నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి …
Read More »తన బాస్ ఎవరో చెప్పిన మోడీ
“ఆయనే నా బాస్. పార్టీలో నేను ఆయన కింద పనిచేస్తాను.“ అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా బీజేపీ ఈ ప్రకటన చేసింది. అనంతరం.. నితిన్.. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నితిన్ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. తన …
Read More »విచారణ వేళ విజయసాయి ట్వీట్… బీజేపీపై ప్రశంసలు!
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్ ద్వారా వైఎస్ జగన్ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. కోటరీల ప్రస్తావన ఇది తొలిసారి కాకపోవడంతో, ఆయన ఎవరిని ఉద్దేశించారన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ సాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ …
Read More »2 వారాల్లో తేలిపోనున్న వివేకా మర్డర్ కేసు?
ఎస్! నిజమే. ఇప్పటి వరకు దాగుడుమూతలుగా ఉన్న ఈ కీలక కేసులో రెండు వారాల్లో కీలక నిర్ణయం వెలుగు చూడనుంది. వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు విచారణ అనేక మలుపుల తర్వాత.. సీబీఐ చేపట్టింది. అయితే.. విచారణ పూర్తయినట్టుగా కొన్నాళ్ల కిందటే సిబీఐ కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. కానీ, తమకు అనుమానాలు …
Read More »కమలదళపతిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకారం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. బిహార్కు చెందిన 45 …
Read More »అసెంబ్లీలో రగడ… గవర్నర్ వాక్ అవుట్ !
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చారు. తొలుత తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపించగా, ఆ తర్వాత జాతీయ గీతాన్ని కూడా పాడాలని గవర్నర్ సూచించారు. అయితే సభ ప్రారంభంలో ‘తమిళ్ తాయి వాజ్తు’ మాత్రమే ఆలపించడమే …
Read More »ఆ 11 ఎమ్మెల్యేలను ఏం చేస్తారు?
వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై మరోసారి కథ మొదటికి వచ్చింది. అసెంబ్లీకి హాజరు కాకుండానే జీతాలు, భత్యాలు తీసుకుంటున్నారన్నది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై ఉన్న ప్రధాన ఆరోపణ. బయట నుంచి వచ్చి.. రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని.. సభా కార్యక్రమాలకు హాజరుకావడం లేదన్నది వైసీపీ ఎమ్మెల్యేలపై గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వ్యాఖ్యానించారు. ఒక్క జగన్ మినహా అందరూ వేతనాలు తీసుకుంటున్నారని.. మరికొందరు ప్రయాణ ఖర్చుల(టీఏ)ను కూడా తీసుకుంటున్నారని తెలిపారు. …
Read More »నైనీ వివాదంపై ‘సీబీఐ విచారణ’ కోసం డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుల మాటల దాడి ఆగడం లేదు. రెండు రోజుల కిందట బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్.. సీఎం రేవంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుగ్లక్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇక, తాజాగా అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు కూడా సీఎంపై విరుచుకుపడ్డారు. `ఔట్ సోర్సింగ్ సీఎం` …
Read More »డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. సీఎం సీరియస్
డీజీపీ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు. అంటే పోలీసులకు బాస్. క్రమశిక్షణకు, నైతికతకు పెద్దపీట వేయాల్సిన పోస్టు. పైగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఆదర్శంగా ఉండాల్సిన కార్యాలయం. కానీ అదే కార్యాలయం రాసలీలలకు, ముద్దు ముచ్చట్లకు వేదికగా మారింది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో వెంటనే చర్యలకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడ …
Read More »తెలంగాణలో టీడీపీకి రెడ్ కార్పెట్!
తెలంగాణలో టీడీపీకి రెడ్ కార్పెట్ పడిందా? ఇక, ఆ పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ పరంగా ఇప్పటి వరకు తెలంగాణలో పుంజుకునేందుకు ప్రయత్నించినా.. గతంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీలో బలమైన నాయకులు ఉండగా.. వారిని విభజించి.. పాలించు అన్నట్టుగా తన పార్టీలోకి తీసుకుంది. తెలుగు దేశం పార్టీ అంటే.. తెలంగాణకు వ్యతిరేక మన్న ప్రచారం చేయడం …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు షాక్
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ మాజీ …
Read More »‘దావోస్ మ్యాన్ చంద్రబాబు’… సీఎంకు ప్రశంస!
దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జ్యూరిచ్లో బిజీ బిజీగా గడిపారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లా తో సమావేశమైన ముఖ్యమంత్రి…ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీని ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates