Political News

ఆద‌ర్శ‌ప్రాయంగా అన్నా క్యాంటీన్లు.. విష‌యం ఏంటంటే!

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న అన్నా క్యాంటీన్ల‌ను ఆద‌ర్శ‌ప్రాయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. ఒక‌వైపు ప్ర‌భుత్వం వైపు నుంచి ఆర్థిక స‌హ‌కారం అందిస్తారు. ఒక్క క్యాంటీన్ న‌డ‌వ‌డానికి రోజుకు రూ.20 వేల వ‌ర‌కు నిధులు అవ‌స‌మ‌వుతాయ‌ని అంచనా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం 60 శాతం నిధులు.. కార్పొరేష‌న్లు 35 శాతం నిధులు వెచ్చించేలా ప్లాన్‌చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల‌ను …

Read More »

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు !

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ పుణ్యక్షేత్రంలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. అనారోగ్యంతో ఆరుద్ర కూతురు వీల్ చెయిర్ కే పరిమితమయింది. ఆమెకు కలిగిన ఇబ్బందులు,  ఆమె కూతురు దుస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న హామీ …

Read More »

బదిలీ : గబ్బర్ సింగ్ ఆఫీసులో అత్యుత్పాహం !

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉన్న సమయంలో ఆయన భద్రతా సిబ్బందితో స్థానిక మంగళగిరి సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. పవన్‌ కల్యాణ్‌ అక్కడ ఉన్న సమయంలోనే అనుమతి లేకుండా ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. 11 రోజుల వారాహి దీక్షలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ అమ్మవారికి పూజలు చేస్తున్న సమయంలోనే సీఐ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం …

Read More »

వాళ్లిద్దరికీ ఎమ్మెల్సీలు ఖరారు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పెద్ద పీట వేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో 175 శాసనసభ స్థానాలకు గాను 21 జనసేనకు, బీజేపీకి 10 శాసనసభ స్థానాలు కేటాయించడంతో టీడీపీ 144 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశానుసారం అభ్యర్థుల గెలుపుకోసం, కూటమి ఘనవిజయం కోసం కృషిచేసిన …

Read More »

ఏపీకి రాబోతున్న లడ్డా ఐపీఎస్?

మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్… ఈ పేరు ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎస్పీగా పనిచేసిన లడ్డా తన మార్క్ పోలీసింగ్ తో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. లడ్డా పేరు వింటే క్రైమ్ చేయాలి అనే ఆలోచన కరుడుగట్టిన నేరస్థులకు సైతం రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిబద్ధత గల పోలీస్ అధికారిగా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం …

Read More »

పెద్దిరెడ్డి : నాటి పాపం .. నేటి శాపం !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి 20 రోజులు దాటింది. ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఎవరికి వారు తమ నియోజకవర్గాలకు వెళ్లి తమకు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. కానీ గత ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి 20 రోజులు దాటినా పుంగనూరులో అడుగుపెట్టలేకపోతున్నారు. ఇటీవల ఎన్నికలలో పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 6095 …

Read More »

ఎయిమ్స్ లో చేరిన బీజేపీ నేత అద్వానీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యల కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.  అద్వానీ వయసు 96 సంవత్సరాలు. అద్వానీకి ఈ ఏడాది  …

Read More »

ఏం చేస్తాం.. చివ‌రే కూర్చుంటాం: వైసీపీలో నిర్వేదం

ఏపీ అసెంబ్లీలో 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌.. వైసీపీ అస‌లు ఎక్క‌డ సీట్లు కేటాయిస్తారో.. ఎక్క‌డ కూర్చోవాల్సి వ‌స్తుందో అనే బెంగ పార్టీని వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్‌.. ప్ర‌త్య‌క్ష యుద్ధానికి తెర‌దీశారు. త‌మ‌కు ప్రతిపక్ష స్థానం క‌ట్ట‌బెట్టాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. రూల్స్-నిబంధ‌న‌ల విష‌యంపై కూడా ఆయ‌న స్పీక‌ర్‌కు లేఖ సంధించారు. గ‌తంలో ఏం చేశారో.. ఇప్పుడు కూడా అలానే చేయాలంటూ.. పాత సంగ‌తులు త‌వ్వేశారు. దీనిపై మున్ముందు ఎలాంటి నిర్ణ‌యం …

Read More »

ఆ ‘గ్రాఫ్’ పెంచాలంటే.. నారా లోకేష్ ఏం చేయాలి?

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. యువ‌గ‌ళం మ‌హిమో.. లేక త‌న‌లోని త‌ప‌నో.. మొత్తానికి నారా లోకేష్‌.. మంత్రిగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టగానే.. ప్రతి రోజూ ఆయ‌న ప్ర‌జాద‌ర్బార్ పేరుతో స‌మ‌స్య‌లు, విన‌తులు తీసుకుంటున్నారు. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌జాద‌ర్బార్ ప్రారంభించారు. ప్ర‌స్తుతం త‌న సొంత …

Read More »

ఆ వెయ్యి కోట్లు ఏమ‌య్యాయి? : ప‌వ‌న్ ఆరా!

వైసీపీ హ‌యాంలో ఏపీలో జ‌రిగిన నిధుల దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఇటీ వ‌ల పంచాయ‌తీ నిధుల విష‌యంపై ఆరా తీసిన ఆయ‌న ఏటా పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుసుకున్నారు. దాదాపు 6 వేల కోట్ల‌రూపాయ‌ల‌కు పైగా నిధుల‌ను వైసీపీ స‌ర్కారు ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. పంచాయ‌తీల‌కు నిధులు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కూడా నిల‌దీశారు. దీనికి …

Read More »

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంపై హైకోర్టుకు వైసీపీ?

ఏపీ అసెంబ్లీకి సంబంధించి గ‌త రెండు రోజులుగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. సంఖ్యాబ‌లం లేనందున వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇచ్చేది లేద‌ని అధికార ప‌క్షం చెబుతోంది. అయితే.. సంఖ్యాబ‌లంతో సంబంధం లేకుండా.. గ‌తంలో ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చిన ప‌రిస్థితులు దేశంలోను, రాష్ట్రంలోనూ ఉన్నాయంటూ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా సంద‌ర్భాల‌ను ఉటంకిస్తూ.. ఆయ‌న స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిలేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ.. అధికార ప‌క్షం మెట్టు దిగే …

Read More »

ఏపీలో ముదిరిన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం

ఏపీలో కీల‌క‌మైన వ‌లంటీర్ల వ్య‌వ‌హారం ముదిరింది. వైసీపీ హ‌యాంలో 2019లో నియ‌మితులైన వ‌లంటీర్ల విష‌యం.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పెను వివాదం రేపిన విష‌యం తెలిసిందే. వీరంతా వైసీపీకి అనుబంధంగా ప‌నిచేస్తున్నార‌ని.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని పేర్కొంటూ.. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ అనే స్వ‌చ్ఛంద సంస్త కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దీంతో ఎన్నిక‌ల వేళ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టారు. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాన …

Read More »