Political News

రూ.100 కోట్ల ‘మెగా’ ఆఫర్ కు షర్మిల నో!

తెలంగాణ రాష్ట్రంలో కాకలు తీరిన రాజకీయ నేతలు.. అధినేతలు ఉన్న వేళ.. వారందరికీ మించిన రీతిలో వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల వ్యవహరించిందన్న మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. ఈ ప్రాజెక్టులో ఏకంగా రూ.50 వేల కోట్ల దోపిడీ జరిగిందన్నది ఆమె వాదన. అంతేకాదు.. రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగవేత మీదా ఆమె కంప్లైంట్లు చేస్తున్నారు. …

Read More »

సినిమా ఎఫెక్ట్‌.. దిగొచ్చిన ప్ర‌భుత్వం

ఆది నుంచి కూడా సినిమా న‌టుల‌పై రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక చుల‌కన భావం ఉంది. న‌టులు ఏం చేస్తారులే.. అని. అయితే.. ఈవిష‌యంలో అన్న‌గారు ఎన్టీఆర్ తన స‌త్తా చూపించారు. తెలుగు నాట‌.. సినిమాల నుంచివ‌చ్చి అధికారం చేప‌ట్టారు. త‌ర్వాత‌..ఈ రేంజ్‌లో రాజ‌కీయాలు చేసిన వారు లేరు. అందుకే.. బ‌హుశ ఈ మాట నిల‌బ‌డిపోయి ఉంటుంది. అయితే.. సినిమా న‌టులు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను మార్చ‌గ‌ల‌ర‌ని.. తాజాగా.. ‘కాంతార‌’ మూవీ నిరూపించింది. …

Read More »

ఎత్తుకు పై ఎత్తు.. బీజేపీ గుండెల్లో ‘కారు’ ప‌రుగులు!!

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు అధికార టీఆర్ఎస్ పార్టీ షాకులిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వ్యూహంలో బీజేపీ చిక్కుకుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీసీ సామాజికవర్గం అజెండాతో బీజేపీ ముందుకుపోతోంది. ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని కమలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వరుసగా బీజేపీకి ఆ పార్టీ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో కలవరం మొదలైంది. గురువారం భిక్షమయ్య …

Read More »

వైసీపీ నిరంకుశ ధోర‌ణికి బుద్ధి చెప్పండి: బాల‌య్య‌

సాధార‌ణంగా ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవు. అందునా.. ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగేందుకు మరో ఏడాదిన్న‌ర‌ పైగానే స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్పుడే.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, అన్న‌గారి కుమారుడు.. నంద‌మూరి బాల‌కృష్ణ రంగంలోకి దిగారు. వైసీపీ ప్ర‌భుత్వ నిరంకుశ ధోర‌ణికి బుద్ధి చెప్పాల‌ని.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు మాత్ర‌మే కాదు.. మేధావులు, విద్యావంతుల‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న సెల్పీ వీడియోను తీసుకుని.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి …

Read More »

బీజేపీకి షాక్‌.. కారెక్కుతున్న కీల‌క నేత‌

మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు నెలలు తిరగకముందే దాసోజు శ్రవణ్ పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్‌ ఇస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు.. గులాబీ గూటికి ఆయన చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలుస్తోంది. …

Read More »

రెబ‌ల్స్‌పై ఇప్ప‌టి నుంచే వేటు..జ‌గ‌న్ వ్యూహం ఇదేనా..?

సాధార‌ణంగా.. ఎన్నిక‌లు అన‌గానే.. టికెట్లు ఆశించేవారు ఎక్కువ‌గానే ఉంటారు. అందునా.. అధికార పార్టీ ఏదైనా.. దానిలో టికెట్ల కోసం.. పోటీ ప‌డేవారు కూడా పెరుగుతారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్న‌దే. ఇక‌, మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం.. ఖాయ‌మ‌నే అంచ‌నాలు వేసుకుంటున్న వైసీపీలో ఈ టికెట్ల గోల మ‌రింత ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే.. పార్టీలో చాలా మందికి టికెట్లపై ఆశ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎలాగూ ద‌క్క‌లేదు. ఇప్పుడైనా.. ద‌క్కుతుందా? అని …

Read More »

పొత్తుల‌తో నిండా మునిగిపోయేది తెలుగు త‌మ్ముళ్లేనా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై పార్టీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. మండ‌ల‌స్థాయిలోనూ.. పార్టీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క‌పోతే.. టికెట్లు ఇచ్చేది లేద‌ని చెప్పారు. పైగా.. పార్టీ నుంచి కూడా.. ప‌క్క‌కు త‌ప్పిస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో నాయ‌కులు.. చాలా మంది ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. ఈ ప‌రిణామం ఇప్పుడిప్పుడే.. పుంజుకుని.. పార్టీ బ‌ల‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో పార్టీ పోయి …

Read More »

రోడ్ల దుస్థితిపై.. సొంత ఎమ్మెల్యే ఫైర్‌

రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి.. మూడేళ్లు దాటిపోయినా.. ఓ ప‌దికిలోమీట‌ర్ల మేరైనా.. ర‌హ‌దారులు నిర్మించ లేద‌ని.. ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు.. క‌నీసం.. దెబ్బ‌తిన్న రోడ్ల‌ను కూడా.. బాగుచేయ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అయితే.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌హా.. కొంద‌రు మంత్రులు ప్ర‌తిప‌క్షాల‌పై ఎదురు దాడి చేస్తున్నారే త‌ప్ప‌.. ర‌హ‌దారుల దుస్థితిని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇటీవ‌ల వ‌ర్షాల‌కు.. అనేక ప్రాంతాల్లోరోడ్డు ప్ర‌మాదాలు …

Read More »

క్లారిటీ లేని క‌మ‌ల నాథులు.. ఏపీలో గ‌డ‌బిడ‌!!

“ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. కూడా.. అలా మాట్లాడ‌తావేంట్రా!” స‌హ‌జంగా మన ఇళ్ల‌లో త‌ర‌చుగా వినిపించేమాట‌. ఇప్పుడు.. ఇదే రేంజ్‌లో ఏపీ బీజేపీలోనూ ఈమాటే వినిపిస్తోంది. కీల‌క‌మైన బీజేపీ పొత్తు పార్టీ.. జ‌న‌సేన అనూహ్యంగా టీడీపీతో చేతులు క‌లిపింది. కార‌ణం ఏదైనా.. బీజేపీకి నామ‌మాత్రం కూడా.. చెప్ప‌లేద‌న్న‌ది వాస్త‌వం. అంతేకాదు.. బీజేపీ నేత‌లు అంటే.. గౌర‌వం ఉంద‌న్న ప‌వ‌న్‌.. ఊడిగం చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా.. బీజేపీపై అనూహ్య‌మైన కౌంట‌ర్లు కూడా …

Read More »

అమ‌రావ‌తి రైతుల‌కు మ‌రో షాక్‌

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న వైసీపీ స‌ర్కారు ఇక్క‌డి రైతుల‌కు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే దీనిపై హైకోర్టు రూలింగ్ ఉన్నా.. కాద‌ని ముందుకే సాగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్ట‌బడి ఉన్నామ‌న్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాలను నిలిపి వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. రాజ‌ధాని కోసం.. ఇక్క‌డి రైతులు త‌మ సాగు భూముల‌ను ఇచ్చిన నేప‌థ్యంలో వాటిని రాజ‌ధాని కోసం …

Read More »

KCR మొదటి మీటింగ్ విశాఖలోనేనా?

కేసీయార్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన జరుగుతోందట. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో బహిరంగ సభ నిర్వహణతో పార్టీని గ్రాండ్ గా లాంఛ్ చేయాలని కేసీయార్ అనుకున్నారు. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల్లో విశాఖనే బెస్ట్ ప్లేస్ అని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఉత్తరాంధ్రలో కేసీయార్ సామాజిక వర్గం బలంగా …

Read More »

అప్పుడు బాబు ఇరుక్కున్నట్లే ఇప్పుడు జగన్?

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఇరుకున పెట్టిన అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన అంశం.. ప్రత్యేక హోదా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంత కాలం పాటు ప్రత్యేక హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించిన బాబు.. అది సాధ్యం కాదని మోడీ సర్కారు తేల్చేయడంతో, దాని స్థానంలో అంతే ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మీడియా వాళ్లు, జనాలు అడిగితే తూచ్ అనేశారు. …

Read More »