వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని.. తాను ఎవరినీ బ్రతిమాలబోనని స్పష్టం చేశారు. “చాలా మంది చెబుతా ఉన్నారు. అన్నా.. వాళ్లు వెళ్లిపోతున్నారు అని. నేనేం చేస్తాను. వెళ్లేవాళ్లను వెళ్లమనే చెబుతా. నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్కడొక కాలు.. అక్కడొక కాలు.. ఎందుకు? వెళ్లేవాళ్లు ఎంతటి వారైనా నేను ఆపను. నాకు చెప్పాల్సిన అవసరం …
Read More »ఇల్లు పీకి పందిరేయడమంటే.. ఇదే జగన్!
చక్కగా కట్టుకుంటున్న ఇంటిని చిందర వందర చేయడం.. పీకేసి పందిరేయడం.. ఈ రెండింటికీ నిలు వెత్తు ఉదాహరణ ఏపీ రాజధాని అమరావతి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ మైలేజీలను కొలుచుకుని.. నాటి సీఎం జగన్ చేసిన నిర్వాకంతో ఇప్పుడు.. అమరావతి పరిస్థితి అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు అమరావతి అంటే.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ.. ఇప్పుడు పిలిచినా వస్తారనే నమ్మకం లేకుండా పోయింది. జగన్ చేసిన …
Read More »పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. పవన్ రియాక్షన్
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఆలస్యం.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ స్టిక్కర్లు, పోస్టర్లు రెడీ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక పవన్ ఎన్నికల్లో గెలిచాక ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. బైకుల మీద, కార్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ హోం మినిస్టర్ గారి …
Read More »‘జగన్ మనస్తత్వం చాలా డిఫరెంట్.. అర్థంకాదు’
వైసీపీ అధినేత జగన్ మనస్థత్వం చాలా డిఫరెంట్గా ఉంటుందని.. దానిని అర్ధం చేసుకోవడం చాలా కష్టమని ప్రముఖ సర్వే సంస్థ.. ఆరా అధినేత మస్తాన్ పేర్కొన్నారు. జగన్ ఎవరినీ బ్రతిమాలరని.. ఎవరూ తనకు అనుకూలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం ఆయనకు లేదన్నారు. ఆయన మనస్థత్వం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నారు. ఆయనను అర్థం చేసుకోవడం కూడా.. అంతే డిఫరెంట్ అని తెలిపారు. లేకపోతే.. ఎన్నికలకు ముందు ఇంత మంది ఎలా వెళ్లిపోతారని …
Read More »తప్పదు.. మోడీ సర్.. బాబు చేతులు కట్టేశారు!
ఏపీకి నిధులు ఇవ్వక తప్పని పరిస్థితి మోడీకి ఏర్పడిందా? అమరావతి రాజధానికి మోడీ ఇప్పుడు కనీసం 100 కోట్లయినా.. కేటాయించక తప్పదా? అంటే.. తప్పదనే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో మోడీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పార్టీ కేవలం టీడీపీనే. ఇతర పార్టీలను తీసుకుంటే.. వారి గొంతెమ్మ కోరికలను తీర్చకపోతే.. ఏ క్షణమైనా తప్పుకొనే అవకాశం ఉంది. కానీ, బాబు అలా చేయరు. గతంలో ఇలా చేసే.. …
Read More »ఆ జాబితాలో చివరి స్థానంలో ఏపీ
ఒక వ్యక్తి ఆలోచన అయినా.. ఒక నాయకుడి ఆలోచన అయినా.. పురోగతి దిశగా ఉండాలి. అది కుటుంబ మైనా.. రాష్ట్రమైనా.. ఒకే సూత్రం. ఒక ఆలోచన వనరులు పండించాలి. అభివృద్ధి పరుగులు పెట్టించాలి. కానీ.. ఏపీలో 2019-24 వరకు ఐదేళ్లపాటు సీఎంగా ఉన్న జగన్.. తన ఆలోచనలను తిరోగమనంలో తీసుకు వెళ్లారు. దీనివల్ల ఆయనకు మానసిక ఆనందం దక్కి ఉండొచ్చు. మనశ్శాంతి పొంది ఉండొచ్చు. కానీ, రాష్ట్రం నీరుగారిపోయింది. తాజాగా …
Read More »ఆర్-5 జోన్ పై చంద్రబాబు మాస్టర్ ప్లాన్
అమరావతి విషయంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించా రు. 2019కి ముందు ఎలా అయితే.. అలానే రాజధానిని తీర్చిదిద్దేందుకు ఆయన ప్లాన్ రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగా.. జగన్ హయాంలో వచ్చిన ఆర్-5 జోన్ను ఇకపై ఆయన రద్దు చేయనున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంటే.. త్వరలోనే ఆర్-5 జోన్ రద్దు కానుంది. అయితే.. ఇది ఒకింత భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో …
Read More »పెద్దిరెడ్డి ‘అక్రమాలు’ తగలబడ్డాయా?
బెజవాడలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. విజయవాడలోని అవనిగడ్డకు వెళ్లే కరకట్టపై కొందరు బస్తాల కొద్దీ ఫైళ్లను తీసుకువచ్చి.. తగుల బెట్టారు. అయితే .. ఈ ఘటన జరిగిన సమయం.. సదరు ఫైళ్లను పరిశీలిస్తే.. గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు వెలుగు చూడకూడదన్న ఉద్దేశంతోనే.. ఇలా చేసి ఉంటారనే అనుమానాలు రేగుతున్నాయి. ఈ ఫైళ్లను తగుల బెడుతుండగా చూసిన ఓ వ్యక్తి.. …
Read More »అనుభవం తెచ్చిన అభివృద్ది.. ఏపీలో ఎంత తేడా!
ఏపీ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటి? ఇద్దరూ ఏపీ ప్రజలు ఎంచుకున్నవారే.. ఘన విజయం అందించిన వారే. అయినప్పటికీ.. రాష్ట్రం విషయంలో ఎక్కడో తేడా .. ఇద్దరి ఆలోచనల మధ్య చాలా వ్యత్యాసం.. ఇదే ఇప్పుడు రాజకీయంగానే కాకుండా.. అభివృద్ది పరంగా కూడా చర్చకు వస్తోంది. రాష్ట్రాన్ని ఆదాయవనరుగా మార్చుకోవాలన్నది.. చంద్రబాబు ఆలోచన. ఇది భేష్ అయిన ఆలోచన. …
Read More »అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం
అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను ప్రజలు గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధికి నడుం బిగించిన ఏపీ సీఎం …
Read More »ఇకపై జగన్ కేసుల రోజువారీ విచారణ
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని 2024 ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి హరి రామ జోగయ్య వేసిన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే జగన్ కేసుల్లో రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ …
Read More »వైఎస్ జయంతి .. షర్మిల టార్గెట్ ఏంటి ?
జులై 8. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 2009 సెప్టెంబరు 2 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో విబేధాల నేపథ్యంలో ఆయన కుమారుడు జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. ఆ తరువాతి పరిణామాల్లో ఆక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates