Political News

మిష‌న్ లేదు-మీనింగూ లేదు: ష‌ర్మిల‌

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. మిష‌న్ లేదు-మీనింగు లేద‌న్నారు. కేవలం అంకెలు, ఆర్భాటాలు త‌ప్ప‌.. ప‌స లేద‌ని పేర్కొన్నారు. “కూట‌మి ప్ర‌భుత్వం ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్‌లో అంకెలు ఘ‌నంగా ఉన్నాయి. కానీ, కేటాయింపులు మాత్రం శూన్యంగా ఉన్నాయి” అని విమ‌ర్శించారు. బ‌డ్జెట్ మొత్తం డొల్లేన‌ని పేర్కొన్న ష‌ర్మిల‌.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను ఏమాత్రం ఈ బ‌డ్జెట్ …

Read More »

పయ్యావుల పద్దును బుగ్గన బట్టీ పట్టేశారే!

ఏపీలోని కూటమి సర్కారు తన తొలి వార్షిక బడ్జెట్ ను శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. పయ్యావుల బడ్జెట్ ను సాధారణంగానే అధికార కూటమి పార్టీల నేతలు ఆకాశానికి ఎత్తేయగా… విపక్ష వైసీపీ ఇదేం బడ్జెట్ అంటూ పెదవి విరిచింది. ఈ తరహా వైఖరి ఏ ఒక్కరికి కూడా కొత్తేమీ కాదు. ఒకరి …

Read More »

హ‌రీష్‌రావుపై ‘నేర పూరిత కుట్ర’ కేసు.. ఏం జ‌రిగింది?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీల‌క నేత హ‌రీష్‌రావుపై హైద‌రాబాద్ లోని బాచుప‌ల్లి పోలీసులు.. కేసు న‌మోదు చేశారు. త‌న‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని పేర్కొంటూ .. బాచుప‌ల్లికి చెందిన చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే 42 ఏళ్ల వ్య‌క్తి పోలీసులను ఆశ్ర‌యించారు. హ‌రీష్ రావుతో పాటు.. సంతోష్‌కుమార్‌, రాములు, వంశీ అనే వ్య‌క్తులు త‌న‌ను బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నా రు. వారినుంచి త‌న‌కు ప్రాణ …

Read More »

సామాజిక పింఛ‌నులో చైత‌న్యం .. బాబు భ‌లే ఐడియా ..!

రాష్ట్రంలో ప్ర‌తి నెలా 1వ తేదీన అందించే సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌-ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్‌పై సీఎం చంద్ర‌బాబు వినూత్న ఐడియా ప్లే చేస్తున్నారు. ఇది మార్చి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది. దీని ప్ర‌కారం.. పింఛ‌ను దారుల‌కు సీఎం సందేశం ఇవ్వ‌నున్నారు. పేరు పేరునా.. ఈ సందేశం వినిపించ‌డం గ‌మ‌నార్హం. అధికారులు చెబుతున్న దాని ప్ర‌కారం.. ప్ర‌స్తుతం పింఛ‌ను తీసుకునేవారు… వేలి ముద్ర వేసి.. సొమ్ములు అందుకుంటున్నారు. సామాజిక …

Read More »

రేవంత్ కు కవిత ‘పింక్’ వార్నింగ్

ఏపీలో వైసిపి హయాంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రెడ్ బుక్ లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. …

Read More »

తొలి బడ్జెట్ తోనే అదరగొట్టిన పయ్యావుల కేశవ్

టీడీపీలో సీనియర్ నేతగా… ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా రాజకీయం చేస్తున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… తన తొలి వార్షిక బడ్జెట్ తోనే అదరగొట్టేశారని చెప్పక తప్పదు. వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా పయ్యావుల మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. చాలా కాలానికి మంత్రి మండలిలోకి ఆయనకు ప్రవేశం లభించింది. అయితే తొలి సారే ఆయనకు ఏకంగా ఆర్థిక శాఖ పగ్గాలు దక్కాయి. ఆ మేరకు …

Read More »

హంగూ ఆర్బాటాల్లేవ్.. రైల్లో వచ్చిన మీనాక్షి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ)కి కొత్త ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ కార్యరంగంలోకి దిగేశారు. అసలే అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నూతన ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి ఏ రేంజిలో ఎంట్రీ ఇస్తారోనని అంతా అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నటరాజన్… ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రైల్లో వచ్చారు. హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన లో రైలు దిగిన ఆమెను చూసి కాంగ్రెస్ శ్రేణులే …

Read More »

ఆస్తుల వివాదంలో విజ‌య‌మ్మ యూట‌ర్న్‌.. జ‌గ‌న్ కు ఇబ్బందే.. !

వైఎస్ కుటుంబంలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ఆస్తుల వివాదంలో వైఎస్ స‌తీమ‌ణి, జ‌గ‌న్ మాతృ మూర్తి.. విజ‌య‌మ్మ ఫుల్లుగా యూట‌ర్న్ తీసుకున్నారు. స‌ద‌రు ఆస్తుల‌తో జ‌గ‌న్‌కు కానీ.. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తికి కానీ.. సంబంధం లేద‌ని.. ట్రైబ్యున‌ల్‌లో అఫిడ‌విట్ వేశారు. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇది క‌నుక కోర్టు ఆమోదం పొందితే.. కీల‌క‌మైన స‌ర‌స్వ‌తి భూముల విష‌యం, వాటాల విస‌యంలో వైసీపీ అధినేత‌కు భారీ దెబ్బే త‌గ‌ల‌నుంద‌ని అంటున్నారు. …

Read More »

కేసీఆర్ ఇగోను హ‌ర్ట్ చేస్తూ రేవంత్‌ ఆఫర్ !

ఎస్ ఇది నిజం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ నేత‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం మాజీ ముఖ్య‌మంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇగోను హ‌ర్ట్ చేసేలా ఉంద‌న్న చ‌ర్చ‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయిన‌ప్ప‌టి నుంచే వేం న‌రేంద‌ర్‌రెడ్డి ఇంకా చెప్పాలంటే రేవంత్ తెలుగుదేశంలో ఉన్న‌ప్ప‌టి నుంచే రేవంత్‌కు ప్ర‌తి …

Read More »

బడ్జెట్ లో ఎపుడూ లేని కొత్త అంశాలివే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు తోడు కొత్త‌గా మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. ఆయా కార్య‌క్ర‌మాల‌కు నిధుల కేటాయింపు భారమే అయిన‌ప్ప‌టికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల‌కు శ్రీకారం చుడుతున్న‌ట్టు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల‌ను అందిపుచ్చుకోనున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. వీటి ద్వారా మ‌రింత స్వావ‌లంబ‌న దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. పాఠ‌శాల‌ల‌కు ఉచిత విద్యుత్‌ …

Read More »

‘ఆరోగ్యశ్రీ’ని మరిపించే బాబు ‘ఆరోగ్య బీమా’

పేదలకు ఉచిత వైద్య సేవల రంగంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఉచిత వైద్యం అనే మాట వినిపించినంతనే… ఆరోగ్యశ్రీ పేరే గుర్తుకు వచ్చే పరిస్థితి. అలాంటి ఆరోగ్యశ్రీని మరిపించే మరో కొత్త ఆరోగ్య సేవల పథకానికి ఏపీలోని కూటమి సర్కారు శ్రీకారం చుడుతోంది. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా పథకాన్ని అందించే దిశగా టీడీపీ అధినేత, …

Read More »

పయ్యావుల పద్దు రూ.3.22 లక్షల కోట్లు… ఏఏ రంగాలకు ఎంతెంత..?

ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం ఉదయం తన తొలి వార్షిక బడ్జెట్ ను ప్రకటించింది. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. కూటమి సర్కారుకు ఇది తొలి వార్షిక బడ్జెట్ కాగా… ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ కు కూడా ఇది తొలి వార్షిక బడ్జెట్టే. మొత్తంగా రూ.3,22,359 …

Read More »