Political News

కొత్త సచివాలయంలోకి ప్రతిపక్ష నేతలను రానివ్వరా?

Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్‌లోకి అనుమతించకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అవకతవకలున్నాయని.. లక్షల కోట్లవిలువైన అవుటర్ రింగ్ రోడ్డును కేటీఆర్, కేసీఆర్ అమ్ముకున్నారని ఆరోపిస్తూ టెండర్ల వివరాలు కోరడానికి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకుని ఆయన్ను లోనికి వెళ్లకుండా ఆపేయడంతో రేవంత్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అవుటర్ రింగురోడ్డు టెండర్లలో జరిగిన …

Read More »

తల్లీ, కొడుకులిద్దరు పోటీచేస్తారా ?

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ నుండి తల్లీ, కొడుకులు పోటీ చేయటానికి రెడీ అయిపోయారు. విషయం ఏమిటంటే రాష్ట్ర రాజకీయాల్లో ములుగు ఎంఎల్ఏ సీతక్కంటే తెలియని వారుండరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు గడచిన మూడు ఎన్నికలుగా సీతక్క అడ్డాగా మారిపోయింది. ఇపుడు సీతక్క కొడుకు సూర్యను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపటానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సూర్య ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గం …

Read More »

ఎవ‌రు వ‌చ్చినా.. ఆ రెండు స్థానాలూ వైసీపీకి ద‌క్కేలా లేవే!

ఇటీవ‌ల వైసీపీకి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర స‌ర్వే అంటూ..ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఒక జాతీయ మీడియా వ‌చ్చే 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ 25 స్థానాల‌కు 24 చోట్ల గెలుస్తుంద‌ని పేర్కొంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తే.. ఈ స‌ర్వే ఎంత త‌ప్పో చెప్ప‌డానికి రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి. ఉమ్మ‌డి కృష్ణాలో రెండు ఎంపీ స్థానాలు విజ‌య‌వాడ‌-మ‌చిలీప‌ట్నం ఉన్నాయి. 2014లో రెండు కూడా టీడీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో …

Read More »

జ‌గ‌న్ సెల్ఫ్ గోల్స్ లో అదొకటి !

నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ‌ల్ల‌గుద్ది మ‌రీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు మావే అని చెప్పుకొన్న వైసీపీ నాయ‌కుల‌కు ఇప్పుడు పెద్ద సంక‌టం వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో కూసాలు క‌దిలిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. రాష్ట్రంలో 29 ఎస్సీ సామాజిక వ‌ర్గానికి కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గాలు , మ‌రో 7 ఎస్టీల‌కు కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో గ‌తంలో కాంగ్రెస్ త‌ర్వాత‌.. అదే రేంజ్‌లో దూసుకుపోయిన పార్టీ వైసీపీ. టీడీపీ కొన్ని …

Read More »

అది కర్ణాటక సీటు అయినా… తెలుగోళ్ల ఓట్లే గెలిపించేది

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఒక ఎమ్మెల్యే కేవ‌లం ఏపీ ప్ర‌జ‌లు వేసే ఓటుపైనే ఆధార‌ప‌డ్డారు. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న బాగేపల్లిలో కన్నడ ప్రజలతోపాటు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. రాసేది కన్నడ భాషలో అయినా తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. ఏపీలోని చిలమత్తూరు, గోరంట్ల, కోడికొండ, పెనుగొండ, కదిరి, తాడిపత్రి, ధర్మవరం తదితర ప్రాంతాలనుంచి వలసవచ్చిన తెలుగు ప్రజలు ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుంటూ కన్నడిగులతో మమేకమయ్యారు. బాగేపల్లి పట్ట …

Read More »

రజినీ విషయంలో వైసీపీ బిగ్ బ్లండర్

అవతల ఉన్నది ఎవరని చూడరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను పొగిడినా.. జగన్‌ను విమర్శించినా.. ఎటాక్ ఎటాక్ ఎటాక్. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల తీరు. సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలోనూ ఇలాగే చేశారు. రెండు రోజుల కిందట విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరైన రజినీకాంత్.. రాజకీయాల గురించి మాట్లాడను అని చెబుతూనే.. చంద్రబాబు విజన్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పాడు. హైదరాబాద్ …

Read More »

నా చొక్క నా ఇష్టం…

ఎవరైనా కడుపు నింపుకోవడానికి దొంగతనం చేశారనుకోండి.. జనమంతా  వాళ్ల మీద పడి చితగ్గొట్టేస్తారు. అదే డబ్బున్నవాళ్లో, రాజకీయ నాయకులో పక్కనోడి పెన్ను తీసి జేబులో పెట్టుకున్నారనుకోండి… ఆయన సరదాపడి తీసుకున్నారు అందులో తప్పేముందీ అన్నట్లుగా మాట్లాడేస్తారు. అదీ సమాజ నైజం.. ఎవరైనా రోడ్డు మీదకు వచ్చి అక్కడే చొక్కా విప్పి తిరుగుతూ గోల చేస్తే వాడికి  పిచ్చి పట్టిందంటారు. అదే ఎమ్మెల్యేనో, మంత్రో, మాజీ ఎమ్మెల్యేనో చేస్తే రాజకీయ ఉద్యమంగానో, …

Read More »

సీనియర్లు పోటీకి భయపడుతున్నారా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయటానికి కాంగ్రెస్ సీనియర్లలో కొందరు భయపడుతున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వయసు అయిపోవటం, రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోవటం, ఖర్చులకు భయపడటంతో పాటు వారసులు రంగంలోకి దిగాలని ఉత్సాహం చూపుతుండటమేనట. రాబోయే ఎన్నికల్లో గెలుపు సంగతిని పక్కన పెట్టేస్తే అసలు పోటీ చేయాలంటేనే డబ్బు ఏ స్ధాయిలో ఖర్చు చేయాలో అని భయపడుతున్నారు. …

Read More »

‘ఇష్టముంటే ఓటేయండి.. లేకపోతే మానేయండి’

ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చుగా మీడియాలో ఉంటున్న ఏపీ మంత్రి, సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. మ‌రో అవే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో హైలెట్ అయ్యారు. ఈ సారి ఏకంగా.. ఆయ‌న సొంత పార్టీ నేత‌ల‌ను.. ప్ర‌జ‌ల‌ను కూడా టార్గెట్ చేశారు. ప‌దువులు కావాల్సిన వాళ్లే.. సీఎం జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. ఆయ‌న‌ను సైకో.. అని పిచ్చోడ‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు ఇస్తున్నందునే అభివృద్ధికి అవ‌కాశం …

Read More »

మీడియా నాట్ ఎలౌడ్..దటీజ్ కేసీయార్

మీడియా మీద కేసీయార్ తన పట్టు ఎలాగుంటుందో మరోసారి చూపించారు. కేసీయార్ అంటే యావత్ మీడియా ఎంతలా వణికిపోతోందో తాజా ఘటనలో అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను కేసీయార్ ఆదివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ స్ధాయిలో సచివాలయాన్ని కేసీయార్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అంతాబాగానే ఉంది కానీ లోకల్లో మెజారిటి మీడియాను మాత్రం దూరంగానే ఉంచేశారు. ఎంపికచేసిన అతికొద్ది రిపోర్టర్లను మాత్రమే సెక్రటేరియట్ లోపలికి …

Read More »

ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫైట్..బొత్సకు టెన్షన్

విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు రచ్చకెక్కడంతో ఏం చేయాలో తోచక అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించినప్పటికీ ఆ ఇద్దరు నేతల అనుచరులు దారికి రావడం లేదు.. వారిని కట్టడి చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది.. శృంగవరపు కోట ఒకప్పుడు టీడీపీకి …

Read More »

మారుతున్న ప‌వ‌నాలు.. తాజా స‌ర్వే ఏం చెప్పిందంటే

దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో మ‌రో 10 రోజుల్లో(మే 10) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇక్క‌డ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది అనేక స‌ర్వేలు వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ కూడా.. హంగ్ వ‌స్తుంద‌ని చెప్పాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వే మాత్రం ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని …

Read More »