బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే దిశగా కుట్రలు జరిగాయని, తాను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్రలు జరిగాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా విరుచుకు పడింది. గురువారం కవిత చేసిన వ్యాఖ్యలకు పలువురు నేతల నుంచి తక్షణ స్పందన కనిపించింది. తాజాగా శుక్రవారం మెదక్ ఎంపీ మాధవనేని రఘనందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి …
Read More »థియేటర్ల రచ్చ… జగన్కు, పవన్కు పోలికా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో థియేటర్ల వ్యవస్థ మీద ఫోకస్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోరుకున్న రేట్లు ఇచ్చి పూర్తి ప్రోత్సాహం అందిస్తుండగా.. తన సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో థియేటర్ల సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇకపై రేట్ల …
Read More »ఇక, గేట్లు మూసేశారా? టీడీపీలో బిగ్ టాపిక్!
మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకునే నాయకుల విషయంలో ఆయన తేల్చిచెప్పేశారు. కోవర్టుల అంశాన్ని ఆయన ప్రధానంగా చర్చించారు. అంతేకాదు, సైలెంట్గా పార్టీ మారి వైలెంట్ వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దీంతో ఇక, జంపింగులకు టీడీపీ గేట్లు మూసేసిందన్న చర్చ మహానాడులోనే జరుగుతుండటం గమనార్హం. ఎందుకిలా? గత ఏడాది ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం చూసిన చాలా …
Read More »ఇది కేసీఆర్కు విషమ పరీక్ష!
రాజకీయాల్లో తలపండిన నాయకుడు అని, తనకంటే వ్యూహ ప్రతివ్యూహాలు వేయగల నాయకుడు లేడని భావించే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏర్పడిన రాజకీయ కల్లోలంతో విషమ పరీక్షకు గురవుతున్నారు. ముందరి కాళ్లకు బంధంలా చుట్టుకున్న కుమార్తె, కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగినా, చివరికి బాధ్యత ఆయనపైనే పడుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది కేసీఆర్కే సమస్యగా మారుతోంది. కవిత రాసిన లేఖ, ఆపై జరిగిన …
Read More »కవిత సినిమా క్లారిటీ..
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ ఎపిసోడ్లో కీలక సస్పెన్స్ దాదాపు తేటతెల్లమైంది. ఆమె ఎవరిని కార్నర్ చేస్తున్నారో.. ఎవరిని ఉద్దేశించి లేఖలు సంధించారో.. కూడా దాదాపు స్పష్టమైంది. పైగా.. ఆమె కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని మాత్రమే చెప్పి ఉంటే.. వేరేగా ఉండేది. కానీ, వేరేవారి నాయకత్వంలో పనిచేయను అని కుండబద్దలు కొట్టేశారు. అంటే.. ప్రస్తుతం జరుగుతున్న బీఆర్ ఎస్ నాయకుల చర్చల ప్రకారం.. రేపో మాపో కేటీఆర్కు పార్టీ …
Read More »వై నాట్ గొడ్డలి పోటు టీడీపీ విధానం కాదు: చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కంపెనీలు రాకపోవడం, ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం, జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం, రాజధాని లేకపోవడం వంటి కారణాలతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పేరు భ్రష్టుపట్టిందని విమర్శలు వచ్చాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరువు నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వేసిన ఓట్లతో …
Read More »తండ్రీకొడుకుల నోట ఆనాటి చేదు జ్ఞాపకం!
టీడీపీ వార్షిక వేడుక మహానాడు కడప కేంద్రంగా గురువారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు రోజు అయిన గురువారం దాదాపుగా 7 లక్షల మందితో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఒకేసారి 7 లక్షలకు పైగా జనం కడపకు రావడంతో కడప నగర పరిసరాలు పసుపు కండువాలతో నిండిపోయింది. చివరి రోజు అశేష జన వాహినిని చూసి ఉప్పొంగిన పార్టీ అధినాయకత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ …
Read More »కేసీఆర్ను శాసిస్తారా? – కవిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు
బీఆర్ఎస్ మేలు కోరుకుంటున్నాను.. మా నాయకుడుగా కేసీఆర్ను మాత్రమే చూస్తున్నానని చెప్పిన కవిత.. తన మాటల ద్వారా అదే కేసీఆర్ను రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ ఇరుకున పడేశారా? ఆయన సమాధానం చెప్పుకొనే పరిస్థితికి కవిత తీసుకువచ్చారా? అంటే.. బీఆర్ ఎస్ నాయకులు అదే మాట అంటున్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు.. పార్టీలోను.. కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నాయకుల్లోనూ చర్చకు వచ్చాయి. కవిత చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా రెండు …
Read More »బ్రేకింగ్.. వల్లభనేని వంశీకి బెయిల్, ఎందుకంటే..
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఎట్టకేలకు గురువారం భారీ ఊరట దక్కిందని చెప్పక తప్పదు. దాదాపుగా వంద రోజులకు పైగా జైల్లో ఉన్న కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వంశీ…చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు… వైద్య చికిత్సల నిమిత్తం వంశీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. …
Read More »దటీజ్ టీడీపీ…మహానాడు వేదికపై కార్యకర్తకు గౌరవం
కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడూరు నుంచి కడపకు 60 ఏళ్ల వయసున్న టీడీపీ కార్యకర్త ఒకరు సైకిల్ తొక్కుకుంటూ మహానాడుకు వచ్చారని, ఇటువంటి కార్యకర్తలు ఉండడం పార్టీకి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. మనందరం ఈ మాదిరిగానే ఉంటే వైఎస్ఆర్ సీపీకి …
Read More »జెండా పీకేస్తాని టులెట్ బోర్డు పెట్టుకున్నారు: లోకేశ్
టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు మూడో రోజుకు చేరుకుంది. చివరి రోజు మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది హాజరు కావడంతో కడప మొత్తం పసుపుమయమైంది. ఈ సందర్భంగా ఈ సభలో ప్రసంగించిన మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జెండా లేకుండా పీకేస్తాం అన్న పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని వైసీపీకి చురకలంటించారు. జెండా పీకేస్తాం అని అన్న …
Read More »3 రోజుల్లో ఇండియాకు రావాల్సిందే: ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు ఆదేశం
తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నమోదైన ఈ కేసులో ప్రధాన నిందితుడుగా.. అప్పటి ఐపీఎస్ అధికారి.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్రావు ఉన్నారు. అయితే.. కేసు నమోదు అవుతుందని తెలిసిన ఆయన వెంటనే.. అమెరికాకు వెళ్లిపోయారు. కానీ.. కేసులో మాత్రం ఆయనను ఏ-1గా పేర్కొన్నారు. అప్పటి నుంచి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates