Political News

మాజీ ఎంపీ స‌హా వైసీపీ నేత‌ల అరెస్టు.. పార్టీలో క‌ల్లోలం!

ఏపీలో ఒక‌వైపు వ‌ర‌దలు మ‌రోవైపు.. వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే స‌మయంలో రాజ‌కీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసుపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు ఉరుకులు ప‌రుగులు పెడుతోంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వైసీపీ నాయ‌కుల‌ను గ‌త అర్థ‌రాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం …

Read More »

బొత్స‌కు బాధితుల సెగ‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. వ‌ర‌ద బాధితుల నుంచి భారీ సెగ త‌గిలింది. వ‌ర‌ద‌ల‌తో ముంచెత్తిన విజ‌య‌వాడ‌లో ప్ర‌జ‌లు ఆదివారం నుంచి ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం శాయ శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. స‌మ‌న్వ‌య లోపం కావొచ్చు.. అధికారుల తీరు కావొచ్చు.. మొత్తానికి బాధితుల‌కు సాయం అంద‌డం లేదు. అందినా.. కొంత మందికే అందుతోంది. దీంతో బాధితులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రీ …

Read More »

‘అయోమ‌యం’ జ‌గ‌న్‌.. సోష‌ల్ మీడియాకు భారీ ఫీడ్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ మాట్లాడినా.. స్క్రిప్టును క‌ళ్ల ముందు ఉంచుకుని చ‌ద‌వ‌డం తెలిసిందే. అయితే.. ఇటీ వ‌ల ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న అస‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేదు. వ‌చ్చినా.. ఏదో నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చాక‌.. జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లోనూ.. ఆయ‌న చూసే చ‌దివారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. కాగా.. జ‌గ‌న్ ఎప్పుడు మాట్లాడినా.. ఆ విష‌యాలు సోష‌ల్ …

Read More »

బుడ‌మేరు గండి – ఆర్మీ స‌రికొత్త ప్ర‌యోగం

విజ‌య‌వాడ‌లోని శివారు ప్రాంతాలు నీట మున‌గ‌డానికి కార‌ణ‌మైన బుడ‌మేరు వ‌ర‌ద‌ను అరిక‌ట్టేందుకు.. స‌జావుగా వాగు సాగేందుకు ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆర్మీ సాయం తీసుకుంటోంది. చెన్నై, విశాఖ‌, సికింద్రాబాద్ నుంచి వ‌చ్చిన 150 మందికి పైగా సైన్యం.. బుడ‌మేరు ప్రాంతంలో గండ్లు పూడ్చే ప‌నిని విడ‌త‌ల వారీగా చేస్తున్నారు. ప్ర‌ధానంగా బుడ‌మేరుకు మూడు గండ్లు ప‌డ్డాయి. వీటి నుంచే నీరు భారీ …

Read More »

చంద్ర‌బాబు ఒంట‌రి పోరాటం.. ఎందాకా ..!

75 ఏళ్ల వ‌య‌సు.. ముఖ్య‌మంత్రి హోదా.. వీటిని సైతం ప‌క్క‌న పెట్టి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మోకాల్లో తు నీటిలో తిరుగుతున్నారు. సాధార‌ణ ఎమ్మెల్యేనే మురుగు నీటిలోకి, వ‌ర‌ద నీటిలోకి అడుగు కూడా పెట్టేందుకు సందేహించే రోజులు ఇవి. ఇలాంటి స‌మ‌యంలో త‌న వ‌య‌సును, హోదాను కూడా ప‌ట్టించుకోకుండా.. ప్ర‌జ‌ల కోసం.. అర్థ‌రాత్రి, అప‌రాత్రి వేళ‌ల్లో కూడా.. చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌నే ముఖ్య‌మంత్రి నివాసం …

Read More »

నేడు లండ‌న్‌కు జ‌గ‌న్.. ఇదే జ‌రిగితే… !

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం లండ‌న్‌కు వెళ్లాల్సి ఉంది. ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు.. బ్రిట‌న్‌లో చ‌దువుతున్న విష‌యం తెలిసిందే. వీరిలోపెద్ద కుమార్తె పుట్టిన రోజు ఈ నెల‌లోనే ఉంది. దీంతో ఆయ‌న కుమార్తెల‌ను చూసేందుకు బ్రిట‌న్‌కు వెళ్లాల్సి ఉంద‌ని.. నెల రోజుల కింద‌టే హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమ‌తి తెచ్చుకు న్నారు. మొద‌ట అనుమ‌తి ఇవ్వ‌ద్దొని సీబీఐ త‌ర‌ఫున న్యాయ …

Read More »

రంగంలోకి 100 ఫైరింజ‌న్లు.. 2 వేల మంది సిబ్బంది: చంద్ర‌బాబు

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల‌ను బాగు చేసేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలిపారు. ఈ క్ర‌మంలో 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామ‌న్నారు. మురుగు కాల్వ‌ల్లో పూడిక తీత‌, రోడ్డ‌పై ఉన్న చెత‌ను తొల‌గించే ప‌నిని యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఇళ్ల లో పేరుకుపోయిన బుర‌ద స‌హా రోడ్ల‌పై పేరుకు పోయిన బుర‌ద‌ను …

Read More »

బాబు ఆరాటం.. ప్ర‌జ‌ల పోరాటం.. ఏం జ‌రుగుతోంది?

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునే విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఎంతో ఆరాట ప‌డుతున్నారు. నీట మునిగి పోయిన ప్రాంతాల్లో స్వ‌యంగా ఆయ‌నే ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రిస్తూ.. భ‌రోసా నింపుతున్నా రు. నేనున్నానంటూ.. ఆయ‌న బాధితుల్లో ధైర్యం నింపే ప‌నిచేస్తున్నారు. అర్ధ‌రాత్రి స‌మ‌యాల్లో కూడా టార్చ్ లైట్లు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. అంతేకాదు.. వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. కానీ, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల బాధ‌లు …

Read More »

బాబు సర్కారుకు సర్టిఫికేట్ ఇచ్చిన చినజీయర్

అధ్యాత్మిక అంశాలకు పరిమితమయ్యే స్వామీజీలు అప్పుడప్పుడు రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం చూస్తుంటాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి అంశంలోనూ సలహాలు ఇచ్చేసి.. ఆ తర్వాతి కాలంలో వార్తలకు కాస్తంత దూరంగా ఉంటున్నారు. ఇంతకూ ఆయన ఎవరో చెప్పలేదు కదా? ఆయనే.. త్రిదండి చినజీయర్ స్వామి. విజయవాడకు విపత్తు విరుచుకుపడి.. వరదలో వేలాది మంది చిక్కుకున్న నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు …

Read More »

ఇలా అడ్డంగా దొరికిపోతున్నారేంటి రోజా?

మనసుకు తోచినట్లుగా మాట్లాడే లగ్జరీ సామాన్యుడికి ఉంటుంది. ఎంత తోపు రాజకీయ నాయకులకైనా అలాంటి సౌకర్యం ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడిగా, నాయకురాలిగా ఉన్నప్పుడు వారి మీద అంతో ఇంతో బాధ్యత ఉంటుంది. మాజీ మంత్రి కం మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇలాంటి విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ.. లిమిటెడ్ గా రియాక్టు అవుతున్న రోజా.. బెజవాడ వరదలపై స్పందించాలని డిసైడ్ అయ్యారు. అదేమీ …

Read More »

హైకోర్టులో వైసీపీ నేతలకు షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైకాప నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో …

Read More »

ఏం జ‌రిగినా ఇంతే.. జ‌గ‌న్ మౌనం వెనుక‌.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ మౌనంగా ఉంటున్నారు. భూకంపం వ‌చ్చినా స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌నే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎక్క డా నోరు విప్ప‌డం లేదు. ర‌చ్చచేయ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మ‌రింత మంది ఈ బాట‌లో ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే.. జ‌గ‌న్ ఎక్క‌డా మీడియా ముందుకు రాలేదు. వెళ్లిపోయిన వారికి అది చేశాను.. ఇది చేశాను..అ ని కామెంట్లు చేయ‌లేదు. ఎక్క‌డా తొంద‌ర ప‌డ‌డం …

Read More »