లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై సర్కారు మెడకు చుట్టుకుంటుదోనన్న ఆందోళన కాంగ్రెస్ సర్కారులో కనిపిస్తున్నది. సరిగ్గా మూడు రోజుల క్రితం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఖాతా తెరిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోస్టులు సర్కారుకు ఊపిరి సలపనివ్వడం లేదు. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు …
Read More »ఎన్నికలకు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే రాజకీయం కళ్ల ముందు కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులు.. బలమైన ప్రచారంతో ఈ రెండు పార్టీలు కూడా.. దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎటొచ్చీ.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ కంటే.. …
Read More »ఏక్షణమైనా.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన.. రంగం రెడీ?
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం.. పైగా ప్రభుత్వం ఉన్న రాష్ట్రం. ఇక్కడ ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే.. ఇక్కడి ప్రభుత్వానికి పరిమితం అధికారాలు మాత్రమే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ను కేంద్ర హోం శాఖ నియంత్రిస్తుంది. పోలీసులను.. చివరకు ట్రాఫిక్ పోలీసులను కూడా.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇలాంటి …
Read More »కూటమిపై పిడుగు.. ఈసీ నిర్ణయంతో తీవ్ర ఇబ్బంది!
కీలకమైన ఎన్నికలు.. వైసీపీని ఓడించి తీరాలన్న బలమైన సంకల్పం. అంతేకాదు.. అధికారంలోకి వచ్చి తీరాలన్న ఆకాంక్ష.. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలు కూటమిగా వచ్చాయి. టీడీపీ-బీజేపీ-జనసేనలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాయి. ఒక్క వ్యతిరేక ఓటు కూడా చీలకూడదన్నది ప్రధాన సంకల్పం.ఇలానే పార్టీలు ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ, ఇంత చేసినా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే క్రమంలో కూటమిపై పెను పిడుగు పడింది. అది …
Read More »షర్మిళకు డిపాజిట్ రాదు.. బాధగా ఉంది: జగన్
ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబ అన్నా చెల్లెళ్లు ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోయి రాజకీయ రణరంగంలో తలపడుతున్న సంగతి తెలిసిందే. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతుంటే.. ఒకప్పుడు తన తండ్రి సారథ్యం వహించిన, జగన్ విభేదించి బయటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో షర్మిళ అధ్యక్షురాలు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. జగన్ మద్దతుతో వైసీపీ తరఫున …
Read More »సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీలో జరగను న్న విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు. కీలకమైన ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో కుదుపునకు దారితీసింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 91 మేరకు నోటీసులు ఇచ్చారు. తొలుత ముఖ్యమంత్రి కార్యాలయానికి రాగా.. అక్కడ నుంచి …
Read More »బీజేపీ దెబ్బంటే ఇలా ఉంటుంది!
ఎన్నికల్లో వ్యూహాలు ఉండడం వేరు.. ఎదుటి పార్టీలను దెబ్బ కొట్టాలన్న కుయుక్తులు ఉండడం వేరు. వ్యూహాలు ఎన్నయినా.. ప్రత్యర్థులు ప్రతివ్యూహాలతో విరుచుకుపడే అవకాశం ఉంటుంది. దీంతో రాజకీ యాలు రాజకీయాలుగానే కొనసాగుతాయి. కానీ, కుయుక్తులు పన్ని.. ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలు వేసినప్పుడు మాత్రం.. ఇబ్బందులు తప్పవు. ఇలాంటి రాజకీయాల్లో బీజేపీ ఆరితేరిపోయింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే.. …
Read More »కమలంతో తెలంగాణ కాంగ్రెస్ కయ్యానికి కాలుదువ్వుతుందా ?
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నది. ఇక ఇటీవలే తెలంగాణలో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి సీఎం పీఠం నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం తప్పనిసరి. రేవంత్ రెడ్డిని బీజేపీ ఏజెంట్ అని, త్వరలోనే ఆ పార్టీలో చేరడం ఖాయం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ …
Read More »పోసానికి షాక్… ఫ్యామిలీ అంతా చంద్రబాబు వైపు
టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరంతరం మీడియాలో ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకుడు, సినీ నటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళికి సొంత కుటుంబంలోనే భారీ షాక్ తగిలింది. ఆయనేమో.. నిరంతరం సీఎం జగన్ భజన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పోసాని.. జగన్ను ఆకాశానికి ఎత్తస్తున్నారు. ఇదేసమయంలో ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై నిరంతరం విమర్శలు చేస్తున్నారు. కానీ, అనూహ్యంగా …
Read More »ఏపీలో పింఛన్ల రగడ.. చంద్రబాబు కొత్త పాయింట్ !
మే 1వ తేదీకి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం.. ఇంటింటికీ వెళ్లి ఇచ్చే పింఛన్ల వ్యవహారం నిలిచిపోవడం నేపథ్యంలో మరోసారి ఈ వ్యవహారం రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతం సస్పెండ్ చేశారు. దీంతో ఏప్రిల్లో పింఛన్ల వ్యవహారం.. నానా ఇబ్బందులుగా మారింది. ఎండలు తట్టుకోలేక.. పింఛన్ల కోసం వచ్చిన వారు.. దాదాపు 32 మంది మరణించారని ప్రభుత్వ గణాంకాలే …
Read More »వీటిపై క్లారిటీ ఏది జగన్?!
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. మేనిఫెస్టో ప్రకటించారు. ఆ వెంటనే ఆయన జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు. ఆదివా రం వరుసగా మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. అది కూడా అనంతపురం జిల్లానే ఎంచుకోవడం గమనార్హం. అయితే.. ఆయన తన పర్యటనల్లో చంద్రబాబును నమ్మొద్దని.. ఆయనను నమ్మడమంటే.. పులినోట్లో తల పెట్టడమేనని చెబుతున్నారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని.. ఇకపైనా చేయబోడని అన్నారు. కాబట్టి చంద్రబాబు …
Read More »మేనిఫెస్టో ఎఫెక్ట్: జగన్ గురించి జనం టాక్ మారిందే!
ఏపీ అధికార పార్టీ వైసీపీ గురించి.. నిన్న మొన్నటి వరకు ఉన్న టాక్ ఒకటి. మరోసారి జగన్ వచ్చేస్తున్నా రని.. కూటమివచ్చినా.. ఆయన గెలుపు ఖాయమని.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీనికి కారణం కూటమిలో టికెట్ల కేటాయింపు నుంచి అభ్యర్థులను బరిలో నిలపడం వరకు పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకోవడమే. అయితే. ఇది అయిపోయింది. ఇక, ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. వైసీపీ వస్తే.. పేదల బతుకులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates