గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో తెలిసిందే. వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికలకు ముందే సంకేతాలు కనిపించాయి కానీ.. మరీ ఆ స్థాయిలో చిత్తవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీంతో కొన్ని నెలల పాటు ఈవీఎం మాయాజాలం అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. కార్యకర్తలను కూడా అదే రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. …
Read More »9552300009 నెంబర్తో ప్రభుత్వ సేవలు
ఏపీలో వాట్పాస్ గవర్నెన్స్ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కొత్త తరహా సేవలను ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రభుత్వం తరఫున అధికారిక వాట్సాప్ నెంబరును లోకేశ్ విడుదల చేశారు.ఆ నెంబరు 9552300009 గా లోకేశ్ ప్రకటించారు. ఈ నెంబర్ కు సందేశం పంపడం ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకుని పొందవచ్చని …
Read More »వర్మ వద్ద డబ్బుల్లేవట!… మరేటి సేత్తారు?
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు కొట్టిన దెబ్బ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా గట్టిగానే తగిలింది. అప్పటిదాకా తనను ఎవరూ ఏమి చేయలేరన్నట్లుగా టేకిట్ ఈజీగా సాగిన వర్మ… సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కూడిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు కొరడా ఝుళిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి తాను తీసుకున్న రూ.1.15 కోట్ల నిధులను తిరిగి …
Read More »నిన్నటిదాకా ‘ఒకే’ మార్గం… ఇప్పుడు ‘మూడు’ దారులు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. వీరిలో బీద మస్తాన్ రావు(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి(వైసీపీ) ఉన్నారు. ఏపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఈ ముగ్గురిని చూసినంతనే ఏపీ జనం వారి మార్గాలపై ఆసక్తికర పయనాల …
Read More »ఇదే జరిగితే.. వైసీపీ విశ్వసనీయత మాటేంటి?: పొలిటికల్ డిబేట్
రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని.. పెద్ద ఎత్తున యాగీ చేస్తున్న విషయం రెండు రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే.. తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …
Read More »అన్న క్యాంటీన్ లో కొత్త నిబంధన!… సూపర్ బాసూ!
అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు. ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా …
Read More »ఈసారి అబ్బయ్యతో కలిసి… వైల్డ్ లుక్కులో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ రేపటితో ముగియనుంది. కూతురి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం సతీసమేతంగా లండన్ వెళ్లిన జగన్… ఆ కార్యక్రమం తర్వాత ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. 15 రోజులకు పైగానే లండన్ లో పర్యటిస్తున్న జగన్.. ఆదిలో తన వేర్ అబౌట్స్ తెలియకుండానే జాగ్రత్త పడ్డారు. అయితే ఆ తర్వాత ఆయనకు చెందిన న్యూ లుక్ ఫొటోలు రోజుకు ఒకటి చొప్పున …
Read More »ఎవరీ తులసిబాబు?… ఇతడి స్టామినా ఏంటో తెలుసా?
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసిబాబు అనే పేరు పదే పదే వినిపిస్తోంది. ఇతడేమీ పెద్ద రాజకీయవేత్త కాదు. అలాగని బిజినెస్ మ్యాన్ కూడా కాదు. మరి సోషల్ వర్కరా? అంటే… కానే కాదు. మరెవరు? ఇతడి పేరు ఇంతగా ఎందుకు వినిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తులసిబాబు… సోమవారం పోలీసుల కస్టడీలోకి వెళ్లియారు. బుధవారం వరకు అతడిని పోలీసులు 3 రోజులు వరుసగా విచారించి తిరిగి జైలుకు తరలించారు. …
Read More »జగన్ తో కానిది… బాబుతో సాకారం
రాయలసీమ ముఖద్వారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం… ఇవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానం. జగన్ మాటలను నమ్మిన సీమ జనం 2019 ఎన్నికల్లో తమ ఓట్లన్నీ వైసీపీకే గుద్దేశారు. ఫలితంగా జగన్ సీఎం అయ్యారు. ఐదేళ్ల పాటు దిలాసాగా కాలం వెళ్లదీశారు. కర్నూలుకు హైకోర్టు ఏదీ అంటే.. అదిగో, ఇదిగో అంటూ చెప్పారే తప్పించి… …
Read More »లెక్కలతో జగన్ ను దొరకబట్టిన లోకేశ్
అదేంటో గానీ.. అధికారంలో ఉన్నంత కాలం దర్జాగా ఎంజాయి చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారం నుంచి దిగిపోయినంతనే ప్రతి చిన్న విషయంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ దొరకడం కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చేతికే ఆయన చిక్కిపోతున్నారు. వెరసి ఇలా జగన్ బుక్కైన ప్రతి సారి లోకేశ్ తనదైన శైలిలో వైసీపీ అధినేతపై …
Read More »7 నెలల కోసం… ఏపీ డీజీపీగా గుప్తా
ఏపీలో కూటమి సర్కారు బుధవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీసు శాఖ అధిపతి (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎల్లుండి (జనవరి 31)న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు డీజీపీగా గుప్తా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ …
Read More »10-15-30.. కుంభమేళా మృతులు.. తెలుగు వారు ఉన్నారా?
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న పవిత్ర మహాకుంభమేళాలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న తొక్కి సలాటలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో కొందరు మృత్యువాత పడ్డారు. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత.. సుమారు 5-6 గంటల పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు కూడా.. మౌనం వహించాయి. అసలు ఏం జరిగిందన్నది.. బాహ్య ప్రపంచానికి తెలిసినా.. యూపీ సర్కారు మాత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates