పోస్కో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కొడుకు చేసిన తప్పునకు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘాటుగా …
Read More »ఢిల్లీలో పసుపు జండా రెపరెప..!
దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయని నాడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు ఆవేదనకు లోనయ్యారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి.. ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి పవర్ ఏమిటో చూపాలన్న కసితో సాగిన ఎన్టీఆర్… తెలుగు దేశం పార్టీ (టీడీపీ)పేరిట పార్టీని స్థాపించి సత్తా చాటారు. ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీ జెండా ఇప్పుడు ఢిల్లీ నడి వీధుల్లో …
Read More »అంబటి నోట ‘లవ్ క్యాష్’ మాట
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన బాట పట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ తో సోమవారం ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్న అంబటి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ పై విరుచుకుపడిపోయారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ …
Read More »కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణం, హాజరు కాని విజయ్!
కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీశన్తో పాటు 20 మంది మంత్రులతో కూడిన కొత్త కేబినెట్ కూడా ఒకేసారి ప్రమాణస్వీకారం చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కేరళ రాజకీయాల్లో కొత్త …
Read More »పోయే వాళ్లు పోండి: జగన్ దారిలో మమత?
రాజకీయాల్లో చింత చచ్చినా పులుపు చావదని అన్నట్టుగా కొందరు నాయకులు వ్యవహరిస్తారు. ఇలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం జగన్ ఒకరు. ఆయన పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా మార్పు రాకపోగా.. పార్టీలో ఉన్నవారిని కించపరిచేలా వ్యవహరించారన్న వాదన ఉంది. ఉంటే ఉండండి పోతే పోండి! అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో బలమైన నాయకులు పార్టీని వదిలేశారు. ఇప్పుడు.. జగన్ దారిలోనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, …
Read More »నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తు.. అదే అమరావతి
ఏపీ రాజధాని విషయంలో అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వాస్తవానికి ఏ నగరం అయినా.. నిర్మాణం పూర్తి చేసుకున్నప్పుడు.. దానికి సంబంధించిన ప్రచారం లభిస్తుందని తెలిపారు. కానీ, అమరావతి విషయంలో మాత్రం నిర్మాణ దశలో ఉండగానే.. రాజధానిపై దేశవ్యాప్తంగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు. నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తుకు రాజధాని అమరావతి నిలువెత్తు నిదర్శ నంగా ఉందన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోసం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన …
Read More »రజినీ ‘అసూయ’ కామెంట్… కమల్ ఏమన్నారు?
ఒకప్పుడు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్కు దరిదాపుల్లో నిలిచే హీరో ఇంకొకరు కనిపించే వారు కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బిజినెస్, వసూళ్ల విషయంలో ఆయన రేంజే వేరుగా ఉండేది. కానీ విజయ్ అనే హీరో చూస్తుండగానే.. ఇంతింతై అని ఎదిగిపోయి, సూపర్ స్టార్ను దాటేశాడు. ఇది రజినీ అభిమానులకు రుచించలేదు. రజినీ సైతం విజయ్ విషయంలో అసూయ చెందుతున్నాడా అన్నట్లు ఉంటోంది ఆయన వ్యవహార శైలి. ‘జైలర్’ ఆడియో …
Read More »`సైమి` వచ్చింది… సమస్య తీరిందా?
ఇరాన్పై జరుగుతున్న యుద్ధం(ప్రస్తుతం తాత్కాలిక విరామం ప్రకటించారు) కారణంగా పశ్చిమాసియా లోని కీలక ఇంధన రవాణా మార్గం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన దరిమిలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా వంట గ్యాస్ సమస్య అనేక దేశాలను ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇరాన్ ప్రతినిధులను దేశంలోకి అనుమతించింది. తద్వారా దౌత్య సంబంధాలు సడలకుండా చూసుకుంది. ఫలితంగా చమురు, గ్యాస్ రవాణా …
Read More »తనయుడి టీజర్లో తండ్రి నారా లోకేష్
రాజకీయ కుటుంబాలకు చెందిన వారసులు ప్రజల ముందుకు రావడం కొత్త విషయం కాదు. అయితే చిన్న వయసులోనే ఆసక్తికర అంశాన్ని ఎంచుకుని డిజిటల్ వేదిక ద్వారా ప్రేక్షకులను చేరుకోవడం మాత్రం కొత్త తరహా ప్రయత్నంగా కనిపిస్తోంది. నారా దేవాన్ష్ ప్రారంభించిన ‘డైనో డీట్స్’ యూట్యూబ్ ఛానల్ కూడా అలాంటి ప్రయత్నంగానే చర్చకు వస్తోంది. సాధారణంగా రాజకీయ వారసులపై ప్రజల్లో ఉండే అంచనాలకు భిన్నంగా.. డైనోసార్లు, శిలాజాలు, పురాతన ప్రపంచం వంటి …
Read More »చర్లపల్లి జైలుకు బండి భగీరథ్
ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ …
Read More »అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఎక్కడ?
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని.. ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్మించనున్నట్టు కూడా తెలిపింది. రెండో దశ భూ సమీకరణను కూడా విమానాశ్రయం కోసమే చేపట్టారు. ఇప్పుడు.. దీనిపై పక్కా క్లారిటీ ఇస్తూ.. ప్రభుత్వం మ్యాప్ను విడుదల చేసింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. తాడికొండ మండలం రావెల సమీపంలో ప్రతిపాదించారు. ఈ విమానాశ్రయం విజయవాడకు దక్షిణ దిశలో సుమారు 35 …
Read More »ఏపీ నుంచి పెద్దల సభకు అమిత్ షా శిష్యుడు?
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు టీడీపీ ఉంచుకుని.. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కేటాయించ నుంది. దీనిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తమిళనాడుకు చెందిన అన్నామలైని పెద్దల సభకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates