మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి …
Read More »కేసీఆర్ విషయంలో పవన్ వ్యూహం ఏంటి?
ఔను.. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విషయంలో జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలా ముందుకు సాగుతారు? ఇదీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న ప్రధాన చర్చ. రెండు కీలక పార్టీలు.. వైసీపీ, టీడీపీల విషయంలో చర్చ ఎలా ఉన్నప్పటికీ.. జనసేన విషయంలో మాత్రం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ లో కేసీఆర్ను పవన్ సమర్ధిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక …
Read More »ప్రజాదరణ పెరిగింది.. ఓటింగ్ పెరుగుతుందా.. టీడీపీ అంతర్మథనం
ప్రస్తుతం టీడీపీలో నేతల మధ్య అంతర్మథనం సాగుతోంది. ప్రజాదరణ పెరిగింది. అది పార్టీ అధినేత చంద్రబాబుపై సింపతీతో కావొచ్చు.. లేదా.. వైసీపీపై వ్యతిరేకతతో కావొచ్చు. ఈ రెండు కారణాల్లో ఏదైనా.. కూడా పార్టీకి మేలు జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. అయితే.. నాయకులే కదలడం లేదన్నది.. చంద్రబాబు వాదన. ఇది కూడా నిజమే. ఇది ఎలా ఉన్నప్పటి కీ.. ప్రజల్లో మాత్రం మార్పు స్పష్టంగా …
Read More »పక్కాలెక్కలు ఉన్నప్పుడు కాగ్ మొట్టికాయలేల బుగ్గన సార్!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. అదేసమయంలో పనిలో పనిగా ఆయన గత టీడీపీ ప్రభుత్వంపై రాళ్లేశారు. ఆ ప్రభుత్వంలోనే అప్పులు అసాధారణంగా పెరిగాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక నిర్వహణ మెరుగు పడిందన్నారు. ఆర్థిక పరిస్థితి దారణంగా దిగజారిందని అప్పులు 8 లక్షల కోట్లకు చేరిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన …
Read More »బీజేపీలోకి రాయపాటి?
ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే! గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ.. టీడీపీ సీనియర్ నేత.. రాయపాటి సాంబశివరావు త్వరలోనే .. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్త కమలదళంలో భారీ ఎత్తున హల్చల్ చేస్తోంది. పార్టీ సీనియర్ కావడం.. మంచి పలుకుబడి ఉండడం.. ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో ఇలాంటి వారికోసమే.. బీజేపీ ఎదురు చూస్తోంది. ఆయన గెలిచి.. మరో ఇద్దరిని గెలిపించగలిగితే.. చాలు.. అనే ధోరణిలో బీజేపీ నేతలు …
Read More »కేసీయార్ కు షాక్ తప్పదా ?
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకే టీఆర్ఎస్ పార్టీని కేసీయార్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా విస్తరించటం మాటేమిటో కానీ తెలంగాణాలోనే షాక్ తప్పేట్లు లేదని సమాచారం. కారణం ఏమిటంటే ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తన విస్తరణను సొంత రాష్ట్రంలో కూడా చేయాలని అనుకున్నదట. కేసీయార్ తో ఉన్న స్నేహం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమున్నా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పార్టీ విస్తరణకు …
Read More »ఉత్తరాంధ్ర వెలమలు.. సీమలో రెడ్లే టార్గెట్.. కేసీఆర్ వ్యూహం ఇదే..!
భారత రాష్ట్ర సమితి… బీఆర్ ఎస్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఏపీపై వ్యూహం విస్తరించారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా.. కేంద్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారం.. కనీసం.. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఈ విషయం కేసీఆర్కు తెలియంది కాదు. ఆయన అన్నీ పక్కాగా లెక్కలు వేసుకునే జాతీయ పార్టీ …
Read More »మునుగోడుపై టీడీపీ వ్యూహం ఇదే!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మునుగోడులో ఇప్పటికే మూడు ప్రదాన పార్టీల మధ్య హోరా హోరీ పోరు రెడీ అయిపోయింది. కాంగ్రెస్-బీజేపీ-టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలు.. నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు మంత్రాలు పఠిస్తున్నాయి. ఎలాగైనా.. ఇక్కడ పాగావేయాలని.. బీజేపీ.. ప్రయత్నిస్తుంటే.. సిట్టింగ్ స్తానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ యుద్ధభూమిలో ప్రయోగాలు చేస్తోంది. ఇక, అధికార పార్టీకి ఈ …
Read More »చిరంజీవితో గంటా భేటీ.. పొలిటికల్ ఇంట్రస్టేనా?
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు.. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తాజాగా మెగా స్టార్ చిరంజీవితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లో గంటా శ్రీనివాసరావు.. చిరుతో భేటీ అయి.. అభినందించారు. అయితే.. ఈ సందర్భంగా.. వీరి మధ్య రాజకీయ ప్రస్తావన కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రాజకీయంగా …
Read More »జేసీ దివాకర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బీజేపీ
దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిందంటే చాలు దానివెనుక బీజేపీ హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిందిదే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ విచారించింది కాబట్టే. హైదరాబాద్ లో ఈడీ అధికారులు జేసీని సుమారు 8 గంటల పాటు విచారించారు. అశోక్ లేల్యాండ్ నుండి …
Read More »ఏపీలో సెంటిమెంట్ పిండే ఐడియా వేసిన బీజేపీ
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ ను విచిత్రమైన డిమాండ్ చేశారు. ఏపీలోకి అడుగుపెట్టేముందే కేసీయార్ క్షమాపణలు చెప్పాలట. ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కేసీయార్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వద్దామని అనుకుంటున్నారంటు నిలదీశారు. గతంలో తెలుగుతల్లి విగ్రహానికి చెప్పులదండ వేసి కాళ్ళు, చేతులు తొలగించిన వ్యక్తి కేసీయార్ అంటు మండిపడ్డారు. సరే రాష్ట్ర విభజన సందర్భంగా కానీ …
Read More »ఈ ప్రశ్నలకు కేసీఆర్ వద్ద ఆన్సరుందా?
కేసీయార్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపోతున్నారు. కేసీయార్ జాతీయ పార్టీ పై రాజకీయ పార్టీలు నెగిటివ్ గా స్పందించటం లేదు. బీజేపీ నేతలు మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కేసీయార్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ నేతలు మాత్రం సున్నితంగానే వ్యతిరేకతను తెలిపారు. సరే పార్టీ నేతలుగా ఎవరెలా స్పందించినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు విపరీతంగా …
Read More »