Political News

కరణం వెంకటేశ్ వైపు మొగ్గిన బాలినేని ..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడింది. చీరాల స్ట్రాంగ్ మేన్ గా పిలిచే ఆమంచి కృష్ణమోహన్ , పరుచూరు ఇంఛార్జ్ పగ్గాలు చేపట్టి, చీరాల నుంచి వైదొలిగిన తర్వాత మిగిలిన నేతల్లో పోటీ పెరిగింది. వైసీపీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేశ్ తో పాటు, పోతుల సునీత సహా ఒకరిద్దరు నేతలు బరిలో ఉన్నారు. ఈ సారి బీసీ సామాజిక వర్గాలకు టికెట్ ఇచ్చే …

Read More »

ఐడియాలు కావ‌లెను.. వైసీపీలో వేలాడుతున్న బోర్డులు..!

అవును..! ఇప్పుడు వైసీపీకి ఐడియాలు కావాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గ‌ట్టెక్కించే నాయ‌కులు కావాలి. ప్ర‌స్తుతం ఉన్న ఐప్యాక్‌పై సీఎం జ‌గ‌న్ గుస్సాగానున్నార‌ని తెలుస్తోంది. విప‌క్షాల దూకుడును క‌ట్ట‌డి చేసేలా ఐప్యాక్ టీం.. దూసుకుపోయేలా వ్యూహాలు ర‌చించ‌లేక‌పోతోంద‌న్న‌ది వైసీపీ అధినేత మ‌నోగతంగా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న వ్యూహాలు పాత‌చింత‌కాయి మాదిరిగా ఉన్నార‌ని అంటున్నార‌ట‌. వీటివ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో కొత్త ఐడియాల‌కు ఆహ్వానం ప‌లు …

Read More »

రాజ్‌భ‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌.. ఈసారీ ర‌చ్చేనా?!

తెలంగాణ రాజ్‌భ‌వ‌న్ వ‌ర్సెస్ అధికార పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ల మ‌ధ్య మ‌ళ్లీ రాజ‌కీయ ర‌చ్చ ప్రారంభ‌మైందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండేళ్లుగా రాజ్‌భ‌వ‌న్‌కు, సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. త‌న‌కు వేతనం కూడా ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం ప్రొటోకాల్ కూడా ద‌క్క‌డం లేద‌ని.. ఇటీవ‌ల కూడా గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము పాల్గొన్న కార్య‌క్ర‌మంలో …

Read More »

మా ఉద్యోగాలు ప్రజాప్ర‌తినిధుల భిక్ష కాదు: బొప్ప‌రాజు ఫైర్‌

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉద్యోగుల‌కు హామీల‌ను తుంగ‌లో తొక్కుతున్నార‌ని.. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జీతభత్యాలు సకాలంలో రావడం లేదని.. ఈ విషయం ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రజాప్రతినిధుల దయ దక్షిణ్యాలతో ఉద్యోగాలకు రాలేదని, పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నామని అన్నారు. “ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలే అమ‌లు కావ‌డం లేదు. ఉద్యోగుల‌కు రావాల్సిన బ‌కాయిలు ఇవ్వ‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు విష‌యం తెలియాల్సి ఉంది. ఉద్యోగులు అడుగుతున్న గొంతెమ్మ …

Read More »

విజ‌య‌మ్మ వీడియోతో జ‌గ‌న్‌కు షాక్‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఈ నెల 27న యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. సుమారు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని 4 వంద‌ల రోజుల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ముసుగులో గుద్దులాట‌కు దిగింది. …

Read More »

ఆ నేత‌ల రాజకీయం ఏమైన‌ట్టు..? పొలిటిక‌ల్ గుసగుస‌!

ఎస్సీల హ‌క్యుల కోసం ఉద్య‌మించిన‌ ఉద్య‌మ‌కారులు.. కారెం శివాజీ.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. ఏమ‌య్యారు. ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. వారు ఎందుకు మౌనంగా ఉన్నారు. క‌నీసం తెర‌మీద‌కి కూడా రావ‌డం లేదు.. ఎందుకు? నిజానికి వీరిద్ద‌రు.. మంద‌కృష్ణ‌మాదిగ‌కు వ్య‌తిరేకంగా ఏ ప్ర‌భుత్వం ఉంటే.. ఆ ప్ర‌భుత్వాని కి అనుకూలంగా చ‌క్రం తిప్పుతున్న ప‌రిస్థితి ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో 2014-19 వ‌ర‌కు కూడా కారెం, జూపూడి ఇద్ద‌రూ కూడా …

Read More »

చంద్ర‌.. గిరి ఎక్క‌లేక పోతున్న ‘సైకిల్‌’ ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు. ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒక్క‌రే కుప్పం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీద‌క్కించుకుంది. అయితే ..ఇప్పుడు చంద్ర‌బాబుకు ప్రాణ‌సంక‌టంగా మారిన ఈ జిల్లాలో మ‌రోసారి వెలుగు వెల‌గాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ముఖ్యంగా టీడీపీని విమ‌ర్శించేవారికి చెక్ పెట్టాల‌నేది ఆయ‌న వ్యూహం. మ‌రీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గంగా ఉన్న‌వారిని చిత్తుచిత్తుగా ఓడించాల‌నేది చంద్ర‌బాబు క‌ల‌. ఈ …

Read More »

మంత్రిగారా మ‌జాకానా.. భూ ఆక్ర‌మ‌ణ‌లే కాదు.. దందాలు కూడా!!

వైసీపీ మంత్రి.. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నేత ఉష శ్రీచ‌ర‌ణ్ పై భూ కుంభ కోణం అభియోగాలు పెరిగిపోయాయి. కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గంప‌రిధిలోనే కాకుండా..జిల్లాలోని కీల‌క ప్రాంతా ల్లో కూడా మంత్రి అనుచ‌రులు, ఆమె కుటుంబ స‌భ్యులు చేస్తున్న దందాలు..ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. నిజానికి అధిష్టానానికి తెలిసి చేస్తున్నారో.. తెలియ‌కుండా చేస్తున్నారో.. తెలియ‌దు కానీ, వేల కోట్ల రూపాల్లోనే ఈ దందాలు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ‘జులాన్‌’ కంపెనీ …

Read More »

మైనారిటీలు వైసీపీకి దూర‌మ‌వుతున్నారా?

ఏపీలో మైనారిటీ వ‌ర్గం ఓట్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత తీసుకున్న చ‌ర్య‌లు, తీసుకువ‌చ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఆ వ‌ర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఈ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం జ‌గ‌న్ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో మైనారిటీ అభ్య‌ర్థుల‌కు ఇచ్చిన‌ స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. …

Read More »

పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి. కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ …

Read More »

పోల‌వ‌రంలో త‌మ్ముళ్ల ఫైట్‌.. సూప‌ర్‌!

ఏపీలో నిఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పోల‌వ‌రం. ఇక్క‌డ కాంగ్రెస్ సంస్థాగ‌త ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే 2004, 2009 వ‌రుస ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు దూకుడు, ఆయ‌న చేసిన వ‌స్తున్నా మీకోసం యాత్ర కార‌ణంగా ఇక్క‌డ పార్టీ పుంజుకుంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో మొడియం శ్రీనివాస‌రావు విజ‌యం ద‌క్కించుకు న్నారు. పార్టీ అధికారంలోకి రావ‌డంతో.. మొడియం …

Read More »

ఆ 22 మంది ఏమ‌య్యారు? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌!

మొత్తం 23 మంది నాయ‌కులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ సాగుతోంది. వారే .. 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంత‌కు చేరారు. స‌రే.. వీరిపై రాజ‌కీయ విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌నే అనుకున్నా.. వీరంద‌రికీ చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చారు. …

Read More »