తొందరలోనే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఈమధ్యనే ఢిల్లీలో జరిగిన ఏన్డీయే సమావేశానికి పవన్ హాజరైన విషయం తెలిసిందే. ఢిల్లీ టూరులో అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ అయ్యారు. ఆ వివరాలను చంద్రబాబుతో షేర్ చేసుకోవటంతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరిపేందుకు తొందరలో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారట. పరిస్ధితిలు అనుకూలిస్తే రెండు, మూడురోజుల్లోనే సమావేశమయ్యే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెప్పాయి. అమిత్ …
Read More »సికింద్రాబాద్ బరిలో షర్మిల ?
ప్రస్తుత రాజకీయాలు చాలా స్పీడయిపోయాయి. ఏరోజు ఏమి జరుగుతోందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. నేతలు తాము పోటీచేయబో నియోజకవర్గాలను కూడా చాలా వేగంగా మార్చేస్తున్నారు. ఇదంతా ఇపుడు ఎందుకంటే రాబోయే తెలంగాణా ఎన్నికల్లో వైఎస్ షర్మిల సికిందరాబాద్ పార్లమెంటు స్ధానానికి పోటీచేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. షర్మిల ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి అసెంబ్లీకి పోటీచేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. అయితే అదంతా ఎప్పుడంటే వైఎస్సార్టీపీ అధినేతగా ఉన్నప్పుడు. మరిప్పుడు ఏమైంది …
Read More »ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్ల. దాదాపు 75 ఏళ్ళకు దగ్గరలో ఉన్న సోనియా ఈమధ్య ప్రత్యక్షరాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. వయసు అడ్డంకి కాకపోయినా అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. క్యాన్సర్ కు బ్రిటన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. వయోభారం, అనారోగ్యం తదితర కారణాల వల్ల చివరకు అధ్యక్ష పదవికి కూడా దూరంగా ఉంటున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో …
Read More »కిషన్ కు అప్పుడే చుక్కలు కనబడ్డాయా ?
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డికి అప్పుడే చుక్కలు కనబడుతున్నాయి. ప్రమాణస్వీకారం రోజునే సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దాంతో ఏమి చేయలేక వేదికమీద జరుగతున్నది కిషన్ చూస్తుండిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే వేదిక మీద మాట్లాడుతు మాజీ అద్యక్షుడు బండి సంజయ్ కొందరు నేతలపై మండిపోయారు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయటం మానుకోవాలని ఎవరిపేరును ప్రస్తావించకుండానే బండి చురకలంటించారు. ఫిర్యాదుల కారణంగానే తాను అధ్యక్షుడిగా తప్పుకోవాల్సొచ్చిందన్నట్లుగా …
Read More »పవన్ కు చంద్రబాబు బాసట
వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పవన్ పై జగన్ సర్కార్ పరువు నష్టం కేసు పెట్టిన వ్యవహారంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిమాలిన చర్య అని, నీతిమాలిన పని అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు అన్న రీతిలో …
Read More »సన్న బియ్యం సన్నాసి.. లోకేష్ పంచ్
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పాత్రపై గత ఏడాది అక్టోబర్ లో వైఎస్ షర్మిల ఇచ్చిన సంచలన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అది, జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల తేల్చేసిందని లోకేష్ విమర్శలు గుప్పించారు. అబ్బాయి కిల్డ్ …
Read More »అవినాష్ రెడ్డిని బుక్ చేసిన షర్మిల?
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సినిమా థ్రిల్లర్ ను తలపించేలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లయినా ఈ కేసులో నిందితులకు శిక్ష పడకుండా విచారణ నత్తనడకన సాగుతున్న వైనంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 7న సీబీఐకి షర్మిల …
Read More »బండి సంజయ్ కోసం బాత్రూంలో ఏడ్చారట
తెలగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ కు కేంద్ర స్థాయిలో పదవి ఇస్తారని టాక్ వచ్చింది. అయితే, ఆ పదవి పై బండి సంజయ్ కు ఆసక్తి లేదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఆయనకు ఉందని ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో గెలిపించుకొని …
Read More »రక్తపు మరకలు ఎలా తుడవాలో ఆ డాక్టర్ చెప్పారు: సీబీఐ
“ఔను.. వారిదే సూత్రం.. వారిదే పాత్ర.. ఈ విషయంలో తేడాలేదు” అని ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి తాజాగా సీబీఐ సమర్పించిన చార్జిషీట్లో కుండబద్దలు కొట్టింది. ఆ వారే.. సీఎం జగన్ పదే పదే తన తమ్ముడు అని సంబోధించే కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి. వీరిద్దరేఅసలు సూత్రధారులు, పాత్ర ధారులు అని సీబీఐ మరోసారి …
Read More »బాలయ్యపై ఫస్ట్టైమ్.. జగన్ ఫైర్
నట సింహం, టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఏపీ సీఎం జగన్ తొలిసారి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో విమర్శలు గుప్పించారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థపై రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వలంటీర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హ్యూమన్ ట్రాఫికింగ్లో వారి పాత్ర ఉందని ఆయన చెప్పారు. అయితే.. దీనిపై ఇప్పటికే వైసీపీ నాయకులు …
Read More »ఒకరితో పెళ్లి.. మరొకరితో సంసారం: పవన్పై జగన్
ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. “ఒకళ్లను పెళ్లి చేసుకుని.. మరొకరితో సంసారం చేసేవాడు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంతోపాటు. ఆయన సంసారంపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. పవన్ కళ్యాణ్ కేంద్రంగా నిప్పులు చెరిగారు. “పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం దత్తపుత్రుడి(పవన్ కల్యాణ్) క్యారెక్టర్. అలాంటి వ్యక్తా వలంటీర్ల గురించి …
Read More »అందరికీ బీసీ ఓట్లే కావాలా ?
తెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ బీసీ సామాజికవర్గాలచుట్టూనే తిరుగుతన్నాయి. ముందుగా బీసీ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. తర్వాత బీజేపీ కూడా బీసీ డిక్లరేషన్ అన్నది. తాజాగా బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధులందరు ఎంఎల్ఏ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. తొందరలోనే బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోంది. తొందరలోనే పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమవ్వాలని కేసీయార్ అనుకుంటున్నారు. కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్లను కూడా …
Read More »