ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ మోస్ట్ నాయకుడు, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అయ్యన్న రేపు బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. తాజాగా 175 మంది ఎమ్మెల్యేల్లో 172 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. జీవీ ఆంజనేయులు(వినుకొండ) వనమాడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ(ఆచంట నియోజకవర్గం) వివిధ కారణాలతో సభకు రాలేదు. …
Read More »‘జగన్ ఐపీఎస్’లకు చంద్రబాబు షాక్!
ఏపీలో జగన్ పాలన సాగిన సమయంలో ఆయన అనుకూలంగా పనిచేశారని.. ఎవరిపై కేసులు పెట్టమం టే వారిపై కేసులు పెట్టి.. ఎవరిని అరెస్టు చేయమంటే వారిని అరెస్టు చేశారని.. విమర్శలు ఎదుర్కొని.. బ్యాడ్ అయిపోయిన ముగ్గురు ‘జగన్ ఐపీఎస్’లకు సీఎం చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు. వారిలో ఒక్కరికి మాత్రమే తిరిగి పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం.. మిగిలిన ఇద్దరిని మాత్రం పక్కన పెట్టింది. దీంతో జగన్ హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్లు …
Read More »కొడాలిపై కేసు.. ఇక దబిడిదిబిడే!
అధికారం ఉంది కదా అని నోటికి ఎంత వస్తే అంతే వాగే వైసీపీ నేతల్లో ముందుగా వినిపించే పేరు కొడాలి నానిదే. రాజకీయ వర్గాల్లో ఇది అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్లలో నాని నోటికి ఎదురు లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆయన బూతు పురాణాన్ని కొనసాగించారు. ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేశారనే ఆరోపణలు నానిపై ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో ఓటమితో …
Read More »కాలర్ పట్టి మరీ.. బాల్క సుమన్ అరెస్టు
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్టయ్యారు. అయితే. . అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. బాల్క సుమన్ కాలర్ పట్టుకుని.. గుంచిమరీ పోలీసులు ఆయనను జీపులోకి బలవంతంగా నెట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు.. ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. అరెస్టు ఎందుకు? మంచిర్యాల …
Read More »చంద్రబాబుకు కేంద్రం మిఠాయి.. అమరావతిపై కీలక నిర్ణయం!
ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టాని కి కేంద్రం అనుమతి తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని కీలకమైన గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలకు కలుపుతూ.. నిర్మించే రైల్వే లైన్లకు కేంద్ర సర్కారు తాజాగా పచ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం లోనే కేంద్రం నుంచి ఈ సమాచారం …
Read More »కాంగ్రెస్లోకి జంప్ చేసిన పోచారం.. రేవంత్ రియాక్షన్ ఇదే!
తెలంగాణ మాజీ స్పీపర్, బీఆర్ ఎస్ అగ్రనాయకుడు.. పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గతంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్న పోచారం.. ఎంతో మంది పోటీలో ఉన్నప్పటికీ.. అసెంబ్లీ స్పీకర్ పదవిని సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోచారం మరోసారి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. 23 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. అయితే.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆయన గత …
Read More »అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు .. ఇప్పుడేమంటారు ?!
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను చూడడం ఇదే మొదటిసారి. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించింది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా శాసనసభకు రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యత. పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖలు లోతుగా పని చేయాలని భావిస్తున్నాడు. పదవి తాలూకు పవర్ ను మేం ఆశించడం లేదు. కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా పవన్ కు వచ్చే లాభం ఏం లేదు. …
Read More »పవన్కు ముద్రగడ పద్మనాభరెడ్డి విన్నపాలు…!
గత నెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. మీడియాకు కనిపించని వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించకపోతే.. తన పేరును పద్మనాభ ‘రెడ్డి’గా మార్చుకుంటానని చెప్పిన ఆయన అన్నంత పని చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. దీనికి …
Read More »ప్రమాణం చేసిన 2 నిమిషాల్లో వెళ్లిపోయిన జగన్
ఏపీ అసెంబ్లీ 16వ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు సభలో ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రమాణ స్వీకారంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న మీమాంసకు తెరదించుతూ ప్రమాణం చేసేందుకు జగన్ వచ్చారు. గత శాసనసభ …
Read More »ఈవీఎం టాంపరింగ్.. కొట్టిపారేసిన వైసీపీ నేత
2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ సాధించిన విజయంపై తెలుగుదేశం అనుమానాలు వ్యక్తం చేసింది. అప్పుడు ఈవీఎంల పనితీరుపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తే అప్పటి సీఎం జగన్ తేలిగ్గా కొట్టి పారేశారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో ఏకంగా 164 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో ఇప్పుడు వైసీపీ వాళ్లు ఈవీఎం టాంపరింగ్ గురించి …
Read More »ఏపీ అసెంబ్లీలో ఎమోషనల్ మూమెంట్స్
2024 ఎన్నికల ఫలితాలు వచ్చాక తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే కానీ.. ఈసారి అసెంబ్లీలో కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయాయి. అవి కోట్లమందికి భావోద్వేగాన్ని కలిగించాయి. అన్నింట్లోకి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన దృశ్యం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే అని ప్రత్యేకంగా …
Read More »ఏపీలో కొత్త జిల్లాలు.. అప్పుడు 26 ఇప్పుడు 32!
ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన యాత్రల్లో పలుప్రాంతాల్లో ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. దీంతో తాము అధికారంలోకి రాగానే.. ఆయా ప్రాంతాలను పరిశీలించి కొత్త జిల్లాల ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు.. ముసాయిదా జిల్లాల ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates