Political News

ఇటు రైతులు.. అటు ఏపీ ప్ర‌భుత్వం.. పాద‌యాత్ర నేటి నుంచే!

అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రాజధానిలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన‌ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసవెల్లి సూర్యదేవుని సన్నిధి వరకూ జరిగే యాత్ర కోసం రైతులు, రైతుకూలీలు ఉత్సాహంతో ఉన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే యాత్ర 60 రోజుల పాటు జరగనుంది. తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు.. అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని రైతులు చెబుతున్నారు. …

Read More »

ఏపీలో త‌హ‌సీల్దార్ల తిరుగుబాటు.. మంత్రుల ఖ‌ర్చుపై గరంగ‌రం

ఎవరైనా మంత్రి జిల్లాలో పర్యటనకు వస్తే ఎంతో హంగామా.. ఎన్నో ఏర్పాట్లు ఉండాల్సిందే. వాహనాలు, వచ్చిన వారికి భోజనాలు, కార్యక్రమం కోసం టెంట్లు, కుర్చీలు.. ఇలా ఎన్నో ఖర్చులు. ఒక్కో పర్యటనకు దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. వీటన్నింటికీ సొమ్మును స్థానిక రెవెన్యూ అధికారులే భరిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు భ‌రించాం.. ఇక మేం భ‌రించ‌లేం.. అంటూ వారు తిరుగుబాటు ప్ర‌ద‌ర్శించే ప‌రిస్థితి …

Read More »

బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నదా ?

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కీలకమైన నిర్ణయం ఏమిటంటే సీనియర్లందరినీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించాలనట. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను కూడా అసెంబ్లీ ఎన్నికల పోటీలోకి దింపాలని ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 119 అసెంబ్లీ …

Read More »

గుడివాడ గ‌రం గ‌రం.. మాజీ మంత్రి పెట్టిన మంట‌!

మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం అడ్డుడికిన‌ట్టు ఉడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప‌దుల సంఖ్య‌లో టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ స‌హా.. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గుడివాడ ప‌ట్టణం ఒక్క‌సారిగా గ‌రంగరం అయిపోయింది. రెండు రోజుల కింద‌ట‌.. కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై …

Read More »

మీ భేటీలు.. ఓట్లు రాల్చ‌వ్‌.. విప‌క్షాల‌పై బాంబు పేల్చిన పీకే

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనామోదం పొందాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయ‌ప‌డ్డారు. విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదని బాంబు పేల్చారు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడరాదని సూచించారు. బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా.. తెలంగాణ …

Read More »

మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? రాహుల్‌

Rahul Gandhi

ఎప్పుడూ గంభీరంగా ఉండే.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీలో సిగ్గు మొగ్గ‌లేసింది. అది కూడా అత్యంత కీల‌క‌మైన, సీరియ‌స్ కార్య‌క్ర‌మం భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న తెగ సిగ్గుప‌డిపోయారు. దీనికి కార‌ణం.. ఈ యాత్ర స‌మ‌యంలో అనూహ్యంగా రాహుల్ గాంధీకి పెళ్లి ప్ర‌స్తావ‌న రావ‌డ‌మే. అది కూడా మా అమ్మాయిని ఇస్తాం అంటూ.. త‌మిళ‌నాడు మ‌హిళ లు అనూహ్య‌మైన ఆఫ‌ర్ ఇవ్వ‌డ‌మే. దీంతో ఆయ‌న బిడియంతో కూడిన …

Read More »

ఆ హామీనే ఇపుడు జగన్ మెడకు చుట్టుకుందా ?

అనాలోచితంగా అప్పట్లో ఇచ్చిన హామీనే ఇపుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే సీపీఎస్ రద్దు. రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తింపచేసే పెన్షన్ పద్దతిని 2004లో కేంద్రప్రభుత్వం మార్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) బదులుగా కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చింది. అయితే కేంద్రం రాష్ట్రాలకు ఒక వెసులుబాటు ఇచ్చింది. అదేమిటంటే ఆయా రాష్ట్రాల పరిస్ధితులను …

Read More »

ఈ ఎంపీ ఆలోచనేంటో అర్ధం కావటం లేదే ?

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు ఏమిటో అర్థం కావటం లేదు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికను అడ్డంపెట్టుకుని పార్టీలో ఎంపీ నానా రచ్చ చేస్తున్నారు. రోజుకోరకంగా మాట్లాడుతు అందరినీ అయోమయంలో పడేస్తున్నారు. ఇదంతా తమ్ముడు, బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపు కోసమే వెంకటరెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లుందని అందరు అనుమానిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం పీసీసీ …

Read More »

కృష్ణంరాజు లాంటి నాయ‌కుడు మ‌ళ్లీ వ‌స్తాడా…?

అవును…! ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ ఏదైనా.. నాయ‌కుడు త‌న ప‌ద్ధ‌తిని మార్చు కోకూడ‌ద‌నే సిద్ధాంతాన్ని ఆచ‌రించి చూపించిన నేత‌గా.. గుర్తింపు పొందారు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న మ‌ధ్యలేరు. కొన్ని గంట‌ల కింద‌టే తుదిశ్వాస విడిచారు. ఒక్క సినీ రంగంలోనే కాకుండా.. రాజ‌కీయంగా కూడా కృష్ణంరాజు త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. 1990ల‌లో ఆయ‌న‌కు తొలిసారి రాజ‌కీయ అవ‌కాశం వ‌చ్చింది. అప్ప‌ట్లో కాంగ్రెస్ …

Read More »

కోస్తాలో ఇలా.. మిగిలిన చోట్ల అలా.. టీడీపీ నేత‌ల తీరిదే సారూ..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా.. కొత్త రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. గ‌తంలో అధినేత చంద్ర‌బాబు ప‌ట్ల విధేయ‌త ప్ర‌ద‌ర్శించే నాయ‌కులు ఉండేవారు. అదే సమ‌యంలో పార్టీకి గైడ్ చేసే నాయ‌కులు కూడా క‌నిపించేవారు. అయితే.. ఇప్పుడు సీనియ‌ర్లు ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఒక్క కోస్తా ప్రాంతంలోనే.. సీనియ‌ర్లుగా ఉన్న బుచ్చ‌య్య చౌద‌రి..య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. వంటివారు క‌నిపిస్తున్నారు. వీరు కూడా.. అడ‌పాద‌డ‌పా.. వ్యాక్య‌లు చేయ‌డం.. …

Read More »

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. ‘ఖ‌ర్చు’ రాజ‌కీయాలు

‘త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా!’ అన్న సామెత‌ను నిజం చేస్తున్నారు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై ఉద్యమం చేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆయ‌న భార‌త్ జోడో(భార‌త స‌మైక్య‌త‌) యాత్ర‌ను ప్రారంభించారు. 3500 కిలో మీట‌ర్ల మేర ఆసేతు హిమాచ‌లం పాద‌యాత్ర చేసి.. మోడీ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధ‌ర‌లు.. గ్యాస్ …

Read More »

వైసీపీ నేత‌ల‌ను ‘క‌దిలించే’ మంత్రం ఇదేనా..!

ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో నాయ‌కులు చెబుతున్న మాట ఇదే! ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ఎంత ఆదేశించినా.. ఎన్ని సార్లు హెచ్చ‌రించినా.. నాయ‌కుల మ‌ధ్య చైత‌న్యం క‌ల‌గ‌డం లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు సుప్త‌చేత‌నావ‌స్థ‌ను వీడ‌లేక .. నిద్ర‌బ‌ద్ధ‌కాన్ని వ‌దిలించుకోలేక పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నారు. మీరు జ‌నాల్లో ఉండ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఉండ‌ద‌ని.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కుల మ‌ధ్య చ‌ల‌నం …

Read More »