దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి చూపు.. ఫోకస్ మొత్తం ఏపీ మీదనే ఉంది. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? గెలిచిన పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని? జనసేన ప్రభావం ఎంతమేర ఉంటుంది? లాంటి ప్రశ్నలే ఉన్నాయి. తెలుగుప్రజల ఆసక్తికి తగ్గట్లే.. ఎగ్జిట్ పోల్స్ సైతం …
Read More »టీడీపీ ఆఫీసులో సంబరాలు.. !
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ కూటమి దూసుకుపోతుండడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిపార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు.. సంబరాలకు దిగారు. ఒకవైపులీడ్స్ వస్తుండడం.. టీడీపీ కూటమి నేతలు.. ముందంజలో ఉండడంతో తమ్ముళ్లలో సంతోషం వ్యక్తమవుతోంది. తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి.. లీడ్లు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ లో ఆధిక్యం 4300తో ఉండిలో రఘురామరాజు ఆధిక్యం లోఉన్నారు. మంగళగిరిలో …
Read More »పిఠాపురంలో పవన్ .. గుడివాడలో నాని
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. ఇక్కడ రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ 8500 ఓట్ల లీడ్లో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. 1549 ఓట్లతో లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకంజలో ఉన్నారు. పులివెందులలో జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 2004 నుండి గుడివాడ ఎమ్మెల్యేగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కొడాలి నాని తాజాగా ఓట్ల లెక్కింపులో …
Read More »బాబు.. పవన్.. లోకేశ్.. బాలయ్య.. అందరూ ముందుకే
తొలి గంట గడిచింది. హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల విషయానికి వస్తే.. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి గంట పూర్తి అయ్యే నాటికి ఫలితాల తీరు ఎలా ఉంటుందన్న దానిపై ఒక అవగాహన వచ్చినట్లుగా చెప్పాలి. మొదటి గంటలో ఏపీ అధికారపక్షం.. అప్పటివరకు వెల్లడైన అధిక్యతల్లో ఏ ఒక్క స్థానంలోనూ ముందుకు లేకపోవటం గమనార్హం. అదే సమయంలో విపక్ష టీడీపీ.. జనసేన.. బీజేపీలు ముందంజలో ఉన్నాయి. ఇదే తీరు.. ఏపీ …
Read More »కనిపించని వైసీపీ లీడ్!
ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. తొలి రౌండ్లలో 36 స్థానాలను ప్రకటించే సరికి వైసీపీకి ఒక్క సీటులో మాత్రమే లీడ్ కనిపించింది. 2019 ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ దూకుడు ప్రదర్శించింది. పైగా.. వేల సంఖ్యలో లీడ్ కూటమి వైపు కనిపిస్తుండడం గమనార్హం. ఈ పరిణామం గమనిస్తే.. వైసీపీ వైపు ప్రజలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూట మి దూకుడు …
Read More »ఏపీలో కూటమికే లీడ్!
ఏపీలో ప్రారంభమైన ఓట్ల కౌంటింగ్.. వేగంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలను ముందుగా లెక్కిస్తుండ గా.. మరికొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తగా కౌంటింగ్ కొనసాగు తోంది. తొలి అరగంటలోనే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతల లీడ్ కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కుప్పంలో చంద్రబాబు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పొంగూరు నారాయణ లీడ్లో …
Read More »అరెస్టుల కెక్కిన రేవ్ పార్టీ !
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరయిన నటి హేమ రేవ్ పార్టీ ఆర్గనైజింగ్ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఐదుగురితో కలిసి ఈ పార్టీ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను …
Read More »ఏపీలో షాకింగ్: ఎమ్మెల్సీ పై అనర్హత వేటు
ఏపీలో కీలకమైన ఓట్ల లెక్కింపునకు ముందు.. సంచలన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఆయన పై వచ్చిన అభియోగాలను అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాత.. ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు మోషేన్ రాజు తెలిపారు. ఈ మేరకు శాసన మండలి సెక్రటేరియెట్ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం …
Read More »వైసీపీకి సుప్రీం లోనూ నిరాశే
ఏపీ అధికారపార్టీ వైసీపీకి కీలకమైన ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు కొన్ని గంటల ముందు.. సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగులు, ఇంటి నుంచి ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్ల విషయంలో వైసీపీ ఆందోళనగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని సుప్రీంకోర్టులోనూ …
Read More »గీత దాటితే .. తాట తీస్తారు
పోలింగ్ ముగిసిన అనంతరం ఏపీలో చెలరేగిన హింస నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం భద్రతాచర్యలు కట్టుదిట్టం చేశారు. ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఏపీవ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్ నిర్వహించి రౌడీషీటర్లను బైండోవర్ చేసి కొందరిపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక …
Read More »ప్రపంచ రికార్డు సృష్టించాం
దేశంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొం ది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ఒక్క భారత్లోనే కనీ వినీ ఎరుగని రీతిలో.. 64.2 కోట్ల మంది ప్రజ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తాజాగా ఏడు దశల ఎన్నికలు పూర్తి కావడం.. మరికొన్ని గంటల్లోనే ఫలితం వెల్లడి …
Read More »పిన్నెల్లికి సుప్రీం దెబ్బ !
అరెస్ట్ నుండి హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్కు వెళ్లొద్దని పిన్నెల్లిని ఆదేశించింది. పోలింగ్ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతోపాటు పిన్నెల్లి అరెస్ట్ కి మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఏజెంట్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates