వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్ ఆ తర్వాత తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సలీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని సభకు ఇంకేం హాజరవుతాం… ఇకపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం అంటూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. …
Read More »పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు!
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేస్తూ నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు తమకు ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల శాతం …
Read More »బీఆర్ఎస్ కు డబుల్ లాస్.. బిందాస్ గా వైసీపీ
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియనే లేదు… అప్పుడే రెండు రాష్ట్రాల్లో మరో ఎన్నికకు తెర లేసింది. అవి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలే కావడం గమనార్హం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం రేపటితో ముగియనుంది. ఈ నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఓ గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు …
Read More »మోడీ తెలంగాణకు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంచిర్యాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిజానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి బలమైన పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కేంద్రంగా చేసుకుని రేవంత్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. ఇప్పటి వరకు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు …
Read More »‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!
అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి సోమవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటుగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఫైబర్ నెట్ లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలే జీవీ రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లుగా సమాచారం. …
Read More »మహిళలకు పండగే.. ఆ రెండు పథకాలు ఖాయం!
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల పరంపర మరోసారి తెరమీదికి వచ్చింది. ఆయా హామీల్లో కీలకమైన వాటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ . ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తరచుగా సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా ఆయా పథకాలను అమలు చేస్తా మని చెబుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. తాజాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. …
Read More »11 నిమిషాల కోసం 11 మంది వచ్చారా?: వైఎస్ షర్మిల
ఏ చిన్న అవకాశం దొరికినా… తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల సెటైరిక్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చి… గవర్నర్ ప్రసంగం కూడా పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేసిన జగన్ తీరుపైనా ఆమె వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? అని ఆమె జగన్ …
Read More »జగన్ ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసన సభకు హాజరై… తన శాసనసభ సభ్యత్వంపై వేలాడుతున్న వేటును తప్పించుకుందామని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అటు అసెంబ్లీకి అయినా… ఇటు శాసన మండలికి అయినా సభ్యులుగా ఎన్నికైన వారు వరుసగా 60 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కాకుంటే వారిపై అనర్హత వేటు …
Read More »బీఆర్ఎస్ కు ఇచ్చి పడేసిన రేవంత్
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ సాగుతున్న ఉహాగానాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులను ప్రస్తావిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆ తర్వాత …
Read More »వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీసు కస్టడీ
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వంశీ రిమాండ్ రేపటితో ముగియనుంది. అయితే, ఈ కేసులో విచారణ కోసం వంశీని 10 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఈ క్రమంలోనే తాజాగా వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. …
Read More »ఇక రాను.. తేల్చిచెప్పేసిన జగన్
ఏపీ అసెంబ్లీలో అధికార కూటమి ప్రచారం చేస్తున్నట్లుగా విపక్షం వైసీపీ సింగిల్ డే షోకే పరిమితం అయిపోయింది. సభలో తాము అడిగినట్టుగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా… ఈ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హాజరైన జగన్.. గవర్నర్ …
Read More »సీనియర్లంటే.. టిష్యూ పేపర్లలా కనిపిస్తున్నారా?
రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఏనాడూ విననన్ని సంచలన వ్యాఖ్యలు, వింత వ్యాఖ్యలు, వినూత్న పోలికలు వింటున్నాం. రాజకీయ రంగమైనా… ఇంకే రంగమైనా కూడా పాత నీరు పోతూ ఉంటే… కొత్త నీరు వస్తూనే ఉంటుంది కదా. అలాగని పాత తరం నేతలను కొత్త తరం నేతలు మరీ చులకనగా చూడకూడదు కదా. అదే సమయంలో తాము ఇంకా బరిలోనే ఉండగా… ఈ కొత్త నేతలు అవసరమా? అని పాత తరం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates