ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పథకాలలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించిన పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఆ పథకం ఏపీలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే వైసిపితో పాటు కాంగ్రెస్ …
Read More »లిక్కర్ వ్యాపారం జొలికెళ్లొద్దు.. చంద్రబాబు సూచన
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత మరిన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే విధంగా ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీపావళి తర్వాత సూపర్ సిక్స్ నుండి మరిన్ని పథకాలను అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి …
Read More »బీజేపీ మౌత్ పీస్గా పవన్ కల్యాణ్.. !
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, బీజేపీకి మౌత్ పీస్గా మారనున్నారనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగఢ్లో జరిగిన ఎన్డీయే కూటమి నాయకుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలు పవన్తో చర్చించారు. ఏపీలో ఆయన సనాతన ధర్మం పరిరక్షకుడిగా ఉంటానని చేసిన ప్రకటన దరిమిలా.. హిందూ సమాజం ఆయనతో ఉన్నట్టు తాము గుర్తించామని కూడా చెప్పినట్టు తెలిసింది. ఈ …
Read More »వైవీ పోయి సాయిరెడ్డి వచ్చే.. !
ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన మార్పు చేశారు. గతంలో ఉన్నట్టుగానే వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికే ఇప్పుడు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. రెండేళ్లకుపైగానే సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్గా ఉన్నారు. ఈయన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగా యి. విశాఖపట్నంలో పార్టీ పాగా కూడా వేసింది. అయితే.. ఎన్నికలకు ఏడాది …
Read More »వైసీపీ నుంచి పోయేవాళ్లే కాదు.. వచ్చేవాళ్లూ ఉన్నారా?
ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూకట్టుకుని మరీ నాయకులు పార్టీకి బై కొడుతున్నారు. వీరిలో కీలకమైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటివారు ఉన్నారు. ఇక, మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు రాజకీయాలే వదిలేస్తున్నారు. ఇలా.. వైసీపీలో నాయకులు పోయే బ్యాచే తప్ప వచ్చే బ్యాచ్ కనిపించడం లేదు. అసలు …
Read More »ప్రజల్లో ఎవరుండాలి? జగన్కు సూటి ప్రశ్న.. !
ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. ‘ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వారు మనల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా వైసీపీ నేతలతో ఆయన వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగానే వారికి ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవరూ కాదనరు. కానీ, అసలు ప్రజల్లో ఉండాల్సింది ఎవరు? అన్నది ప్రశ్న. …
Read More »వడివడిగా అమరావతి అడుగులు!
రాజధాని అమరావతి అడుగులు వడివడిగా పడనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాజధాని నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రాజధానిని పట్టించుకోకపోవడంతో చిన్నపాటి అడివిగా మారిపోయిన నేపథ్యంలో దానిని తీసేసి.. అమరావతికి ఒక రూపం కల్పించే పనిని చేపట్టారు. దీనికి గాను 33.86 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా రు. ముందుగా పెట్టుకున్న లక్ష్యం మేరకు ఈ నెల 20తో …
Read More »జగన్ ఆరు నెలల టార్గెట్.. వైసీపీ మారిపోతుందా?
వైసీపీ అధినేత జగన్.. తాజాగా నిర్వహించిన ఆ పార్టీ నేతల వర్క్ షాపులో నేతలకు, కార్యకర్తలకు.. ఆరు మాసాల టార్గెట్ పెట్టారు. “ఆరు మాసాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మీదే” అంటూ నొక్కి చెప్పారు. అందరూ ఒకే తాటిపై నిలిచి.. పార్టీని ముందుకు నడిపించాలని కూడా ఆయన ఆదేశించారు. అంతేకాదు.. ఎక్కడైనా చిన్నపాటి విభేదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించే బాధ్యత సీనియర్లు తీసుకోవాలని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని …
Read More »అప్పుడూ ఇవే హెడ్డింగులు.. బాబూ!
ఔను! ఇది ముమ్మాటికీ నిజం. గత 2014-19 మధ్య చంద్రబాబు పాలన ప్రారంభించిన తర్వాత.. ఎలాంటి వార్తలు వచ్చాయో..ఇప్పుడు కూడా అలాంటివే వస్తున్నాయి. ఇక్కడేమీ కల్పిత వార్తలు వచ్చాయని చెప్ప డం లేదు. ఓపిక ఉంటే.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే.. అప్పటి వర్తాలకు.. ఇప్పుడు గత నాలుగు రోజులుగా వస్తున్నవార్తలకు మధ్య చాలా సారూప్యత ఉంది. ఏమాత్రం పెద్దగా తేడా లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే …
Read More »నోరు చెడ్డదైతే ఎప్పటికైనా జైల్ కే అనిల్..
వైసీపీ కార్యకర్త, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం.. ఫలితాలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. చేసిన దారుణ వ్యాఖ్యల నేపథ్యంలో జూన్ 1న గుంటూరు పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం …
Read More »నేనేమీ అందాల భామల కోసం పనిచేయట్లేదు: రేవంత్
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. మూసీ నది ప్రక్షాళన అంశంపై ఆయన మాట్లాడుతూ… ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేపట్టిన బృహత్ సంకల్పంగా పేర్కొన్నారు. నేనేమీ అందాల మేడలు కట్టుకునేందుకు, దోచుకునేందుకు ప్రయత్నించడం లేదు. నేనేమీ అందాల భామల కోసం పనిచేయడం లేదు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు పనిచేస్తున్నా అని వ్యాఖ్యానించారు. మూసీ …
Read More »‘ఏమో-తెలీదు-గుర్తులేదు’: సజ్జల సమాధానాలు!
తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు కీలక సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృ ష్నారెడ్డి.. అందరు చెప్పినట్టే సమాధానాలు చెప్పారు. 2021, అక్టోబరు 19 నాడు జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తాజాగా మంగళగిరి స్టేషన్ సీఐ శ్రీనివాసరావు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు రావాలని పేర్కొన్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates