Political News

50 ఎకరాల్లో మహానాడు

తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. ఈనెల 27,28 తేదీల్లో మహానాడును ఘనంగా రాజమండ్రిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీన మహానాడును జరుపుకోవటం పార్టీకి ఆనవాయితీగా వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వివిధ కారణాల వల్ల మహానాడు నిర్వహణకు అంతరాయాలు కలిగినా మొత్తం మీద రాబోయే పండుగను మాత్రం బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు. రాజమండ్రికి సమీపంలోని …

Read More »

జ‌గ‌న్‌కు త‌ల్లి-చెల్లి అందుకే దూర‌మ‌య్యారు

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత‌న‌ని గొప్ప‌గా చెప్పుకొనే జ‌గ‌న్‌కు ఇప్పుడు త‌న త‌ల్లి-చెల్లి ఎందుకు దూర‌మ‌య్యారో చెప్పే ధైర్యం ఉందా? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ అరాచ‌కాలు చూసి.. విసిగిపోయి వారంతా ఎప్పుడో జ‌గ‌న్‌ను వ‌దిలేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆస్తి వివాదాల్లో ఏకంగా.. త‌ల్లిని, చెల్లిని కూడా జ‌గ‌న్ దూషించార‌ని.. వైసీపీ నాయ‌కులే త‌న‌తో …

Read More »

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ప‌ట్టాలు.. ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేన‌ట్టే

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి ప్రాంతంలోని ఆర్‌5 జోన్‌లో పేద‌ల‌కు ప‌ట్టాలు ఇవ్వ‌డాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ఇంటా బ‌య‌టా కూడా పొగ.. సెగ పెరిగింది. ఈ జోన్‌లో ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డం ద్వారా మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌ను ఓడించాల‌నే ల‌క్ష్యం నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఈ విష‌యంపై సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ప‌ట్టాలు ఇచ్చినా.. తుది తీర్పున‌కు లోబ‌డి ఉండాల‌ని, అంతేకాకుండా.. ప‌ట్టాలు పొందే …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 105 సీట్లు మ‌న‌వే..: కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్నే పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 95 నుంచి 105 సీట్లు ఖాయమని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి దశాబ్ది వేడుకలు ఘనంగా జరపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని తెలిపారు. సర్వేలన్నీ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. …

Read More »

ప‌వ‌న్ చెప్పిన ‘సీట్ల‌ మ‌త‌ల‌బు’ ఏమైనా అర్థ‌మైందా.. సైనికా..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు రోజులుగా ఏపీలోనే ఉన్నారు. ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు మేధావుల‌ను సైతం తిక‌మ‌క‌కు గురి చేశాయి. గురు, శుక్ర‌వారాల్లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో అసలు.. ప‌వ‌న్ ఎటువైపు అడుగులు వేస్తున్నార‌నే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. తొలిరోజు త‌మ‌కు 40 సీట్లు వ‌చ్చి ఉంటే.. ముఖ్య‌మంత్రి పీఠం కోసం ప‌ట్టుబ‌ట్టేవాడిన‌ని చెప్పారు. రెండో రోజు శుక్ర‌వారం మాట్లాడుతూ.. క‌నీసం మ‌నం 10 …

Read More »

పవన్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోకీలక భూమిక పోషించాలని తపిస్తున్న ఆయన.. అందుకు తగ్గట్లే పొత్తుల లెక్కను ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఆయన ఏ మాత్రం ఊహించని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తుగా చెప్పే గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. జనసైనికులకు కొత్త …

Read More »

మోదీ దర్శనానికి బయలుదేరుతున్న జగన్

ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఏ పనైనా డబ్బుతో కూడుకున్నాదే. అందులోనూ ప్రభుత్వాలు నడపాలంటే రోజువారీ డబ్బులు విపరీతంగా కావాలి. పైగా జగన్ లాంటి అనాలోచిత ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రులు పాలన నడపేందుకు భారీ స్థాయిలో నిధుల కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే ఇప్పుడు జగన్ మళ్లీ కేంద్రం వైపు చూస్తున్నారు మోదీకి వంగి వంగి దణ్ణాలు పెట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. ఈ నెల 27వ తేదీన …

Read More »

మిస్టర్ కే.. కర్ణాటక కాంగ్రెస్ ఘన విజయంలో కీలకం ఇతడే

కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం వెనుక కనిపించని వ్యూహకర్త ఒకరున్నారు. పార్టీ ముఖ్యనేతలు.. పార్టీ అధినాయకత్వానికి నిత్యం సూచనలు.. సలహాలు ఇస్తూ నడిపించిన అతని గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి థింక్ ట్యాంకర్ గా వ్యవహరించారు సునీల్ కనుగోలు. కర్ణాటక విజయంలో కీలకభూమిక పోషించారని చెబుతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? …

Read More »

అమిత్ షా పిలిస్తే అందుకే వెళ్లలేదు.. షాకిస్తున్న నిఖిల్ మాటలు

కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ.. తన మార్కు సినిమాల్ని చేసే నిఖిల్ కు కార్తికేయ 2 భారీ బ్రేక్ గా చెప్పాలి. అతడి కెరీర్ గ్రాఫ్ ను పెంచేసిన ఈ మూవీతో అతని రేంజ్ పెరిగింది. తాజాగా అతను హీరోగా గ్యారీ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల కావటం తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న మిస్టరీతో …

Read More »

కాంగ్రెస్‌ను బలహీనం చేయడమే తక్షణ లక్ష్యం

కర్ణాటక ఫలితాలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. బీజేపీ ఓటమి ఆ పార్టీ వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తున్నా కాంగ్రెస్ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకోవటం బీఆర్ఎస్‌లో భయం కలిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ – కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ 50 శాతానికి పైగా స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడంతో పొరుగునే ఉన్న తెలంగాణలో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో మొత్తం 41 అసెంబ్లీ స్థానాలు …

Read More »

లైగర్ గొడవ.. వరంగల్ శీను వెర్షన్ ఇదీ

Warangal Sreenu

‘లైగర్’ సినిమా రిలీజై తొమ్మిది నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా తాలూకు నష్టాల గొడవ మాత్రం ఇంకా తేలలేదు. ఈ సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లు పరిహారం కోరుతూ కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో నిరాహార దీక్షలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ పెట్టుబడి పెట్టి కోలుకోలేని దెబ్బ తిన్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను.. దాదాపుగా డిస్ట్రిబ్యూషన్ ఆపేసి సైలెంట్ అయిపోయాడు. …

Read More »

జగన్, పవన్ మధ్య క్లాస్ వార్..

కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న రోజుల్లో, జనం కేపిటల్ చదివే రోజుల్లో ‘క్లాస్ వార్’ ఓ అందమైన, ఆకర్షణీయమైన పదం. పేద, మధ్య తరగతి వర్గాలకు బాగా నచ్చిన పదం. రాబిన్ హుడ్ తరహాలో ఆలోచించే వారికి అదీ నచ్చిన పదం. పెద్దలను కొట్టు, పేదలకు పెట్టు అన్న చందంగా ప్రచారమైన పదం. చాన్నాళ్లుగా జనం ఆ పదాన్ని వాడటం మానేశారు. సాఫ్ట్ వేర్ యుగంతో హావ్స్, హావ్ నాట్స్ అనే …

Read More »