Political News

జ‌గ‌న్ జ‌ట్టులో క‌ల‌వ‌రం.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ జ‌ట్టులో క‌ల‌వ‌రం పెరిగిపోయిందా? నేత‌ల నుంచి అధికారుల వ‌ర‌కు అంద‌రూ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఎత్తి చూపిస్తున్నారు. అంతే కాదు.. అధికారుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. టార్గెట్ అవుతున్నారు. అయితే.. ఇదేదో కొన్ని రోజులు ఉంటుంద‌ని అనుకున్నా.. త‌ర్వాత‌.. కూడా కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌నుల శాఖ అప్ప‌టి డైరెక్ట‌ర్ …

Read More »

ఐదు నెలల్లోనే దూకుడు.. వ‌చ్చే నాలుగేళ్ల మాటేంటి ..!

టీడీపీ అధినేత‌.. సీఎం చంద్ర‌బాబు ఐదు నెల్ల‌లోనే దూకుడు పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఐదు మాసాలే అయింది. ఇంత‌లోనే అనేక రూపాల్లో సీఎంచంద్ర‌బాబు త‌న స‌త్తా చాటుతున్నా రు. ఒక‌వైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేస్తూనే.. మ‌రోవైపు, పాల‌నా ప‌రంగా బ‌ల‌మైన సంకేతాలు ఇస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమం పేరుతో వేస్తున్న అడుగులు సామాన్యుల‌ను మ‌రింత‌గా బాబువైపు మ‌ళ్లేలా చేస్తున్నాయి. పింఛ‌న్ల పెంపుతో ప్రారంభ‌మైన చంద్ర‌బాబు పాల‌న‌.. ఇప్పుడు అమ‌రావ‌తి …

Read More »

కేసీఆర్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. హనుమకొండలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజే రుణమాఫీపై చర్చ పెడతామని, కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా? అని రేవంత్ …

Read More »

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలీదు

జ‌గ‌న్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. త‌మ్ముడి మ‌ర‌ణం త‌ర్వాత‌.. తొలిసారి అసెంబ్లీకి వ‌చ్చిన ఆయ‌న మంగ‌ళ‌వారం స‌భ‌లో చేప‌ట్టిన సాగునీట ప్రాజెక్టుల‌పై చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టునుతామే పూర్తి చేస్తామ‌ని ఈ స‌మయంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌కు ఆ అవ‌కాశం ఇచ్చేది లేద‌న్నారు. అదే …

Read More »

డబ్బులు లేవుగానీ ఆలోచనలు వున్నాయి

వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను నిధులు కూడా మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ల నిర్వహణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన …

Read More »

మాల్యా, నీరవ్‌లను అప్పగిస్తారా: మోదీ డిమాండ్

జీ20 సదస్సు సందర్భంగా బ్రెజిల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌తో కీలక సమావేశం జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా ఆర్థిక నేరగాళ్లపై దృష్టి పెట్టిన మోదీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులను భారత్‌కు అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా కాలంగా వారిని భారత్ కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ న్యాయపరమైన లుసుగులతో వారు అక్కడే ఉంటున్నారు. ఇక …

Read More »

మిస్సింగ్ కేసుల రచ్చ పై పవన్ స్పందన

ఏపీలో 30 వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. ఏపీలో 30 వేలకు పైగా మహిళలు మిస్సయితే వైసీపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రతకు …

Read More »

విచారణకు రావడం లేంటూ వర్మ వాట్సాప్ మెసేజ్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ సానుభూతిపరుడిగా ముద్రపడిన వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. నవంబర్ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని వర్మకు పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. కానీ, ఈ రోజు విచారణకు వర్మ గైర్హాజరైన వైనం …

Read More »

చంద్రబాబు అరెస్టుపై అట్టుడికిన అసెంబ్లీ

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ అరెస్టు దేశ రాజకీయాలలో సైతం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే చంద్రబాబును అరెస్టు చేశారని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై టీడీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో …

Read More »

శాస‌న మండ‌లిలో ‘పెద్ద‌రెడ్డి’ చిచ్చు!

ఏపీ శాస‌న మండ‌లి స‌మావేశాల్లో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, ప్ర‌స్తుత పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి పేరును మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ప్ర‌స్తావించ‌డం.. చిచ్చు రేపింది. భూముల పై జ‌రిగిన చ‌ర్చ‌లో మండ‌లిలో రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ స్పందిస్తూ.. భూముల అక్ర‌మాల‌పై ఉక్కుపాదంమోపుతామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల భూముల‌ను అడ్డంగా దోచుకున్న‌వారిని ఒక్క‌రిని కూడా వ‌దిలి పెట్ట‌బోమ‌ని తెలిపారు. ఈ స‌మ‌యంలో రెండు మూడు …

Read More »

సునీత పిటిష‌న్‌: అవినాష్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

వైసీపీ యువ నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫిబ్ర‌వ‌రి 24న అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఏం జ‌రిగింది? వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి.. మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో …

Read More »

శాస‌న మండ‌లిలో ‘రుషికొండ ప్యాల‌స్’ ర‌చ్చ‌

ఏపీ శాస‌న మండ‌లి బ‌డ్జెట్‌ స‌మావేశాల్లో మంగ‌ళ‌వారం ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ప్ర‌ధానంగా వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై నిర్మించిన ప్యాలెస్ వివాదం ర‌చ్చ‌గా మారింది. ఇటు ప్ర‌భుత్వం ప‌క్షాన ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్‌.. మరో మంత్రి అచ్చెన్నాయుడు ప్యాలెస్ నిర్మాణం విష‌యంపై నిప్పులు చెరిగారు. ఇదేస‌మ‌యంలో అటువైపు వైసీపీ స‌భ్యులు ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ‌ను నిర‌సిస్తూ.. స‌భ‌లో ఆందోళ‌న …

Read More »