వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి శివారు ప్రాంతం చంద్రగిరి ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచిన చెవిరెడ్డి… ఆ తర్వాత జగన్ ఆదేశాల మేరకు చంద్రగిరిని తన కుమారుడికి వదిలేసుకుని తాను మాత్రం ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పరాజయాన్ని చెవిరెడ్డి ఫ్యామిలీ చవిచూసింది. …
Read More »జగన్ వ్యవహారంపై రాజకీయ రచ్చ.. ఎందుకీ ఆరాటం?!
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే రావడం లేదు. ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. పైగా.. కూటమి సర్కారు కూడా దీనిని లైట్ తీసుకుంది. ప్రజలు ఇవ్వనప్పుడు తాము మాత్రం ఎలా ఇస్తామని.. కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ పరిస్థితి డోలాయమానంలో పడింది. దీంతో అందివచ్చిన అవకాశం సద్వినియోగం …
Read More »గ్రామాల్లోనే టెంట్లు… వాటిలోనే పవన్ బస
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే… పవన్ రాజకీయం చాలా డిఫరెంట్ గానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆయన ప్రజల పట్ల మాట్లాడే తీరు గానీ, ప్రజా సమస్యలపై స్పందించే తీరు కూడా ఇతరులతో పోల్చితే టోటల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పక తప్పదు. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందన్నది ఈ సంక్రాంతి తర్వాత …
Read More »`బ్రాండ్ ఏపీ బిగిన్`: చంద్రబాబు
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపించే రంగాల్లో కీలకమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పాతిపెట్టిందని దుయ్యబట్టారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధి ఇచ్చేవారు కూడా నష్టపోయారని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే.. ప్రభుత్వానికి కూడా అన్ని రూపాల్లోనూ నిధులు సమకూరుతాయన్నారు. కానీ.. …
Read More »తప్పు జరిగిపోయింది.. ఇకపై జరగనివ్వం: బీఆర్ నాయుడు
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం అందజేతకు బోర్డు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను ప్రకటించిన నాయుడు…వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తాని తెలిపారు. …
Read More »జగనన్న కాలనీలు కాదు… మరేంటి!
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో నూతనంగా వెలసిన వైఎస్సార్ జగనన్న కాలనీల పేరును మారుస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలుగా జనాల్లో బాగానే ప్రచారం పొందిన ఈ కాలనీలను ఇకపై పీఏంఏవైై ఎన్టీఆర్ నగర్ లుగా పరిగణించాలని తీర్మానించింది. ఈ మేరకు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్ లుగా …
Read More »రఘురామను హింసించిన వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ?
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా పేరున్న తులసి బాబు ఇటీవల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజును గతంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… తమ కస్టడీలో ఆయన …
Read More »తిరుమల తొక్కిసలాటకు రీజన్ ఇదేనట
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం, 40 మంది దాకా భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు దారి తీసిన కారణాలేమిటన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే దేవదాయ శాఖ మంత్రి …
Read More »కాంగ్రెస్ ఒంటరి.. రాహుల్ సక్సెస్పై ఎఫెక్ట్!
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఉంది. మోడీ ప్రభావం, బీజేపీ దూకుడుతో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇక, అధికారం చేరువ అవుతుందన్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలైన పరిస్థితి కనిపించింది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అతి కష్టం మీద విజయం దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఈ క్రమంలోనే మోడీపై యుద్ధానికి …
Read More »పిఠాపురంలో పవన్ పర్యటన… రీజనేంటి?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి గురువారం రాత్రి వరకు ఆయన తిరుపతిలోనే ఉన్నారు. అక్కడ తొక్కిసలా ట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన శుక్రవారం ఉదయాన్నే.. పిఠాపురం పర్యటనకు వెళ్లడం గమనార్హం. ఈ పర్యటనలో ఆయన కీలకమైన రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే సంక్రాంతి సమయానికి గ్రామీణ …
Read More »టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు …
Read More »విపత్తుల్లోనూ విజన్.. తగ్గేదే లేదు అంటున్న చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగడం తెలిసిందే. ఆయన వేసిన బాటలు.. ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు.. కానీ, ఓ పదేళ్ల తర్వాత వాటి తాలూకు ఫలాలు, ఫలితాలు.. ప్రజలకు చేరువ అవుతాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో సైబరాబాద్, హైదరాబాద్లే ప్రధాన ఉదాహరణ. అప్పట్లో ఆయన వేసిన అడుగులు ఇప్పటికీ.. ప్రజలకు మేలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates