Political News

మ‌ళ్లీ కేకే…. కేక‌!

తాజాగా రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దేశ‌వ్యాప్తంగా 12 రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా నోటిపికేష‌న్ ఇచ్చింది. దీనిలో తెలంగాణ‌కు చెందిన కే. కేశ‌వ‌రావు(కేకే) కూడా ఉన్నారు. అదేవిధంగా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప్రాంతీయ‌, జాతీయ పార్టీల నాయ‌కులు కూడా ఉన్నారు. కేకే మిన‌హా మిగిలిన 11 మంది కూడా.. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటుకు …

Read More »

ష‌ర్మిల ఎందుకు ఒంట‌ర‌య్యారు? ఏం జ‌రుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఒంటరి అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన నాయకులతో కూడిన పార్టీగా ఇప్పటికీ గుర్తింపు ఉంది. ఏపీలో చాలామంది సీనియర్ నాయకులు ఇప్పటికి పార్టీకి అండగానే ఉన్నారు. వీరిలో పల్లంరాజు, రఘువీరారెడ్డి, శైలజనాథ్ అదే విధంగా కేంద్ర మంత్రులుగా పని చేసిన‌ వారు కూడా ఇప్పుడు ఈ కోవలోనే ఉన్నారు. అయితే వీరందరినీ కలుపుకొని …

Read More »

స‌తీమ‌ణికి చీర‌లు కొన్న చంద్ర‌బాబు.. కాస్ట్ ఎంతంటే!

సీఎం చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చీర‌లు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గ‌తంలో భువ‌నేశ్వ‌రి ఓ సంద‌ర్భంలో ..చంద్ర‌బాబు ఎప్పుడూ ప్ర‌జ‌లు, ప్ర‌జ‌లు అంటారే త‌ప్ప‌.. ఇంట్లో వాళ్ల‌ను ప‌ట్టించుకోర‌ని.. ఎప్పుడో పెళ్ల‌యిన కొత్త‌లో ఒక్క చీర కొన్నార‌ని, దానిని తాను భ‌ద్రంగా దాచుకున్నాన‌ని ఆమె చెప్పారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్ర‌బాబు చీరలు కొన‌డం …

Read More »

అదేంటో అధికారం పోయాకే.. ఇవ‌న్నీ గుర్తొస్తున్నాయి!

కొన్ని రాజకీయ పార్టీలను, కొంతమంది నాయకులను గమనిస్తే అధికారం పోయిన తర్వాత అనేక విషయాలు గుర్తుకొస్తున్న విషయం ఆసక్తిగా మారింది. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి వంటి విషయాలను పదేపదే మాట్లాడుతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ఏది తీసుకున్నా ప్రతిపక్షంలో ఉన్న మాజీ అధికార పక్షాలు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగాను వింతగా కూడా కనిపిస్తోంది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న జగన్ మోహన్ …

Read More »

కార్యకర్తల మీద జగన్ ఫీలింగ్ ఇదా?

గత పర్యాయం ఏకంగా 151 సీట్లతో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణాల్లో కార్యకర్తల కృషి ఒకటి. అదే పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిందన్నా దాని వెనుక కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవాలి. అంటే వాళ్లు పనిగట్టుకుని ఓడించారు అని కాదు. కార్యకర్తలను వైసీపీ సరిగా పట్టించుకోవడంతో గత ఎన్నికలకు ముందులా వాళ్లు కసిగా పని చేయలేదని.. ఈ పార్టీతో ఒరిగేది ఏముంది …

Read More »

ఏపీలో కొత్త లిక్క‌ర్ పాల‌సీకి ఓకే.. అస‌లేంటిది?

ఏపీలో కొత్త లిక్క‌ర్ పాల‌సీకి చంద్ర‌బాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని అక్టోబ‌రు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా అమ‌లు చేయ‌నున్నారు. నూత‌న మ‌ద్యం విధానం మేర‌కు ప్ర‌స్తుతం ఉన్న అన్ని ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల‌ను ఎత్తేయ నున్నారు. ఇదేస‌మ‌యంలో ప్రైవేటుకు అప్ప‌గిస్తారు. వాస్త‌వానికి ప్ర‌స్తుతం బార్లు మాత్ర‌మే ప్రైవేటు ఆధ్వ‌ర్యంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన లైసెన్సులు ఈ ఏడాది న‌వంబంరు-డిసెంబ‌రు వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. వీటిని …

Read More »

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సంచలన నిర్ణయం.. బెయిల్ పిటిషన్ వెనక్కి

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రూ.వంద కోట్ల ఈ స్కాం సంగతి ఎలా ఉన్నా.. దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కాంలో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతో …

Read More »

అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు క‌లిసి రానుంది. కీల‌క‌మైన ప‌నులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారుల‌ను ఒప్పించేందుకు.. ప్ర‌య‌త్నాలు చేస్తూ.. మ‌రోవైపు రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభించారు. గ‌త ఐదేళ్ల కాలంలో రాజధాని ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌ధాన‌మైన న‌వ‌న‌గ‌రాలు ప్రాంతం చిట్టి అడివిని త‌ల‌పిస్తోంది. అదేవి ధంగా చిన్న‌పాటి వ‌ర్షానికి కూడా అమ‌రావ‌తి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిల‌బ‌డి పోతోంది. దీంతో అస‌లు అమ‌రావ‌తి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందిక‌ర …

Read More »

వినేశ్ ఫొగట్ పై వేటు..రంగంలోకి మోదీ

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 50 కిలోల విభాగంలో ఫైనల్ కు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె బంగారు పతకం తేవడం ఖాయమని యావత్ భారతావని ఎదురుచూస్తోంది. అయితే, అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెపై ఐఓసీ వేటు వేసింది. దీంతో, ఆమె ఈ రోజు రాత్రి జరగాల్సిన ఫైనల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వినేవ్ ఫొగాట్ వేటుపై భారత్ …

Read More »

ఏపీ హోం మంత్రితో వివేకా కుమార్తె సునీత భేటీ

ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌లపూడి అనిత‌తో దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. అమ‌రావ‌తి స‌చివాల‌యంలోని రెండో బ్లాక్‌లో మంత్రి అనిత ఛాంబ‌ర్‌లో క‌లిసి కొద్దిసేపు చ‌ర్చించారు. వారి సంభాష‌ణ‌ల్లో వివేకా దారుణ హ‌త్య‌కు సంబంధించిన విష‌యాలే వినిపించా యి. డీజీపీ కార్యాల‌యంలో ఒక‌సారిక‌ల‌వాలంటూ సునీత‌కు హోం మంత్రి అనిత సూచించారు. తాను కూడా డీజీపీతో మాట్లాడాన‌ని అన్నారు. మొత్తంగా 20 నిమిషాల‌కు …

Read More »

జగన్ వచ్చారు.. వార్నింగ్ ఇచ్చారు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించ‌కూడ‌ద‌న్న ధోర‌ణితో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అందుకే అంద‌రినీ భ‌య పెట్టి పాల‌న చేస్తు న్నార‌ని మండిప‌డ్డారు. ఇదే కొన‌సాగితే.. చంద్ర‌బాబు స‌హా కూట‌మి ప్ర‌భుత్వం బంగాళా ఖాతంలో కూలిపోవ‌డం ఖాయ‌మ‌నం జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు భ‌య‌పెట్టి పాల‌న సాగించాల‌ని అనుకుంటున్నాడు. ఇదే చేస్తే.. ఇలాంటి ప‌నులే కొన‌సాగిస్తే.. …

Read More »

ఏపీ లో యూట్యూబ్ అకాడ‌మీ: చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే

ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ స్థాయి కంపెనీలు ఒక్కొక్క‌టిగా ఏపీకి వ‌స్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన‌ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత యూట్యూబ్ సంస్థ‌.. ఏపీలో అకాడ‌మీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. వాస్త‌వానికి చంద్ర‌బాబే ఆహ్వానించారు. దీంతో ఆ సంస్థ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీ హెడ్ సంజయ్ గుప్తాలు దీనికి సుముఖత వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో సీఎం చంద్రబాబు …

Read More »