తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ను భారత రాష్ట్ర సమితి.. బీఆర్ ఎస్గా మారుస్తూ.. ముఖ్యమంత్రి.. తెలంగాణ ప్రజల ఆరాధ్యుడిగా పేరొందిన కేసీఆర్ తీర్మానం చేశారు. దీనికి పెద్ద ఎత్తున హడావుడి చేశారు. భారీ కాన్వాయ్తో.. ఆయన వెళ్లడం.. జిల్లాల నుంచి నాయకులను కూడా రాజధానికి రప్పించడం.. వారితో సంతకాలు తీసుకోవడం.. వారితోఆమోద ముద్ర వేయించుకుని.. టీఆర్ ఎస్ పార్టీని.. ఇక నుంచి జాతీయ పార్టీగా గుర్తించాలని.. తీర్మానం చేశారు. …
Read More »“కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా”
మాజీ మంత్రి కొడాలి నాని పై గుడివాడ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా” అని రావి సవాల్ చేశారు. కొడాలి నాని కాళ్ళు పట్టుకొని అడుక్కోవడంతోనే చంద్రబాబు ‘బి’ ఫారం ఇచ్చారని గుర్తుచేశారు. గుడివాడలో హరికృష్ణ ను ఓడించింది కొడాలి నానినే అని అన్నారు. చరిత్రను …
Read More »రేవంత్ ఈ 3 గండాలు దాటితేనే…!
మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మూడు గండాలను దాటుకొని పార్టీని విజయతీరాలకు చేర్చాల్సి ఉంది. ఇవి ఆయన ప్రతిభకే గీటురాయిగా మిగలనున్నాయి. ఈ మూడింటిలో ఏ ఒక్క దాంట్లో ఆయన విఫలమైనా టీ కాంగ్రెస్ లో ఆయన గురించి చరిత్రగానే చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో రేవంత్ ఒకింత గుబులుగానే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంతుకు …
Read More »ఆ బ్రిడ్జి మూసివేస్తూ నిర్ణయం… పాదయాత్రే టార్గెట్టా?
రాజమహేంద్రవరం అన్నంతనే గుర్తుకు వచ్చేది రోడ్ కమ్ రైలు వంతెన. నిత్యం భారీగా రాకపోకలు సాగే ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేయటం.. రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు తూర్పుగోదావరి కలెక్టర్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతినే రాజధానిగా ఖరారు చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ వాదనకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రను ఇప్పటికే పెయిడ్ పాదయాత్రగా ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకత్వం.. …
Read More »విజయసాయిరెడ్డి ‘చిట్టా’ విప్పేసిన విశాఖ వైసీపీ ఎంపీ
జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎప్పుడూ లేని రీతిలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. మొన్నటివరకు ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిన ఏపీ అధికారపక్ష నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్య రచ్చ మొదలైంది. అధిపత్య పోరు విషయంలో తగ్గేదేలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గత వారంలో రెండు ప్రాంతాల్లో వైసీపీ నేతల మధ్య …
Read More »చంద్రబాబుపై వ్యతిరేకత లేదు.. జగన్పై నమ్మకం లేదు!
రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆయన విజన్ కావొచ్చు.. లేదా.. ఆయన వేసిన బాట కావొచ్చు. నేడు ఉపాధి హామీ పథకం రయ్ రయ్యన దూసుకుపోతున్నా.. వివిధ పరిశ్రమలు ప్రారంభం అవుతున్నా.. చంద్రబాబు వేసిన పునాదులేనని.. అందరూ చెబుతున్నారు. దీనిని వైసీపీ నాయకులు కూడా ఖండించలేక పోతున్నారు. ఎందుకంటే.. తమ మూడేళ్ల హయాంలో ఏమీ తీసుకురాలేక పోయారు కాబట్టి..! ఇక, జగన్పై …
Read More »బీఆర్ఎస్ రావడమే మంచిదా.. వైసీపీ టాక్!
ఏపీ అధికార పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూస్తానని.. ప్రకటిం చారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అంతా కూడా… ఒకే పార్టీకి(అది కూటమి కావొచ్చు) పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని.. ఆయన ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు బాగానే ఇబ్బంది పెడుతోంది. అందుకే తరచుగా.. వాళ్లు.. …
Read More »అది విశాఖకు బిగ్ డే
ఈనెల 15వ తేదీన విశాఖపట్నంలో చాలా బిజీ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. ఒకేరోజు మూడు పార్టీలకు సంబంధించిన భారీ కార్యక్రమాలు జరగబోతుండటంతో ఆరోజు నగరం చాలా బిజీబిజీగా ఉండబోతోంది. కాకపోతే పార్టీ కార్యక్రమాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉంటే అదే పదివేలు. మొదట ప్రజాగర్జన విషయం చూద్దాం. మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణకు మద్దతుగా పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి జేఏసీ అవసరమైన చర్యలు …
Read More »అరెరె… రాజగోపాల్ కి పెద్ద సమస్య వచ్చిపడిందె !!
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి దూసుకుపోతున్నారు. బీజేపీ నేతలు కూడా బాగా హడావుడి చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకముందునుండే రాజగోపాలరెడ్డి కమలంపార్టీ అభ్యర్ధిగా ప్రచారంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాలను తారుమారుచేయటానికి కీలకమైన డబ్బుకు రాజగోపాల్ దగ్గరే సమస్యేలేదు. అయినా టెన్షన్ పడిపోతున్నారట. ఇంత టెన్షన్ పడటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఇప్పటికీ చాలా గ్రామాల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ నేతగానే …
Read More »కేటీఆర్ తడబాటు.. నెటిజన్లు.. క్లాస్ పీకేశారుగా!
అత్యంత ఇంపార్టెంట్గా ముందుకు సాగుతున్న తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక.. అధికార పార్టీకి ప్రాణసంకటంగా మారింది. ఇక్కడ గెలిచి తీరాల్సిన అవసరం.. గెలుపుగుర్రం ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. తెలిసిందే. అయితే.. అధికార పార్టీ తరఫున జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలు.. పార్టీ ని ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా మంత్రి, రాజకీయంగా.. ఏవిషయాన్నయినా.. సమర్థవంతంగా డీల్ చేయగల నాయకుడుగా పేరున్న.. కేటీఆర్ తడబడ్డారు. మునుగోడులో ఈ రోజు .. తొలిసారి …
Read More »గూగుల్ మ్యాప్లు అబద్ధాలు చెబుతాయా?: హైకోర్టు ఫైర్
విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను తొలిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో రుషికొండ తనిఖీ చేయాలని పంపుతామని.. కమిటీ వేస్తే మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని …
Read More »మునుగోడు పోరు: కమలనాథుల క్యాస్ట్ గేమ్ !
మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం దక్కించుకుని.. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకులు అన్ని అస్త్రాలను ఇక్కడ ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో కులాల వారీగా కన్నేశారు. కుల సంఘాలవారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రచారానికి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖ నేతలను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికను బీజేపీ సెమీ ఫైనల్గా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో …
Read More »