Political News

పవన్ కు రక్షణ కవచంగా లోకేశ్.. టీడీపీ ముందుజాగ్రత్త

ఏపీ రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు.. తీవ్ర ఆరోపణలు మామూలే. అయితే.. ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు ఎలాంటి స్పందన ఉంటుందన్నది చాలా ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి సాధించిన చారిత్రక విజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఆయన టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేశారే తప్పించి.. జనసేన …

Read More »

జగన్ కు కర్ణాటక మఠం ఆహ్వానం.. విషయం ఏంటంటే?

వైసీపీ అధినేత వై ఎస్ జగన మోహన్ రెడ్డి కి గురువారం ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఎక్కడో కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నందీపుర పీఠం నుంచి ఈ ఆహ్వానం అందింది. ఇందుకోసం నందీపుర పీఠాధిపతులు నేరుగా అమరావతి పరిధిలోని తాడేపల్లి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఏప్రిల్ లో తమ పీఠం నిర్వహించనున్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం భూమిపూజకు హాజరు కావాలని వారు జగన్ ను …

Read More »

30 ఏళ్ల గ్యాప్ కు దగ్గుబాటి, చంద్రబాబు ముగింపు!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…మాజీ రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుల మధ్య రాజకీయపరంగా విభేదాలున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఈ తోడల్లుళ్లు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి దాదాపు 30 సంవత్సరాలయింది. ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న గ్యాప్ పై దగ్గుబాటి వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవునన్నా కాదన్నా..అందరికీ అన్ని విషయాలు తెలుసు. అవన్నీ గతం ఇక…వాటి …

Read More »

హమ్మయ్యా.. వర్మకు భారీ ఊరట దక్కినట్టే

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిజంగానే ఇప్పుడు భారీ ఊరట దక్కినట్టేనని చెప్పాలి. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట అప్పుడెప్పుడో వర్మ తీసిన సినిమాపై తాజాగా సీఐడీ నమోదు చేసిన కేసుపై ఏపీ హై కోర్ట్ స్టే విధించింది. ఈ పరిణామం వర్మకు బూస్టింగేనని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కేసులో వర్మ వినిపించిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా వర్మ వాదనను ప్రస్తావించిన కోర్టు సీఐడీ …

Read More »

బీజేపీ దూకుడు.. దీని ప‌ర‌మార్థ‌మేమి?!

తెలంగాణ‌లో బీజేపీ దూకుడు పెరిగిందా? ఆ పార్టీ పుంజుకుంటోందా? అంటే.. తాజాగా జ‌రిగిన‌ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ క‌మ‌ల నాథుల వికాసాన్ని బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ఒక‌టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అయితే.. రెండు ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీల స్థానాలు ఉన్నాయి. వీటిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్‌.. పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. విజ‌యం ద‌క్కించుకునేందుకు సీఎం …

Read More »

నెక్స్ట్ దువ్వాడే..కేసుల వెల్లువ!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే దువ్వాడపై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే, పవన్ ను కించపరిచేలా మాట్లాడిన దువ్వాడపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, దువ్వాడపై కేసుల పరంపర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దువ్వాడపై గుంటూరులో …

Read More »

బ‌న‌క‌చ‌ర్ల నిర్మించి తీరుతాం.. కేంద్రానికి కూడా చెప్పా: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలోని బ‌న‌క‌చ‌ర్ల‌లో కీల‌క సాగునీటి ప్రాజెక్టును నిర్మించి తీరుతామ‌ని.. దీనికి ఎవ‌రు అడ్డు ప‌డినా.. అది ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మేన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు బుధ‌వారం పొద్దు పోయాక‌.. మీడియాతో మాట్లాడారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును ప్రారంభించ‌కుండానే.. ప్ర‌తిపాద‌న ద‌శ‌లో కొంద‌రు అడ్డు ప‌డుతున్నా ర‌ని.. దీనిపై కేంద్రానికి వివ‌రించామ‌ని చెప్పారు. గోదావ‌రి జిలాలు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తున్నాయ‌ని.. వాటిని వినియోగించుకుని …

Read More »

‘కాకినాడ’ దెబ్బ ఇంత గట్టిగా తగిలిందా?

భారత పారిశ్రామిక విఫణిలో బుధవారం ఓ కీలక పరిణామం వెలుగు చూసింది. దేశీయ ఫార్మా రంగంలో సత్తా చాటుతున్న అరబిందో ఫార్మా… సింగపూర్ కంపెనీతో చేసుకున్న అత్యంత కీలకమైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సాధారణంగా కీలక ఒప్పందాలు… ప్రత్యేకించి అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు రద్దు చేయాల్సి వచ్చినప్పుడు అందుకు గల కారణాలను ఆయా కంపెనీలు వెల్లడిస్తూ ఉంటాయి. ఆ ఒప్పందాల రద్దుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ విచారం వ్యక్తం …

Read More »

జగన్ ది సీక్రసీ… బాబుది ఓపెన్ టాప్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో వరుస భేటీలు వేశారు. ఈ భేటీల్లో రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాల్సిన అంశాలను సమగ్రంగా ప్రస్తావించడంతో పాటుగా …

Read More »

రాహుల్ గాంధీపై రూ.200 జరిమానా

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి మరోసారి న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్రలో స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా 2022లో నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి, ఆయన బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే రాహుల్ గాంధీ వ్యక్తిగత కారణాలు చూపుతూ హాజరు కాలేదు. దీనిపై కోర్టు స్పందిస్తూ రూ.200 జరిమానా విధించింది. ఈ మొత్తం విచారణలో వాదన వినిపించిన ఫిర్యాదుదారుడి న్యాయవాదికి అందజేయాలని …

Read More »

‘వివేకా హత్య’ ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి అప్పుడే ఆరేళ్లు కావస్తోంది. ఈ నెల 15వ తేదీకి వివేకా హత్యకు ఆరేళ్లు నిండనున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ కేసు దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు గానీ… ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగన్న బుధవారం చనిపోయాడు. వివేకా ఇంటి వద్ద రంగన్న వాచ్ …

Read More »

మీనాక్షి మార్కు!.. 3 వర్గాలుగా టీ కాంగీయులు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలో ఒకింత ఈజీనెస్ కనిపిస్తోంది. కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీ నియమావళిని పాటిస్తున్న నేతలు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్లు ఉన్నారు… జూనియర్లూ ఉన్నారు. ఎవరూ ఇందుకు మినహాయింపు కాదు. పాత కాపులు కట్టు దాటుతున్నారు. కొత్త కాపులూ ఇష్టారాజ్యం అంటున్నారు. ఇలాగైతే కుదరదంటూ పార్టీ అధిష్ఠానం అప్పటిదాకా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న …

Read More »