Political News

బిగ్ బ్రేకింగ్‌: అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం రెడీ

వైసీపీ ఎంపీ, యువ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు త‌మ్ముడు వ‌రుస అయ్యే.. వైఎస్‌ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును విచారిస్తున్న సీబీఐ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఇప్ప‌టికే ఆయ‌న‌కు నోటీసులు స్వ‌యంగా అందించింది. విచార‌ణ‌కు రావాల‌ని .. కోరింది. అయితే, ఆయ‌న మాత్రం ఐదు రోజుల పాటు గ‌డువు కోరారు. ఇది.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన విష‌యం. అయితే.. విదేశాల‌కు వెళ్లిపోయే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని …

Read More »

నమ్మిన బంటును జగన్ నట్టేట ముంచారా ?

జగన్ అధికారానికి రాగానే సీఐడీ ఏడీజీగా సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జగన్ చెప్పిందల్లా చేశారు. అత్యుత్సాహంతో ఆయన చెప్పని పనులు కూడా కొన్ని చేశారు. ఆయన తీరు రోజువారీగా వివాదాస్పదమవుతూనే ఉంది. సోషల్ మీడియా కేసులు, టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం , కోర్టు వరకూ వెళ్లడం వంటి అంశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలోనే సునీల్ కుమార్‌పై ప్రతిపక్షాలు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. అంతలోనే సునీల్ …

Read More »

బీజేపీ, సీపీఐపై పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్లు

ఏపీలో బీజేపీకి కేంద్ర నాయకత్వం అండ ఉంది. మోదీ, అమిత్ షా నిత్యం రాష్ట్ర నేతలతో టచ్ లో ఉంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని నూరు పోస్తుంటారు. జనసేన, బీజేపీతో పొత్తు వ్యవహారం ఇంకా కొలిక్కి రానప్పటికీ సొంత బలాన్ని కొంతైనా పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి గెలుస్తారా… అంత సీన్ ఉందా అంటే మాత్రం రాష్ట్ర బీజేపీ అధినాయక్వంలో ఆ విశ్వాసం లేదని …

Read More »

వివాదాలకు కేంద్ర బిందువుగా ఆ విశ్వవిద్యాలయం

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్… హెచ్సీయూ, ఈ పేరు తెలియని వారండరు. మూడు నాలుగు దశాబ్దాల క్రితం అక్కడ ప్రవేశాల కోసం విపరీతమైన పోటీ ఉండేది. చదువు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆ హెచ్సీయూ పేరును ప్రస్తావించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ అదీ. దేశ విదేశాల విద్యార్థులు వచ్చి అక్కడ చదువుతుంటారు. అంతలోనే సాఫ్ట్ వేర్ విప్లవం వచ్చి పడింది. ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చాయి. దానితో యూనివర్సిటీ కోర్సుల్లో …

Read More »

జనసేనలోకి కన్నా.. ఎంట్రీకి డేట్ ఫిక్సు?

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి.. ముందస్తుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారన్న ప్రచారం రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోంది. అదే సమయంలో ఎన్నికల వేళ.. హడావుడిగా పొత్తులకు పోకుండా.. ముందునుంచే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతుండటం.. అందుకు తగ్గ పరిణామాలు గడిచిన కొద్దిరోజులుగా చూస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తెలుగుదేశం …

Read More »

అనుష్టుప్ యాత్రకు వేళాయే..జనసైన్యం కదులుతోంది

కొండగట్టు పవన్ కల్యాణ్ కు ఓ సెంటిమెంటు. ఏ పనైనా కొండగట్టు నుంచి మొదలెడితే శుభం కలుగుతుందని పవర్ స్టార్ విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్.. తన వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు నిర్వహిస్తున్నారు. వారాహి అంటే అమ్మవారి శక్తిస్వరూపం. వారాహి అమ్మవారిని సప్తమాతృకల్లో ఒకామెగా, దశ మహావిద్యల్లో ఒకామెగా కొలుస్తారు. ఆమె వరాహ ముఖం కలిగి ఉండటంతో వారాహిగా పిలుస్తారు. వారాహి …

Read More »

టీడీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఇదే…!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో స‌ర్వేలు కామ‌న్‌. ఏ పార్టీకి ఆ పార్టీ స‌ర్వేలు చేయించుకుం టాయి. దీనిని ప్ర‌చారం చేసుకునేందుకు లేదా.. పార్టీ నేత‌ల్లో భ‌రోసాను నింపేందుకు పార్టీలు వినియోగిం చుకుంటాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. అలానే ఇప్పుడు అంత‌ర్గ‌త స‌ర్వేలు పుంజుకున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు టీడీపీ కూడా అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయిస్తున్నాయి. తాజాగా టీడీపీకి అత్యంత కీల‌క …

Read More »

బాబుకు పెద్ద చిక్కే!

క‌డ‌ప‌జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైదుకూరు. ఇక్క‌డ నుంచి పార్టీలు వేరైనా.. ఇద్ద‌రే వ్య‌క్తులు.. ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు.. గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. వారే.. డీఎల్ ర‌వీంద్రారె డ్డి, శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి. 1978 నుంచి ఈ ఇద్ద‌రే ఇక్క‌డ ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పుతున్నారు. టీడీపీ త‌ర‌ఫున శెట్టిప‌ల్లి 1985, 1999 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2014, 2019 ఎన్నిక‌ల్లో ఈయ‌న వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. మ‌రోవైపు.. డీఎల్ ర‌వీంద్రారెడ్డి …

Read More »

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

అంచనాలు తప్పలేదు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా తప్పదన్న రీతిలో సాగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే దారుణంగా హతమార్చిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆరోపణల పేరుతో ప్రచారం జరగటం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయటం …

Read More »

షర్మిలకు ఏమైంది? జోరు తగ్గింది.. పదును మిస్ అయ్యిందే?

అవకాశాలు ఉన్న చోట ప్రయత్నం చేయటం ద్వారా.. చాన్సుల్ని సొంతం చేసుకునే వీలు ఉంటుంది. అలాంటిది అవకాశం అన్న మాటకు కూడా ఛాన్స్ లేని చోట వచ్చి.. రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల తీరును కొందరు గొప్పగా అభివర్ణిస్తే.. మరికొందరు ఆమెను తీవ్రంగా తప్పు పడుతుంటారు. అయితే.. తన మీద విమర్శల్ని చేసేవారిని అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయే అలవాటున్న ఆమె..గడిచిన కొంతకాలంగా తన తీరుకు …

Read More »

వైసీపీ నేత కోసం.. నాగ‌బాబు త్యాగం!

అవును.. రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు వ్యూహాలు లేకుండా.. ముందు ఆలోచ‌న లేకుండా ఏ ప‌నినీ చేయ‌రు, చేయ‌బోరు. ఇది.. ఇప్పుడు జ‌న‌సేన‌లోనూ క‌నిపిస్తోంది.గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన పార్టీ కీల‌క నాయ‌కుడు నాగ‌బాబు తాజాగా.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని అన్నారు. అయితే.. దీనికి ముందు అంద‌రూ కూడా టీడీపీతో జ‌న‌సేన …

Read More »

లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ

కుప్పం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అభివృద్ధికి పర్యాయపదంగా నిలిచిన అసెంబ్లీ సెగ్మెంట్. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచే కుప్పం టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న విశ్వ ప్రయత్నం జరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనే ఓడించాలన్న ఉద్దేశంతో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి కుప్పం ప్రజల్లో చీలిక తెచ్చేందుకు సంకల్పించారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ …

Read More »