భావం మంచిదే అయినా.. మాట తీరు కూడా.. అంతే మంచిగా ఉండాలి. మాటలో ఏ చిన్న తేడా వచ్చినా.. భావం మొత్తాన్ని హరించేస్తుంది. వివాదం కూడా చేస్తుంది. “మీ నాన్న ఉన్నాడా? – అన్నదానికీ.. నీ అమ్మ మొగుడు ఉన్నాడా? ” అన్న దానికీ ఎంత తేడా ఉంది. ఇలానే.. భావం మంచిదే అయినా మాట తీరు సరిగా లేకపోతే.. తీవ్ర ప్రమాదమే వస్తుంది. ఇప్పుడు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. …
Read More »అవినాష్రెడ్డి పాస్ పోర్టు రెడీ చేసుకున్నారు: షర్మిల
కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందుకే.. ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత.. ఏ క్షణమైనా ఊరు దాటి.. దేశం దాటి.. పోయేందుకు పాస్టు పోర్టును రెడీ చేసుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న షర్మిల.. స్థానిక మీడియాతో మాట్లాడారు. సీఎం …
Read More »ఓటింగ్ శాతం పెరుగుదల వెనక మర్మమేంటి ?
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదా ? తొలి, మలి దశ ఎన్నికలలో ఆ పార్టీకి ఎదురుగాలి వీయడంతోనే బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో తమ వాణిని, బాణిని మార్చారా ? ఉత్తరాదిన బీజేపీకి ఈ సారి అంత సానుకూల వాతావరణం లేదా ? తొలి, మలి ధశ ఎన్నికల పోలింగ్ ముగిశాక 11 రోజులకు ఎన్నికల కమీషన్ తుది నివేదిక ఇవ్వడంలో మర్మం ఏంటి ? అందులో …
Read More »బీజేపీని తిట్టాడని బీఎస్పీ నుండి గెంటేసింది !
బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి హయాంలో తన ప్రాభవం కోల్పోతూ వస్తున్నది. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఎస్పీ తరపున 19 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీని విమర్శించాడని తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి, …
Read More »బీజేపీకి దక్షిణం ‘దారి’ చూపుతుందా ?
400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఇంతవరకు ఖాతానే తెరవలేదు. ఇక కర్ణాటకలో పోయినసారి 28 లోక్ సభ స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. తెలంగాణలో 17 స్థానాలకు 4 స్థానాలలో విజయం సాధించింది. దక్షిణాదిన ఉన్న 130 స్థానాలలో 29 స్థానాలలోనే బీజేపీ విజయం సాధించింది. అంటే 101 స్థానాలలో …
Read More »జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?
ఫొటోల పిచ్చి అనండి.. ప్రచార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేజేతులా చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పీకల వరకు తెచ్చింది. సీఎం జగన్కు ఎవరు సలహా ఇచ్చారో.. ఏం చెప్పారో తెలియదు కానీ.. ఆయన ఏం చేసినా.. ఫొటోలు వేసుకోవడం రివాజు. ఇంటి డోర్ నుంచి.. పిల్లలకు ఇచ్చే పుస్తకాల వరకు, మహిళలకు ఇచ్చే పథకాల నుంచి పింఛను పుస్తకాల వరకు.. అన్నింటిపైనా సీఎం జగన్ బొమ్మ …
Read More »పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతున్న సమయంలో గత ఏడాది జగన్ సర్కారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత ప్రమాదకర చట్టమని.. దీని వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ యాక్ట్ గురించి పెద్ద చర్చ జరుగుతుండడంతో జగన్ సర్కారు మెడకు ఈ చట్టం చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. …
Read More »పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్రబాబు మాస్ వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన బరిలో ఉన్న చిత్తూరు జిల్లా పుంగనూరులో తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ ప్రజాగళంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది. ఇక్కడ బుల్లెట్ లాంటి నాయకుడు,.. చల్లా రామచంద్రారెడ్డిని బరిలో నిలిపాం. పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లా బాబు. ఈయనకు …
Read More »కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ
మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. నగర నడిబొడ్డున ఉన్న ఆల్ట ఓపెర్ నుండి సెంట్రల్ రైల్వేస్టేషన్ వరకు “కూటమి ఐక్యత వర్ధిల్లాలి”, “సైకో పోవాలి..కూటమి రావాలి” అనే నినాదాలతో మూడు కిలోమీటర్ల మేర నడకయాత్ర చేశారు. జర్మనీలో నివసిస్తున్న తెలుగు …
Read More »మెగా ఎఫెక్ట్.. కదిలిన ఇండస్ట్రీ..!
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు కూటమి.. మరోవైపు వైసీపీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఇంత జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం మౌనంగా ఉంది. ఒకరిద్దరు మినహా.. ఎవరూ ముందుకు రాలేదు. ఎవరికీ మద్దతు చెప్పలేదు. గతంలో అయితే.. ఎంతో కొంత మార్పు ఉండేది. కానీ, ఇప్పుడు అసలు పూ్ర్తిగా మౌనం వహించారు. …
Read More »చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు: రేవంత్
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి లేని గాడిద కొడుకు” అని తీవ్రస్థాయిలో స్పందించారు. తాజాగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఎన్డీ టీవీ సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ సమయంలో చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ..ఏపీలో మీ గురువు చంద్రబాబు పోటీ చేస్తున్నారు. శిష్యుడిగా మీ సహకారం ఏమైనా ఉంటుందా? అన్న ప్రశ్నకు రేవంత్ …
Read More »పవన్కు బంపర్ మెజారిటీ?
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం ఎంపికలో ఎంతో కసరత్తు చేశాకే పిఠాపురంను ఎంచుకున్నారు పవన్. కానీ ఇక్కడ పవన్ గెలవగలడా అనే విషయమై మొదట్లో కొంత సందేహాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates