Political News

జ‌గ‌న్.. 639 కోట్ల‌ను ఏం చేశారు? మోడీ సీరియ‌స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సీరియ‌స్ అయింది. తాము ఒక కార్య‌క్ర‌మం కోసం ఇచ్చిన సొమ్ముల‌ను.. ఆ కార్యక్ర‌మానికి ఖ‌ర్చు చేయ‌క‌పోగా.. క‌నీసం మాట మాత్రం కూడా చెప్పకుండా.. వేరే వాటికి ఎలా వాడేస్తార‌ని నిల‌దీసింది. ఈ క్ర‌మంలో సుమారు 639 కోట్ల రూపాయ‌ల‌ను ఏం చేశార‌ని కేంద్ర స‌ర్కారు నిల‌దీసింది. అంతేకాదు.. త‌క్ష‌ణం ఈ నిధుల‌ను సంబంధిత ఖాతాలో జ‌మ …

Read More »

ఈ ముగ్గురు నేతలు మాయమైపోయారా ?

ముఖ్యమంత్రి తమ జిల్లాకు వస్తున్నారంటే నేతలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీలు పడతారు. ప్రధానమంత్రి తమ రాష్ట్రానికి వస్తున్నారంటే ఆ పార్టీ నేతలంతా తప్పకుండా హాజరవుతారు. ప్రధానమంత్రి దృష్టిలో పడితే చాలని ఎగబడతారు. అలాంటిది వరంగల్ జిల్లాకు నరేంద్రమోడి వచ్చినా ముగ్గురు నేతలు గైర్హాజరయ్యారంటే ఏమిటర్ధం ? చాలామంది సీనియర్లు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ముగ్గురునేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు. ఇపుడీ విషయమే పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. అసలు …

Read More »

పాలేరు నుంచే పోటీ.. ద‌మ్ముంటే ఓడించండి: ష‌ర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల తాజాగా శనివారం ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పాలేరులో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే, తాను గతంలో చెప్పినట్లే.. పాలేరు నుంచే పోటీ చేస్తానని షర్మిల పేర్కొన్నారు. “ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని …

Read More »

వైసీపీది ‘ముందస్తు’ డ్రామా:బాబు

ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో జగన్ ముందస్తు ఎన్నికల గురించి దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్ ను …

Read More »

సీఎం జ‌గ‌న్ సెంట్రిక్‌గా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వ‌ర్సెస్ బొత్స‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ కేంద్రంగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు మాట‌ల తూటాలు పేల్చారు. జ‌గ‌న్‌పై అశోక్ గ‌జ‌ప‌తి రాజు చేసిన ఘాటు విమ‌ర్శ‌ల‌కు అంతే ఘాటుగా బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా.. స‌మాధానం ఇచ్చారు. దీంతో విజ‌య‌న‌గ‌రం పాలిటిక్స్‌లో హాట్ ఎట్మాస్ఫియ‌ర్ ఏర్ప‌డింది. అశోక్ ఏమ‌న్నారంటే.. ”చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు …

Read More »

నిజామాబాద్‌లో నితిన్ భయం

నిజామాబాద్ జిల్లాలో హీరో నితిన్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని, వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో పాలక బీఆర్ఎస్‌లో కంగారు మొదలైంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా తమ సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోనని భయపడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్‌లోని కొందరు నేతలలో కంగారు …

Read More »

రాహుల్ ట్వీట్.. షర్మిల రీట్వీట్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తి పెంచాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ …

Read More »

2021లో ట్రైలర్ మాత్రమే…:మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన మోడీ….సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని, ఆ దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మోడీ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు డైవర్ట్ …

Read More »

ఏదీ ఆ జోష్‌.. వైసీపీలో కుమ్ములాట‌లే కార‌ణ‌మా..?

YSR

వైసీపీలో కుమ్ములాట‌లు.. ఆత్మ స్థ‌యిర్యం కోల్పోతున్న వైనం స్ప‌ష్టంగా తెర‌మీదికి వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు త‌మ‌కు టికెట్ వ‌స్తుందో రాదో అనే భ‌యం వెంటాడుతోంది. ఈ క్ర‌మంలో వారు.. ఎవ‌రికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి కార్య‌క్ర‌మంపై ప్ర‌భావం చూపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. శ‌నివారం(జూలై 8) వైఎస్ జ‌యంతి. కానీ, ఎక్క‌డా ఆ జోష్ క‌నిపించ‌డం లేదు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన తొలి మూడేళ్ల‌పాటు వైఎస్ …

Read More »

ఐప్యాక్ మీద నమ్మకంలేదా ?

తొందరలోనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎల్ఏల పనితీరుపై ఐప్యాక్ విస్తృతంగా సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తోంది. ఐప్యాక్ బృందం తయారుచేసిన సర్వే రిపోర్టుపై జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎంఎల్ఏల మీద ఉన్న ప్లస్సులు, మైనస్సులతో పాటు జనాల్లో ఉన్న అభిప్రాయాలు, వ్యతిరేకత తదితర అంశాలపైన కూడా ఐప్యాక్ బృందం క్లారిటితో రిపోర్టు సబ్మిట్ చేసినట్లు సమాచారం. అందుకనే జగన్ కూడా అంత సుదీర్ఘంగా సమీక్షలు …

Read More »

టార్గెట్ @ 47 సీట్లు

ఎన్నికల వేడి పెరిగిపోతున్న కొద్ది వివిధ సామాజికవర్గాలు ఎక్కువ టికెట్లు సాధించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీలో ఇపుడీ విషయమే హాట్ టాపిక్కుగా మారింది. కాంగ్రెస్ లోని బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీసీల జనాభా ఆధారంగా సముచితమైన స్ధానాలు కేటాయించాల్సిందే అని తీర్మానించారు. వీలైనన్ని ఎక్కువ టికెట్లు …

Read More »

సిట్టింగులతోనే సమస్యా ?

ఒకపుడు ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను రాసిచ్చేయటమే ఇపుడు కేసీయార్ కు తలనొప్పులుగా తయారైంది. దాదాపు తొమ్మిదేళ్ళపాటు నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలదే రాజ్యమైపోయింది. ఒకవిధంగా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు రాజులుగా చెలామణి అయిపోతున్నారు. నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు ఏమిచేసినా కేసీయార్ పిలిచి ప్రశ్నించింది లేదు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా కనీసం కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో ఏమైందంటే తమకు కేసీయార్ పూర్తిస్ధాయిలో స్వేచ్చ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఆకశమేహద్దుగా చెలరేగిపోయారు. దాని ఫలితం ఏమైందంటే భూకబ్జాలు, అవినీతి, …

Read More »