Political News

దిశ చట్టం… రాష్ట్రం తప్పిదమేనా?

అప్పుడెప్పుడో అంటే దాదాపు రెండేళ్ల క్రితమే ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టానికి ఇంతవరకు అతీగతీ లేదు. దిశ చట్టం బిల్లును ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అందుకనే రాష్ట్రంలో పోలీసు, న్యాయ శాఖల ఉన్నతాధికారులు దిశ చట్టం బిల్లును రూపొందించారు. దాన్ని అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించాయి. తర్వాత అదే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రంలో ముందు న్యాయశాఖ పరిశీలిస్తుంది. తర్వాత హోంశాఖకు వెళ్ళి తర్వాత క్యాబినెట్ కు చేరుతుంది. …

Read More »

‘మేఘా’ సంస్థ చేతికి భారీ డీల్

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టులను చేజిక్కించుకోవటంలో మేఘా ఇంజనీరింగ్.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కు సాటి రావటం చాలా సంస్థలకు సాధ్యం కాదని చెబుతారు. గడిచిన రెండు దశాబ్దాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన సంస్థల్లో ఒకటిగా నిలుస్తుంది మేఘా సంస్థ. మూలాలు ఏపీ అయినా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల మీద మేఘా కన్ను పడితే.. ఆ ప్రాజెక్టు ఆ సంస్థ చేతికి చిక్కుతుందని చెబుతారు. …

Read More »

నోట్ దిస్ పాయింట్ కేసీఆర్ స‌ర్‌!… ఈటల ఏమ‌న్నారంటే!

కొన్ని కొన్ని కామెంట్లు కొంద‌రి నోటి నుంచి వ‌స్తేనే సంచ‌ల‌నంగా మారుతుంది. ఇప్పుడు ఆ స‌బ్జెక్టుకు కూడా సార్ధ‌క‌త చేకూరుతుంది. ఇప్పుడు ఇలాంటి కామెంట్లే చేశారు. బీజేపీ నాయ‌కుడు, మాజీ టీఆర్ఎస్ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. మ‌ద్యం అమ్మి, భూములు అమ్మి.. రాష్ట్రాన్ని బాగు చేస్త‌రా.. అంటూ.. కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుపడ్డారు. తనదైన శైలీలో కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. మ‌ద్యం, భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక …

Read More »

కేసీఆర్ వెనుక ఉన్నది వాళ్లే.. రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సొంతపార్టీ నేతలకు రాహుల్ గాంధీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్‌లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాహుల్.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే యుద్ధమని వెల్లడించారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కేసీఆర్‌ వెనుక ధనం, పోలీసులు ఉన్నారు కానీ.. ప్రజలు లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసేది నిరంకుశ ప్రభుత్వం …

Read More »

వైసీపీకి పొత్తుల‌తో ప‌నిలేదు: అంబ‌టి, సాయిరెడ్డి

వైసీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో.. వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన. “చంద్రబాబుకు ఎన్నికలలో గెలుస్తామన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అసలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. పైగా బాబుది దుర్మార్గపు ఆలోచన. ఎప్పుడూ ఇతరులపైనే ఆధారపడే …

Read More »

రేవంత్ ను సర్వాధికారిగా డిసైడ్ చేసిన రైతు సంఘర్షణ సభ

అదేంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సర్వాధికారిగా మారటం ఏమిటన్న సందేహం కొందరికి కలగొచ్చు. పేరుకు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటికీ.. ఆయనకు పూర్తి అధికారాలులేవన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీలోని అసమ్మతి ఆయన్ను అడ్డుకుంటూనే ఉంటోంది. ఒక దశలో ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. కాంగ్రెస్ కాని రేవంత్ ను.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా చేసినప్పటికీ.. ఆయనకు పూర్తిస్థాయి పెత్తనం ఇచ్చే విషయంలో …

Read More »

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లకు జైలు శిక్ష..

ఒక కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సాధారణ జైలుశిక్షతో పాటు.. జరిమానాను విధిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఊహించని రీతిలో వచ్చిన ఈ తీర్పునకు వెంటనే అప్పీలుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును ఆరు …

Read More »

ప్రభుత్వానికి చేతకావడం లేదు, మీదే బాధ్యత – ప్రజలతో పవన్

రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై విచారణను హైకోర్టే సూమోటోగా తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై అత్యాచారాలు ఆగని పక్షంలో జనాల్లో భయం పెరిగిపోతుందన్నారు. అందుకనే అత్యాచార ఘటనలను కోర్టే విచారణకు స్వీకరిస్తే జనాల్లో కాస్త ధైర్యం వస్తుందన్నారు. ఈ పద్ధతిలో హైకోర్టు చొరవ చూపించి ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం ఆపలేకపోతోందన్నారు. ఈ విషయాన్ని …

Read More »

2 ల‌క్షల రుణ మాఫీ.. రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ‘వరంగల్ డిక్లరేషన్‌’ ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. చేసే అభివృద్ది పనుల గురించి ప్రసంగించారు. తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రేవంత్‌… రైతుల కుటుంబాలను కేసీఆర్‌ ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 …

Read More »

పొత్తుల గురించి ఎవరు మాట్లాడినా ఔట్‌: రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్‌

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఆ పార్టీ నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. పొత్తుల విష‌యంలో కాంగ్రెస్‌లో ఎవ‌రూ నోరు మెద‌పొద్ద‌ని గ‌ట్టిగానే చెప్పారు. ఇలా ఎవ‌రు మాట్లాడినా.. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. టీఆర్ ఎస్‌, బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగే నాయ‌కుల‌కు కూడా పార్టీలో చోటు లేద‌న్నారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్‌.. ఆ సాంతం వాడి …

Read More »

కేసీఆర్ క‌రుణ ద‌క్కేది ఎవ‌రికి? రాజ్య‌స‌భ రేసులో కొత్త ముఖాలు

టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ క‌రుణ కోసం.. నేత‌లు త‌హ‌త‌హలాడుతున్నారు. ఆయ‌న త‌మ‌ను క‌రుణించాల‌ని.. నేత‌లు దేవుళ్ల‌ను మొక్కుతున్నారు. దీనికి కార‌ణం.. త్వ‌ర‌లోనే మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు ఉండ‌డమే! ఈక్ర‌మంలో కేసీఆర్‌ ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. 2018 ఏప్రిల్‌ 3న బండా ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా పరిణామాల అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌.. …

Read More »

పొత్తుల‌పై చంద్ర‌బాబు సంకేతాలు.. ఏమ‌న్నారంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రాజ‌కీయ పొత్తుల‌పై తొలిసారి పెద‌వి విప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు అన్ని పార్టీలూ క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జా ఉద్య‌మం నిర్మించాల‌ని.. దీనికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని తేల్చి చెప్పారు. “ఏపీలో ప్ర‌జా ఉద్య‌మం రావాలి. ఈ ప్ర‌జా ఉద్య‌మానికి టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంది. ఈ విష‌యంలో టీడీపీ ఎన్నిత్యాగాలు చేసేందుకైనా సిద్దం. ఇప్ప‌టికే మాతో క‌లిసి ప‌నిచేసేందుకు సీపీఐ సిద్ధంగా …

Read More »