Political News

రాష్ట్ర‌ప‌తి ఏ చీర క‌ట్టుకోవాలో.. వాళ్లే నిర్ణ‌యిస్తార‌ట‌!!

నిజంగానే ఇది ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో చాలా మంది తెలియ‌ని అతి పెద్ద ర‌హ‌స్యం. ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధానులు.. ఏం తినాలో.. ఎటు వైపు వెళ్లాలో.. ఎక్క‌డ ప‌ర్య‌టించాలో.. వంటివాటిని మాత్ర‌మే అదికారులు నిర్ణ‌యిస్తార‌ని.. ముందుగా.. కొన్ని ప‌దార్థాల‌పై టెస్టులు కూడా చేస్తార‌ని తెలుసు. కానీ.. రాష్ట్ర‌ప‌తి విష‌యంలో వీటికి అద‌నంగా కూడా కొన్ని నిర్ణ‌యాలు అధికారులే తీసుకుంటార‌నే విష‌యం.. ఇప్పుడే వెలుగు చూసింది. రాష్ట్ర‌ప‌తి ఏం మాట్లాడాలో.. ముందుగానే రాష్ట్ర‌ప‌తి …

Read More »

విలీన మండ‌లాల‌పై..చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో పోల‌వ‌రం విలీన మండ‌లాల‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై విలీన మండ‌లాల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని.. అందుకే వారు తెలంగాణ‌లో క‌లిసిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని చంద్రబాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకం చూస్తున్నారని అన్న బాబు.. విలీన మండలాల్లో …

Read More »

టీడీపీ, జనసేన ఏమి చేస్తాయో ?

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. అందుకనే ముగ్గురు అభ్యర్ధులను కూడా ప్రకటించేశారు. మరి ప్రతిపక్షాలు ఏమి చేస్తాయి ? ప్రతిపక్షాలంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే మిగిలిన పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ఉన్నాయంటే ఉన్నాయంతే. వచ్చే మార్చిలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ద్వారా భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం …

Read More »

కేసీయార్ కు ఏపీ బుల్లెట్ ప్రూఫ్

తెలంగాణ సీఎం కేసీయార్ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో రెడీ అవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని వీరపనేనిగూడెంలో ఇవన్నీ సిద్ధమవుతున్నాయి. కేసీయార్ భద్రతా చర్యల్లో భాగంగా 8 వాహనాలను బుల్టెట్ ప్రూఫ్ చేయించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డిసైడ్ చేసింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా వీలైనంత తొందరలో అత్యంత రక్షణగా ఉండే వాహనాలను వెంటనే రెడీ చేయాలని పోలీసులు ఉన్నతాధికారులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా 8 …

Read More »

ఆ స‌ల‌హాదారుపై జ‌గ‌న్ గుస్సా.. అప్పాయింట్మెంట్ నై!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. సుమారు 36 మందిని ఏరికోరి స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్న విష‌యం తెలిసిం దే. వీరిలో త‌న‌సొంత మీడియాలో ప‌నిచేసే ఉన్న‌త‌స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే.. వీరికి అప్ప‌గించిన ప‌నివిష‌యంలో వారు స‌క్సెస్ కాలేక పోతున్నార‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వంపై వ‌స్తున్న క‌థ‌నాల‌ను.. లేదా.. వ్య‌తిరేక‌త‌ను అరిక‌ట్టేందుకు.. లేదా త‌గ్గించేందుకు వీరు ప్ర‌య‌త్నాలు చేయ‌లేక పోతున్నార‌నేది సీఎం జ‌గ‌న్ ఆవేద‌న‌గా ఉంద‌ని.. వైసీపీ వ‌ర్గాలు ముఖ్యంగా తాడేప‌ల్లిలోని కీల‌క …

Read More »

మీడియా లో కంగారూ కోర్టులు న‌డుస్తున్నాయ్‌: జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఫైర్‌

టీవీ ఛానెల్‌లలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో ‘కంగారూ కోర్టు’ల నిర్వహణ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.మీడియా చర్చలు న్యాయవ్యవస్థ పనితీరు, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయన్నారు. మీడియా వ్యక్తం చేస్తున్న పక్షపాత అభిప్రాయాలు, ప్రత్యేక ఎజెండాతో నడిచే చర్చలు భారత ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి వేసేలా చేస్తున్నాయని జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. మీడియా ప్రచారం చేస్తున్న ఏకపక్ష అభిప్రాయాలు ప్రజలను …

Read More »

శ‌భాష్‌.. నిమ్మ‌లా!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు అరుదైన ప్ర‌శంస ల‌భించింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్ర‌బాబు నుంచి పార్టీనాయ‌కులు కితాబు కోరుకుంటారు. అయితే.. ఇదేమంత‌.. ఈజీగా ల‌భించే కితాబు కాదు. ఎంతో క‌ష్ట‌ప‌డి.. చెమ‌ట‌లు చిందించినా.. కూడా చంద్ర‌బాబు ప్ర‌శంసించ‌రు. ఇంకా క‌ష్ట‌ప‌డాలి.. ఇంకా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చెబుతుంటారు. అయితే.. అదే చంద్ర‌బాబు తాజాగా నిమ్మ‌ల‌ను ఆకాశానికి ఎత్తేశారు. “శ‌భాష్‌.. బాగా ప‌నిచేస్తున్నావ్‌!!” అని నిమ్మ‌ల …

Read More »

జ‌గ‌న్‌.. విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్న మోడీ!

ఔను..జ‌గ‌న్ విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆయ‌న చేస్తున్న త‌ప్పులు త‌మ పీక‌ల‌మీద‌కు రాకుండా.. ప్ర‌జ‌ల్లో త‌మ ప‌ర‌ప‌తి పోకుండా చూసుకునేందుకు.. మోడీ చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మాట వైసీపీ నేత‌లే చెబుతున్నారు. క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌పిస్తున్నారు. త‌ద్వారా.. తాను భావిస్తున్న‌.. (ప్ర‌జ‌లు వ్య‌తిరేకించినా..) మూడు రాజ‌ధానుల‌కు ముందడుగు ప‌డుతుంద‌ని.. అనుకున్నారు. …

Read More »

జగన్ కీలక నిర్ణయం !

గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహణపై జగన్మోహన్ రెడ్డి జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమీక్షించారు. కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నులపై అందరితో మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో వాళ్ళకున్న బాధ్యతలు ఏమిటి ? వాళ్ళపై తాను ఎలాంటి భారాన్ని మోపారనే విషయాన్ని జగన్ వివరించారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయటంలో జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల పాత్రపై జగన్ స్పష్టత ఇచ్చారు. పనిలోపనిగా ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అదేమిటంటే …

Read More »

కేసీయార్ ను అవమానించిన మోడీ సర్కార్

నరేంద్రమోడీ ప్రభుత్వం కేసీయార్ తో పాటు మరికొందరు ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించింది. పదవీ విరమణ చేయబోతున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నరేంద్ర మోడీ వీడ్కోలు విందిచ్చారు. ఈ విందుకు తనకు ఇష్టమైన ముఖ్యమంత్రులను మాత్రమే పిలిచి ఇష్టంలేని ముఖ్యమంత్రులను వదిలేశారు. నిజానికి రాష్ట్రపతి గౌరవార్థం విందు ఇస్తున్నపుడు ఎవరిని పిలవాలనే విషయంలో స్పష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ మోడీ సర్కార్ దాన్ని తుంగలో …

Read More »

చంద్ర‌బాబు టోన్ మారిందే…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు టోన్ మారింది. గ‌తానికి భిన్నంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌లో విస్తృతంగా తిరుగుతున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా తిర‌గ‌బ‌డాలంటూ.. ఆయ‌న పిలుపునిస్తున్నారు. ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తాన‌ని.. ప్ర‌జల‌కు అన్ని రూపాల్లోనూ పార్టీ అండ‌గా ఉంటుందని కూడా ఆయ‌న అంటున్నారు.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబులో పూర్తి మార్పు క‌నిపించింద‌ని అంటున్నారు పరిశీల‌కులు. వాస్త‌వానికి చంద్ర‌బాబు గ‌తంలో ఎప్పుడూ.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌లేదు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల ర‌గిలిపోతున్నారట

ఔను! ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ర‌గిలిపోతున్నారు. త‌ప్పులు మీరు చేసి.. మాపై నింద‌లు మోపుతారా? అని కొంద‌రు అంటుంటే.. మీరు చేస్తున్న త‌ప్పుల‌కు మేం ప్ర‌జ‌ల‌తో తిట్టించుకుంటున్నాం.. అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించ‌డ‌మే. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆయ‌న ఎమ్మెల్యేల‌కు రెండుసార్లు క్లాస్ ఇచ్చారు. పార్టీ ప్ర‌తిష్టా త్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు మాత్ర‌మే మ‌న‌సు పెట్టి చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లు …

Read More »