తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ కు కాల్ చేసిన మోదీ… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చోటుచేసుకున్న ప్రమాదంపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన రేవంత్ కు భరోసా ఇచ్చారు. ఇందుకోసం …
Read More »బ్రేకింగ్ : అసెంబ్లీకి రానున్న వైఎస్ జగన్!
ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న వైసీపీ. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చేశారు. రానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ తరఫున అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఆయన ఆదేశాలు జారీ …
Read More »పవన్ మాదిరే కృష్ణ తేజదీ గొప్ప మనసే!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ది ఎలాంటి మనస్తత్వమో తెలుసు కదా. ఆపదలో ఉన్నారని తెలిస్తే… ప్రభుత్వమే వచ్చి వారిని ఆదుకోవాలని ఆయన అనుకోరు. తనకు చేతనయినంత సాయం చేసి ఆపదలో ఉన్న వారికి తక్షణ వెసులుబాటు కల్పించడంతో పాటుగా వారిలో బ్రతుకుపై భరోసా నింపుతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉంటే… ఆయనకు పర్సనల్ సెక్రటరీ హోదాలాో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ తెలుసు కదా. కేరళ …
Read More »తగ్గేదే లే.. ఇక పై ‘ఎక్స్’ నా స్టేజీ: పృథ్వీరాజ్
టాలీవుడ్ లో థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ తో సాగుతున్న హాస్య నటుడు పృథ్వీరాజ్ రాజకీయ విమర్శలు చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్నారు. ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం లైలా ప్రీ రిలీజ్ వేడుక వేదికపై మాట్లాడిన పృథ్వీరాజ్.. ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ సెటైరిక్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తానో పాత్ర చేస్తున్నానని, తనకు ఇద్దరు …
Read More »‘ద కారవాన్’ కవర్ పై చంద్రబాబు రాజసం
నిజమే… ఎవరు ఔనన్నా… ఎవరు కాదన్నా కూడా చంద్రబాబు రాజకీయ పరంపర ఏ ఒక్కరు నిలువరించలేనిదే. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే… చంద్రబాబు లెగసీ ముమ్మాటికీ అన్ స్టాపబులే. ఎఫ్పుడో 1977లో రాజకీయ తెరంగేట్రం చేసిన చంద్రబాబు… 45 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ ఇంకా సత్తా చాటుతున్నారు. అటు రాజకీయంగానే కాకుండా ఇటు పాలనలోనూ చంద్రబాబు తనదైన మార్కుతో సాగిపోతున్నారు. …
Read More »బాబు ఫోకస్ : అమరావతి పనులు ఎందాకా వచ్చాయ్.. ?
రాష్ట్ర రాజధాని అమరావతి మాట గత ఏడాది డిసెంబరు వరకు రోజూ మీడియాలో వినిపించింది.. కనిపించింది. డిసెంబరు మూడో వారంలో పనులు ప్రారంభిస్తున్నారని.. పనులు వడివడిగా ముందుకు సాగి 2027-28 నాటికి రాజధానికి ఒక రూపం తీసుకువస్తామని మంత్రి పొంగూరు నారాయణ పదే పదే చెప్పారు. ఇక, జనవరి తొలి వారంలో కూడా ఇదే ప్రకటన చేశారు. మరోవైపు సీఆర్ డీఏ కూడా.. పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు …
Read More »కేంద్రమంత్రికి విరిగిన సీటు వేసిన ఎయిర్ ఇండియా
ఇప్పుడు నేషనల్ మీడియాలో ఓ అంశంపై పెద్ద రచ్చ నడుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఎయిర్ ఇండియా తన విమానంలో విరిగిన కుర్చీని కేటాయించిందట. ఇప్పుడైతే కేంద్ర మంత్రి గానీ… గతంలో చౌహాన్ చాలా కాలం పాటు మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మిస్టర్ క్లీన్ నేతగా అందరి మన్ననలు అందుకున్న చౌహాన్.. ఎయిర్ ఇండియా తనకు …
Read More »బెంగళూరుకు జగన్.. వైసీపీకి మళ్లీ రెస్టే.. !
వైసీపీ అధినేత జగన్.. అలా రెండు పర్యటనలు ముగిశాయో లేదో.. ఇలా బెంగళూరుకు వెళ్లిపోయారు. విజయవాడలో తన పార్టీ నాయకుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ వెంటనే మరుసటి రోజు.. గుంటూరు మిర్చియార్డును సందర్శించారు. రైతుల కష్టాలు తెలుసుకున్నారు. దీంతో ఇక, తమ నాయకుడు.. నిత్యం ప్రజల్లోనే ఉంటారని.. ప్రజల సమ్యలు వింటారని.. రోజూ యాత్రలే నని వైసీపీ ముఖ్యులు భావించారు. ఇదే కొనసాగితే.. …
Read More »ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జనానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల మొత్తాలను పెంచిన చంద్రబాబు… ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. విద్యుత్ చార్జీలను పెంచేది లేదని చెప్పిన మాటను కూడా చంద్రబాబు సర్కారు రెండు రోజుల క్రితమే అమలు చేసి చూపింది. తాజాగా పట్టణ ప్రాంత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన చెత్త పన్ను వసూళ్లను పూర్తిగా …
Read More »జైలుకెళ్లే టైముంది కానీ.. కోర్టుకు వచ్చే సమయం లేదా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో వివాదం రేకెత్తింది. తనది కాని కేసుల్లో అరెస్టైన నిందితులను జైలుకు వెళ్లి కలిసేందుకు ఆసక్తి చూపుతున్న జగన్… తన విషయంలో నమోదు అయిన కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తనపై నమోదు అయిన కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఎంతమాత్రం ఆసక్తి చూపని జగన్.. తన రాజకీయాలకు పనికొస్తుందన్న భావనతో జైలులో …
Read More »టెస్లా కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు అండ్ కో
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత విఫణిలోకి అడుగు పెడుతోంది. భారత భూభాగంపై టెస్లా కార్ల తయారీకి కొంత సమయం పట్టినా… ఆ సంస్థ విదేశాల్లో తయారు చేస్తున్న వాహనాలు త్వరలోనే భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ముంబైలోనూ టెస్లా షోరూమ్ ల ఏర్పాటు అప్పుడే ప్రారంభమైపోయింది. ఈ షోరూమ్ ల సిబ్బంది …
Read More »ఇంత చిన్న వివాదం కూడా బాబే పరిష్కరించాలా!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పాలక మండలి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలనాపాలనతో పాటు స్వామివారి దర్శనార్థం వస్తున్న లక్షలాది మంది భక్తులకు సరిపడ సౌకర్యాలను అందించేందుకు ఏర్పాటు అయిన సంస్థ. ప్రపంచంలోని అత్యున్నత ధార్మిక మండళ్లలో టీటీడీ కూడా ఒకటని చెప్పవచ్చు. ఇలాంటి అత్యున్నత స్థాయి మండలిలో సభ్యులుగా కొనసాగుతున్న వారు ఎలా ఉండాలి? రాగద్వేషాలకు అతీతంగా… ఎంతో ఓర్పు, నేర్పుతో వ్యవహరించే వారు అయి ఉండాలి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates