ఏపీలో సీఎం జగన్ ఆస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, అరబిందో-హెటిరో ఛార్జ్షీట్లో బీపీ ఆచార్యపై సీబీఐ కోర్టు అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్థించింది. రఘురాం సిమెంట్స్ ఛార్జ్షీట్ కొట్టివేయాలన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం అభ్యర్థననూ తోసిపుచ్చింది. ప్రస్తుత దశలో సీబీఐ కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. …
Read More »బీజేపీలో పవన్ కలవరం.. ఢిల్లీకి కీలక నాయకుడు?
ఏపీ బీజేపీలో జనసేన పార్టీ విషయంపై కలవరం ప్రారంభమైందా? వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి ముందుకు సాగాలన్న రాష్ట్ర కమలనాథులు..ఎందుకు మథనపడుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు, తాజాగా ఓ కీలక నాయకుడు హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లిపోయారు. అయితే, అక్కడ నాయకులు అందరూ గుజరాత్ ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్నారు. అయినా, ఈయన మాత్రం అర్జంట్ చర్చించాల్సిన విషయం ఉందని పేర్కొంటూ ఫ్లైటెక్కడం గమనార్హం. ఇంతకీ …
Read More »ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీఆర్ఎస్దే అధికారం: జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి భారీ బాంబు పేల్చారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ నెంబరు 2 పొజిషన్లోకి వస్తుందన్నారు. మరోసారి సీఎం కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, టీఆర్ఎస్ గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న హైటెక్ డ్రామాలకు ఓట్లు రాలవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే అధికార పార్టీ టీఆర్ఎస్ మొదటి స్థానంలో, రెండో స్థానంలో …
Read More »ఏపీ సీఎస్గా జవహర్ రెడ్డి.. అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే టీటీడీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. కాగా, రెండు, మూడు రోజుల్లో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. అసాధారణ స్థాయిలో ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు పొందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన …
Read More »వైసీపీ మైండ్ గేమ్.. పార్టీల తర్జన భర్జన!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆడుతున్న మైండ్గేమ్.. ప్రతిపక్ష పార్టీలను తర్జన భర్జనకు గురి చేస్తోంది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే.. ఇంతలోనే వైసీపీ ఎన్నికల హడావుడిని ప్రారంభించేసింది. సీఎం జగన్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. ఆయన ప్రసంగాలు ఎన్నికలను తలపిస్తున్నాయి. నన్ను చూసి, నా పాలనను చూసి ఓటేయండి ఆయన పిలుపునిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఇలా …
Read More »షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. రీజన్ ఇదే!
ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న ఆమెను అరెస్టు చేయడంతో దీనిని నిరసిస్తూ.. ఆమె పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. …
Read More »‘మోడీకి చాడీలు చెప్పను, జగన్ తో నేనే తేల్చుకుంటా’
ఏపీలో వైసీపీని ఓడించడానికి ఎవరికో చెప్పి చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు, నా యుద్ధం నేనే చేస్తానంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇప్పటం గ్రామాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానమంత్రికి చెప్పి చేయనని, నా యుద్ధం నేనే చేస్తానని చెప్పారు. 2024లో వైసీపీ మళ్లీ ఎలా గెలుస్తుందో చూస్తామని ఆయన సవాల్ విసిరారు. నేను …
Read More »బీఆర్ఎస్ రాగానే ఐటీ రైడ్స్ వుండవట
ఇటీవల ఐటీ దాడులతో తీవ్రస్థాయిలో వార్తల్లోకి వచ్చిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఐటీ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఎంతైనా సంపాయించుకు నేందుకు హక్కుకల్పించడంతోపాటు.. సంపాయించుకున్నవారే టాక్సులు కట్టేలా కూడా సవరిస్తామని చెప్పారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి …
Read More »అమరావతి పై సుప్రీం కీలక తీర్పు
తాజాగా సుప్రీం కోర్టు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ఘాటుగా నే వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలను, కేబినెట్లను కోర్టులే నిర్ణయిస్తే.. కోర్టులే నిర్దేశిస్తే.. ఇక, ఆయా ప్రభుత్వాలు ఎందుకు ? అని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది మూడు రాజధానులకు అనుమతి ఇచ్చినట్టేనా? వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు కలలు కంటున్న మూడు రాజధానులకు సుప్రీం పచ్చజెండా ఊపినట్టేనా? అంటే.. కాదని అంటున్నారు న్యాయనిపుణులు. …
Read More »జగన్ ‘నవ్వులు’ పవన్ ఎటకారం మామూలుగా లేదుగా
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీ అంటూ వాగితే చెప్పు తెగుతుంది అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి నెల కిందట తీవ్ర పదజాలంతో ఘాటైన వ్యాఖ్యలు చేసిన దగ్గర్నుంచి పవన్ ఫైర్ మామూలుగా ఉండట్లేదు. మంచి పాయింట్లు పట్టుకుని.. జగన్ సహా ముఖ్య నేతల తీరును …
Read More »వరుస కాంట్రవర్సీలతో ఒంటరైపోయిన వైసీపీ నేత…!
వరుస వివాదాలు.. వైసీపీలో కీలక నాయకుడిని ఏకాకి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఆయనకు పార్టీ అధిష్టానం కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు. ఇక, జిల్లాలో అయినా.. నాయకులకుఆయనకు అసలు పడడం లేదని చెబుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు. తాజాగా ఆయనను పార్టీలోని జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. తర్వాత ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీనికి కారణం వరుస వివాదాలేనని అంటున్నారు లోకల్ నాయకులు. …
Read More »పవన్ ఇలా చేస్తే.. వైసీపీ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు
వచ్చే 2024 ఎన్నికలు హాట్ గురూ.. అంటూ ప్రచారంలో ఉన్నా తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణలు, మార్పులు చూస్తే.. మరోసారి వైసీపీకి అధికారం బంగారుపళ్లెంలో పెట్టి అందిస్తున్నారే! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానంటూ జనసేన అధినేత పవన్ గత కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జరగాలంటే.. కమ్యూనిస్టులు చెబుతున్నట్టు అన్ని పార్టీలు …
Read More »