కర్నాటక ఎన్నికలు చాలా హోరా హోరీగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అధికార బీజేపీ మీద జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మీద జనాల్లో బ్రహ్మాండమనేంతగా సానుకూలత కనబడటంలేదట. కాబట్టి మధ్యలో ఉన్న జేడీఎస్ కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆమధ్య జరిగిన ఒక సర్వేలో 224 అసెంబ్లీల్లో కాంగ్రెస్ కు 127 సీట్లు వస్తాయని తేలింది. అయితే …
Read More »ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఏం చదువుకున్నారు..
ఏపీ అసెంబ్లీ స్పీకర్.. తమ్మినేని సీతారాం విద్యకు సంబంధించిన వివాదం కీలక మలుపు తిరుగుతోంది. చినుకు.. చినుకు.. అనుకున్న విషయం కాస్తా..ఇప్పుడు తీవ్ర గాలివానగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హత విషయంలోనూ.. తీవ్ర రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఏపీ స్పీకర్గా ఉన్న తమ్మినేని వంతు వచ్చినట్టు అయింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న తమ్మినేని …
Read More »అక్కడ 151 అడుగుల స్టిక్కర్ వేయండి వైసీపీ కి పవన్ సలహా
వైసీపీ సర్కారుపై తరచుగా విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా ఇంటింటికీ స్టిక్క ర్ల పథకంపై తనదైన శైలిలో సటైర్లు గుప్పించారు. విశాఖ పట్నంలోని రుషి కొండ అక్రమతవ్వాలపై వైసీపీ సర్కారు ఇరుకునపడిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ.. పవన్.. `ఆ రుషికొండ అక్రమాల ను కప్పి పుచ్చుకునేందుకు అక్కడ 151 అడుగుల స్టిక్కర్ వేయండి“ అని వ్యాఖ్యానించారు. చేసినా చేస్తారని.. అక్రమాలు కప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. …
Read More »అంబటి నిర్వేదం
అంబటి రాంబాబు నీటి పారుదల శాఖామంత్రి… ప్రత్యేర్థులు ఆయన్ను నోటి పారుదల శాఖామంత్రి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడతారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రత్యర్థులను తిట్టి పోస్తుంటారు. అలాంటి ఫోర్సున్న అంబటి.. ఇప్పుడు ఎందుకో వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారని అనుచురులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.. సత్తెనపల్లి వైసీపీ టికెట్ తనకు గ్యారెంటీ కాదని అంబటి స్వయంగా చెప్పుకుంటున్నారట. ఈ దిశగా ఆయన నిర్వేదంలోకి వెళ్లిపోయారట. 2024లో తామెవ్వరికీ …
Read More »ఏపీకి పూర్వవైభవం తెస్తా: చంద్రబాబు
వచ్చే ఏడాదిలో టీడీపీ ఏపీలో పాలన ప్రారంభిస్తుందని.. టీడీపీ అధికారమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెలుగు వారు ఎక్కడున్నా నెంబర్.1గా ఉండాలన్నదే తన సంకల్పమని అన్నారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఏపీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది టీడీపీ వస్తుందని.. రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తామని ఆయన స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ సూత్రాన్ని అమలు చేస్తామని, పేదలను ఆర్థికంగా పైకి తెస్తామన్నారు. …
Read More »బీఆర్ఎస్కు ఉన్న విచక్షణ.. వైసీపీకి లేదు: పవన్ కళ్యాణ్ ఫైర్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే విషయంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్కు ఉన్న విచక్షణ, ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఏమాత్రం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా.. కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేది లేదని చెప్పడం ఊపిరిచ్చినట్టుగా ఉందన్నారు. కేంద్ర మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తే ప్రకటనను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. కేంద్రమంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని …
Read More »మహేశ్వర్ రెడ్డి.. దారులన్నీ బీజేపీ వైపే
కాంగ్రెస్ నేత, నిర్మల్ మాజీ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు రోజులుగా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడం.. దానికి ఆయన తీవ్రంగా స్పందించడంతో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీపీసీసీ ఇచ్చిన నోటీసులపై ఏలేటి రెట్టింపు స్థాయిలో ఫైర్ కావడం …
Read More »వైసీపీ ఫోకస్ మారింది.. టీడీపీ, జనసేన కాదు టార్గెట్ బీఆర్ఎస్
ఏపీ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా… పాలకవిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు.. తిట్లు, బూతుపురాణాలు, నిరసనలు, ధర్నాలు, అరెస్టులు, నిర్బంధాలు, అడ్డుకోవడాలు.. ప్రతిరోజూ పొలిటికల్ పండగే అక్కడ. అధికారపక్షం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల సమస్యల కంటే విపక్ష నేతలపై ఎదురుదాడికే సమయమంతా సరిపోతుంది. అధికారం పక్షం కొట్టే దెబ్బల నుంచి బయటపడేందుకు విపక్షం కూడా రోజూ డిఫెన్స్, కౌంటర్ అఫెన్స్ కార్యక్రమాలలోనే ఉంటుంది. నిర్మాణాత్మక రాజకీయాలనేవే లేకుండా పోయిన …
Read More »ఏపీలో ఏ గోడ చూసినా స్టిక్కరే
ఏపీలో ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం భీకరంగా సాగుతోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య స్టిక్కర్ల కార్యక్రమం కొత్త యుద్ధాన్ని తలిపిస్తోంది. వాస్తవానికి ఇంటింటికీ స్టిక్కర్లు అనే కార్యక్రమాన్ని మొదట ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డే మొదలుపెట్టారు. గడప గడపకు వైయస్సార్, మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగనన్న అనే నినాదాలతో గత కొంతకాలంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, …
Read More »మీ మామతో కలిసి కల్లు తాగి.. ఒళ్లు కొవ్వెక్కిందా? : సీదిరి
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. తెలంగాణ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘మీ మామతో కలిసి కల్లు తాగి.. ఒళ్లు కొవ్వెక్కిందా?’ అని ప్రశ్నించారు. అంతేకాదు.. కవితకు ఉన్నట్టు.. ఏపీలో ఎవరికీ లిక్కర్ మాఫియాలతో సంబంధం లేదన్నారు. విషయం ఏంటంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు.. కేంద్రం రెడీ అయిన దరిమిలా.. దీనిని సొంతం చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ …
Read More »యంగ్ ఎంపీ ఇంటి రాజకీయం హాట్ హాట్ !
రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో చంద్రబాబునాయుడుకు తలనొప్పులు తప్పేట్లు లేదు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ ఎంపీగా కాకుండా ఎంఎల్ఏగా పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. ఎంపీని ఎంఎల్ఏగా పోటీ చేయించడం చంద్రబాబుకు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం అబ్బాయ్-బాబాయ్ మధ్య ఆధిపత్య పోరాటం బాగా పెరిగిపోతుంది. దీని ప్రభావం పార్టీలోని ఇతర …
Read More »అందరినీ సుఖేష్ ఇరికించేశాడా ?
హవాలా కేసులో అరెస్టయి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒకేదెబ్బకు చాలామందిని ఇరికించేసినట్లే ఉన్నాడు. ఇరుక్కున్నది మామూలు వాళ్ళు కాదు ఏకంగా ముఖ్యమంత్రి, మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి, మరో ఎంఎల్సీ లాంటి ప్రముఖులను. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీమంత్రి సత్యేంద్ర జైన్, బీఆర్ఎస్ ఎంఎల్సీ, కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవితలు తనతో …
Read More »