ఏపీలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రంగా ఇప్పటికే రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి సృష్టించిన విధ్వంసం.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సృష్టించిన అరాచకం.. చంద్రగిరిలో టీడీపీ నాయకుడు.. పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం వంటివి ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఆయా నియోజకవర్గాలు …
Read More »పాకిస్థాన్ నుంచి రాజాసింగ్ కు బెదిరింపులు
భాగ్యనగరం హైదరాబాద్లో తీవ్ర గడబిడ చోటు చేసుకుంది. ఇక్కడి ఘోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజాసింగ్కు బెదిరింపు ఫోన్లువచ్చాయి అవి కూడా.. లోకల్ నుంచి కాకుండా.. పాకిస్థాన్ ఫోన్ నెంబర్ల నుంచి ఆయనను లేపేస్తా మంటూ .. ఫోన్లు రావడంతో ఒక్కసారిగా ఆయన హడలి పోయారు. అయితే.. తొలుత ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే గతంలోనూ రాజా సింగ్కు అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. …
Read More »ప్రజెంట్ ఐఏఎస్ వర్సెస్ రిటైర్డ్ ఐఏఎస్!
ఏపీలో భూముల రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు ముందు.. రాజకీయ నేతలు చేసిన ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ చట్టం ద్వారా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. భూములు దోచేస్తారని.. పేదలకు నిలువనీడ కూడా ఉండబోదని.. ప్రతిపక్ష కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే సయమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. పీవీ రమష్ కూడా.. దీనికి …
Read More »బెయిల్ ఎఫెక్ట్.. టంగ్ మార్చేసిన ఢిల్లీ సీఎం!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి జైల్లో రెండు మాసాలకు పైగా గడిపిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ ప్రచారం కోసం.. సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. దీంతో గత వారం నుంచి కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆరో దశ ఎన్నికల పోలింగ్లో ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే.. బెయిల్ …
Read More »31న చంద్రబాబు-పవన్ భేటీ.. కీలక చర్చ!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు.. ఈ నెల 31న భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరగనున్న ఈ బేటీలో కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉందని ఇరు పార్టీల ముఖ్య నాయకులు తెలిపారు. ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ నెల 13 తర్వాత.. ఇరువురు నాయకులు కూడా విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు అమెరికాకు వెళ్లినట్టు అధికారిక ప్రకటన జారీ చేయగా, పవన్ …
Read More »‘కవిత మామూలు మహిళ కాదు.. సో పవర్ ఫుల్’
ఢిల్లీ మద్యం కేసులో నిందితురాలిగా ప్రస్తుతం జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయటం.. తనకు సాధారణ మహిళలకు ఉండే హక్కుల్ని కల్పించాలని కోరుతూ తన తరఫు లాయర్ చేత వాదనలు వినిపించటం తెలిసిందే. ఈ వాదనకు కౌంటర్ గా సీబీఐ.. ఈడీల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ మహిళ కాదని.. ఆమె చాలా శక్తివంతురాలన్న విషయాన్ని ఈడీ.. …
Read More »వైసీపీకి ఈక్వేషన్ల బెంగ.. ఆ నాలుగూ
ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రస్తుత ఎన్నికల్లో ఈక్వేషన్ల మంత్రం పఠించింది. స్థానికంగా ఉన్న వారిని.. సిట్టింగులను కూడా ఎన్నికల సమయంలో మార్పు చేసింది. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని కూడా.. ఇక్కడ నియమిస్తూ.. తాము ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పుకొంది. అయితే.. అన్ని వేళలా ఈ ప్రయోగాలు ఫలిస్తాయని చెప్పలేని పరిస్థితి. ఇదే.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా నాలుగు కీలక నియోజకవర్గాలను పార్టీ వదులుకునే పరిస్థితి వచ్చిందని …
Read More »అధికారులు వెళ్లిపోతామంటున్నారు.. ఏంటి కథ!
వారంతా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు. నిన్న మొన్నటి వరకు కూడా వారంతా సీఎం జగన్కు అత్యంత వీర విధేయులు. ఆర్థిక, ఎక్సైజ్, గనుల శాఖల అధిపతులుగా చక్రం తిప్పారు. వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు కూడా మేలు చేశారనే విమర్శలు బలంగా ఎదుర్కొన్నారు. నిత్యం ప్రతిపక్షాల నుంచి అనేక ఈసడింపులు ఎదురైనా.. నాలుగేళ్లపాటు వాటిని ఎదుర్కొన్నారు. సీఎం జగన్ ఏం చెబితే అది చేశారు. ఆయన కనుసన్నల్లోనే మెలిగారు. అనేక …
Read More »పిన్నెల్లి అరాచకాలపై బుక్లెట్: చరిత్రలో ఫస్ట్!
వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై బుక్లెట్ రూపొందించారు. దీనిని ఎవరు రాశారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎందుకంటే.. ప్రాణ భయం ఉన్న నేపథ్యంలో ఎవరు రాశారనే విషయం బయటకు పొక్కలేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం పీడిఎఫ్ కాపీ జోరుగా వైరల్ అవుతోంది. ఇలా.. ఒక ఎమ్మెల్యే అరాచకాలపై బుక్లెట్ రూపొందించడం.. ప్రచారం చేయడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి అని పరిశీలకులు చెబుతున్నారు. …
Read More »సంచలనం: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరు
ఆరు మాసాల కిందట దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో తాజాగా మరో సంచలనం వెలుగు చూసింది. ఈ స్కాం గురించిన అనే కీలక విషయాలు అన్నీ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు తెలుసునని ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ను కూడా దాఖలు చేసింది. ఈడీ తరఫు న్యాయవాది పదే పదే కేసీఆర్ పేరును తాజాగా ప్రస్తావించడం గమనార్హం. ఢిల్లీలోని ఆమ్ …
Read More »జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి బెయిల్!
ఏపీ సీఎం జగన్పై విజయవాడ శివారులోని సింగ్నగర్ ప్రాంతంలో జరిగిన రాయి దాడి ఘటనలో ప్రధాన నిందుతుడు(ఏ1) సతీష్కు ఉపశమనం లభించింది. విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్కు సంబంధించి కొన్ని షరతులు విదించింది. ప్రతి శనివారం, ఆదివారం సింగ్నగర్ పోలీసు స్టేషన్లో హాజరు కావాలని.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు సంతకాలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా రూ.50 వేలపూచీ కత్తు …
Read More »చంద్రబాబు రిటర్న్ టు ఏపీ.. ఇక, వేడే!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం తిరిగి రానున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత(ఈనెల 13) ఆయన కుటుంబంతో సహా.. విదేశాలకు వెళ్లారు. అయితే.. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసమని అప్పట్లో పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఈ పర్యటనలో నారా లోకేష్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. మొత్తంగా నారా కుటుంబం అమెరికాలో పర్యటించింది. ఈ పర్యటనను ముగించుకుని బుధవారం చంద్రబాబు ఫ్యామిలీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates