టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. టీడీపీలో ఉన్ననాటి నుంచి రేవంత్రెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ.. డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. భూములు చట్టబద్ధంగానే కొన్నానని… లీగల్గా వెళ్లి రేవంత్ను జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు. రేవంత్ బిడ్డ పెళ్లికి తానే డబ్బులు ఇచ్చానని… యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా …
Read More »జగన్ చేస్తున్న అప్పులకు అంతం ఎప్పుడు? : ఉండవల్లి
జగన్ పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. విజయవాడలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్లేసిన వాళ్లకు అన్నీ చేసేద్దాం.. ఓట్లేయని వాళ్లను పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ప్రజలను వైసీపీ మోసం చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. వీళ్లలో వీళ్లు తిట్టుకుంటారే కానీ బీజేపీని మాత్రం ఒక్కమాట కూడా అనరని …
Read More »కేసీఆర్ పీఛేముడ్.. ఢిల్లీలో ఏం జరిగింది?
ఎన్నో ఆశలతో హస్తిన బాటపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా వెనుదిరిగారు. కనీసం ఈ నెల 27 వరకు ఆయన ఢిల్లీ సహా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ పర్యటించాలని ముందుగా షెడ్యూల్ నిర్ణయిం చుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ నెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యం లో కేసీఆర్ డిల్లీ టూర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మోడీకి మొహం చూపించలేకే ఆయన హస్తిన పర్యటన పెట్టుకున్నారని.. …
Read More »మళ్ళీ యాక్టివ్ అవుతున్న గంటా
ఇంతకాలం ఎక్కడున్నారో కూడా తెలీని, ఏమి చేస్తున్నారో కూడా తెలీని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సమిష్టి కృషి చేయాలని, చంద్రబాబునాయుడును మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని గంటా పిలుపునివ్వటం చర్చనీయాంశమైంది. ఒక్క ఛాన్సంటు అధికారం అందుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసినట్లు మండిపడ్డారు. రాష్ట్రానికి సమర్ధ …
Read More »అంబటి రాంబాబు వర్సెస్ తారక్ ఫ్యాన్స్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకరు, ఇటీవలే మంత్రి పదవి చేపట్టిన అంబటి రాంబాబుకు వివాదాలు కొత్త కాదు. నోటి దురుసుకు మారుపేరైన ఆయన.. ఈ మధ్య కాలంలో బాగా నెగెటివిటీని పెంచుకున్నారు. మంత్రి పదవి చేపట్టాక.. గతంలో కొడాలి నాని పోషించిన పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. నానికి దీటుగా జగన్ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. తన నోటి దురుసును చూపిస్తున్నారాయన. ఐతే …
Read More »ఏబీఎన్ ఆర్కేకు చుక్కలు చూపించిన పాల్
గ్లోబల్ పీస్ మిషన్ పేరుతో క్రిస్టియన్ ప్రచార, సేవా సంస్థను నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. పెద్ద పెద్ద దేశాల అధినేతలతో వన్ టు వన్ మీటింగ్ల్లో పాల్గొంటూ తిరుగులేని పాపులారిటీ సంపాదించిన వ్యక్తి కేఏ పాల్. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూడటం ద్వారా వైఎస్కు టార్గెట్గా మారి.. బాగా అన్ పాపులర్ అయిపోయారు పాల్. సోదరుడి …
Read More »డ్రైవర్ను హత్య చేసి.. శవాన్ని చితకబాదాడా?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామన్నారు. హత్య ఘటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. …
Read More »ఆర్ఆర్ఆర్ పై అనర్హత వేటు.. ప్రివిలేజ్ కమిటీ విచారణ షురూ!
తన వ్యాఖ్యలు, విశ్లేషణలతో నిత్యం మీడియాలో ఉండే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ దాఖలు చేసిన ప్రివిలేజ్ పిటిషన్ విచారణకు వచ్చింది. సొంత పార్టీ వైసీపీకి వ్యతిరేకగా వ్యవహరిస్తున్నారని, పార్టీ అధినేత జగన్ను దూషిస్తున్నారని పేర్కొంటూ రఘు రామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు వి. విజయసాయిరెడ్డి దాదాపు ఏడాదిన్నర …
Read More »ఇట్లుంటది కేసీఆర్తోని: రేవంత్ ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్… పంజాబ్ రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని అనుమానం వ్యక్తం చేశారు. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమోనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ చురకలంటించారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ …
Read More »అందుకే.. డైవర్ను నేనే చంపేశా.. : ఎమ్మెల్సీ అనంతబాబు
ఏపీ అధికారపార్టీని కుదిపేసిన.. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ హత్య కేసు దాదాపు కొలిక్కి వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని.. అనంతబాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు విచారణలో తెలిపారు. సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు తెలిపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో …
Read More »అనంతబాబు అరెస్టు ఎప్పుడు..? : చంద్రబాబు డిమాండ్
కారు డ్రైవర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత భాస్కర్ బాబును అరెస్ట్ చేయకపోవటంపై టీడీపీ అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి …
Read More »బాదుడే బాదుడిని ఇకనైనా ఆపండి: నారా లోకేష్
కేంద్రం, ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై భారాలు తగ్గిస్తుంటే, ఏపీలో ఒక్కసారి కూడా తగ్గించకుండా మరింతగా పన్నులు పెంచిన సర్కారు తక్షణమే ఇప్పటికైన ధరలను తగ్గించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రికి నేరుగా రాసిన ఈ లేఖలో చాలా విషయాలను లోకేష్ ప్రస్తావించారు. లేఖ సారాంశం ఇదీ.. ముఖ్యమంత్రి వర్యా!రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి …
Read More »