Political News

వైసీపీకి ప్లీనరీ నిర్వహణ సవాలేనా ?

జూలై నెల 8,9 తేదీల్లో అధికార వైసీపీ రెండురోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతోంది. అధికారపార్టీ కాబట్టి రెండురోజుల ప్లీనరీ నిర్వహణలో కష్టమేముందని అనుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీయే రెండు రోజుల మహానాడును ఒంగోలులో నిర్వహించినపుడు వైసీపీకి పెద్ద కష్టమేమీకాదని కూడా లైట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడే వైసీపీకి సమస్య వస్తోంది. అదేమిటంటే అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం సహకారం కచ్చితంగా ఉంటుందనటంలో సందేహంలేదు. కానీ నేతలు, …

Read More »

టీఆర్ఎస్ పైన బీజేపీ మైండ్ గేమ్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణాలో అధికారపార్టీ టీఆర్ఎస్ పై బీజేపీ మైండ్ గేమ్ పెంచేస్తోంది. మైండ్ గేమ్ కూడా బీజేపీ రెండు రకాలుగా మొదలుపెట్టింది. తాజాగా ఢిల్లీలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించటం మొదటిది. ఇక రెండోది ఏమిటంటే జూలై చివరలో పార్టీ జాతీయస్ధాయి కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించటం. జాతీయకార్యవర్గ సమావేశంలు నిర్వహించటం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు …

Read More »

ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్‌ ఏం చేయాలి.. ఏం చేస్తాడో?

రాష్ట్రంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయింది. ఇది ఏ ప్ర‌భుత్వానికైనా.. చాలా మెజారిటీ కాలం. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామం ఎదురైంది. క‌రోనా రావ‌డంతో రెండేళ్ల కాలం కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది. దీంతో అభివృద్ధి చేసేందుకు.. పెట్టుబ‌డులు తెచ్చేందుకు కొంత ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌నేది వాస్త‌వం. అయితే.. ఈ విష‌యాన్ని ప్రొజెక్టు చేసుకుని.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో వైసీపీ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. ఎందుకంటే.. ఇప్పుడు …

Read More »

YS జగన్: మ‌రో బాదుడుకు రంగం సిద్ధం!

ఆంధ్రావ‌ని వాకిట నేరు పన్నుల వ‌డ్డ‌న బాగా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల ప‌రోక్ష ప‌న్నుల వ‌డ్డ‌న కూడా ఊహించ‌ని విధంగా ఉంది. ఇంత జ‌రిగినా, ఇంత‌కు ఇంత వ‌చ్చి ఖ‌జానాకు వ‌చ్చి చేరినా జ‌గ‌న్ మాత్రం అప్పుల గురించే దిగులు చెందుతుంటారు. ఆదాయం బాగున్న రాష్ట్రానికి అప్పెందుకు స‌ర్ అంటే స‌మాధానం ఉండదు. తాజాగా బార్ లైసెన్సుల రెన్యువ‌ల్ పేరిట మ‌రో బాదుడుకు సిద్ధం అవుతోంది. బార్ లైసెన్సు …

Read More »

రేవంత్ తేరుకునేలోగా.. కేసీఆర్ ప్లాన్ స‌క్సెస్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న్ను రాజ‌కీయంగా టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా స‌మ ఉజ్జీగా నిల‌బ‌డే నేత‌లు ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స‌రైన వ్య‌క్తి ప‌లువురు ప్ర‌తిపాదిస్తుంటారు. దీనికి రేవంత్ రెడ్డి అనుస‌రించే వ్యూహాలు, చేసే విమ‌ర్శ‌లు వంటివి కార‌ణంగా పేర్కొన‌వ‌చ్చు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన గేమ్ ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నార‌ని… …

Read More »

వైసీపీలో కొత్త కుంపటి

నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి అధికార వైసీపీలో కొత్తకుంపటి మొదలైంది. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఈరోజు పెద్ద బాంబే వేశారు. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా సరే పోటీచేసి గెలుస్తానంటు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఎంఎల్ఏ ముదునూరి ప్రసాదరాజుతో కొత్తపల్లికి ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే. జిల్లాల పునర్వవ్యస్ధీకరణలో నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయటంలో ఎంఎల్ఏ ఫెయిలైనట్లు ఆ మధ్య కొత్తపల్లి నానా గొడవ …

Read More »

కాంగ్రెస్ కు గట్టిదెబ్బ తప్పదా?

మరో ఏడాదిలోపు ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. పటీదార్ సామాజకవర్గంలో గట్టి పట్టున్న హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయటం ఒకనష్టమైతే పటేల్ తొందరలోనే బీజేపీలో చేరుతుండటం మోరో నష్టమనే చెప్పాలి. రిజర్వేషన్లకు ఒకపుడు పటీదార్లు చేసిన ఉద్యమం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ రిజర్వేషన్ల ఉద్యమంలో బాగా పాపులరైంది హార్దిక్ పటేలే. ఆ ఉద్యమంతోనే పటేల్ …

Read More »

కేసీఆర్‌కు మరో షాక్.. జీఎస్టీ వాటా 296 కోట్లే

ఇప్ప‌టికే కేంద్రం నుంచి అప్పులు పుట్ట‌క‌.. ప‌దే ప‌దే ప్లీజ్ ప్లీజ్ అని బ‌తిమాలుతున్నా.. క‌రుణించ‌క‌.. ఆద్యంతం రాజ‌కీయ కార‌ణా ల‌తో తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారును కేంద్రం ముప్పు తిప్పులు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో జూన్ నెల జీతాల‌కు.. కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక‌, ఈ నెల‌లోనే అమ‌లు చేయాల‌ని కేసీఆర్ మాన‌స పుత్రిక ప‌థ‌కం రైతు బంధు నిధుల విడుద‌ల‌కు మ‌రో …

Read More »

రుషికొండ `రంగు` తేలుస్తాం: సుప్రీంకోర్టు

విశాఖ రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టుకు ఏపీ స‌ర్కారు. వివరించింది. అయితే.. పిటిషన్‌పై విచారణను సుప్రీం ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. రిషికొండ వ‌ద్ద వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు జ‌రుపుతున్న‌ తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన …

Read More »

కాంగ్రెస్ చ‌చ్చిన పాము.. నా ఇమేజ్ పోయింది: PK

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది లేదని అన్నారు. బీహార్‌లోని వైశాలిలో ఉన్న దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ నివాసం నుంచి తన జన్ సూరజ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  వివిధ పార్టీలతో కలిసి తాను …

Read More »

వైసీపీ వ‌ల్లే మ‌హానాడు హిట్‌

వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. వైసీపీ పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని వ్యాఖ్యనించారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని అన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని.. ఎవరికీ మినహాయింపులు లేవని వెల్లడించారు. వైసీపీ …

Read More »

మ‌హానాడులో తొడ‌గొట్టిన లేడీ లీడ‌ర్‌.. టికెట్ ద‌క్కేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు ఏం చేసినా.. సొంత లాభం లేకుండా.. ఏ ఒక్క‌రు అడుగు కూడా ముందుకు వేయ‌రు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. అధికార,  ప్ర‌తిప‌క్ష‌పార్టీల నాయ‌కులు ఎవ‌రైనా..కూడా `ముందు చూపు`తోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఒంగోలు వేదిక‌గా తొడ‌గొట్టిన టీడీపీ నాయ‌కురాలు కూడా చేరిపోయారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే టికెట్ ఆశించిన‌ప్ప‌టికీ.. ఆమెకు ఆశించిన విధంగా ఎలాంటి సానుభూతి రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌హానాడులో …

Read More »