Political News

కేసీఆర్‌.. మూడు రోజుల ఢిల్లీ టూర్‌.. అందుకేనా?

ఊర‌క‌రారు మ‌హానుభావులు.. అన్న చందంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి ఫైర్ బ్రాండ్ ఎక్క‌డికైనా వెళ్తే.. కొంత అర్ధం ప‌ర‌మార్థం లేకుండా.. ఉండ‌దు క‌దా! ఇదే.. ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసింది. తాజాగా కేసీఆర్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీలో కాలు మోపారు. ఆయ‌న వెంట మ‌రికొంద‌రు వెళ్లారు.. స‌రే.. అస‌లు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లార‌నేది ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌. కొన్ని వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. …

Read More »

టీడీపీ-బీజేపీ మైత్రి ఇప్ప‌ట్లో సాధ్యం అయ్యేనా

కొన్ని విష‌యాలు చేదుగా ఉన్నా.. క‌నిపిస్తున్న వాస్త‌వాల‌ను బ‌ట్టి.. దిగ‌మింగ‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇబ్బందిక‌ర స‌ర్కిల్లో ఇరుక్కుపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. గ‌ట్టి ప్ర‌య‌త్నం చేయాల్సిందే. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత పొత్తు చూపులు చూస్తున్నార‌నేది త‌మ్ముళ్ల బ‌ల‌మైన న‌మ్మ‌కం. ఇది నిజ‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని నేరుగా చెప్ప‌క‌పోయినా.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే త్యాగాల గురించి ప్ర‌స్తావించారు. దీంతో పొత్త‌లకు ఆయ‌న …

Read More »

రాజ‌గోపాల‌రెడ్డికి ఏఐసీసీ షాక్‌.. ఆ దిశ‌గా నిర్ణ‌యం..?

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుందా..? కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తుందా..? ఇది స్వ‌యంగా ఆయ‌న త‌ప్పిద‌మేనా..? రాజ‌గోపాల‌రెడ్డితో పాటు జ‌గ్గారెడ్డికి కూడా ఏఐసీసీ ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతుందా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి. వారిద్ద‌రిపై వేటు వేయాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. రాజ‌గోపాలరెడ్డి ఆది నుంచీ సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న అన్న వెంక‌టరెడ్డి ద్వారా …

Read More »

నేను చెబితే విన్నావా జ‌గ‌న్: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నేను అప్పుడు చెప్పాను. నా మాట విని ఉంటే.. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కాదు. కానీ, నామాట నువ్వు విన‌లేదు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణం విషయంలో జ‌గ‌న్‌ ప్రభుత్వ తప్పును కేంద్రం, పీపీఏ, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. …

Read More »

రోడ్లు వేసేందుకు డ‌బ్బులు లేవు.. 15 వ‌ర‌కు ఆగండి: మంత్రి

ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. పైగా రోడ్ల దుస్థితిని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌పై ఎదురు దాడి చేయిస్తున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌లను మాత్రం ప్ర‌భుత్వం ఆప‌లేక పోతోంది. నాయ‌కులు ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు ర‌హ‌దారుల దుస్థితిపై నిల‌దీస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ …

Read More »

మ‌రింత పెరిగిన గ్యాప్‌.. కేసీఆర్‌ పై గ‌వ‌ర్న‌ర్ హాట్ కామెంట్స్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సైల మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెరుగుతోంది. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు అంత‌ర్గ‌తంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. త‌న‌కు ప్రొటోకాల్ ఇవ్వ‌డం లేద‌ని గ‌వ ర్న‌ర్‌.. రుస‌రుస లాడుతున్నారు. ఇక‌, ఆమె గ‌వర్న‌ర్‌గా కాకుండా.. మోడీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ప‌నిచేస్తున్నా ర‌నేది కేసీఆర్ భావ‌న‌. కౌశిక్‌రెడ్డి వ్య‌వ‌హారం నుంచి ఇలా.. ఇరు ప‌క్షాల మ‌ధ్య దుమారం కొన‌సాగుతూనే ఉంది. ఇక‌, రాష్ట్ర హైకోర్టు …

Read More »

నిజాలు తెలియాలంటే జగన్ చేయాల్సిన పనేంటి ?

అధికారంలో ఉన్న పార్టీ పై జనాల్లో అసంతృప్తి మొదలవ్వటం సహజం. ఏ ప్రభుత్వం కూడా నూటికి నూరుశాతం జనాలను సంతృప్తి పరచటం సాధ్యం కాదు. సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అనర్హులకు లబ్ధి అందటం, అర్హులకు అందకపోవటం లాంటివి చాలా సహజం. ఇలాంటి వాటాని ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే సర్దుబాట్లు చేసుకుని వెళుతుంటుంది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన కూడా జనాల్లో అసంతృప్తి మొదలైంది. మరి జరిగిన …

Read More »

జైలుకు వెళ్లి వ‌చ్చిన వారు నీతులు చెబుతారా? : కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ అస‌మ్మ‌తి మునుగోడు ఎమ్మెల్యే , తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రెండు విష‌యాల‌ను క్లియ‌ర్‌గా చెప్పేశారు. తాను పార్టీ మారుతున్న‌ట్టు.. బీజేపీ కండువా వేసుకుంటున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించిన‌ట్టే ఖండించి.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు.. పార్టీ మారితే త‌ప్పులేద‌ని చెప్పేశారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. జైలుకు వెళ్లివ‌చ్చిన నేత‌ల‌తో నీతులు చెప్పించుకునే(ఓటుకు నోటు కేసులో) ప‌రిస్థితిలో తాను లేన‌ని వ్యాఖ్యానించారు. …

Read More »

‘జ‌న‌సైన్యం’ తెలుసుకోవాల్సిన నిజం ఇదే!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ల‌క్ష్యం పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కిం చుకుని అధికారంలోకి రావాల‌ని ఆయ‌న నిర్ణ‌యానికి వ‌చ్చారు. పొత్తులు ఉంటాయా.. ఉండ‌వా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడి తే.. ఏ రాజ‌కీయ పార్టీకైనా ఉండాల్సిన ల‌క్ష్యం అధికార‌మే కాబ‌ట్టి.. ఆయ‌న పెట్టుకున్న ల‌క్ష్యాన్ని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు క‌లిసి వ‌చ్చేవారేరీ? అనేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. …

Read More »

జ‌గ‌న్‌కే అభిమానులం.. పార్టీ మార‌ను..

వైసీపీ నాయ‌కుడు.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. ఒంగోలు పార్ల‌మెంటు స‌భ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో త‌న‌పైనా.. త‌న కుటుంబం పైనా జ‌రుగుతున్న రాజ‌కీయ ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. తాను, త‌న కుటుంబం.. త‌న సొద‌రులు కూడా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు అభిమానుల‌మేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌మ కుటుంబంపై వ‌స్తున్న వార్త‌ల‌ను ఇప్ప‌టికైనా క‌ట్టిపెట్టాల‌న్నారు. గ‌త కొన్నాళ్లుగా.. మాగుంట వ్య‌వ‌హార …

Read More »

రాష్ట్ర‌ప‌తి ఏ చీర క‌ట్టుకోవాలో.. వాళ్లే నిర్ణ‌యిస్తార‌ట‌!!

నిజంగానే ఇది ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో చాలా మంది తెలియ‌ని అతి పెద్ద ర‌హ‌స్యం. ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధానులు.. ఏం తినాలో.. ఎటు వైపు వెళ్లాలో.. ఎక్క‌డ ప‌ర్య‌టించాలో.. వంటివాటిని మాత్ర‌మే అదికారులు నిర్ణ‌యిస్తార‌ని.. ముందుగా.. కొన్ని ప‌దార్థాల‌పై టెస్టులు కూడా చేస్తార‌ని తెలుసు. కానీ.. రాష్ట్ర‌ప‌తి విష‌యంలో వీటికి అద‌నంగా కూడా కొన్ని నిర్ణ‌యాలు అధికారులే తీసుకుంటార‌నే విష‌యం.. ఇప్పుడే వెలుగు చూసింది. రాష్ట్ర‌ప‌తి ఏం మాట్లాడాలో.. ముందుగానే రాష్ట్ర‌ప‌తి …

Read More »

విలీన మండ‌లాల‌పై..చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో పోల‌వ‌రం విలీన మండ‌లాల‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై విలీన మండ‌లాల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని.. అందుకే వారు తెలంగాణ‌లో క‌లిసిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని చంద్రబాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకం చూస్తున్నారని అన్న బాబు.. విలీన మండలాల్లో …

Read More »