విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. నాగరాజుపై కేసు కూడా నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే, సాయికృష్ణ కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించిన ఏపీ మాజీ సీఎం జగన్…ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు …
Read More »జనసేన తెలంగాణ ప్రస్థానం ప్రారంభం
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ కీలక అడుగు వేసింది. పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయం శుక్రవారం భాగ్య నగరి హైదరాబాద్ లో ప్రారంభమైంది. వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నగరంలోని మణికొండలో జనసేన తెలంగాణ శాఖ కార్యాలయాన్ని పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత …
Read More »కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల, రాజకీయంగా కూడా.. తాము లబ్ధిపొందాలని భావించిన వైసీపీకి చంద్రబాబు ఊహించని షాక్ ఇచ్చారు. విషయం ఏదైనా.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు రెడీగానే ఉంటాయి. అందునా.. ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోని వైసీపీకి ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ ఛాన్స్ కొట్టేయాలని చూస్తోందనే టాక్వినిపిస్తోంది. ఈ క్రమంలోనే …
Read More »పరశురాముడి రూపంలో రాహుల్ గాంధీ
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు చేయడం తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వివాదంలో నిలిచారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా పరశురాముడి రూపంలో రూపొందించిన చిత్రం, దానికి నిర్వహించిన పాలాభిషేకం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ జన్మదినాన్ని …
Read More »‘బాబు, పవన్లపై నమ్మకం ఉంది’
వైసీపీ చేస్తున్న రాజకీయాలకు చెక్ పెడుతూ.. విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ కుటుంబం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కుమారుడు ఎక్కడున్నా తీసుకురావాలని.. లేదా.. మృతదేహాన్నయినా.. అప్ప గించాలని కోరుకుంటున్నట్టు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామలు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు సంపూర్ణ సహకారం ఉందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమకు నమ్మకం ఉందన్నారు. తమకు జరిగిన అన్యాయం వేరే ఏ కుటుంబానికీ …
Read More »సాయికృష్ణ కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం
సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించే …
Read More »ఈ స్పీడు నాడేది… జగన్?
విజయవాడ యువకుడు సాయికృష్ణ మిస్టరీ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా ఆదేశించారు. ఒక ప్రభుత్వంగా ఎంత వరకు స్పందించాలో.. అంతవరకు ముఖ్యమంత్రి స్పందించారు. అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ నేత, మాజీ సీఎం జగన్.. వెంటనే …
Read More »సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే… ఈ వ్యవహారంలో వైసీపీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని అధికార కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. సాయి తల్లి విజయలక్ష్మిని ఆయన ఓదార్చారు. …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక సాధారణ రైతుపై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జైలు పాలవగా, ఆయనకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించనని శపథం చేసిన రైతు తన మొక్కు తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 2022 జనవరి 6న పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు …
Read More »‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి(బీహార్ కేడర్) సునీల్ నాయక్పై తీవ్రంగా మండిపడింది. సరెండర్ అవుతారా? లేక కేసులో వాదనలు కొనసాగిస్తారా? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఈ కేసులో అన్నీ తెలుసునని వ్యాఖ్యానించింది. తాజాగా సునీల్ నాయక్.. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు.. ఈ …
Read More »‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటుతో పోల్చిన పవన్ పై ఎందుకు కేసు పెట్టలేదని ఆమె నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించడం వల్లే పవన్ వంటి వారు రెచ్చిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. …
Read More »జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది. తాము అధికారంలోకి వస్తే…ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను క్రమానుగతంగా భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ… అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కగా… ఆ తర్వాత జాబ్ కేలండర్ అన్న మాట వైసీపీ నుంచి వినిపించ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates