Political News

వీళ్ళకన్నా కేఏ పాలే బెటరా ?

తెలంగాణాలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలకన్నా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చాలా బెటరని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యల పై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కాంత్ జైశ్వాల్ ను కలిసి వ్రాత మూలకంగా ఫిర్యాదుచేశారు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రు. 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. …

Read More »

‘అమ్మ ఒడి’ ల‌క్ష‌ల మందికి కోత‌.. 27న డ‌బ్బుల విడుద‌ల‌

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ పథకం అందుకుంటున్న వారిలో.. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది..! దీంతో ల‌క్ష మంది అమ్మ‌ల‌కు ‘అమ్మ ఒడి’ ప‌థ‌కం దూరం అయిపోయింది. నవరత్నాల్లో ప్రతిష్టాత్మక పథకమైన “అమ్మఒడి” పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. …

Read More »

మోడీ-షాల ప‌ద‌వీ దాహం.. ప్ర‌జాస్వామ్యానికి తూట్లు!

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో.. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనం అంచున నిలిచింది. న‌రేంద్ర మోడీ ప్రధానిగా, అమిత్ షా కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మ‌హారాష్ట్ర కూడా చేరిపోతోంద‌నే వాద‌న బ‌లంగా …

Read More »

గోడ క‌ట్టుకోండి.. అయ్య‌న్న కుటుంబానికి హైకోర్టు ఆదేశం

టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమంగా గోడ కూల్చి వేయడంతో పిటీషన్‌ వేయాలని హైకోర్టు అయ్యన్న తరపు న్యాయవాదులను ఆదేశించింది. దీనిపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అధికారుల చ‌ర్య‌లు దారుణంగా ఉన్నాయ‌ని.. కోర్టు తెలిపింది. దీనిపై అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సంబంధిత శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ …

Read More »

విశాఖ‌కు ఇన్ఫోసిస్‌… ఆరోజు బాబు మీటింగ్ ఫలించినట్టేగా

కార్పొరేట్లకు విశ్వాసం కల్పించడం చంద్రబాబుది పై చేయి అనే మాట…చివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా బయటకు ఒప్పుకోకపోయినా దీనిని అంగీకరిస్తారు. ఒక సమయంలో కేటీఆర్ కూడా దీనిని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతెందుకు ఇటీవల 20 ఏళ్ల స్నాతకోత్సవం జరుపుకున్న ఐఎస్బీ అధికారికంగా చంద్రబాబు వల్లే ఇక్కడకు వచ్చాం అని చెప్పిన విషయం కూడా తెలిసిందే. చంద్రబాబుకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య అనుబంధమే 2003లో ఆయన ఓడిపోవడానికి, 2014లో ఆయన …

Read More »

ఈ గ‌ట్టునుందామా? ఆ గ‌ట్టుకెళ్దామా? కేసీఆర్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. బీజేపీయేత‌ర కూట‌మి పార్టీలు.. ఏకంగా 17 పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హాను రంగంలోకి దింపాయి. ఇక బీజేపీ కూట‌మి పార్టీలు.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ద్రౌప‌దీ ముర్మును ఎంపిక చేశాయి. ప్ర‌స్తుతం బీజేపీకి 48.6 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇక‌, బీజేపీ అభ్య‌ర్థి గెలిచేందుకు కేవ‌లం 2 శాతం ఓట్లు ఉంటే స‌రిపోతుంది. అయినప్ప‌టికీ.. …

Read More »

ఆనంను దూరం పెట్టేసినట్లేనా ?

మాజీ మంత్రి సినియర్ నేత, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టేసినట్లేనా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆనం ఎక్కడా కనబడలేదు. మంగళవారం ప్రచారం కూడా ముగిసిపోయింది. అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డితో కానీ లేదా విడిగా కూడా ఆనం ప్రచారం చేసినట్లు కనబడలేదు. ఉప ఎన్నికలో ప్రచారం కోసం కొందరు మంత్రులు, …

Read More »

‘మహా’ సంక్షోభం బీజేపీ పనేనా ?

