Political News

వైసీపీ గేమ్ మొదలైపోయింది

2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దాని వల్ల రెండు పార్టీలకూ చేటు జరిగింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే రెంటికీ అంతటి దారుణ పరాభవం ఎదురయ్యేది కాదు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతటి ఘన విజయాన్ని అందుకునేది కాదు. ఓట్ల చీలిక వల్ల వైసీపీ బాగా ప్రయోజనం పొందితే.. చాలా సీట్లలో టీడీపీకి, జనసేనకు నష్టం జరిగింది. ఈసారి కూడా ఈ …

Read More »

ప‌వ‌న్ మీటింగ్‌లో మిస్స‌యిన వీడియో చూశారా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా మంగ‌ళ‌వారం.. త‌న పార్టీ కేంద్ర కార్యాల‌యం మంగ‌ళ‌గిరిలో మాట్లాడుతూ.. వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. కొడ‌క‌ల్లా.. చెప్పుతోకొడ‌తా.. అంటూ.. రెచ్చిపోయారు. మ‌రిన్ని కామెంట్లు కూడా చేశారు. ఇక‌, యుద్ధ‌మే అంటూ.. వైసీపీ నాయ‌కుల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. అయితే.. దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కౌంట‌ర్లు ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఒక పార్టీ అధ్య‌క్షుడు మాట్లాడేతీరు ఇదే.. నువ్వు నీ కార్య‌క‌ర్త‌ల‌కు …

Read More »

ఎవ‌రి ఖ‌ర్గే.. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎలా ఎదిగారు?

కాంగ్రెస్ అధ్య‌క్ష పీఠంపై ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్ణాట‌క నాయ‌కులు.. 86 ఏళ్ల మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూర్చొన‌బోతున్నారు. ఆయ‌న ఎన్నిక ముందుగానే ఊహించింది. అయినా.. ఎన్నిక‌లు జ‌రిగిన ద‌రిమిలా.. భారీ మెజారిటీతోఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. అయితే… ఇంత పెద్ద పోస్టుకు ద‌క్షిణాది నాయ‌కులు.. పైగా.. ద‌ళితుడు అయిన‌.. ఖ‌ర్గే ఎలా అందుకున్నారు? ఆయ‌న ఎదిగిన తీరు ఏంటి? అంతా.. ఆస‌క్తిక‌రం.. మల్లికార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే …

Read More »

జ‌న‌సేన‌లోకి క‌న్నా.. నేడో.. రేపో..?

Kanna Lakshmi Narayana

ఏపీ బీజేపీలో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ క‌మ‌లం గూటికి రాం రాం చెప్ప‌నున్నారు. తాజాగా జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. దీనికి ముందు నుంచి కూడా.. ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న వ‌రుస ప‌రాభ‌వాల నేప‌థ్యంలో.. క‌న్నా.. పార్టీ మారేందుకు రెడీ అయ్యార‌ని తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్య అనుచరులతో భేటీ అయినా.. పార్టీ …

Read More »

ప‌వ‌న్ ఎఫెక్ట్: బీజేపీలో సెగ‌లు..!

Pawan Kalyan and Somu Veeraju

తాజాగా టీడీపీతో చేతులు క‌లిపిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉదంతం.. ఏపీ బీజేపీలో.. సెగ‌లు పుట్టిస్తోంది. ఏమాత్రం ఓటు బ్యాంకులేని.. బీజేపీకి అండ‌గా ఉండేందుకు సిద్ధ‌మైన ప‌వ‌న్‌ను.. ఉద్దేశ పూర్వ‌కంగానే బ‌య‌ట‌కు పంపించార‌నే చ‌ర్చ‌.. బీజేపీలో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.దీనికి క‌ర్త‌, క‌ర్మ, క్రియ కూడా.. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజే అనే భావ‌న వినిపిస్తోంది. తాజాగా దీనిపై ఓ మీడియాతో మాట్లాడిన బీజేపీ మాజీ అధ్య‌క్షుడు.. క‌న్నా …

Read More »

