Political News

క‌విత‌కు లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌!

అన్ని దారులు మూసుకుపోయిన స‌మ‌యంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆమెను అక్రమంగా అరెస్టు చేశార‌ని బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కులు ఆరోపిస్తున్నారు. కాదు, స‌క్ర‌మంగానే అరెస్టు చేశామ‌ని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వాద ప్ర‌తివాదాల మ‌ధ్య సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్‌(జేడీ), జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌క్ష్మీనారాయ‌ణ ఎంట్రీ ఇచ్చారు. క‌విత‌కు ఏకంగా ఆయ‌న …

Read More »

ఈడీ అధికారుల‌పై కేటీఆర్ ఫైర్‌..

త‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయ‌డంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎలా అరెస్టు చేస్తారంటూ వారిని ప్ర‌శ్నించారు. ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీష్‌ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. చాలా సేపు వారిని అధికారులు ఇంట్లోకి అనుమ‌తించ‌లేదు. విచారణ ముగిసిన …

Read More »

టార్గెట్ రోజా.. తెల్ల‌వారితే టికెట్ ప్ర‌క‌టిస్తార‌న‌గా..

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మంత్రి రోజాకు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రిలో తీవ్ర సెగ త‌గులుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్నాళ్లుగా ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ.. ఐదు మండ‌లాల్లోని ఒక‌ప్ప‌టి ఆమె అనుచ‌రులు తీవ్ర స్థాయిలో ఉద్య‌మం చేస్తున్నారు. తాజాగా వీరు మ‌రోసారి ఎలుగెత్తారు. తెల్ల‌వారితే టికెట్ ప్ర‌క‌టిస్తార‌ని అన‌గా వారు మ‌రింత రెచ్చిపోయారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. …

Read More »

ఒక‌వైపు మోడీ రోడ్ షో.. మ‌రోవైపు.. క‌విత అరెస్టు.. ఏంటి సందేశం!

యాదృచ్ఛిక‌మా.. కావాల‌ని చేశారా?  అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో అడుగు పెట్టిన స‌మ‌యంలో ఇటు ఆయ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన‌(ఇప్పుడు కాదు) కేసీఆర్ త‌న‌య, బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారు లు అరెస్టు చేయ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించి.. ఆమెను నిందితు రాలిగా పేర్కొన్న అధికారులు.. అనేక సంద‌ర్భాల్లో విచారించారు. మూడు సార్లు ఆమెను …

Read More »

ఉరుములు లేని పిడుగు.. క‌విత అరెస్టు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత అరెస్ట‌య్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమె నిందితురాలిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు శుక్ర వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత వేగం పెంచారు. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చూచాయ కూడా లేకుండానే.. క‌విత ఇంటికి వ‌చ్చిన 12 మంది ఈడీ అధికారులు(వీరిలో ఢిల్లీ నుంచి …

Read More »

క‌మ్మ ఓట్లు గుండుగుత్త‌గా కాంగ్రెస్‌కే.. ఇదీ ఎఫెక్ట్‌!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను గుండుగుత్త‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో బ‌ల‌మైన అడుగు వేసింది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్మ ఓటు బ్యాంకు త‌ట‌స్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా క‌మ్మ ఓటు బ్యాంకు ప‌నిచేస్తోంది. అందుకే గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్‌లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ ఓట్టు …

Read More »

జగనన్నా.. ఒకసారి అద్దం ముందు నిల్చో..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ముఖ్యమంత్రి, అధికార వైఎస్సార్సీపీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మాటల దాడి తీవ్రమవుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులు జగన్ అండ్ కో మీదే వేళ్లెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా తనయురాలు సునీత.. తన తండ్రి హత్యలో జగన్, అవినాష్ రెడ్డి తదితరుల మీద తీవ్ర ఆరోపణలే చేశారు. తాజాగా వివేకా భార్య …

Read More »

అందరి చూపులు గంటాపైనేనా?

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇపుడందరి చూపులు మాజీమంత్రి, ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావుపైనే నిలిచింది. కారణం ఏమిటంటే టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవటమే కారణం. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చేసే అలవాటే ఇపుడు గంటాకు పెద్ద మైనస్ అయిపోయింది. స్ధిరమైన నియోజకవర్గం అంటు ఒకటి లేకపోవటంతోనే చంద్రబాబునాయుడు మాజీమంత్రిని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పోటీచేయమన్నారు. అక్కడినుండి పోటీ చేయడం గంటాకు ఇష్టంలేదు. చీపురుపల్లికి వెళ్ళలేరు, విశాఖ జిల్లాలో …

Read More »

పిఠాపురం పీట‌ముడి.. ఎవ‌రీ వ‌ర్మ‌.. ఎందుకీ ర‌గ‌డ‌!

పిఠాపురం.. ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. రెండు ర‌కాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై చ‌ర్చ సాగుతోంది. ఒక‌టి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌న్న మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌కు పిఠాపురం స‌మాధానం చెప్పింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న పోటీ చేసే స్థానంపై జ‌న‌సైనికులు.. ప‌వ‌న్ అభిమానులకు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక‌, రెండోది.. …

Read More »

వీర్రాజు పోటీ ఇక్కడేనా ?

Somu Veeraju

బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేసే అసెంబ్లీ సీటు ఖాయమైనట్లేనా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసిన విషయం తెలిసిందే. మూడుపార్టీల కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. టీడీపీ ఇప్పటికి 128 స్ధానాలను ప్రకటించింది. జనసేన అధినేత ఏడు నియోజకవర్గాలను ప్రకటించారు. బీజేపీ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఒక్క సీటును కూడా ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాల …

Read More »

 ఒక్క వీడియోతో దుమ్ము రేపిన ‘జ‌న‌సేన‌’

ఎన్నిక‌ల వేళ.. నాయ‌కులు చెప్పే ఒక్క మాట‌కైనా వాల్యూ ఎక్కువ‌గానే ఉంటుంది. అలాంటి ఒక్క వీడి యో విడుద‌ల చేసినా.. దాని ప‌వ‌ర్ వేరేగా ఉంటుంది. తాజాగా జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో దుమ్ము రేపుతోంది. షార్ట్ ఫిలిమే అయినా.. మాట‌లు.. మంత్రాలు, హామీలు లేక‌పోయినా.. ఈ వీడియో దుమ్ము రేపుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌నసేన పార్టీ కార్యాల‌యంలో గురువారం రాత్రి విడుద‌ల చేసి ఈ వీడియో …

Read More »

బీజేపీలో గందరగోళం పెరిగిపోతోందా?

బీజేపీ నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఈ గందరగోళం ఎందుకంటే టీడీపీ అధినేత ప్రకటించిన రెండోజాబితా విషయంలోనట. ఎందుకంటే తాము పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారట. అందుకనే చంద్రబాబు పొత్తుధర్మాన్ని పాటించటంలేదంటు గోలపెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము పోటీచేయాలని అనుకోవటం వేరు, తమకు కేటాయించిన నియోజకవర్గాలు వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోతున్నారు. పొత్తులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలి, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏమిటనే విషయంలో …

Read More »