Political News

బాబుకు బిగ్ రిలీఫ్‌.. ఒక్క‌రోజే 1200 కోట్ల రాక‌!

ఏపీలోని కూట‌మి స‌ర్కారును న‌డిపిస్తున్న‌ సీఎం చంద్ర‌బాబుకు శుక్ర‌వారం బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఒక్క‌రోజే 1200 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూరాయి. అయితే.. ఇదేదో అప్పుగానో.. లేక గ్రాంటుగా కేంద్రం నుంచో వ‌చ్చిన సొమ్ములు కావు. రాష్ట్ర ప్ర‌జ‌లు క‌ట్టిన సొమ్ములు. ఔను.. రాష్ట్ర‌ వ్యాప్తంగా శుక్ర‌వారం ఒక్క‌రోజే భూములు, పొలాలను రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌వారు క‌ట్టిన సొమ్ము. అది కూడా సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు …

Read More »

కేసీఆర్ రాకతో తెలంగాణ హీటెక్కింది

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే… శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారో… ఆ మరుక్షణమే తెలంగాణలో ఒక్కసారిగా హీట్ తారాస్థాయికి చేరింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టారు. …

Read More »

ఏపీకే ఆ 100 కోట్ల డ్రోన్ పెట్టుబడులు

భారత్ లో డ్రోన్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనూ ఏపీలోని కూటమి సర్కారు డ్రోన్ టెక్నాలజీకి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమరావతిలో డ్రోన్ టెక్నాలజీపై జాతీయ సదస్సును నిర్వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు..ఈ రంగానికి బూస్ట్ ఇచ్చే ప్రకటనలు చేశారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు 300 ఎకరాలను కేటాయిస్తూ కీలక ప్రకటన …

Read More »

పెమ్మసానిని అంబటి నిలువరించగలరా..?

ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికార, విపక్షాల మధ్య ఇప్పుడు రసవత్తర రాజకీయం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మునిసిపాలిటీలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలు కాగా… శుక్రవారం గుంటూరులోనూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. హిందూపురంలో చైర్ పర్సన్ పదవి కోసం టీడీపీ, వైసీపీల మధ్య పోరు సాగుతుంటే… గుంటూరులో కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా క్యాంపు రాజకీయీలు మొదలు కావడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉండగా …

Read More »

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయ్‌.. మొద‌లైన ప్ర‌క్రియ‌..!

ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల‌ను పెంచే క్ర‌తువు ప్రారంభం కానుంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. రాష్ట్రానికి మ‌రో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక‌, నియోజ‌క ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ప్ర‌కారం.. 5-8 పార్ల‌మెంటు స్థానాలు కూడా పెర‌గాల్సి ఉంది. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్నా.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. కానీ, పార్టీల‌కు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే.. త‌మకు ఇబ్బందులు …

Read More »

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు… కూటమి నేతలకు బాబు సూచన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 16347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే, అనుకోకుండా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయడంలో కాస్త జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. …

Read More »

నోరు జారి.. సారీ చెప్పిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకునేవారే. అయితే ఆ ముప్పును క్షణాల్లో గ్రహించిన ఆయన వెనువెంటనే తనను తాను సరిచేసుకుని వివాదానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. చాలా కాలంగా రాజకీయాల్లో సాగుతున్నా గానీ… ఎందుకనో రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తాను టార్గెట్ చేస్తున్న పార్టీలు, నేతలు ఎవరు?.. వారి ప్రయారిటీ ఏమిటన్న …

Read More »

ఫిబ్రవరిలో బహిరంగ సభ పెడుతున్నా: కేసీఆర్

బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాన్నాళ్ల తర్వాత తన గళాన్ని విప్పారు. 2023 ఆకరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనకు తెర పడిపోయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి చేరగా.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే ఎందుకనో గానీ… కేసీఆర్ చాలాకాలంగా బయటకే రావడం లేదు. ఎర్రవలిలోని తన ఫామ్ …

Read More »

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే… టీ కాంగ్ లో కొత్త రచ్చ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నిలుచుంటే…మరోవైపు మాజీ ఎమ్మెల్యే నిలుచుని బస్తీ మే సవాల్ అనే రీతిలో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వీరిలో ఒకరు మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ సీనియర్ నేత, మీడియా సంస్థ అధినేత గడ్డం వివేక్ వెంటకస్వామి ఒకరు కాగా… పార్టీలో మంచి మైలేజీ ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ …

Read More »

కేసీఆర్ సెక్ర‌టేరియెట్‌.. రేవంత్ ఉస్మానియా!

తెలంగాణ‌లో పేరొందిన చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాలు చ‌రిత్ర‌లో క‌లుస్తున్నాయి. వాటిస్థానంలో ప్ర‌భుత్వాలు పోటీ ప‌డి మ‌రీ కొత్త‌వి నిర్మిస్తున్నాయి. ద‌శాబ్దాలు, శ‌తాబ్దాల నాటి క‌ట్ట‌డాలు కావ‌డంతో కొంత మేర‌కు మార్పుల పేరుతో కొత్త‌వాటికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో కేసీఆర్ ఉమ్మ‌డి రాష్ట్రానికి చెందిన స‌చివాల‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఇంద్ర‌భ‌వ‌నం వంటి నూత‌న సచివాల‌యాన్ని నిర్మించారు. దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న ముందుకే వెళ్లారు. ఇక‌, ఇప్పుడు రేవంత్ …

Read More »

ఫుల్లు భరోసా!… రాష్ట్రపతి నోట పోలవరం మాట!

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక పథకాలను ప్రస్తావించారు. అదే సమయంలో పలు కీలక రాష్ట్రాలకు చెందిన కీలక అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సాగారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏపీ అంశానికి వస్తూ.. …

Read More »

‘స్టైల్’ చాల్లే!… ‘డ్రెస్ కోడ్’లోకి జగన్!

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించారు. గురువారం రాత్రి లండన్ లో ఫ్లైట్ ఎక్కిన జగన్ దంపతులు… శుక్రవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. దాదాపుగా 15 రోజులకు పైగా లండన్ లో సేదదీరిన జగన్… నిర్దేశిత గడువులోగానే తన పర్యటనను ముగించారు. ప్రస్తుతం బెంగళూరు చేరిన జగన్… విదేశీ ప్రయాణం బడలికను తీర్చుకుని ఫిబ్రవరి 3న నింపాదిగా తాడేపల్లి చేరుకుంటారట. …

Read More »