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే:  రాహుల్ కామెంట్స్‌

Rahul Gandhi

ఏపీలో మూడు రాజ‌ధానులు అనేది బుద్ధిలేని ఆలోచ‌న అని కాంగ్రెస్  అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఒక రాష్ట్రం.. ఒక రాజ‌ధాని అనేదే కాంగ్రెస్ నినాద‌మ‌ని.. దానికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం భార‌త్ జోడోయాత్ర‌లో ఉన్న రాహుల్ గాంధీ.. క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో స్థానికంగా కొంద‌రితోనూ.. ఆయ‌న చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు రాజ‌ధాని విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంద‌ని.. అయితే.. …

Read More »

జయ మరణంపై అనుమానాలన్నీ శశికళపైనేనా ?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంలో అనుమానాలన్నీ శశికళవైపే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత దాదాపు నెలరోజులు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో జయ మరణవార్త పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే చనిపోయారని ప్రకటించేందుకు రెండురోజుల ముందే తాను బాగున్నట్లు స్వయంగా జయే వీడియో విడుదలచేశారు. రెండు రోజుల తర్వాత ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దాంతో చాలామందికి అనుమానాలు పెరిగిపోయాయి. అయితే జయమరణంపై …

Read More »

టీఆర్ఎస్ కు మరో భారీ షాక్.. త్వరలో చిచ్చా గుడ్ బై..?

అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి మరో భారీ షాక్ తగలబోతోందా..? ఆ పార్టీకి చెందిన ఉద్యమ నేత మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కమలం తీర్థం పుచ్చుకోబోతున్నారా..? మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా..? మరో ఉప ఎన్నిక భారం తెలంగాణపై పడనుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇవి ఊహాగానాలు కాదు నిజమేననే భావన కలుగుతోంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. …

Read More »

ప‌వ‌న్ విష‌యంలో జ‌గ‌న్ చేసిన అతి పెద్ద త‌ప్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు మంగ‌ళ‌వారం వేగంగా మారిపోయాయి. ఇప్ప‌టిదాకా సాత్వికంగా మాట్లాడుతూ వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఒక్క‌సారిగా ఉగ్ర‌రూపం దాల్చాడు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల మీద మునుపెన్న‌డూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ప్యాకేజీ, మూడు పెళ్లిళ్లు.. ఇలా వైసీపీ వాళ్లు త‌న‌ను టార్గెట్ చేసే అంశాల మీద తిరుగులేని స‌మాధానం చెప్పాడు. దీనికే వైసీపీ వాళ్లు గింజుకుంటుంటే.. త‌ర్వాత ఇంకో కీల‌క …

Read More »

ఇక‌, తేల్చుకోవాల్సింది బీజేపీనే?!

Pawan Kalyan and Somu Veeraju

ఔను.. ఇక‌, ఏపీలో ఎవ‌రితో క‌లిసి అడుగులు వేయాలి? అనే విష‌యాన్ని బీజేపీనే తేల్చుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌తో పొత్తు ఉంద‌ని.. ఆ పార్టీతో నే క‌లిసిన‌డుస్తామ‌ని.. నిన్న‌టి వ‌ర‌కు చెప్పిన బీజేపీ.. ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్టు అయిపోయింది. ఎందుకంటే.. ప‌వ‌నే స్వ‌యంగా చెప్పారు.. నేను అనేక సార్లు బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాను. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఇంకా వేచి చూస్తే.. మా …

Read More »

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణే ధ్యేయం.. చేతులు క‌లిపిన ప‌వ‌న్‌-బాబు!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐదేళ్ల తరువాత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ…ప్ర‌జాస్వామ్యం కోసం.. ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు. అన్ని పార్టీల‌ను క‌లుపుకొని వైసీపీపై పోరు సాగిస్తామ‌న్నారు. పవన్‌పై ప్రభుత్వ విధానం సరికాదన్నారు. పవన్‌కు సానుభూతి తెలిపేందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. పవన్ మీటింగ్ పెట్టుకున్నరోజే ప్రభుత్వ కార్యక్రమం సరికాదని సూచించారు. పవన్‌ …

Read More »

ఏపీలో సంచ‌ల‌నం.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు భేటీ

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ నోవాటెల్‌ హోటల్‌ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. చంద్రబాబుతో పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ, వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా సంయుక్త కార్యాచరణపై దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ముగించుకుని నేరుగా నోవాటెల్ హోటల్‌కు వచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ …

Read More »