ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే అధికార దాహంతో ఉన్న వైసీపీ దేనికైనా తెగించేందుకు వెనుకాడటం లేదనే విమర్శలున్నాయి. ఓట్లు పొందేందుకు ప్రత్యర్థి పార్టీలపై తీవ్రమైన ఆరోపణలు, నాయకులపై దాడులతో పాటు జనాలను మభ్య పెడుతూ వైసీపీ సాగుతోందనే టాక్ ఉంది. ఇక వాలంటీర్లనే ప్రధానంగా నమ్ముకున్న వైసీపీ వాళ్లతో ఓట్లు పొందేందుకు వ్యూహాలు అమలు చేస్తుందని తెలిసింది. వాలంటీర్లతో ప్రచారం చేయించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా …
Read More »గంటాకు సినీ గ్లామర్.. ప్రచారాన్ని హోరెత్తించిన నమిత
ఎన్నికల వేళ నాయకులకు సినీ గ్లామర్ కూడా కలిసి వస్తోంది. అయితే.. గతంలో మాదిరిగా పెద్దగా సినీ తారలు ఇప్పుడు ప్రచారంలో కనిపించడం లేదు. ఒక్క పవన్ కల్యాణ్కు మాత్రం పిఠాపురంలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్కు నందమూరి కుటుంబ సభ్యులు.. ఈ కుటుంబంలోని ఒకరిద్దరు నటులు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు మించి పెద్దగా సినీ గ్లామర్ ఇప్పుడు రాజకీయ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ, టీడీపీ నాయకుడు, …
Read More »ఖమ్మం టీడీపీ ఆఫీసుకు పెరిగిన డిమాండ్ !
తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని నేరుగా కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీ కార్యాలయానికి అందరూ క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయం చుట్టూ ఖమ్మం లోక్ సభ …
Read More »కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ రెండు పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేజీ కూడా తోడవడంతో కూటమి బలం ఇంకా పెరిగింది. ఇది వైసీపీలో గుబులు పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వల్ల ఓట్ల పరంగా జరిగే లాభం కంటే.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు చేయకుండా అడ్డుకోవడం ద్వారా జరిగే మేలు ఎక్కువని …
Read More »ఆ మూడూ గెలవకుంటే .. మూడు ముక్కలాటే !
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ కు తప్పనిసరి అవసరంగా మారింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో, రేవంత్ సొంత ఊరు కొండారెడ్డిపల్లి నాగర్ కర్నూలు పరిధిలో ఉండగా సిట్టింగ్ ఎంపీగా మొన్నటి వరకు మల్కాజ్ గిరి నుండి ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అందరి …
Read More »20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి-జగన్
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని పదే పదే జగన్ చెప్పుకుంటుంటే.. జగన్ విస్మరించిన హామీలంటూ ఆయన ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలనే షేర్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. జగన్ మాట తప్పిన హామీల్లో ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ …
Read More »గోనె వారి సర్వే… కూటమి వర్సెస్ జగన్.. లెక్క తేల్చేశారు!
గోనె ప్రకాశరావు. తరచుగా సీఎం జగన్పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయకుడు.. ఒకప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డికి మిత్రుడు. తాజాగా ఈయన ఏపీ పాలిటిక్స్పై సంచలన సర్వే అంటూ ఒకటి విడుదల చేశారు. ప్రస్తుతం ఈయన తెలంగాణలో ఉంటున్నారు. మరి ఆయనకు ఏపీలో ఎక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. తాను మాత్రం తెలుసుకున్నట్టు వివరించారు. సరే.. ఎన్నికల వేళ ఏదైనా హాట్ టాపిక్కే కదా! సో.. …
Read More »జగన్ ఎందుకు పవన్ పెళ్లిళ్లపై మాట్లాడతాడంటే..
పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో తెలిసిందే. పవన్ను పేరు పెట్టి పిలవకుండా ‘దత్తపుత్రుడు’ అనడం.. తానుఎక్కడ మాట్లాడుతున్నది కూడా చూసుకోకుండా స్కూల్ పిల్లలున్న సభల్లోనూ ఆయన పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడ్డం.. కార్లను మార్చినట్లు ప్రతి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడని కామెంట్లు చేయడం మామూలే. తాజాగా జగన్ ఒక టీవీ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన …
Read More »జగన్ ఫారిన్ టూర్కు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ
ఏపీ సీఎం జగన్ ఈ నెల 17 నుంచి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉండడంతో దీనికి కోర్టు నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ తరఫున న్యాయవాదులు గుట్టు చప్పుడు కాకుండా ఈ నెల 6వ తేదీనే.. హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సీబీఐ …
Read More »జగన్ అనుకున్నట్టు జరగలేదు..వెయిట్ చేయాలన్న ఈసీ
ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ సహా ఆసరా, చేయూత, విద్యా దీవెన పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నగదును పోలింగ్కు ముం దు ఇచ్చేందుకు వీలు కాదని తేల్చి చెప్పింది. పోలింగ్ మరో నాలుగు రోజుల్లో జరగనుందని.. పోలింగ్ ముగిసిన తర్వాత.. ప్రజలకు ఆయా పథకాల నిధులను జమ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. …
Read More »చింతమనేనితో గొడవ గురించి పవన్..
2014లో తెలుగుదేశంకు మద్దతుగా ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత టీడీపీతో విభేదించి.. ఆ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఐతే ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచారు. పవన్ టీడీపీతో విభేదించిన సమయంలో …
Read More »పవన్ ని తప్పయితే, మోడీది కూడా తప్పే కదా జగన్
తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 2014లో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్ మీద నిందలేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులకు పవన్ కూడా బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలకు పవన్ కూడా వంత పలికారన్న జగన్.. ఆ కూటమిలోనూ బీజేపీ ఉందన్న విషయాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates