Political News

అప్పుడు ఐటీ.. ఇప్పుడు డ్రోన్.. ఏమైనా బాబు ట్రెండ్ సెట్టర్

ఏమైనా చంద్రబాబు లెక్కనే వేరుగా ఉంటుంది. డెబ్భై ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం.. రాష్ట్రానికి ఏదో చేద్దామన్న తపన ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచనలకు ఏ మాత్రం పోలిక లేని స్థాయిలో ఆయన విజన్ ఉంటుంది. ఐటీ గురించి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దగా మాట్లాడుకోని వేళలో.. హైదరాబాద్ కు ఐటీ కంపెనీలను తెచ్చేందుకు తపించిన ఆయన ఆలోచనలు ఫలించటమే కాదు.. …

Read More »

ఆ విష‌యంలో జ‌న‌సేన‌ను.. బీజేపీ హైజాక్ చేస్తుందా..!

రాష్ట్రంలో మూడు పార్టీల కూట‌మిని ఏర్పాటు చేసి, వైసీపీని గ‌ద్దె దించిన పార్టీ జ‌న‌సేన‌. ఇక‌, టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసిన పార్టీ బీజేపీ. అంటే.. మొత్తంగా కూట‌మిలో ఈ రెండు పార్టీల ప్ర‌భావం, ప్రాధాన్యం కూడా ఎక్కువ‌గానే ఉంది. మంత్రి ప‌ద‌వులు కూడా పంచుకున్నారు. వారి వారి ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి.. చంద్ర‌బాబు ఆయా పార్టీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం వ‌చ్చింది. ఈ …

Read More »

అమిత్ షా మీటింగుతో సత్యకుమార్ చెప్పిందిదేనా?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌.. వైసీపీ అధినేత‌, మాజీసీఎం జ‌గ‌న్‌పై కేంద్రానికి ఫిర్యాదులు మోశారు. తాజాగా ఆయ‌న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను క‌లుసుకుని.. జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయి లో ఫిర్యాదుల చిట్టాను విప్పారు. ఏపీని ఆయ‌న నాశ‌నం చేశార‌ని, ఇప్పుడు ఆ ధ్వంస‌మైన పాల‌న‌ను గాడి లో పెట్టాల్సి వ‌స్తుంటే త‌ల‌నొప్పిగా మారింద‌న్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా వాడేశార‌ని.. చెప్పారు. దీంతో ఇప్పుడు …

Read More »

జ‌గ‌న్ జీవో… వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా!

ఇటీవ‌ల వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పార్టీ సోష‌ల్ మీడియాపై ప‌దునైన వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా పుంజుకునేలా చేయాల‌ని, తాము యుద్ధం చేస్తున్న‌ది కేవ‌లం టీడీపీపైనే కాద‌ని.. ఆ పార్టీని, కూట‌మిని స‌మ‌ర్థించే మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల‌పై కూడా అని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాను యాక్టివేట్ చేయాల‌ని కూడా ఆయ‌న సూచించారు. దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం.. త‌మ‌కు ప‌గ్గాలు అప్ప‌గించేశారు..రెచ్చిపోదాం.. …

Read More »

గుంటూరు వైసీపీ సైలెంట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉండే జిల్లా గుంటూరు. అలాంటి జిల్లాలో పార్టీ ప‌రుగులు పెట్టాలి. నాయ‌కులు క‌లివిడిగా ఉండాలి. అయితే.. ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గుంటూరులో ఒక‌ప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు వైసీపీలో క‌నిపించ‌డ‌మే లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో విజృంభించిన వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డింది. అయినా.. …

Read More »

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను …

Read More »

‘జ‌గ‌న్ చేసిన దుర్మార్గాలను సీరియ‌ల్‌గా తీస్తే..’

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కుడు, ఒక‌ప్ప‌టి జ‌గ‌న్ స్నేహితుడు, ప్ర‌స్తుత మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావ‌న్నారు. ఆయ‌న చేసిన దుర్మార్గాల‌ను సీరియ‌ల్‌గా తీస్తే.. కొన్ని సంవ‌త్స‌రాల పాటు ప్ర‌సారం చేసుకోవ‌చ్చ‌న్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. జ‌గ‌న్ పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు ధ్వంస‌మ‌య్యాయ‌ని అన్నారు. ఇప్పుడు వాటిని స‌క్ర‌మ‌మార్గంలో పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు రేయింబ‌వ‌ళ్లు …

Read More »

మాజీ ఎంపీ నందిగంపై ఎటెంప్టివ్ మ‌ర్డ‌ర్‌ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌..ఇప్ప‌ట్లో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. టీడీపీ ఆఫీసుపై 2021లో జ‌రిగిన దాడి నేప‌థ్యంలో న‌మోదైన కేసులో ఆయ‌న తొలుత అరెస్టు అయ్యారు. 14 రోజుల పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. బెయిల్ వ‌చ్చింది. కానీ, ఇంత‌లోనే.. అమ‌రావ‌తిలోని వెంక‌ట పాలెంలో ఉన్న ఎస్సీ కాల‌నీలో మ‌రియ‌మ్మ …

Read More »

1996 నాటి చంద్రబాబును చూస్తున్నా: రామ్మోహన్ నాయుడు

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అమరావతి, మంగళగిరి, విజయవాడలో 2 రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై రామ్మోహన్ …

Read More »

డ్రోన్లు.. రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్

రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రోన్ సమ్మిట్ ఏపీలో ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ను ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత సదస్సులో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. …

Read More »

ఏపీ-తెలంగాణ‌.. తిరుమ‌ల లొల్లి!

ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న హామీల వివాదాలు కొన‌సాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్ప‌టికే నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే.. ఇవి నేరుగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌పై పెద్దగా ప్ర‌భావం చూపించ‌డం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు ఇరు రాష్ట్రాల్లోనూ త‌మ త‌మ కార్య‌కలాపాల‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య తిరుమ‌ల వ్య‌వ‌హారం లొల్లిగా మారే ప్ర‌మాదం ఏర్ప‌డింది. తాజాగా తెలంగాణ‌కు చెందిన జ‌డ్చ‌ర్ల …

Read More »

బ‌డ్జెట్‌పై బాబు వ్యూహం.. ఈ సారికి ఉందా.. లేదా..?

ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలోనూ ప్ర‌భుత్వాలు తమ‌కు వ‌చ్చే ఆదాయాన్ని, చేసే వ్య‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. అసెంబ్లీలో ప్ర‌క‌టించి ఆమేర‌కు చేయాలి. ఇది దేశ‌వ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏటా చేసే ప‌నే. అయితే.. ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో ఓటాన్ అకౌంట్‌(4 మాసాల‌కు) వైసీపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. ఏప్రిల్ నుంచి జూలై వ‌ర‌కు ఇది కొన‌సాగింది. జూన్‌లో …

Read More »