ఏపీ సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టుపై సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేందుకు తాముకేంద్రంతో యుద్ధాలు.. ఫైటింగులు చేస్తున్నామని చెప్పారు. కొన్ని కొన్ని సార్లు బ్రతిమాలుతున్నట్టు చెప్పారు. అయితే.. కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు. ఇక, పోలవరం కట్టినా.. నీళ్లు పూర్తిగా నింపేది ఉండదని.. దీనికి కేంద్ర ప్రబుత్వం ఒప్పుకోదని చెప్పారు. నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి వినతిపత్రాలు పంపిస్తున్నామని.. సెప్టెంబర్ లోగా …
Read More »కొవ్వూరు వైసీపీలో ఏం జరుగుతోంది ?
హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం సహకార బ్యాంకు ఎన్నికల ఫలితం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులోని 11 డైరెక్టర్ పోస్టులకు జరిగిన ఎన్నికలో టీడీపీ గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తం అన్ని స్దానాలను ప్రతిపక్ష టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయంపైనే అందరి దృష్టి పడింది. ఒక పార్టీ ఏకగ్రీవంగా అన్నీ స్ధానాలు గెలిచిందంటేనే ప్రతిపక్షం లేదనే కదా అర్ధం. …
Read More »ముద్రగడ.. రూటు మారుతోందా?
కాపు ఉద్యమ నాయకుడు.. ముద్రగడ పద్మనాభం రూటు మార్చారా? టీడీపీవైపు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజకీయ పరిశీలకులు. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు గుప్పించారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో ముద్రగడ అనుకూల వర్గం.. టీడీపీని వ్యతిరేకించింది. ఇది అప్పట్లో వైసీపీకి మేలుచేసిందనే విశ్లేషణలు వచ్చాయి. పైగా.. ముద్రగడ కూడా.. వైసీపీని కాపుల రిజర్వేషన్ విషయంలో బలవంతం చేయలేదు. దీంతో …
Read More »102 స్థానాలు టీడీపీకి అనుకూలమా… తమ్ముళ్ల చర్చ..!
టీడీపీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? గతానికి భిన్నంగా పార్టీ పుంజుకుందా? వచ్చే ఎన్నికల్లో దూకుడు చూపించి.. అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. మహానాడు తర్వాత… పార్టీ పుంజుకుందని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. చంద్రబాబు పేరు వినిపిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత, వివిధ కారణాల వల్ల తమ గ్రాఫ్ పెరుగుతోందని అంటున్నారు. అదేసమయంలో ఎస్సీలు, …
Read More »పశువులు సైతం మెచ్చుకునేలా వరద సాయం: జగన్
వరద నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేసి.. ఈ సీజన్లోనే పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ కోనసీమలోని బాధితులకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. జి.పెదపూడిలంక వద్ద వంతెన నిర్మిస్తామన్నారు. వరద సాయం అందని ఒక్కరిని కూడా చంద్రబాబు చూపించలేకపోయారని, ఈ విషయంలో ఆయన విఫలమయ్యారని సీఎం జగన్ విమర్శించారు. కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. హెలికాప్టర్లో తాడేపల్లి …
Read More »సీఎం జగన్ పెన్ను విలువ ఎంతో తెలుసా?
ఏపీ సీఎం జగన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన వరద ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇళ్లకు వెళ్లి బాధితులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలివిడిగా వ్యవహరించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఎత్తుకున్న తన చిన్నారిని సీఎం జగన్ ముద్దాడారు. అక్కడితో ఆగకుండా.. ఆయన ఆ చిన్నారిని తన ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. …
Read More »అక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు? రెండు పార్టీల్లోనూ కలవరం
వచ్చే ఎన్నికలు ఎంత హాట్ గా ఉంటాయో.. ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గెలుపు కోసం.. అధికార వైసీపీ. టీడీపీలు ఢీ.. అంటే ఢీ.. అనే ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎక్కడ ఎలా ఉన్నా.. విజయవాడ, గుంటూరు నగరాలు అత్యంత కీలకం. ఈ రెండు చోట్లా తమ తమ పార్టీలు గెలుపు గుర్రం ఎక్కితే.. ఆ లెక్కే వేరు! అనే విధంగా పార్టీలు భావిస్తాయి. అయితే.. ఇప్పుడు ఈ రెండు ఎంపీ …
Read More »జనం లేని.. జగనన్న పర్యటనలు
ఏపీ సీఎం జగన్ గురించి ఆయన పార్టీ వైసీపీనాయకులు చాలా గొప్పగా చెబుతారు. జగన్ ఎక్కడ అడుగు పెట్టినా.. భారీ సంఖ్యలో జనాలు వస్తారని.. ఇసుక వేసినప్పటికీ రాలదని.. చాలా చాలా వర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్కడా అలాంటి జోష్ కనిపించడం లేదు. ఇటీవల చాలా చోట్ల జగన్ నిర్వహించిన సభలకు డ్వాక్రా మహిళా సంఘాలను తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే.. …
Read More »మరీ ఇంత వైరాగ్యమా ? గుడ్ బై చెప్పేస్తారా ?
ఎవరికి కూడా వైరాగ్యం అంత తొందరగా రాదు. అందులోను రాజకీయాల్లో దశాబ్దాలుగా పదవుల్లో ఉంటున్నవారికి అసలు రాదు. దీర్ఘకాలంపాటు ప్రతిపక్షంలోనే ఉన్నవారిలో కొందరు నేతలకు వైరాగ్యం వచ్చినా అదోలెక్క. ఎందుకంటే ఎంతకాలమున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిందే అని ఫిక్సయిపోయిన కొందరికి వైరాగ్యం రావటంలో తప్పుకూడాలేదు. కానీ అధికారంలో ఉంటు మంత్రిగా పనిచేస్తున్న సీనియర్ నేతకు కూడా వైరాగ్యం వచ్చిందంటే ఏమిటర్ధం ? ఇపుడిదంతా ఎవరి విషయంలో అంటారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ …
Read More »మమత.. మమతే! ఫైర్.. ఫైరే..!!
దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో బెంగాల్ సీఎం మమతకు ఉన్న పేరు.. బ్రాండ్ సపరేటు. ఆమె నోరు విప్పితే.. నిప్పులు రాలాల్సిందే. ప్రతిపక్షంపై విమర్శల జడివాన కురవాల్సిందే. అంతేకాదు.. ఒక్కొక్కసారి తన వారైనా సరే.. మమత ఫైర్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే దూకుడు.. తన సొంత కేబినెట్ మంత్రి.. ఆమెకు అత్యంత ప్రియమైన నేత పార్థా ఛటర్జీపై చూపించారు. ఆయనకు జీవిత ఖైదు విధించినా సంతోషమేనని చెప్పారు. అంతేకాదు.. …
Read More »కేసీఆర్.. మూడు రోజుల ఢిల్లీ టూర్.. అందుకేనా?
ఊరకరారు మహానుభావులు.. అన్న చందంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి ఫైర్ బ్రాండ్ ఎక్కడికైనా వెళ్తే.. కొంత అర్ధం పరమార్థం లేకుండా.. ఉండదు కదా! ఇదే.. ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. తాజాగా కేసీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలో కాలు మోపారు. ఆయన వెంట మరికొందరు వెళ్లారు.. సరే.. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారనేది ఇప్పుడు ప్రధాన చర్చ. కొన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చలను బట్టి.. …
Read More »టీడీపీ-బీజేపీ మైత్రి ఇప్పట్లో సాధ్యం అయ్యేనా
కొన్ని విషయాలు చేదుగా ఉన్నా.. కనిపిస్తున్న వాస్తవాలను బట్టి.. దిగమింగక తప్పదు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇబ్బందికర సర్కిల్లో ఇరుక్కుపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. గట్టి ప్రయత్నం చేయాల్సిందే. ప్రస్తుతం టీడీపీ అధినేత పొత్తు చూపులు చూస్తున్నారనేది తమ్ముళ్ల బలమైన నమ్మకం. ఇది నిజమే. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని నేరుగా చెప్పకపోయినా.. చంద్రబాబు పదే పదే త్యాగాల గురించి ప్రస్తావించారు. దీంతో పొత్తలకు ఆయన …
Read More »