Political News

టీడీపీ అధినేతగా చంద్రబాబు ఎన్నిక

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికయ్యారు. ఇప్పటికే 30 ఏళ్లుగా టీడీపీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నుకుంటూ టీడీపీ వార్షిక వేడుక మహానాడు తీర్మానం చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు చేత పార్టీ సీనియర్ నేత వర్ల …

Read More »

స‌గ‌టు ప్రేక్ష‌కుల కోణంలో.. ప‌వ‌న్ నిర్ణ‌యం ఫ‌లిస్తే.. !

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర‌ స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. త‌న వ‌ద్ద‌కు ప్ర‌త్యేకంగా రావొద్ద‌ని.. ఏదైనా ఉంటే.. సామూహికంగా వ‌చ్చి అధికారుల‌కు స‌మ‌స్య‌లు వివ‌రించాల‌ని కూడా ఆయ‌న తేల్చేశారు. అదే స‌మ‌యంలో కార‌ణాలు ఏవైనా కూడా.. ప‌వ‌న్ ఆగ్ర‌హంతో అనేక రూపాల్లో సినిమా హాళ్ల‌ పై ప్ర‌భావం అయితే ప‌డుతుంది. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న …

Read More »

యోగా తో రికార్డులు టార్గెట్ చేసిన బాబు

ఏపీని ప్ర‌పంచంలోనే ముందుండేలా చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. క‌డ‌ప‌లో జ‌రుగుతున్న మ‌హానాడులో రెండో రోజు మాట్లాడిన ఆయ‌న‌.. యోగా నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్య‌క తీర్మానం చేశారు. వ‌చ్చే నెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి ఏపీ ఆతిథ్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి ప్ర‌ధాని మోడీ హాజ‌రు అవుతున్నార‌ని.. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లువురు ప్ర‌తినిధులు కూడా వ‌స్తున్నార‌న్న ఆయ‌న‌.. ఈ క్ర‌మంలో ఏపీ అభివృద్ధిని కూడా ప్ర‌పంచ స్థాయికి వివ‌రించే కార్య‌క్ర‌మాల‌కు …

Read More »

విచారణకు సారు రెడీ!.. ఏం చెబుతారో?

తెలంగాణలో వచ్చే నెల 5న ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ నుంచి విచారణకు హాజరయ్యే విషయంపై సానుకూలత వ్యక్తం కాగా… విచారణ సందర్భంగా కమిషన్ వేసే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలన్న దానిపై ఆయన ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే తనతో బేటీ …

Read More »

మహానాడు వేదికపై అన్నగారి ప్రత్యక్ష్యం, ప్రసంగం

కడపలో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక మహానాడు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఈ వేడుక ప్రారంభం రోజైన మంగళవాంరం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. అదేంటీ… ఏటా మహానాడు జరుగుతూనే ఉంది కదా… ఈ ఏటి మహానాడు ప్రత్యేకత ఏమిటి? అంటూ కొందరు నొసలు చిట్లించారు. అయితే ఆ ప్రశ్నలకు రెండో రోజైన బుధవారం సిసలైన సమాధానం వచ్చేసింది. 30 ఏళ్ల క్రితం మరణించిన పార్టీ …

Read More »

‘అన్ని వర్గాలు కీర్తించే వ్యక్తి ఎన్టీఆర్’

కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. సంక్షేమానికి సరికొత్త దారి చూపించిన సంఘసంస్కర్త అన్న నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదలకు కూడు, గూడు, …

Read More »

బాబు మార్క్ పాలిటిక్స్ – నేతల ప్రసంగాలకు ర్యాంకులు!

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణకు పెట్టింది పేరు. పార్టీలో తనతో మొదలు సాధారణ కార్యకర్త వరకు అందరూ క్రమశిక్షణతో మెలగాలని చంద్రబాబు కోరుకుంటారు. అంతేకాదు, పనితీరు ఆధారంగా సాధారణ కార్యకర్త నుంచి లోకేష్ వరకు అందరినీ సమానంగా చూడడం చంద్రబాబు నైజం. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ కార్డులివ్వడం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ కు నిదర్శనం. ఈ క్రమంలోనే తాజాగా …

Read More »

ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తాం: ప్ర‌ధాని మోడీ

ఎన్టీఆర్ ఆశ‌యాలు సాధిస్తామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ 102వ‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్ పేద‌ల దేవుడిగా కీర్తి గ‌డించార‌ని చెప్పారు. అభిమాన ధ‌నుడిగా.. తెలుగు జాతి కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేయ‌డంలో ఆయ‌న ఎంతో కృషి చేశార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలోను.. పేద‌ల‌ను ఆదుకోవ‌డంలోనూ.. ఎన్టీఆర్ ఆద‌ర్శ‌ నాయ‌కుడ‌ని ప్ర‌ధాని పేర్క న్నారు. …

Read More »

“వ‌ర్షం వ‌చ్చేట్టుంది.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రారు!”

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఆయ‌న బుధ‌వారం.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని పొదిలి ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి నాలుగు రోజుల కింద‌టే ప్లాన్ చేసు కున్నారు. దీంతో స్థానిక నాయ‌కులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించినట్టు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నా.. అని చెప్ప‌డంతో ఇక్క‌డ స‌భ కూడా పెట్టే అవ‌కాశం ఉంద‌ని భావించిన నాయ‌కులు దానికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే.. …

Read More »

పీక కోస్తున్నా చంద్రయ్య జై టీడీపీ అన్నారు: చంద్రబాబు

టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పసుపుమయమైంది. దేవుని గడప కడపలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు లక్షలాదిగా తరలి వచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగం టీడీపీ కార్యకర్తలను ఉద్వేగానికి లోనయ్యేలా చేసింది. పసుపు సింహం, టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య పీక కోస్తున్నా సరే …

Read More »

అర్థమైందా రాజా?..జగన్ పై లోకేశ్ సెటైర్లు

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలానుగుణంగా పార్టీలో మార్పులు రావాల్సిన అవసరముందని లోకేశ్ అన్నారు. రాబోయే 40 ఏళ్లు పార్టీని విజయవంతంగా నడిపించేందుకు అవసరమైన అంశాలపై చర్చకు మహానాడు వేదిక కావాలని అన్నారు. పార్టీ జెండా ఎత్తినప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు లోకేశ్. …

Read More »

కూట‌మి ప‌దిలం.. క‌లిసి ప‌నిచేస్తాం: చంద్ర‌బాబు

మ‌హానాడు వేదిక‌గా సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన ఆ పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు కూట‌మిపై మాట్లాడుతూ… గ‌త ఎన్నికల్లో కూట‌మి పార్టీలు దిగ్విజ‌యం సాధించాయ‌ని చెప్పారు. 100 ప‌ర్సంట్ స్ట్ర‌యిక్ రేట్‌తో జ‌న‌సేన‌, 98 శాతం స్ట్ర‌యిక్ రేట్‌తో టీడీపీ విజ‌యం సాధించాయ‌ని, ఈ విజ‌య ప‌రంప‌ర మున్ముందు కూడా కొన‌సాగాల‌ని పిలుపునిచ్చారు. అనేక మంది కూట‌మిని స్వాగ‌తించార‌ని.. కొంద‌రు వ్య‌తిరేకించార‌ని చెప్పారు. అయితే.. కూట‌మి పార్టీల ఐక్య‌త‌, విజ‌యం చూసిన …

Read More »