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం హఠాత్తుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కూటమిలోని కీలక భాగస్వామి శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ శిందే నాయకత్వంపై తిరుగుబాటు లేవదీయటంతో సంక్షోభం తప్పలేదు. తన మద్దతుదారులతో కలిసి శిందే సూరత్ లోని ఒక హోటల్లో క్యాంపు పెట్టారు. దాంతో శివసేనలో ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ? ఎప్పుడు కూలిపోతుందో ? అనే టెన్షన్ మొదలైపోయింది. నిజానికి ఇంత హఠాత్తుగా ప్రభుత్వంలో …

Read More »

జగన్ ని ఇరుకున పడేసిన తీర్పు

ఆంధ్రావ‌నిలో స‌ర్కారు త‌ర‌ఫున భూముల వేలాన్ని అడ్డుకుంటూ, వ‌ద్ద‌ని చెబుతూ.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ‌ర్గాల అత్యుత్సాహంపై హైకోర్టు నీళ్లు జ‌ల్లింది. భూముల‌ను ప్ర‌భుత్వం వేలం వేయ‌డం ఏంట‌న్న‌ది కోర్టు వారి ప్ర‌శ్న. పేద‌ల‌కు ఇవ్వాల్సిన భూముల‌ను కార్పొరేష‌న్ పేరిట ఎలా బ‌హిరంగ మార్కెట్లో వేలం వేస్తార‌ని కూడా అంటోంది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది. విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న భూముల వేలం అన్న‌ది ఇప్పుడొక చ‌ర్చ‌కు తావిస్తోంది. …

Read More »

ఎవ‌రీ ద్రౌప‌ది.. ఎక్క‌డి వారు.. ఏం చేసేవారు?

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. ఎన్డీఏ పక్షాలు అన్నింటితో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఒక గిరిజ‌న మ‌హిళ‌కు.. అందునా ఆదివాసీ మ‌హిళ‌కు అవ‌కాశం ద‌క్క‌డం ప్ర‌ప్ర‌థ‌మం. ఈ నేప‌థ్యంలో ద్రౌపది ముర్ము ఎవ‌రు? ఏం చేసేవారు? ఎక్క‌డ నుంచి వ‌చ్చారు? …

Read More »

ద‌గ్గుబాటికి చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌.. క‌లుస్తున్న మ‌న‌సులు!

ఎన్టీఆర్ పెద్ద అల్లుడు.. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి భ‌ర్త‌, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు స్వ‌ల్ప గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు.. స్టంట్ వేశారు. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు. అయితే.. ద‌గ్గుబాటి అనారోగ్యానికి గుర‌య్యార‌ని తెలుసుకున్న ఆయ‌న తోడ‌ల్లుడు, అన్న‌గారిచిన్న‌ల్లుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెంట‌నే అపోలో ఆసుప‌త్రికి వెళ్లి.. ప‌రామ ర్శించారు. …

Read More »

టీడీపీ సాహ‌సం చేస్తే వైసీపీ వినోదం చూస్తుందా ?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫైట్ మామూలుగా ఉండ‌దు అని తేలిపోయింది. రెండు పార్టీలూ కొట్టుకున్నా కొట్టుకుంటాయి. ప‌ర‌స్ప‌ర దాడులు చేసుకున్నా చేసుకుంటాయి. ఆ విధంగా ఆ రెండు పార్టీలూ ఉన్నాయి. ఓ విధంగా టీడీపీది ఇప్పుడు సాహ‌సం. ఎందుకంటే ఎక్క‌డికక్క‌డ గృహ నిర్బంధాల‌న్న‌వి ఉన్నా కూడా ఆ పార్టీ వీలున్నంత మేర‌కు నిర‌స‌న‌లు చేసి, ప్ర‌జా బ‌లం కూడ‌గ‌ట్టుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఆ విధంగా టీడీపీకి ఇవాళ ప్ర‌జా మ‌ద్ద‌తు కూడా …

Read More »