Political News

జగన్ ఓటమి చూసి ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారా

ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ప‌రాజ‌యాన్ని త‌ట్టుకోలేక ఫ‌లానా జిల్లాలో ఒక‌రు మృతి. మ‌రో చోట ఇంకొక‌రి మ‌ర‌ణం.. ఇదీ వైసీపీ ప‌త్రిక‌, ఛానెళ్లు, సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వ‌స్తున్న వార్త‌లు. జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ ఫ‌లితాలు వ‌చ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్ప‌టికీ జ‌గ‌న్ పార్టీ ఓట‌మిని …

Read More »

ప‌వ‌న్ క‌ల‌ల సాకారం అంత ఈజీయేనా..?

క‌ల‌లు క‌న‌డం ఈజీనే. కానీ, వాటిని సాకారం చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది. అది కూడా.. వ్య‌క్తిగ‌త క‌ల‌లైతే బాగానే ఉంటుంది. కానీ, ప్ర‌భుత్వ ప‌రంగా ఒక వ్య‌వ‌స్థ‌ను మార్చాల‌ని క‌ల‌లు కంటే మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఈ స‌మ‌స్యే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకు వ‌చ్చింది. ఆయ‌న తొలి స‌మీక్షలోనే కీల‌క ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. గ్రామీణ స్థాయిలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న …

Read More »

కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం !

లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేగుతున్నది. కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితం అయింది. జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసుల అంశాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని ప్రజాపనుల మంత్రి సతీశ్‌ జార్కిహోళి, సహకార శాఖ మంత్రి కేఎన్‌ …

Read More »

ఏపీ ప్రెస్ అకాడ‌మీ.. ఇక‌పై ‘రామోజీ’ ప్రెస్ అకాడ‌మీ? !

మీడియా మొఘ‌ల్‌, ఈనాడు సంస్థ‌ల అధినేత‌, రామోజీ ఫిలిం సిటీ రూప‌క‌ర్త రామోజీరావుకు ఘ‌న నివాళులు అర్పించేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్న‌ద్ద‌మైంది. ఈ నెల 27న ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌కు ఘ‌నంగా సంస్మ‌ర‌ణ స‌భ‌ను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టిపెరిగిన‌.. కృష్ణాజిల్లాలోనే ఈ కార్య‌క్ర‌మాన్ని భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రూ. 5 కోట్ల ను విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులు కొలుసు పార్థ‌సార‌థి, కొల్లు ర‌వీంద్ర స‌హా.. …

Read More »

ఆ 31 మందికి ప‌ద‌వులు ఇస్తానంటోన్న బాబు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక టీడీపీ నాయ‌కుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా ఆ 31 మంది నాయ‌కులు ఏమీ ఆశించ‌కుండా కూట‌మి విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు వీళ్ల‌ను ప‌దవుల‌తో గౌర‌వించేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఇంత‌కీ ఆ 31 మంది ఎవ‌రూ అంటే.. పొత్తులో భాగంగా టికెట్లు వ‌దులుకున్న టీడీపీ నాయ‌కులే. ఏపీ అసెంబ్లీ …

Read More »

హ‌రీష్ రావ‌డ‌మే మార్గ‌మా? కానీ రానిస్తారా?

తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంది. ఇలాంటి క‌ష్ట‌కాలం వ‌స్తుంద‌ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించి ఉండ‌రు. నిరుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇచ్చిన షాక్‌తో కుంగిపోయిన కేసీఆర్‌ను.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా ఫ‌లితం మ‌రింత దెబ్బ‌కొట్టింది. దీంతో పార్టీ ఉనికి ప్ర‌మాదంలో ప‌డ‌టంతో నాయ‌కులు ప‌క్క చూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకునేందుకు కాంగ్రెస్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ స‌మ‌యంలో బీఆర్ఎస్‌ను కాపాడేది హ‌రీష్ రావు మాత్ర‌మేన‌న్న …

Read More »

అమర్‌నాథ్ అంత మాట అనేశాడేంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయడమే కాక.. నిత్యం సోషల్ మీడియా, మీడియాలో కనిపిస్తూ బాగానే హైలైట్ అయ్యాడు గుడివాడ అమర్‌నాథ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్‌నాథ్.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయి తెలుగుదేశం మీద.. అలాగే జనసేన మీద చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. మిగతా వైసీపీ నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే అయినా.. …

Read More »

అమ‌రావ‌తి రైతులు మొక్కులు చెల్లించారు.. షాక్ ఏంటంటే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. ఆదివారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి బ‌య‌లు దేరిన అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకుంటున్నామ‌ని …

Read More »

అమిత్ షాకు నో చెప్పిన చంద్రబాబు

చంద్రబాబు మారిపోయారు. పూర్తిగా మారిపోయారు. దశాబ్దాల తరబడి ఒకే తీరును ప్రదర్శించే ఆయన ఇప్పుడు కొత్త వెర్షన్ లో కనిపిస్తున్నారు. అధికారం.. ప్రతిపక్షం ఆయనకు అలవాటే అయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన్ను పూర్తిగా మార్చేశాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. బాబులో మార్పు ఎంతన్న విషయం మరింత బాగా అర్థమవుతుంది. ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే కేంద్రంలో చక్రం తిప్పాలన్న తహతహ బాబులో …

Read More »

ఆ ఆరుగురు ఎవరు ? .. కొత్త మంత్రుల కొట్లాట !

లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. గత డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పేరుతో ప్రతి పనికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో ఇప్పుడు అందరిదృష్టి మంత్రి పదవుల మీద పడింది. డిసెంబరులో 12 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోగా మరో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రులయ్యే ఆ ఆరుగురు ఎవరు అన్న …

Read More »

ఏపీలో ఉచిత బ‌స్సు.. ఎప్ప‌టి నుంచంటే!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత ప్ర‌క‌టించిన‌ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్లో కీల‌క‌మైంది.. మ‌హిళ‌లకు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. ఇప్ప‌టికే తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. దీనినే ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. నిర్వ‌హించిన మ‌హానాడులో చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో ప్ర‌క‌టించిన ఆరు హామీల్లో ఒక‌టిగా చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీ ఎప్పుడంటూ చ‌ర్చ ప్రారంభ‌మైంది. చంద్ర‌బాబు కూట‌మి …

Read More »

కేసీఆర్ చేస్తే రైటూ.. రేవంత్ చేస్తే రాంగా?

ఎవ‌రు చేసిన కర్మ వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు! అధికారం ఉంది క‌దా.. రాష్ట్రంలో అడ్డు ఎవ‌రు? అనే అహంకారంతో సాగే వాళ్లకు కాల‌మే స‌మాధానం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన తొలి రెండు ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని ఈ పార్టీల‌ను కేసీఆర్ దెబ్బ‌కొట్టారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ అనేదే లేకుండా చూడాల‌నుకున్నారు. కానీ కేసీఆర్‌కు ఇప్పుడు అదే దెబ్బ రిట‌ర్న్‌లో త‌గులుతోంది. …

Read More »