Political News

అమరావతీ ఊపిరి పీల్చుకో

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు ఐడేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇక్క‌డ ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. 2015లో శంకు స్థాప‌న జ‌రిగిన రాజ‌ధాని అమ‌రావ‌తికి.. గ‌త ఐదేళ్ల పాటు గ్ర‌హణం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. అమరావతిలోని రాజ‌ధాని ప్ర‌ధాన ప్రాంతం రాయపూడిలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి, పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి ఆయ‌న …

Read More »

ఇదంతా అప్పుడు చెప్పాల్సింది జగన్

చేతులు కాలాక‌.. ఆకులు ప‌ట్టుకున్న‌ట్టుగా ఉంది వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిస్థితి. ఆయ‌న హ‌యాంలో జ‌రిగి న త‌ప్పుల‌పై అప్ప‌ట్లో కూట‌మి పార్టీలు ఊరూవాడా ప్ర‌చారం చేశాయి. ఆధారాలు చూప‌లేదు కానీ.. ప్ర‌చా రంలో మాత్రం దూసుకుపోయాయి. ఇక‌, ఎలానూ కూట‌మి పార్టీల‌కు మౌత్ పీస్‌లు ఉన్నాయి కాబ‌ట్టి ఆ ప్ర‌చారం జోరుగా.. హోరెత్తింది. అలాంటి స‌మ‌యంలోనే స్పందించి.. తాను చేసిందేంటో చెప్పుకోవాల్సి న జ‌గ‌న్ మౌనంగా ఉండిపోయారు. అయితే..ఇ …

Read More »

వైసీపీ.. ‘సోష‌ల్’ స‌మ‌రం ప‌క్కా… !

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప‌క్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సోస‌ల్ మీడియా విష‌యంలోనూ ఆయ‌న చాలాదూకుడుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌రకు ఎన్నిక‌లు అయిపోయి.. నాలుగు మాసాలు గ‌డిచాయి. ఈ నాలుగు మాసాల కాలంలో పార్టీ నేత‌లు ఎలా ఉన్నా..ఇప్ప‌టి నుంచి మాత్రం ప‌క్కాగా ఉండాల‌ని జ‌గ‌న్ సూచించారు. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే..ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు. అయితే.. మ‌రీ ముఖ్యంగా, …

Read More »

వంద రోజుల ‘ప్రోగ్రెస్‌’: చంద్ర‌బాబు వేసుకున్న మార్కులు ఇవీ!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి.. 125 రోజులు అయింది. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారంతో కొలువుదీరిన కూట‌మి ప్ర‌భుత్వం.. 125 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో ఆదిలోనే తాను చెప్పుకొన్న‌ట్టు స‌ర్కారుకు మార్కులు వేసుకున్నారు చంద్ర‌బాబు. వంద రోజుల ప్రోగ్రెస్‌ను ఆయ‌న తాజాగా చ‌దివి వినిపించారు. పార్టీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్ర‌బాబు స‌ర్కారుకు మంచి మార్కులే వేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదీ ప్ర‌గ‌తి.. సీఎం చంద్ర‌బాబు …

Read More »

ఇది మాత్రం ‘జోకే’.. జ‌గ‌న్ గారూ!

“ప్ర‌శ్నించే స్వ‌రాల‌ను చంద్ర‌బాబు అణిచేస్తున్నారు”- ఇదీ.. తాజాగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన కామెంట్‌. అయితే.. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతోంది. దీనికికార‌ణం.. అస‌లు ప్ర‌శ్నించే స్వ‌రాల‌ను అణిచి వేసింది వైసీపీ హ‌యాంలోనేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు. 2023 జ‌న‌వ‌రిలో తొలి వారంలోనే ప్ర‌బుత్వం ‘జీవో నెంబ‌ర్-1’ తీసుకువ‌చ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ర‌చ్చ కూడా సాగింది. ఎందుకంటే.. ఎవ‌రైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే.. …

Read More »

టార్గెట్ 2029 కాదు.. 2026: బాబు ప‌క్కా ప్లాన్‌!

దేశ‌వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌లు రానున్న ద‌రిమిలా.. దీనికి ఏపీ సీఎం చంద్ర‌బాబు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ ఏడాది జూన్‌లో ఏర్ప‌డిన ప్ర‌బుత్వానికి ఐదేళ్ల గ‌డువు ఉంటుంది. అయితే.. జ‌మిలి నేప‌థ్యంలో రెండున్న‌రేళ్ల‌కు మించి స‌మ‌యం ఉండే అవ‌కాశం లేదు. పైగా జ‌మిలికి కేంద్రం కూడా రెడీ అయిపోయింది. ఎన్డీయే కూట‌మి ప‌క్షాల‌ను కూడా ఒప్పించేసింది. ఒక్క …

Read More »

మహిళలకు ఫ్రీ బస్ పథకం..షర్మిల వినూత్న నిరసన

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పథకాలలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించిన పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఆ పథకం ఏపీలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే వైసిపితో పాటు కాంగ్రెస్ …

Read More »

లిక్కర్ వ్యాపారం జొలికెళ్లొద్దు.. చంద్రబాబు సూచన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత మరిన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే విధంగా ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చంద్రబాబు ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీపావళి తర్వాత సూపర్ సిక్స్ నుండి మరిన్ని పథకాలను అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి …

Read More »

బీజేపీ మౌత్ పీస్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇక‌, బీజేపీకి మౌత్ పీస్‌గా మార‌నున్నార‌నే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఛండీగ‌ఢ్‌లో జ‌రిగిన ఎన్డీయే కూట‌మి నాయ‌కుల స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు ప‌వ‌న్‌తో చ‌ర్చించారు. ఏపీలో ఆయ‌న స‌నాత‌న ధ‌ర్మం ప‌రిర‌క్ష‌కుడిగా ఉంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న ద‌రిమిలా.. హిందూ స‌మాజం ఆయ‌న‌తో ఉన్న‌ట్టు తాము గుర్తించామ‌ని కూడా చెప్పిన‌ట్టు తెలిసింది. ఈ …

Read More »

వైవీ పోయి సాయిరెడ్డి వ‌చ్చే.. !

ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విష‌యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న మార్పు చేశారు. గ‌తంలో ఉన్న‌ట్టుగానే వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డికే ఇప్పుడు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వాస్త‌వానికి పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రెండేళ్ల‌కుపైగానే సాయిరెడ్డి ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈయ‌న హ‌యాంలోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు కూడా జ‌రిగా యి. విశాఖ‌ప‌ట్నంలో పార్టీ పాగా కూడా వేసింది. అయితే.. ఎన్నిక‌ల‌కు ఏడాది …

Read More »

వైసీపీ నుంచి పోయేవాళ్లే కాదు.. వ‌చ్చేవాళ్లూ ఉన్నారా?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి చాలా మంది నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూక‌ట్టుకుని మ‌రీ నాయకులు పార్టీకి బై కొడుతున్నారు. వీరిలో కీల‌క‌మైన బాలినేని శ్రీనివాస‌రెడ్డి, సామినేని ఉద‌య భాను, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావు వంటివారు ఉన్నారు. ఇక‌, మ‌రికొంద‌రు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొంద‌రు రాజ‌కీయాలే వ‌దిలేస్తున్నారు. ఇలా.. వైసీపీలో నాయ‌కులు పోయే బ్యాచే త‌ప్ప వ‌చ్చే బ్యాచ్ క‌నిపించ‌డం లేదు. అస‌లు …

Read More »

ప్ర‌జ‌ల్లో ఎవ‌రుండాలి? జ‌గ‌న్‌కు సూటి ప్ర‌శ్న‌.. !

ప్ర‌జ‌ల్లో ఉండాలంటూ.. నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా సెల‌విచ్చారు. ‘ప్ర‌జ‌ల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వారు మ‌న‌ల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి’ అని ఆయ‌న పేర్కొన్నారు. తాజాగా వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న వ‌ర్క్ షాపు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగానే వారికి ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, అస‌లు ప్ర‌జ‌ల్లో ఉండాల్సింది ఎవ‌రు? అన్న‌ది ప్ర‌శ్న‌. …

Read More »