ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడేం జరుగుతోంది. పాలన ఎలా ఉంది.. పైకి వెళ్తోందా.. కిందకు వెళ్తుందా.. ఇలాంటి ప్రశ్నలకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పారు. తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభకు భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. బాలయ్య మార్క్ ప్రసంగం తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు గంటన్నర పాటు మాట్లాడారు. జగన్ ప్రభుత్వ తీరును ఆయన …
Read More »కర్ణాటకలో మోడీకి ఎదురు గాలి.. సర్వే ఏం చెబుతోందంటే!
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకను మరోసారి దక్కించుకోవాలని.. ఆ పార్టీ పెద్దలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటికి మూడు మాసాలు కూడా గడవకముందే.. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి పనుల పేరిట.. ఐదు సార్లు వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతిసారీ.. ఆయన ఇక్కడి ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న విధంగా పరిస్థితి ఉండదని.. తాజాగా వెలుగు చూసిన …
Read More »అవినాశ్ రెడ్డి.. నెల రోజుల గడువు పెట్టిన సుప్రీంకోర్టు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ఊహించని రీతిలో ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణ ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి భవిష్యత్తు ఏంటనేది ఈ గడువుతో తేలనుంది. అయితే… సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వగా సీబీఐ అంతకంటే రెండు వారాల ముందు .. అంటే, ఏప్రిల్ 15కే …
Read More »జగన్ కేబినెట్లోకి కొడాలి, బాలినేని?
ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రి పదవులు ఎవరికి వస్తాయి.. ఎవరి పదవులు ఊడుతాయనే విషయంలో రోజురోజుకీ అంచనాలు, ఊహాగానాలు మారిపోతున్నాయి. నిజానికి పార్టీ అధిష్టానం వద్ద దీనిపై జరుగుతున్న ఎక్సర్సైజ్లోనూ అనేక ఈక్వేషన్లు చెక్ చేస్తుండడంతో ఆ ప్రకారమే పార్టీవర్గాల నుంచి బయటకు లీకులొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న పేర్లుపై ఆ పార్టీ ఆశావహులు నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందుకు కారణం.. జగన్ తొలి …
Read More »రాహుల్ కు ఊరట ఖాయమా?
పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీని జెడ్ స్పీడులో లోక్ సభ సచివాలయం అనర్హుడిగా ప్రకటించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేసినప్పటికీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఎనిమిదేళ్ల పాటు రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఉద్యమించాయి. పార్లమెంట్ కు నల్లదుస్తులతో వస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లే అవకాశం …
Read More »పవన్ ఈ స్పీడు తగ్గించి.. ఆ స్పీడు పెంచాలి
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవర్ స్టార్గా తన అభిమానులను అలరించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన రాజకీయాలు కాస్త పక్కన పెట్టి వరుసగా తన కొత్త కొత్త సినిమాల షూటింగ్ల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటిదాకా ఎన్నడూ ఇవ్వనంత బల్క్ డేట్లు ఇచ్చి ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసిన పవన్.. మూడు వారాల పాటు విరామం లేకుండా షూటింగ్లో పాల్గొని ‘వినోదియ సిత్తం’ రీమేక్లో తన పని అవగొట్టేశాడు. …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలు..! నిజం!!
ఏపీలో ముందస్తు ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ఇదే విషయంపై మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఇవి రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు తెలంగాణతోపాటు.. ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా.. …
Read More »టీడీపీకి చేరువవుతున్న బీజేపీ! తాజా అప్డేట్ ఇదే..
అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కదా! అలానే ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీకి చేరువ అవుతోంది. వాస్తవానికి ఒకప్పుడు.. అంటే.. నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీ కి చేరువయ్యేందుకు టీడీపీ ప్రయత్నించింది. కానీ, ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో పడింది. దీంతో ఆ పార్టీనే టీడీపీకి చేరువ అవుతోంది. తాజాగా టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా …
Read More »సజ్జలపై వేటుకు జగన్ రెఢీ?
వైవీ సుబ్బారెడ్డి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మైసూరా రెడ్డి. విజయసాయి రెడ్డి. సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఈ పేర్లు చదివినప్పుడు కొన్ని సారూపత్యలు కనిపిస్తాయి. నిజమే.. ఈ నేతలంతా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారే. అంతకు మించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నీ తామైనట్లుగా ఒక దశలో వ్యవహరించిన వారే. అదే సమయంలో.. అదంతా కొంతకాలమే. ఒక్కో సీజన్ లో ఒక్కొక్కరు అన్న చందంగా.. ఒకరి తర్వాత ఒకరిని తన సన్నిహితుడి …
Read More »బీసీ చట్టం.. లోకేష్ అభయ హస్తం
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజున కొనసాగుతోంది. సెల్ఫీ విత్ లోకేష్ తో ప్రారంభమయ్యే రోజువారీ కార్యక్రమం తర్వాత కనీసం మూడు నాలుగు మీటింగులతో కొనసాగుతోంది మైనార్టీలు, బీసీలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్.. అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. పాలిచ్చే ఆవును తరిమేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నందునే ఈ సమస్య …
Read More »బీజేపీ మెంటల్ గా ప్రిపేరైపోయిందా?
తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లే అనిపిస్తోంది. ఏదోరోజు మిత్రపక్షాలు విడిపోక తప్పదన్న విషయం కమలనాదులకు అర్ధమైపోయినట్లుంది. ఇంతకాలం ఏదో మూలన జనసేనపై చిన్న ఆశ ఉన్నట్లుంది. అందుకనే అవకాశం దొరికినపుడల్లా జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పింది. ఇపుడిక విడిపోక తప్పదని నిర్ధారణ చేసుకున్నట్లుంది. అందుకనే జనసేన తమను మోసంచేసిందని బహిరంగంగా ఆరోపణలకు దిగింది. తాజాగా 163 నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించింది. …
Read More »అవిశ్వాసం పెడితే ఏమవుతుంది?
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. లోక్ సభ సెక్రటేరియట్ రాహూల్ గాంధిని ఎంపీగా అనర్హత వేటువేసిన విషయం తెలిసిందే. స్పీకర్ ఆదేశాల ప్రకారమే సెక్రటేరియట్ రాహూల్ పై అనర్హత వేటువేసిందని కాంగ్రెస్ అగ్రనేతలంతా మండిపోతున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా దేశంలోని 16 ప్రతిపక్షాలు పోరుబాటు పట్టాయి. ఈ పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నాయి. ఒకవైపు …
Read More »