Political News

ఏపీకి ప్రత్యేక హోదా.. అమరావతి మీద కేసీఆర్ స్టాండ్ ఏమిటి?

KCR

తనకు అలవాటైన పిచ్ మీద ఏ బ్యాట్స్ మెన్ అయినా.. బౌలర్ అయినా ఇరగదీస్తాడు. కానీ.. తనకు అలవాటు లేని ఫార్మాట్ లో ఆడాల్సి వచ్చినప్పుడు మాత్రం కాస్తంత తొట్రు పాటు ఖాయం. ఆటలో ఉండే ఈ ఇబ్బందికి మించి రాజకీయాల్లో ఉంటుందని చెప్పాలి. ఇంతకాలం వినిపించిన తెలంగాణ సెంటిమెంట్ కు భిన్నంగా.. తన పరిధి యావత్ దేశమని.. దేశ ప్రయోజనాలకు తగ్గట్లు తన ఆలోచనలు.. ప్రణాళికల్ని చెప్పాల్సిన అవసరం …

Read More »

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ‘ఏక‌గ్రీవం..`’మారిన బీజేపీ వ్యూహం

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీ యూట‌ర్న్ తీసుకుంది. ఈ ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి.. అధికార పక్షం మద్దతు పలకనుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దీనికి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. దేశ రాజ‌కీయాల్లో రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతకు …

Read More »

మోడీ వ్యూహానికి చిక్కిన కాంగ్రెస్‌.. చ‌రిత్ర‌లో చ‌వి చూడ‌ని క‌ష్టం!

నొప్పి తెలియ‌కుండా వాత‌లు పెట్ట‌డం అంటే.. మోడీని చూసి నేర్చుకోవాల్సిందే! రాజ‌కీయాల్లో వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు కామ‌న్‌. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై పైచేయి సాధించేందుకు నాయ‌కులు వ్యూహాలు వేయ‌డం.. అంద‌రికీ తెలిసిందే. అయితే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స్ట‌యిలే వేరు. పైకి ఏమీ తెలియ‌న‌ట్టుగా న‌టిస్తూనే ఆయ‌న తాజాగా పన్నిన వ్యూహం.. అతి పెద్ద కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. అది కూడా కీల‌క‌మైన‌… రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో కావ‌డంతో ఇప్పుడు …

Read More »

కేసీయార్ తప్పు చేస్తున్నారా ?

ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో 22 పార్టీల కీలకమైన సమావేశానికి హాజరు కాకూడదని కేసీయార్ డిసైడ్ అయ్యారు. వచ్చే నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్లబ్ లో నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలకు కూడా మమత ఆహ్వానాలను పంపారు. మమత నుండి ఆహ్వానాలను అందుకున్నవారిలో కేసీయార్ …

Read More »

టీడీపీ-బీజేపీల విష‌యంలో 2019 త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌..!

ఈ చిత్రం చూశారా.. ఒక‌రు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు, మ‌రొక‌రు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు. వారే.. కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు, సోము వీర్రాజు. 2019 త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌రికొక‌రు ముభావంగా ఉన్నారే త‌ప్ప‌.. ఎవ‌రు ఎవ‌రితోనూ క‌లిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు ప‌డే అవ‌కాశం వ‌చ్చినప్పటికీ త‌ప్పించు కుని తిరిగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌ఫంక్ష‌న్‌లో క‌లుసుకున్నారు. ఒక‌రికొక‌రు కుశ‌ల ప్ర‌శ్న‌లు …

Read More »

గురువుల‌కు షాక్ ! నోటీసులు ఎందుకు జ‌గ‌న్ !

ఆంధ్రావ‌నిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఆశించిన మేర లేని కార‌ణంగా గురువుల‌కు షోకాజ్ నోటీసులు వెళ్తున్నాయి. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు చ‌ర్య అంతటా చ‌ర్చ‌కు తావిస్తోంది. తాజాగా సమాచారం అనుస‌రించి క‌స్తూరిబా బాలిక‌ల పాఠ‌శాల‌ల‌కు సంబంధించి ఫ‌లితాలు బాగుండ‌క‌పోవ‌డంతో సంబంధిత గురువుల‌కు స‌ర్వ‌శిక్ష అభియాన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ చ‌ర్య‌ను నిర‌సిస్తూ, స‌ర్కారును ప్ర‌శ్నిస్తూ ఉపాధ్యాయ సంఘాలు మండిప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఎంతో ఒత్తిడిని అధిగ‌మించి …

Read More »

మోడిలో టెన్షన్ మొదలైందా ?

నరేంద్రమోడిలో టెన్షన్ మొదలైనట్లే కనిపిస్తోంది. లేకపోతే గడచిన ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని అనుకోని మోడి ఒక్కసారిగా ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నారంటే టెన్షన్ మొదలైనట్లే అనుకోవాలి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే సమయంలో వరుణ్ గాంధి లాంటి సొంతపార్టీ ఎంపీలే ఉద్యోగాల భర్తీ విషయంలో మోడీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రెండురోజుల క్రితమే కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉన్న …

Read More »

ప్లీనరీలో కీలక నిర్ణయం వెల్లడించనున్న జగన్

వ‌చ్చే నెల ఎనిమిది, తొమ్మిది తారీఖుల్లో జ‌రిగే వైఎస్సార్సీపీ ప్లీన‌రీ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఓ కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించాల‌నుకుంటున్నారట. ఈ నిర్ణ‌యం కార‌ణంగా వ‌చ్చే సారి ఎన్నిక‌ల‌కు పోటీచేసే అభ్య‌ర్థుల జాబితాను ఆరు నెలల ముందు కానీ లేదా ప‌ది నెల‌ల ముందు కానీ ప్ర‌క‌టించే అవ‌కాశాల‌ను పరిశీలిస్తూ సంబంధిత విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గ‌తంలోనూ ఇదే విధంగా ఆయ‌న ప‌నిచేసిన దాఖ‌లాలు ఉన్నాయి. …

Read More »

బాబు హుషారు- 100 నియోజకవర్గాల్లో రోడ్డు షోలు

వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు భారీ ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఏడాదిలోపు 100 నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఏడాదిపాటు జిల్లాల్లో పర్యటనలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. జిల్లాల పర్యటన ఈరోజు అంటే బుధవారం నుండే ప్రారంభమవుతున్నాయి. తన పర్యటనను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంతో చంద్రబాబు మొదలు పెట్టబోతున్నారు. ‘ఎన్టీయార్ స్పూర్తి-చంద్రన్న భరోసా’ పేరుతో ఏడాది పాటు జిల్లాల పర్యటనలను ప్రారంభించబోతున్నారు. …

Read More »

అనంత‌బాబుకు అభిషేక‌మా… దేవుడా !

క‌లియుగ ధర్మం అంటే ఇదేమోనో. ఎమ్మెల్సీ అనంత‌బాబుకు ఏజెన్సీ వాసులు ఎందుకు పాలాభిషేకం అంట. అల్లూరు సీతారామ రాజు జిల్లా, దేవీప‌ట్నం మండ‌లం, ఇందుకూరుపేట‌లో నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన అనంత‌రం ఈ వైనం చోటుచేసుకుంది. స్థానిక ఆర్ అండ్ బీ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఆయ‌న చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేయ‌డం ఇప్పుడొక చ‌ర్చ‌కు తావిస్తోంది. ద‌ళిత యువ‌కుడు, ఆయ‌న డ్రైవ‌ర్ అయిన సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్యకు కార‌ణం …

Read More »

వైసీపీ – టీడీపీ మధ్య వెంకాయమ్మ వార్

కొన్ని విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీస్తాయో ఊహించడం కష్టం. సాధారణంగా ఏపీలో జగన్ ని తిట్టడానికి బహిరంగంగా చాలామంది ధైర్యం చేయరు. అలా ధైర్యం చేసిన కొందరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అయితే, వెంకాయమ్మ అనే మహిళ జగన్ సర్కారు గురించి చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. ఎప్పటిలాగే ఆమెను కొందరు ఇబ్బంది పెట్టడం చేశారు. కానీ వెంకాయమ్మ అదరలేదు బెదరలేదు. టీడీపీ ఆమెకు మద్దతుగా నిలబడింది. …

Read More »

భోరున ఏడ్చేసిన ముఖ్య‌మంత్రి

సినిమాలు చూసి క‌న్నీళ్లు పెట్టుకునే వారు ఇప్పుడు చాలా చాలా అరుదుగా క‌నిపిస్తున్నారు. ఎందుకంటే.. త‌మ జీవితాల్లోనూ సినిమాల‌ను మించిన క‌ష్టాలు వ‌స్తున్నాయి. నిత్య జీవితంలో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టాలు సినిమాల‌ను త‌ల‌పిస్తున్నాయి. దీంతో ఎంతో బాధాక‌ర‌మైన స‌న్నివేశాలు.. సెంటిమెంటుతో కూడిన స‌న్నివేశాలు ఉంటే త‌ప్ప‌.. పెద్ద‌గా ఎవ‌రికి క‌ళ్లు చెమ‌ర్చ‌డం లేదు. కానీ, క‌ర్ణాట‌క సీఎం మాత్రం ఓ సినిమా చూసి భోరున క‌న్నీరు కార్చారు. ఇదేదో ఒక్క …

Read More »