కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ నటులైనా.. ఇతర రంగాలకు చెందిన వ్యక్తులైనా… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి సొంతంగా ఒంటి చేత్తో అధికారం చేజిక్కించుకోవడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి. ఎక్కడికక్కడ అటు జాతీయ పార్టీలతో పాటుగా… ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా వ్యూహాలు అంతగా పని చేయవని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఏపీనే తీసుకుంటే… జనసేన పేరిట రాజకీయాల్లోకి …
Read More »జగన్ ను బాబు సాంతం చదివేశారు!
నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆసాంతం చదివేశారు. రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లను చవిచూశారు. అందివచ్చిన విజయాలతో పాటుగా ఎదురు వచ్చిన ప్రతి ప్రతిబంధకాన్ని కూడా ఆయన క్షుణ్ణంగానే చదవేశారు. లేకుంటే… విడతల వారీగా ఓ సారి గెలుపు… ఓ సారి ఓటమి ఎలా సాధ్యపడతాయి? ఓటమి నుంచి పాఠాలు …
Read More »ఏపీలో ఆ రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: రేవంత్ రెడ్డి
ఏపీలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? అక్కడ మాదిగలకు ద్రోహం చేయడం లేదా? అని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి …
Read More »‘సంపద సృష్టి’కి బాటలు.. బడ్జెట్లో కీలక అంశం!
“సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను పేదలకు పంచుతాం!” అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా.. చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలో తరచుగా విపక్షాలు.. ‘సంపద సృష్టి’ మాటేంటి? అనే ప్రశ్న వినిపిస్తన్నాయి. ఏ రాష్ట్రానికైనా.. ఏ ప్రభుత్వానికైనా.. సాధారణంగా.. ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. సంపద …
Read More »సీఎం అయినా రేవంత్ సంతృప్తిగా లేరా..?
ఎనుముల రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో ఓ ఊపు వచ్చింది. కాంగ్రెస్ కు ఇక అందదనుకున్న తెలంగాణ అధికారం అందివచ్చింది. గ్రాటిట్యూడ్ గా రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. తెలంగాణ సీఎంగా రేవంత్ అప్పుడే ఏడాది పాలనను కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడప్పుడే రేవంత్ రెడ్డి నుంచి సీఎం సీటు చేజారుతుందన్న భావన అస్సలే వినిపించట్లేదు. సీఎం పోస్టు దక్కిందంటే… ఏ రాజకీయ …
Read More »2029లోనూ టికెట్ కావాలంటే… ఏం చేయాలో చెప్పిన బాబు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ఘట్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం శుక్రవారం పూర్తి అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభ్యులకు ప్రత్యేకించి కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు …
Read More »మిషన్ లేదు-మీనింగూ లేదు: షర్మిల
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ లేదు-మీనింగు లేదన్నారు. కేవలం అంకెలు, ఆర్భాటాలు తప్ప.. పస లేదని పేర్కొన్నారు. “కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అంకెలు ఘనంగా ఉన్నాయి. కానీ, కేటాయింపులు మాత్రం శూన్యంగా ఉన్నాయి” అని విమర్శించారు. బడ్జెట్ మొత్తం డొల్లేనని పేర్కొన్న షర్మిల.. ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం ఈ బడ్జెట్ …
Read More »పయ్యావుల పద్దును బుగ్గన బట్టీ పట్టేశారే!
ఏపీలోని కూటమి సర్కారు తన తొలి వార్షిక బడ్జెట్ ను శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. పయ్యావుల బడ్జెట్ ను సాధారణంగానే అధికార కూటమి పార్టీల నేతలు ఆకాశానికి ఎత్తేయగా… విపక్ష వైసీపీ ఇదేం బడ్జెట్ అంటూ పెదవి విరిచింది. ఈ తరహా వైఖరి ఏ ఒక్కరికి కూడా కొత్తేమీ కాదు. ఒకరి …
Read More »హరీష్రావుపై ‘నేర పూరిత కుట్ర’ కేసు.. ఏం జరిగింది?
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కీలక నేత హరీష్రావుపై హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులు.. కేసు నమోదు చేశారు. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ .. బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ అనే 42 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. హరీష్ రావుతో పాటు.. సంతోష్కుమార్, రాములు, వంశీ అనే వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నా రు. వారినుంచి తనకు ప్రాణ …
Read More »సామాజిక పింఛనులో చైతన్యం .. బాబు భలే ఐడియా ..!
రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన అందించే సామాజిక భద్రతా పింఛన్-ఎన్టీఆర్ భరోసా పెన్షన్పై సీఎం చంద్రబాబు వినూత్న ఐడియా ప్లే చేస్తున్నారు. ఇది మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. పింఛను దారులకు సీఎం సందేశం ఇవ్వనున్నారు. పేరు పేరునా.. ఈ సందేశం వినిపించడం గమనార్హం. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రస్తుతం పింఛను తీసుకునేవారు… వేలి ముద్ర వేసి.. సొమ్ములు అందుకుంటున్నారు. సామాజిక …
Read More »రేవంత్ కు కవిత ‘పింక్’ వార్నింగ్
ఏపీలో వైసిపి హయాంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రెడ్ బుక్ లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. …
Read More »తొలి బడ్జెట్ తోనే అదరగొట్టిన పయ్యావుల కేశవ్
టీడీపీలో సీనియర్ నేతగా… ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా రాజకీయం చేస్తున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… తన తొలి వార్షిక బడ్జెట్ తోనే అదరగొట్టేశారని చెప్పక తప్పదు. వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా పయ్యావుల మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. చాలా కాలానికి మంత్రి మండలిలోకి ఆయనకు ప్రవేశం లభించింది. అయితే తొలి సారే ఆయనకు ఏకంగా ఆర్థిక శాఖ పగ్గాలు దక్కాయి. ఆ మేరకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates