ఇప్పటికే కేంద్రం నుంచి అప్పులు పుట్టక.. పదే పదే ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతున్నా.. కరుణించక.. ఆద్యంతం రాజకీయ కారణా లతో తెలంగాణలోని కేసీఆర్ సర్కారును కేంద్రం ముప్పు తిప్పులు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జూన్ నెల జీతాలకు.. కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక, ఈ నెలలోనే అమలు చేయాలని కేసీఆర్ మానస పుత్రిక పథకం రైతు బంధు నిధుల విడుదలకు మరో …
Read More »రుషికొండ `రంగు` తేలుస్తాం: సుప్రీంకోర్టు
విశాఖ రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టుకు ఏపీ సర్కారు. వివరించింది. అయితే.. పిటిషన్పై విచారణను సుప్రీం ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. రిషికొండ వద్ద వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి చెందిన కొందరు వ్యక్తులు జరుపుతున్న తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన …
Read More »కాంగ్రెస్ చచ్చిన పాము.. నా ఇమేజ్ పోయింది: PK
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది లేదని అన్నారు. బీహార్లోని వైశాలిలో ఉన్న దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ నివాసం నుంచి తన జన్ సూరజ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ పార్టీలతో కలిసి తాను …
Read More »వైసీపీ వల్లే మహానాడు హిట్
వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. వైసీపీ పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని వ్యాఖ్యనించారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని అన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని.. ఎవరికీ మినహాయింపులు లేవని వెల్లడించారు. వైసీపీ …
Read More »మహానాడులో తొడగొట్టిన లేడీ లీడర్.. టికెట్ దక్కేనా?
రాజకీయాల్లో ఎవరు ఏం చేసినా.. సొంత లాభం లేకుండా.. ఏ ఒక్కరు అడుగు కూడా ముందుకు వేయరు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు ఎవరైనా..కూడా `ముందు చూపు`తోనే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఒంగోలు వేదికగా తొడగొట్టిన టీడీపీ నాయకురాలు కూడా చేరిపోయారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించినప్పటికీ.. ఆమెకు ఆశించిన విధంగా ఎలాంటి సానుభూతి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మహానాడులో …
Read More »దావోస్ నుంచి రిటర్న్.. పెట్టుబడులపై జగన్ ఏం చెబుతారో?
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అక్కడ బిజీబిజీగా గడిపారు. తాజాగా ఆయన ఏపీకి చేరుకున్నారు. అయితే.. ఈ పర్యటనలో జగన్ సాధిం చిందేంటి? ఇప్పుడు ఏపీ ప్రజలకు ఏం చెబుతారు? అనేది ప్రశ్నగా మారింది. దావోస్లో ఏం చేశారు? వాస్తవానికి దావోస్కు వెళ్లినప్పుడు.. అక్కడకు వచ్చే విదేశీ కంపెనీలను కలుసుకుని.. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంటుంది. కానీ, జగన్ …
Read More »వారసులొస్తున్నారు.. తెలంగాణలో వేడెక్కిన పాలిటిక్స్
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికలుంటాయా, లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత ప్రభుత్వానికి మరో ఏడాదిన్నర మాత్రమే సమయముంది. దీంతో వచ్చే ఎన్నికలు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పకడ్భందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వారసుల రాజకీయ ఆరంగేట్రానికి గ్రేటర్లోని నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు …
Read More »కేంద్ర మంత్రికి ‘మహానటి’ డైరెక్టర్ కౌంటర్
‘మహానటి’ సినిమాతో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా ప్రభాస్తో వందల కోట్ల బడ్జెట్లో ‘ప్రాజెక్ట్ కే’ లాంటి భారీ చిత్రం చేసే అవకావం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ఐతే దర్శకుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసి తిరుగులేని స్థాయికి చేరుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఒక సామాన్యుడిలాగే కనిపిస్తుంటాడు నాగ్ అశ్విన్. ఒక మామూలు నెటిజన్ ఎవరో ఏదైనా ప్రశ్న అడిగినా బదులిస్తాడు. అలాగే చాలామంది సెలబ్రెటీల్లాగా సోషల్ ఇష్యూస్ విషయంలో మనకెందుకు అనుకోకుండా …
Read More »టీడీపీ ఓటమికి కారణం చెప్పిన బీజేపీ ఎంపీ
తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు కారణం ఏమిటి? ఈ విషయామై చంద్రబాబు నాయుడు అనేకసార్లు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి తాను ఎంత కష్టపడినా జనాలు తమపార్టీని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధం కావటంలేదని చాలాసార్లే చెప్పారు. అలాంటిది టీడీపీ ఘోర ఓటమి కారణాన్ని బీజేజీలోకి ఫిరాయించిన టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ చాలా సింపుల్ గా తేల్చేశారు. ఇంతకీ వెంకటేష్ చెప్పిందేమంటే తన హయాంలో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను …
Read More »రాజకీయ మోక్షం పొందిన రఘువీరా
నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సమైక్య రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 2009లో అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే వైఎస్ చనిపోయినా రఘువీరా మాత్రం ఐదేళ్ళు మంత్రిగానే ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గరా పనిచేశారు. అంటే ఏకధాటిగా పదేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఇపుడిదంతా ఎందుకంటే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం …
Read More »బాబు స్పీడ్: నెలకు రెండు జిల్లాల్లో పర్యటన
మహానాడు సక్సెస్ స్పూర్తిని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే నెలకు రెండుజిల్లాల్లో పర్యటించబోతున్నట్లు పార్టీనేతలతో చెప్పారు. తొందరలోనే తన పర్యటనకు సంబంధించిన ప్లాన్ డిసైడ్ చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిపోయిన వ్యతిరేకతే మహానాడు విజయానికి కారణమైందని అభిప్రాయపడ్డారు. అప్పుడెప్పుడో ఎన్టీయార్ హయాంలో విజయవంతమైన మహానాడును తాజా మహానాడు విజయవంతం గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిపోయిన వ్యతిరేకతను పార్టీ అడ్వాంటేజ్ …
Read More »ఈ రాజ్యసభ సీటు వెనుక కథ ఇదేనా?
తెలంగాణాకు చెందిన ఎంతో మంది బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకున్నా రాజ్యసభ ఎంపీగా పనిచేసే అవకాశం డాక్టర్ లక్ష్మణ్ నే వరించింది. లక్ష్మణ్ దశాబ్దాలుగా పార్టీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణా అధ్యక్షుడిగా, రెండుసార్లు ముషీరాబాద్ ఎంఎల్ఏగా కూడా ఈయన పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఎంఎల్ఏగా ఓడిపోయిన తర్వాతే ఈయనకు పార్టీ అగ్రనాయకత్వం …
Read More »