రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ బెంగుళూరులో రెండు రోజుల పాటు సమావేశమైన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆప్ వంటి పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విపక్ష ఫ్రంట్కు I-N-D-I-A (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్) అని పేరు పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు …
Read More »టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తుపై పవన్ కామెంట్స్
ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశానికి ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఎన్డీఏలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన టీడీపీకి మాత్రం కమలనాథుల నుంచి కబురందలేదు. దీంతో, బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఖాయమని, టీడీపీ విడిగానే పోటీ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్ ఏపీలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు …
Read More »సీఎం ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో ఒంగోలు టౌన్లో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తర్వాతి సీఎం ఎన్టీఆరే అంటూ ఏర్పాటైన ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫ్లెక్సీల్లో.. “నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అని రాసి ఉంది. సరిగ్గా లోకేష్ యాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సమయంలోనే జిల్లా …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం.. వైసీపీ ఎంపీ కుమారుడికి బెయిల్
దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈరోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టయి.. జైల్లో ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పిటిషన్పై ఇప్పటికే రెండు సార్లు వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు మంగళవారం తొలికేసుగా పరిగణించి విచారించింది. ఈ క్రమంలోనే రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. …
Read More »సీనియర్లు.. మీరే ఇలా చేస్తారా? సజ్జల ఫైర్..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో వైసీపీ సీనియర్ నాయకుల మధ్య చోటు చేసుకున్న రాజకీయ తుఫాన్పై వైసీపీ అధిష్టానం తక్షణం స్పందించిందనే చెప్పాలి. రామచంద్రపురం టికెట్ను తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్న రాజ్యసభ సభ్యుడు , మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గత రెండు రోజులుగా తీవ్ర హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. రామచంద్రపురంలో ఆదివారం ఆయన.. మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుకు వ్యతిరేకంగా ఉన్నవారితో భేటీ …
Read More »విభజన చట్టానికి ముగింపు కాలం.. వైసీపీ కోర్టులో కీలక బాల్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తూ.. 2014లో కాంగ్రెస్ చేసిన విభజన చట్టానికి కాలం ముగిసిపోతోంది. మొత్తం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా.. ఈ విభజన చట్టాన్ని అప్పట్లో రూపొందించారు. ఈ క్రమంలో ఈ చట్టంలోని అంశాలను పదేళ్ల కాలంలో నెరవేర్చాలని నిర్ధిష్టంగా పేర్కొనకపోయినా.. చట్టం గడువును అనుసరించి పదేళ్ల కాలంలో ఆయా అంశాలను ఏపీకి.. అదేవిధంగా తెలంగాణకు నెరవేర్చాల్సి ఉంది. కానీ, తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే.. ఏపీ …
Read More »కేసీయార్ కు షాక్ ?
జాతీయ రాజకీయాల్లో పరిణామాలు కేసీయార్ కు షాకిచ్చాయనే చెప్పాలి. నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మీటింగ్ జరుగబోతోంది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయమై సలహాలు, సూచనలు తీసుకోవటమే సమావేశం ముఖ్యోద్దేశం. ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగా భాగస్వామ్య పార్టీలనే కాకుండా కొత్తగా మరో ఎనిమిది పార్టీలను కూడా బీజేపీ సమావేశానికి ఆహ్వానించింది. సీన్ కట్ చేస్తే 17,18 తేదీల్లో అంటే …
Read More »మంత్రి సోదరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా ?
మంత్రి సోదరి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఒక ఉద్యోగిని రంగం సిద్ధం చేసుకోవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే వేముల రాధికారెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. వరంగల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా సాధనలో ఉద్యోగ సంఘాల ఆందోళనల్లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణా రాగానే ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అనుకున్నా ఎందుకనో అలా జరగలేదు. అయితే …
Read More »బీజేపీతో పొత్తుపై చర్చిస్తా: పవన్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే, వైసీపీ మినహా టిడిపి, బిజెపి, జనసేనలు పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కొద్ది రోజుల క్రితం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ ఈక్వేషన్ నుండి టిడిపిని వేరు చేశాయి. దీంతో, జనసేన-టీడీపీ లేదా …
Read More »దివికేగిన రాజకీయ దిగ్గజం.. ఊమెన్ చాందీ కన్నుమూత..!
కేరళ పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏళ్ళ ఊమెన్ చాందీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ఉదర, గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నా రు. కాగా.. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న …
Read More »వైసీపీ మైనస్లు.. టీడీపీకి ప్లస్లు అవ్వట్లేదే…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మైనస్లు కోకొల్లలు. దాదాపు 40 నియోజకవర్గాల్లో నాయకులు కీచులాడుకుం టున్నారు. కొన్నిచోట్ల అయితే.. పొలిటికల్ కబడ్డీ స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లోని విశాఖ, కృష్ణా, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు వంటి ప్రాంతాల్లో మంత్రులకు, నాయకులకు పడడం లేదు. ఎమ్మె ల్యేలకు ఎమ్మెల్యేలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక, తమ నియోజకవర్గాలతో సంబంధం లేకపోయినా.. ఆధిపత్య ధోరణి కనిపిస్తున్న జిల్లాలు ఉన్నాయి. …
Read More »పరుచూరులో పాగా వేయలేం.. తేల్చేసిన నేతలు
టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసిన వైసీపీ.. ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తమ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే కుప్పం, టెక్కలి, హిందూపురం, పాలకొల్లు, కొండపి వంటి బలమైన టీడీపీ వర్గం ఉన్న నియోజకవర్గాలపైనా వైసీపీ వ్యూహా త్మకంగా పావులు కదుపుతోంది. ఇక,ఇవన్నీ.. కూడా టీడీపీ ఫైర్బ్రాండ్స్ చేతిలో ఉన్న నియోజకవర్గాలే కావడం గమనార్హం. ఈ జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం పరుచూరు. …
Read More »