ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో కొన్ని కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన, బీజేపీ నాయకులకు కూడా ఇచ్చారు. అయితే.. ఎన్నికలకుముందు ఆయా పార్టీల తరఫున బలంగా పోరాటం చేసిన వారికి.. వైసీపీపై పోరాడి కేసులు ఎదుర్కొన్న వారికి కీలక పదవులు కట్టబెట్టారు. అదేవిధంగా ఫైర్ బ్రాండ్స్గా పేరు తెచ్చు కున్నవారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. …
Read More »రీజనబుల్ టైం అంటే ఎంతకాలం.. ?
రీజనబుల్ టైం అంటే.. ఎంతకాలం? ఈ ప్రశ్న వేసింది సామాన్య వ్యక్తులు కాదు. సామాన్య సంస్థలు కూడా కాదు. సాక్షాతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నుంచి ఈ ప్రశ్న వినిపించింది. ఈ ప్రశ్న తెలంగాణకు చెందిన ఓ పిటీషన్ విచారణ సందర్బంగా వినిపించడం గమనార్హం. ఈ ప్రశ్నకు నీళ్లు నమిలిన ప్రాసిక్యూషన్ లాయర్ ఫై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి సమాధానాలను అనుమతించబోమని కూడా …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు…? రోజాకు షాకేనా?
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన వైసీపీలోకి ఇప్పుడు కొత్త చేరికలు ఊపందుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవలే పీసీసీ చీఫ్ గా పనిచేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలోకి మరో కీలక నేత చేరబోతున్నట్టు సమాచారం. ఈ నేతకు ఇప్పటిదాకా పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా… రాజకీయంగా మంచి ప్రాబల్యం ఉన్న కుటుంబానికి చెందిన ఈ నేత వాళ్ళ పార్టీకి మంచి …
Read More »‘రాయల్’ ఉదంతంలో నయా ట్విస్ట్… లక్ష్మి అరెస్ట్
జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ చేతిలో మోసపోయానంటూ బయటకు వచ్చిన లక్ష్మి అనూహ్య పరిణామాల మధ్య సోమవారం అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ కు చెందిన జైపూర్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి తరఫు వారు ఎందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా జైపూర్ పోలీసులు సమాధానం ఇవ్వకుండానే లక్ష్మిని తమ వెంట తీసుకెళ్లారు. రాయల్ ఫై ఆరోపణలు చేసిన …
Read More »‘చిలుకూరు దాడి’ కుట్ర కోణం పెద్దదే!
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఫై జరిగిన దాడి వెనుక పెద్ద కుట్ర కోణం ఉందన్న విషయం బయటపడింది. రామరాజ్యం స్థాపన పేరిట బయలుదేరిన ఓ వ్యక్తి… ఈ దాడికి కారణంగా నిలుస్తున్న… అతడి ఉద్దేశ్యం మాత్రం దారుణమైనదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రామరాజ్య స్థాపన ఉద్దేశ్యం మంచిదే అయినా.. దానిని అతడు ముందుకు తీసుకువెళుతున్న వైనం భయకంపితులను చేస్తోందని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఈ …
Read More »మోడీ.. నెక్ట్స్ టార్గెట్.. అక్కే!
ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోడీ.. పట్టుబట్టారంటే.. కమల వికాసం జరగాల్సిందే. దీనికి సహకరించేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా వ్యూహం మరింత చక్కగా కలిసి వస్తుంది. సో.. ఇదే.. మోడీ-షా ధ్వయాన్ని దేశవ్యాప్తంగా అజేయంగా నిలిపింది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో ఈ ఇద్దరు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్డీయే కూటమిని కాపాడుకోవడమే కాదు.. కూటమి పార్టీల మధ్య వివాదాలు విభేదాలు రాకుండా.. వ్యవహరించడం కూడా ఈ …
Read More »తిరుమల ‘కల్తీ నెయ్యి’ కొలిక్కి వచ్చినట్టేనా..?
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నమోదు అయిన కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచినట్టేనని చెప్పక తప్పదు. లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చ్చిన కాలంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన మూడు కంపెనీలకు చెందిన యజమానులను సిబిఐ అధికారులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వారిని తిరుపతికి తరలించిన సిబిఐ.. వారిని సోమవారం స్థానిక కోర్టులో …
Read More »జగన్ నివాసం వద్ద ప్రమాదాలకు చెక్ పడినట్టే
వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఇటీవల ఒకే రోజు రెండు సార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాలకు సంబంధించి పలు రకాల భిన్న వాదనలు వినిపించాయి. ఎండు గడ్డిపై నిప్పు రవ్వ పడగా ప్రమాదం సంభవించిందని ఓ వాదన వినిపిస్తే.. కీలక పత్రాలను తగులబెట్టే క్రమంలో జగన్ అనుచర గణమే ఈ ప్రమాదానికి కారణమయ్యారన్న వాదనలూ వినిపించాయి. …
Read More »కేసీఆర్ వచ్చేలోపే.. తెలంగాణ టీడీపీపై లోకేష్ వ్యూహం..!
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు కంటే.. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు కొన్ని రోజులు తెలంగాణ పై దృష్టి పెట్టారు. తెలంగాణలోనూ పార్టీని పుంజుకునేలా చేస్తామని చెప్పారు. వీకెండ్స్లో అక్కడకు వెళ్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. దీంతో అంతో ఇంతో జోష్ వచ్చినట్టు అయింది. కానీ.. ఏపీలో పాలన …
Read More »జాతుల వైరం ఎఫెక్ట్.. మణిపూర్ సీఎం రాజీనామా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ చాలా రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. రెండు జాతుల మధ్య నెలకొన్న వైరం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. పదుల అంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ఫలితంగా… మణిపూర్ లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుతో పాటుగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కోవ్బాల్సి వచ్చింది. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాటమాత్రంగానైనా స్పందించలేదని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అంతేకాకుండా …
Read More »రాయల్ ఫై జనసేన విచారణ… కీలక ఆదేశాలు జారీ
ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు… వెరసి జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఫై ఓ పెద్ద రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఇదే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాయల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. . తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… …
Read More »పెమ్మసాని వద్దకు పులివెందుల సమస్యలు
పులివెందుల సమస్యల పరిష్కారం కోసం… ఆ నియోజకవర్గ ప్రజలు ఇప్పటిదాకా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లేవారు. అది కూడా జగన్ పులివెందులకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ తరహా దృశ్యాలు కనిపించేవి. ఎందుకంటే… చాలా ఏళ్లుగా పులివెందుల ఎమ్మెల్యే గా జగన్ కొనసాగుతున్నారు కాబట్టి. జగన్ కు ముందు ఆయన తల్లి విజయమ్మ అంతకుముందు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే లుగా కొనసాగారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates