Political News

కేసీఆర్ నిర్ణ‌యం… సీమ రాజ‌కీయాలు మార్చేస్తుందా..?

ఏపీలో అడుగు పెట్టే విష‌యంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చిన త‌ర్వాత‌.. తొలి అడుగు మ‌హారాష్ట్రలో వేసి.. భారీ బ‌హిరంగం స‌భ పెట్టారు. త‌ర్వాత‌.. అంద‌రూ అనుకున్న‌ది మ‌లి అడుగు కేసీఆర్ ఏపీలోనే వేస్తార‌ని! కానీ.. కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. అంటే.. ఏపీని వ‌దిలేసుకున్న‌ట్టు కాదు. …

Read More »

గుంటూరు నేతలపై బాబు గరం గరం

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి కఠినంగా ఉండాలని తీర్మానించారు. అందుకే పార్టీ నేతల దగ్గర మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు. సరిగ్గా పనిచేయని నేతలను నిలదీస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు విడిగా పిలిచి మాట్లాడుతూ పనిచేయని వారికి క్లాస్ తీసుకుంటున్నారు. దారికి రాకపోతే ఇంక అంతేనని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాలలో తిరిగారు. పెదకూరపాడు, సత్తెనపల్లి , తాడికొండ …

Read More »

కేసీఆర్ దిల్లీ టూర్.. వారం రోజులు మకాం అక్కడే

తెలంగాణ సీఎం కేసీఆర్ మే మొదటి వారమంతా దిల్లీలోనే ఉండేందుకు నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని వివిధ పార్టీల నాయకులు, మేధావులతో సమావేశం కాబోతున్నారు. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్‌ దేశంలోని ఏఏ రాష్ట్రాలలో పోటీ చేయబోతోంది.. ఏఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోతోంది వంటి అన్ని విషయాలలో ఈ పర్యటనతో కొంత స్పష్టత రానుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేసిన …

Read More »

వివేకా కేసు విచార‌ణ వాయిదా

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు విచార‌ణ‌.. సుదీర్ఘ వాయిదా ప‌డింది. ఈ కేసును విచారిస్తున్న నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు విచార‌ణ‌ను ఏకంగా..జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. వాస్త‌వానికి ఈ కేసును ఏప్రిల్ 30(ఈ నెల‌)న పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్టు గ‌తంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేస్తారంటూ.. వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. సుప్రీంకోర్టు …

Read More »

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా వైసీపీ ఓట‌మి ఖాయం: చంద్ర‌బాబు

రాష్ట్రాన్ని కాపాడటానికి 5 కోట్ల మంది ఒకటి కావాలన‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప్రజలంతా చేయి చేయి పట్టుకుని జగన్ను దించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రలోబాలు కాదని, ప్రజలు టీడీపీని గెలిపించారని తెలిపారు. ‘వై నాట్ కుప్పం’ అన్న వారికి పులివెందులలో జెండా ఎగరేసి సమాధానం …

Read More »

బీజేపీ నినాదం – ముస్లింల ఓట్లు మాకొద్దు

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కర్నాటకలో సామాజికవర్గాల సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మామూలుగా కర్నాటక ఎన్నికలంటే ఒక్కలిగలు, లింగాయతుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అయితే తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఇపుడు పై సామాజికవర్గాలతో పాటు ముస్లింల గురించి కూడా చర్చలు పెరిగిపోతున్నాయి. ఒక్కలిగలు, లింగాయతుల జనాభా సుమారు చెరో 15 శాతం ఉంటుందని అంచనా. అందుకనే వీళ్ళ మద్దతు ఏ పార్టీకైనా చాలా కీలకమవుతోంది. అయితే ఈసారి వీళ్ళతో …

Read More »

42 చోట్ల కొత్తవారికి ఛాన్స్ ?

తాజాగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొందరు ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అలాంటి ఎంఎల్ఏల పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాకపోయినా వాళ్ళెవరో అందరికీ తెలుసన్నారు. దళితులు, బీసీల అభివృద్ధకి అమలుచేస్తున్న పథకాల్లో కూడా అవినీతికి పాల్పడతారా ? అంటు ఫుల్లుగా క్లాసుపీకారు. అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలంతా రాబంధుల్లాగ పీక్కుతున్నట్లని …

Read More »

‘గన్నవరం’లో రజినీకాంత్ కు స్వాగతం పలికిన బాలకృష్ణ

ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభలో పాల్గొనేందుకు ఆయన రాగా, ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ సభలో రజినీకాంత్ పాల్గొంటున్నారు. కాగా నందమూరి …

Read More »

చంద్ర‌బాబుపై తిట్లు ప‌నిచేయ‌డం లేదా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు కామ‌నే. ఏ పార్టీ అయినా.. ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకునేందుకు.. త‌మ పార్టీ పుంజుకునేం దుకు ప్ర‌త్య‌ర్థి పార్టీపైనా.. నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జ‌మే. దీంతో గ‌త నాలుగేళ్లుగా.. అధికార పార్టీ నేత‌లు..చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌ను విమ‌ర్శించ‌డంతోపాటు.. అనేక రకాల మాట‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఇక‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా.. ఇదే పంథాలో ముందుకు సాగారు. సీఎంగా ఆయ‌న ఏసభ‌లో పాల్గొన్నా.. కూడా.. చంద్ర‌బాబు ను …

Read More »

విజ‌న్‌కు ప‌ట్టం.. చంద్ర‌బాబు న‌మ్మ‌కం ఇదే!

రాజ‌కీయాల్లో మార్పులు స‌హ‌జం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా క‌నివినీ ఎరుగ‌ని విధంగా వైసీపీలో ముసలం పుడితే. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం విక‌సిత రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ఇంకే ముంది.. మాకు తిరుగులేదు.. వైనాట్ 175 అని చెప్పిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆత్మ రక్ష‌ణ‌లో ప‌డిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయ‌న విధానాల‌ను తూర్పార‌బడుతున్నారు. క‌నీసం ఎమ్మెల్యేలకు ఎలాంటి విలువా లేకుండా చేయ‌డంపై …

Read More »

త‌మ్ముళ్లూ.. జాగ్ర‌త్త‌..: చంద్ర‌బాబు మెసేజ్ ఇదే!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీలో జోష్ పెరిగింది. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇంకేముంది.. పార్టీ ప‌రిస్థితి అయిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. అలాంటి పార్టీ ఇప్పుడు దూసుకుపోతోంది. దీంతో ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు వ‌చ్చి చేరేందుకు క్యు క‌ట్టారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క మానదు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కు అనేక వ‌ర్గాల నుంచి సిఫార‌సులు సైతం పోటెత్తుతున్నాయ‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన‌.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అదేస‌మ‌యంలో …

Read More »

ఎమ్మెల్యేల అవినీతిపై కేసీఆర్ ఫైర్‌

సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై సీఎం కేసీఆర్ ఫైర‌య్యారు. చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతి బాట ప‌ట్టార‌ని హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఇలా చేయ‌డం స‌రైన చ‌ర్య‌కాద‌న్నారు. ముఖ్యంగా ద‌ళితుల‌కు ఉద్దేశించిన కీలక‌మైన‌ ప‌థ‌కం.. ద‌ళిత బంధును ఆస‌రా చేసుకుని సొమ్ములు బొక్కేయ‌డం స‌రికాద‌న్నారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వాళ్లెవ‌రో కూడా త‌న ద‌గ్గ‌ర చిట్టా ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇదే చివరి వార్నింగ్‌.. మళ్లీ రిపీట్‌ …

Read More »