌ర్కారుపై స‌ద‌భిప్రాయం ఏర్ప‌డాలంటే.. …

Read More »

జ‌గ‌న్ అందుకే ఓడిపోయాడు: రాజా సింగ్

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయిన విష‌యం తెలిసిందే. క‌వేలం 11 స్థానాల‌కే ఆ పార్టీ ప‌రిమిత‌మై.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక పోయింది. అస‌లు అసెంబ్లీకి వెళ్తారో లేదో .. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఘోర ప‌రాభ‌వం ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా ప్ర‌జ‌లకు మొహం చూపించ‌లేక పోతున్నారు. ఇక‌, మాజీ సీఎం జ‌గ‌న్ మాత్రం విడ‌త‌ల వారీగా .. త‌న వారితో భేటీ అయి.. కొంత …

Read More »

ఏపీ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ బ‌హిరంగ లేఖ‌..!

ఏపీ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర డిప్యూటీ ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌హిరంగ లేఖ రాశారు. త్వ‌ర‌లోనే తాను బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని అన్నారు. ఈ సేవ చేసే భాగ్యంత‌న‌కు క‌ల్పించిన ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ధ‌న్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్య‌మంత్రిగా కంటే..ఒక ఎమ్మెల్యేగానే తాను సేవ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప‌ద‌విని స్వార్థం కోసం ఎట్టి ప‌రిస్థితిలోనూ వినియోగించుకునేదిలేద‌న్న ఆయ‌న‌.. త‌న‌కు ఇష్ట‌మైన శాఖ‌లు కేటాయించిన‌.. సీఎం చంద్ర‌బాబుకు …

Read More »

భూములు మింగేశారా? బీఆర్ఎస్ నేత‌ల‌కు రేవంత్ టెన్ష‌న్‌

తెలంగాణ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాభ‌వాల‌తో బీఆర్ఎస్ కుంగిపోయింది. ఏదో చేయాల‌ని, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని క‌ల‌లు క‌న్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. పార్టీలోని ఎమ్మెల్యేలు, కీల‌క‌ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా చేజారుతున్నారు. మ‌రోవైపు ఫోన్ ట్యాపింగ్‌, గొర్రెల పంపిణీ, కాశేళ్వ‌రం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ల‌లో అవినీతి ఆరోప‌ణ‌ల‌తో బీఆర్ఎస్ పెద్ద త‌ల‌కాయ‌లే టార్గెట్‌గా …

Read More »

మార‌ని జ‌గ‌న్‌.. అదే త‌ప్పు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌నాలు ఓటు అనే ఆయుధంతో వైసీపీని పాతాళానికి తొక్కారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీకి కేవ‌లం 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌స‌భ స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. 2019 ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీకి ఈ ఫ‌లితాలు దారుణ ప‌రాభ‌వం కిందే లెక్కా. ఈ ఘోర ప‌రాజ‌యంతోనైనా జ‌గ‌న్ మార‌తార‌ని అనుకుంటే అదేం జ‌ర‌గ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ ప‌దే …

Read More »

ఆ ఎంపీ అప్పుడే డ్యూటీ మొదలుపెట్టాడు

Appalanaidu

కలిశెట్టి అప్పలనాయుడు. ఈ పేరుకు ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీడీపీలో సాధారణ కార్యకర్త అయిన అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. అనేకమంది అభ్యంతరాలు చెప్పినా తాను పట్టించుకోలేదని స్వయంగా వెల్లడించిన చంద్రబాబు ఫలితాల తర్వాత జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ‘ఏం అప్పలనాయుడు ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నావా ? లేదంటే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు’ అంటూ అప్పలనాయుడును ఆరాతీయడంతో ఆయన బాబు …

Read More »

ర‌ఘురామ‌, అయ్య‌న్న‌, బుచ్చ‌య్య‌, ధూళిపాళ్ల‌కు కీల‌క ప‌ద‌వులు!

టీడీపీ సీనియ‌ర్లు స‌హా.. తాజా ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి విజ‌యం ద‌క్కించుకున్న ముఖ్య నాయకుడు.. ర‌ఘురామ‌కృష్ణ రాజుకు కూడా.. సీఎం చంద్ర‌బాబు ముఖ్య ప‌ద‌వులు ఇచ్చేందుకు చూస్తున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గ కూర్పు పూర్త‌యింది. మ‌రో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో చంద్ర‌బాబు రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతున్నారు. ప్ర‌తి సోమ‌వారం ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించేందు కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈలోగానే కీల‌క ప‌ద‌వుల‌ను పూర్తి …

Read More »

జ‌గ‌న‌న్న పోయి ఎన్టీఆర్ వచ్చే..

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ప‌నులు ప్రారంభించింది. శాఖల ప‌రంగా మంత్రు లను కేటాయించ‌డం.. అధికారుల‌ను తీసుకోవ‌డం.. వంటి కార్య‌క్ర‌మాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌డివ‌డిగానే పూర్తి చేశారు. ఇక‌, కార్యాచ‌ర‌ణ‌కు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అవ‌లంభించిన కార్య‌క్ర‌మాల్లో కొన్నింటిని త‌ప్ప‌ని స‌రిగా అమ‌లు చేస్తున్నారు. అయితే.. వాటికి పేర్ల‌ను మార్చుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌తినెలా 1వ తేదీనే ఇచ్చే.. …

Read More »

జ‌గ‌న్‌కు షాక్‌: హైదరాబాద్ లోటస్‍పాండ్‍లో కూల్చివేతలు

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన ద‌రిమిలా.. ఇంకా ఆ షాక్ నుంచి పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తేరుకోలేదు. ఇంకా లెక్క‌లు వేసుకుంటూనే ఉన్నారు. ఎలా ఓడిపోయామా? అని సందేహాలు వ్య‌క్తం చేస్తూ నే ఉన్నారు. అంతేకాదు.. నాయ‌కుల‌ను కూర్చోబెట్టుకుని త‌న ఆశ్చ‌ర్యాన్ని, దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. అయితే.. ఈ షాక్ నుంచే ఇంకా తేర‌కోని జ‌గ‌న్‌కు ఇప్పుడు మ‌రో భారీ షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో …

Read More »

ప‌ని మొద‌లెట్టేసిన బాబు గారు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌ని ప్రారంభించేశారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌రుస‌టి రోజు నుంచే చంద్ర‌బాబు త‌న తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలోని స‌చివాల‌యంలోనే తాను అందుబాటులో ఉంటాన‌ని తేల్చిచెప్పారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తాను స‌చివాల‌యంలోనే ఉండనున్న‌ట్టు చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈ స‌మ‌యంలో ఎవ‌రు వ‌చ్చినా.. త‌న‌ను క‌లుసుకోవ‌చ్చారు. ఇక‌, ఇదే …

Read More »