Political News

పోల‌వ‌రంపై శ్వేత ప‌త్రం.. చంద్ర‌బాబు చెప్పిన నిజాలు!

నాడు వైఎస్ చేసిన త‌ప్పే జ‌గ‌న్ చేశారు పోల‌వ‌రంపై జ‌గ‌న్ అడుగడుగునా మాట మార్చారు జూన్‌-డిసెంబ‌ర్‌.. అంటూ ప్రాజెక్టును నాశ‌నం చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఫైర్‌ ఏపీ ప్ర‌జ‌ల సాగు, తాగు నీటి అవ‌స‌రాల‌కు కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం. అయితే. ద‌శాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండ‌డుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారింది. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. దీనిని పూర్తి చేస్తామ‌ని చెబుతోంది . …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కారుకు జ‌గ‌న్ ఫ్రెండ్‌ యార్ల‌గ‌డ్డ స‌ర్టిఫికెట్‌!

ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వానికి మాజీ సీఎం జ‌గ‌న్ స్నేహితుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ స‌ర్టిఫి కెట్ ఇచ్చారు. ‘మంచి నిర్ణ‌యం-శుభ‌ప‌రిణామం’ అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి.. చంద్ర‌బాబుతో విభేదించ‌డంలో యార్ల‌గ‌డ్డ ముందున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో అన్న‌గారు ఎన్టీఆర్‌తో క‌లిసి ప‌నిచేసిన యార్ల‌గ‌డ్డ .. అప్ప‌ట్లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. త‌ర్వాత కాలంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పంచ‌న చేరిన …

Read More »

బాబును క‌లిసిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌.. తెర‌వెనుక విష‌యం ఇదేనా?

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ ఏపీలో ప‌ర్య‌టిస్తున్నారు. శుక్ర‌వారం ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ నుంచి గ‌న్న‌వ‌రం చేరుకున్న ఆయ‌న.. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్య‌మంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ ఆయ‌న‌కు సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ రాధాకృష్ణ‌న్‌ను ఆయ‌న‌ సత్కరించారు. అనంత‌రం.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ …

Read More »

తిరుమలలో ఇష్టారాజ్యం నడిపించారు

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఉత్కృష్టం. ఈష‌ణ్మాత్ర‌(సెక‌నులో స‌గ‌భాగం) ద‌ర్శ‌నం ల‌భిస్తే.. చాల‌ని ప‌రిత‌పించే దేవ‌దేవుని భ‌క్తులు వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని మ‌రీ తిరుమ‌ల గిరుల‌కు క్యూ క‌డుతుంటారు. అంత డిమాండ్ ఉండే శ్రీవారి ద‌ర్శ‌నాన్ని వైసీపీ నాయ‌కులు రాజ‌కీయం చేసేశారు. త‌మ చేతికి ఎముక లేకుండా.. సిఫార‌సు లేఖ‌లు ఇచ్చేశారు. దీంతో వైసీపీ భ‌క్తులు.. లెక్క‌కు మిక్కిలి సంఖ్య‌లో శ్రీవారి ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. అయితే ఏంటి నొప్పి అనుకుంటున్నారా? …

Read More »

‘వైట్’ పేప‌ర్ వెనుక‌.. బాబు వ్యూహ‌మేంటి?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. వైట్ పేప‌ర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ప‌ని చేసిన తీరు.. అదేవిధంగా అమలు చేసిన ప‌థ‌కాలు.. తీసుకువ‌చ్చిన నిధులు.. అప్పులు వంటివి పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ప‌దేప‌దే.. ఈ విష‌యాలను చ‌ర్చించారు. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యేలా చేశారు. అయితే.. ఈ …

Read More »

గౌరవంగా సాగనంపుతున్నారు !

వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ, ఇన్నీ కావు. ఎన్నికల సమయంలో ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కమీషన్ పలువురు అధికారుల మీద చర్యలు తీసుకున్నా వారి స్థానంలో తిరిగి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారినే పోస్టింగ్ కోసం సిఫారసు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి …

Read More »

గన్ మెన్లు రిటర్న్ .. కూన తొందరపడ్డాడా ?!

“నాకు రక్షణగా గన్‌మెన్లు అవసరం లేదు. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశాను. ప్రజలతో నిత్యం ఉన్నాను. సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే నాకు మంచిది” అంటూ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిన మాటల వెనక అంతర్యం వేరే ఉందా ? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఆయన గన్ మెన్లను తిప్పిపంపిన వ్యవహారం ఇప్పుడు …

Read More »

బాబు-ప‌వ‌న్‌ ముచ్చ‌ట చూశాక‌ ప‌దేళ్లు ఖాయం అంటున్నారు!

రాజ‌కీయంగా విభిన్న ఆలోచ‌న‌ల నుంచి వ‌చ్చి.. చేతులు క‌లిపిన నాయ‌కులు ఎన్నాళ్లు అలా క‌లిసి ఉంటారో చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే.. ఎవ‌రి భావాలు వారివి. ఎవ‌రి ప్రాధాన్యాలు వారివి. అనేక మంది చేతులు క‌లుపుతారు.. అనేక మంది విడిపోతూ కూడా ఉంటారు. కానీ, ప‌ట్టుమ‌ని ప‌దేళ్ల‌యినా.. క‌లిసి ఉన్న పార్టీలు పెద్ద‌గా మ‌న‌కు క‌నిపించ‌వు. క‌నిపిస్తే మంచిదే. కానీ, ఇప్పుడు ఏపీలో చేతులు క‌లిపి. అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ-జ‌న‌సేన అధినేత‌ల …

Read More »

వైసీపీని టెన్ష‌న్‌లో పెట్టేసిన హైకోర్టు!

ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు కార్యాల‌యాల కూల్చివేత‌పై బెంగ పెట్టుకుంది. అన‌ధికారి కంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను నిర్మిస్తున్న నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం వాటిని కూల్చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో వాటిని క‌క్ష పూరితంగానే కూల్చేస్తు న్నార‌ని పేర్కొంటూ.. వైసీపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. అయితే.. కూల్చివేత‌ల‌కు.. ఒక్క రోజు విరామం ఇవ్వాలంటూ.. హైకోర్టు ఆదేశించింది. దీంతో గురువారం నాడు అధికారులు దూరంగానే ఉండిపోయారు. …

Read More »

అమరావతిలో రామోజీ విగ్రహం

‘నేను 2008లో తొలిసారి రామోజీరావు గారిని కలిశాను. రామోజీ రావు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీ వివరించారు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు …

Read More »

అమరావతికి ఈనాడు విరాళం రూ.10 కోట్లు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సంధర్బంగా ఆయన కుమారుడు కిరణ్ అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ సంధర్భంగా ఆయన ప్రసంగించారు.  ‘నాన్న గారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ …

Read More »

జగన్ ప్రభుత్వంపై కీరవాణి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్మరణ సభకు రాజకీయ, పాత్రికేయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ వేదికపై రామోజీరావు గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక రామోజీరావు అని కీరవాణి కొనియాడారు. రామోజీరావు లాగా ఒక్కరోజు …

Read More »