జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా.. పనితీరు విషయంలో మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పనుల పర్యవేక్షణ.. నిధుల సమీకరణ.. ఈ రెండు విషయాల్లో పవన్ కల్యాణ్ చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. చంద్రబాబు సైన్యంలో జనసేనాని డిఫరెంట్ అనే టాక్ వచ్చేలా ఆయన చేసుకున్నారు. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ది శాఖలను అత్యంత కీలకంగా భావిస్తున్న …
Read More »సజ్జలతోనే అసలు తంటా.. తేల్చేసిన పులివెందుల!
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు , కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మెజారిటీ నాయకులు.. తమ సమస్య మొత్తానికి కారకులుగా .. పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వేళ్లు చూపించారు. తమకు కనీసం గౌరవం కూడా.. ఇవ్వకుండా.. …
Read More »తిరుమలలో 100కోట్ల కుంభకోణం?
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) హుండీ నగదు లెక్కింపు ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగినట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదుతో పాటు విదేశీ కరెన్సీ సొమ్మును రహస్యంగా ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. హుండీ నగదు లెక్కింపు నిర్వహించే పరకామణిలో ఈ అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద జీయర్ తరఫున సి.వి. రవికుమార్ అనే …
Read More »జమిలి వస్తుంది..మీ జగన్ గెలుస్తున్నాడు
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, అటువంటిదేమీ లేదని, జమిలి చట్టం అమల్లోకి వచ్చినా 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, మీ జగన్ గెలుస్తున్నాడు …
Read More »మా దెబ్బ ఇంకా బలంగా ఉంటుంది: సజ్జల
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు వరకు సజ్జల పెద్దగా వార్తల్లో ఉండేవారు కాదు. పార్టీలో ఆయన ప్రాధాన్యం కూడా పెద్దగా కనిపించేది కాదు. కానీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆయన చాలా కీలకంగా మారిపోయారు. పేరుకు ప్రభుత్వ సలహాదారు అయినా.. కీలక మంత్రిత్వ శాఖల కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. …
Read More »ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అవుతా: దిల్ రాజు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, …
Read More »శాలువాలతో డ్రెస్సులు..చింతమనేని ఐడియా అదిరింది
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు కాబట్టి ఈ శాలువాలను వేరే వారికి ఇవ్వాలన్న ఆలోచన రాదు. దీంతో, ఆ శాలువాలలో చాలా బీరువాలలో నిరుపయోగంగా పడుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్సులు కుట్టించే వినూత్న ఆలోచనకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. అప్పుడపుడు వివాదాలలో పేరు వినిపించినప్పటికీ …
Read More »కేసీఆర్, హరీష్ రావుకు ఊరట!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదు చేసిన కేసు, భూపాలపల్లి జిల్లా సెషన్సు కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించినట్టయింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ …
Read More »ప్రతి రోజూ అటెండెన్స్.. చంద్రబాబు మరో నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ మంత్రులకు పక్కా నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసే ఈ నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన అటెండెన్సును.. ఆయన మంత్రులకు కూడా విస్తరించారు. జనవరి 1వ తేదీ నుంచి నూతనంగా అందు బాటులోకి తీసుకువచ్చే ప్రత్యేక యాప్లో అటెండెన్స్ వేయనున్నారు. ప్రత్యేక …
Read More »అమరావతి ప్రమోషన్ .. ధూం ధాంగా.. !
రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిధుల సమీకరణకు కూడా.. ప్రాధాన్యం ఇచ్చారు. అప్పు రూపంలోనో.. మరో విధంగానో.. ఇప్పుడు అమరావతికి నిధులు అయితే వస్తున్నాయి. దీంతో జనవరి నుంచి పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి. వచ్చే రెండున్నర లేదా.. మూడు సంవత్సరాల్లో అమరావతిని పరుగులు పెట్టించనున్నారు. టెండర్లను కూడా.. ఈ నెల ఆఖరులో ఖరారు చేయనున్నారు. అయితే.. నిర్మాణాల …
Read More »చంద్రబాబుకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ..!
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సమస్యలు చూస్తే.. తన కడుపు తరుక్కుపోతోందన్నారు. తనకు నిద్ర కూడా పట్టడం లేదని చెప్పారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలో కూడా.. తనకు అర్థం కావడం లేదన్నారు. వాస్తవానికి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత.. అనేక సందర్భాల్లో ఇది చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. ఆర్థిక …
Read More »రేవంత్ ది ప్రతీకార పాలన: కవిత
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates