వరిస్తూనే ఉంటుంది. ఏపీ విపక్షం తెలుగుదేశం పని కూడా ఇప్పుడు అలానే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా క్లీన్ స్వీప్ చేశారో లేదో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయభేరీ మోగించారు. వైసీపీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించడమే విపక్ష పార్టీ గ్రేట్ సక్సెస్.. విజయం తెచ్చిన జోష్ ఇప్పుడు టీడీపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందే డిసైడ్ చేసుకున్న ఇద్దరు కాకుండా …
Read More »గెలవక పోతే.. రాజకీయాలు వదిలేస్తా
నెల్లూరులో వైసీపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ కీలక ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలపై పార్టీ అధిష్టానం వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో వారంతా ఖండించారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఎలా నిర్ధారించారని ఆనం ప్రశ్నించారు. ఇక, కోటంరెడ్డి..తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. మంచి పనిచేశారని వ్యాఖ్యానించారు. మొత్తంగా నేతల నోటి …
Read More »రాహుల్ ఎఫెక్ట్: మూడు పార్టీలపైనా కేవీపీ ఫైర్..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం.. ఆయనపై కేసు.. కోర్టు తీర్పుల నేపథ్యంలో పలు పార్టీలు రాహుల్కు అండగా నిలిచాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలు కూడా రాహుల్కు అనుకూలంగా మారాయి. అయితే.. ఏపీ నుంచి మాత్రం ఎవరూ ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ కీలక నేత, వైఎస్ ఆత్మగా పేర్కొనే కేవీపీ రామచంద్రరావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీకు ఏమైంది? …
Read More »సీఎం ఢిల్లీ టూర్లు..తగ్గుతున్న సీబీఐ జోరు..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. పక్షం రోజులు తిరగకముందే ఆయన హస్తిన బాట పడుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సు ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్తున్నారు.మనం పక్క వీధికి వెళ్లినంత సులభంగా జగన్ హస్తినకు చేరుకుంటున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలపై అనేక ఊహాగానాలు, విమర్శలు తలెత్తున్నాయి. గత సారి ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాతే వివేకా కేసులో సీబీఐ దూకుడు తగ్గించిందని కొందరు విశ్లేషిస్తున్నారు.. ఈ …
Read More »మగవారు పోరంబోకులు.. – మంత్రి ధర్మాన వివాదాస్పద కామెంట్స్
‘మగవారు పోరంబోకులు.. తినేసి వెళ్లిపోతారు’ అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలోని కిల్లిపాలెం, హడ్కో కాలనీలో రెండు చోట్ల మహిళలతో సమావేశం నిర్వహించి మరీ మగవారిని పోరంబోకులంటూ విమర్శించారు. మంత్రి మాట్లాడుతూ ‘మగవాళ్లు పోరంబోకులు. బాగా తిరిగేసి వస్తారు. తినేసి వెళ్లిపోతారు. ఇలా అంటున్నప్పుడు కొంతమంది చప్పట్లు కొడుతున్నారంటే అంగీకరించినట్లే. ఆ పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదన్నదే జగనన్న …
Read More »అంతుపట్టని పవన్ అంతరంగం
జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు.. ఇప్పుడాయన ఏం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేనను ఆయన ఎలా సమాయత్తం చేస్తున్నారు. పొత్తులు ఉంటాయా.. ఒంటరిగా పోటీ చేస్తారా.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ పదవ ఆవిర్భావ సభ తర్వాత జనసేనలో ఎలాంటి రాజకీయ కదలిక కనిపించలేదు. వారాహి టూర్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ …
Read More »ఏపీలో మురికి వాడలకు పరదాలు.. రీజన్ ఇదే!
ఏపీలో సీఎం జగన్ ఎక్కడకు వెళ్లినా.. పరదాలు కడుతున్నారని.. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. జగన్ ఎక్కడ పర్యటన పెట్టుకున్నా.. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో పరదాలు కడుతున్నారు. అదేసమయంలో రోడ్లపై చెట్లు నరికేస్తు న్నారు. ఈ చర్యలపై ప్రజాస్వామ్య వాదులు.. ప్రతిపక్ష నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే..ఇప్పుడు ఏకంగా మురికి వాడలకు కూడా..భారీ ఎత్తున పరదాలు కట్టేస్తున్నారు. …
Read More »అమరావతి ఆగింది కాబట్టి.. మనమే ముందున్నాం
ఏపీ అమరావతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెట్రో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ప్రస్తుతం హైదరాబాద్ ముందు ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే 7000+ స్క్వేర్ కిలోమీటర్ల పరిదిలో హైదరాబాద్ అభివృద్ది చెందుతోందన్నారు. అయితే.. ఈసందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో హైదరాబాద్ …
Read More »ఈసారి మహానాడు… అదిరిపోయే సెంటిమెంటు!!
టీడీపీ ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే పార్టీ ఆవిర్భావ సదస్సు.. మహానాడును ఈ సారి రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం మేరకు.. వచ్చే మేనెలలో నిర్వహించే ఈ మహానాడుకు రాజమండ్రి వేదిక కానుంది. అయితే.. దీనివెనుక పెద్ద సెంటిమెంటు ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజమండ్రిలో గతంలో నిర్వహించిన మహానాడు అనంతరం.. వచ్చిన ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చిందని.. అదే సెంటిమెంటును …
Read More »మహారాష్ట్ర సరే ఆంధ్రప్రదేశ్ మాటేమిటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి చాలా రోజులైంది. పార్టీ విస్తరణపై వరుస ప్రకటనలు చేసి కూడా చాలా రోజులైంది. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర నుంచి జనం వచ్చి చేరి కూడా నెలలు గడిచాయి. ఇప్పుడు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అక్కడి నాందేడ్ లో రెండో సారి బహిరంగ సభను నిర్వహించారు. మహారాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్ల పోటీ చేస్తుందని ప్రకటించడం ద్వారా …
Read More »అమరావతి కేసు.. సర్కారుపై సుప్రీం ఆగ్రహం
అమరావతి రాజధాని విషయంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఎందుకంత తొందర పడుతున్నారు? దానిలో మీ వ్యక్తి గత ప్రయోజనాలు లేవుకదా.. ఉంటే చెప్పండి!” అని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులనుఉద్దేశించి.. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో మంగళవారం అమరావతి కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసుకు …
Read More »కొత్తగూడేనికి కొత్త నాయకుడొస్తారా?
కోవిడ్ టైంలో లైమ్లైట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్కు కాళ్లు మొక్కడం నుంచి హరీశ్ రావుకు అహర్నిశలూ భజన చేయడం వరకు ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. ఈ ప్రయత్నాలలో ఆయన మిగతా టీఆర్ఎస్ నేతలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కొందరు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది. తాజాగా ఆయన కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడిన మాటలపై వనమా నాగేశ్వరరావు వర్గం నుంచి …
Read More »