Political News

ఇంచార్జ్‌ల‌ను మార్చినా వైసీపీకి ఊపులేదు

ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా అధినేత స్థాయిలో మార్పు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు కూడా ఆయ‌న భ‌రోసా ఇవ్వ‌లేక పోతున్నారు. దీంతో ఇంచార్జ్ లుగా బాధ్య‌తలు చేప‌ట్టిన వారు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఎవ‌రికి వారు త‌మ‌సొంత ప‌నులు చేసుకుంటున్నారు. ఏంటి కార‌ణం..?ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ఉన్న నాయ‌కుడు ఆ …

Read More »

మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేసిన‌ చంద్ర‌బాబు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టేందుకు 20 బిల్లుల‌ను ఆమోదించారు. వీటిలో కీల‌క‌మైన రెండు బిల్లుల‌ను చంద్ర‌బాబు తొక్కిపెట్టారు. అస‌లు ఈ రెండు బిల్లుల‌నే ఆమోదించాల‌న్న‌ది టీడీపీ నేత‌లు, మంత్రులు చెప్పిన మాట‌. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఆ రెండు త‌ప్ప‌.. అంటూ వ్యాఖ్యా నించారు త‌ర్వాత చూద్దామ‌నికూడా ప‌క్క‌న పెట్టేశారు. దీంతో త‌మ్ముళ్లు …

Read More »

ఒట్టు..ప్రభాస్ ఎవరో తెలీదు: షర్మిల

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులకు షర్మిల గతంలో ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ప్రభాస్ వ్యవహారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. …

Read More »

బొత్సకు హగ్ ఇచ్చిన పవన్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీని వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో మండలిలో వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతలు అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సభ బయట ఓ ఆసక్తికర ఘటన జరిగింది. సభ బయట కనిపించిన బొత్సను పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న …

Read More »

గౌతమ్ అదానీ ఇష్యూపై వైట్ హౌస్ రియాక్షన్ ఇదే

బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అమెరికా.. భారత్ మీద సంబంధాల మీదా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన వినిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్ష భవనం ఈ అంశంపై రియాక్టు అయంయింది. సోలార్ పవర్ ప్రొక్షన్.. సప్లై డీల్స్ కు సంబంధించి భారత్ లో రూ.2029 కోట్ల లంచాలు …

Read More »

జ‌గ‌న్ రాజ‌కీయ అవినీతి ప‌రుడు: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన ప్ర‌ముఖ పారిశ్రామిక గౌతం అదానీ లంచాల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ పాత్ర వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ క్ర‌మంలో ష‌ర్మిల స్పందిస్తూ.. జ‌గ‌న్ రాజ‌కీయ అవినీతి ప‌రుడు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లంచం ఇస్తే.. ఏపీని కూడా తాక‌ట్టు పెడ‌తాడ‌ని ఆమె అన్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన …

Read More »

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డిని ఆమె టార్గెట్ చేశారు. ఆది నుంచి కూడా ఇరువురి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రింత ఎక్కువ అయ్యాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ప‌రిటాల కుటుంబాన్ని తోపుదుర్తి టార్గెట్ చేసుకుని రాజ‌కీయాలు చేసిన‌ట్టే.. ఇప్పుడు సునీత కూడా తోపుదుర్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి …

Read More »

పార్టీ మార్పులపై హైకోర్టు తుదితీర్పు: బీఆర్ఎస్ కు షాక్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసి, కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది. హైకోర్టు తీర్పులో స్పీకర్‌కు నిర్ణయం తీసుకునే విషయంలో కాలపరిమితి విధించలేమని స్పష్టం చేసింది. అయితే, …

Read More »

అస‌లు వ‌ద్దు… కొస‌రు ముద్దంటోన్న జ‌గ‌న్‌…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి విచిత్రంగా ఉంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీల‌క‌మైన స‌మ‌యం లో ఆయ‌న మౌనంగా ఉంటూ.. అవ‌స‌రంలేని స‌మ‌యంలో స్పందిస్తున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మండ‌లి ఎన్నిక‌లు వ‌చ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయినా.. జ‌గ‌న్ వైపు నుంచి స్పంద‌న రాలేదు. ఎవ‌రినీ ఆయ‌న నిల‌బెట్ట‌లేదు. ప్రోత్స‌హించ‌లేదు. మ‌ద్ద‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు. నిజానికి మండ‌లి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చినా, ఎవ‌రినైనా …

Read More »

మండ‌లిలో బొత్స‌.. గ్రాఫ్ పెరిగిందా.. త‌గ్గిందా..?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు మాజీ మంత్రి, శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఈ ఏడాది మండ‌లికి ఎన్నికైన ఆయ‌న‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో మండ‌లిలో స‌ర్వం ఆయ‌నే అన్న‌ట్టుగా వైసీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శాస‌న స‌భ‌కు హాజ‌రు కాని వైసీపీ ఎమ్మెల్యేలు కేవ‌లం తాడేప‌ల్లి కార్యాల‌యానికే ప‌రిమితం అవుతున్నారు. దీంతో కీల‌క‌మైన …

Read More »

బాబు విజ‌న్‌: ఏపీకి 1.87 ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబ‌డి!

ఏపీలో గ‌తంలో ఎన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా నేష‌న‌ల్ ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌(ఎన్టీపీసీ) ఏకంగా 1.87 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డిని పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి వ‌చ్చిన వ‌స్తున్న పెట్టుబ‌డుల్లో ఇదే అతి పెద్ద‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌బుత్వం ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ విశాఖ‌లో 65 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు …

Read More »

వ‌ద‌ల బొమ్మాళి: వ‌ర్మ‌ను వెంటాడుతున్న కేసులు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను కేసులు వెంటాడుతున్నాయి. ఒక దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకే ఆయ‌న ఆప‌సోపాలు ప‌డుతున్నారు. అయితే.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా కేసులు ఆయ‌న‌ను వెంటా డుతూనే ఉన్నాయి. సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుని చెల‌రేగిన ఫ‌లితంగా వ‌ర్మ‌కు ఇప్పుడు సెగ బాగానే త‌గులుతోంది. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామ‌లింగ‌య్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు న‌డుస్తోంది. 41 ఏ కింద నోటీసులు కూడా …

Read More »