Political News

‘కొత్తకోట’ లాంటోళ్లు అరుదుగా వస్తారంతే

ఇప్పుడున్న రాజకీయాల్లో నిన్నటి లెక్క నిన్నటిదే. ఇవాల్టి లెక్క ఇవాల్టిదే. ఫక్తు వ్యాపారంగా మారిపోయిన రాజకీయాల్లో.. కొత్తకోట దయాకర్ రెడ్డిలాంటి వారి ఉదంతాలు విన్నప్పుడు.. అలాంటి వారు వెళ్లిపోతున్న వైనానికి వేదన కలిగించక మానదు. తమకు స్థాయిని కల్పించే పార్టీని నమ్ముకొని ఉండిపోవటమే తప్పించి.. పదవుల కోసం పార్టీలు మారేందుకు సుతారం ఇష్టపడని పాతతరం నాయకులకు కొత్తకోట లాంటోళ్లు నిలువెత్తు చిహ్నాలు. తాను నమ్మిన తెలుగుదేశంలో ఉండిపోయి.. చివరకు ఆ …

Read More »

మీడియా ప్రముఖుడి అరెస్టు !

ప్రముఖు మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆయన్ను.. పీకే అయ్యర్.. డీసీ అడిటర్ మణి ఊమెన్ లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. బ్యాంక్ ను మోసం చేయటం.. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. పలు బ్యాంకుల నుంచి రూ.8800 కోట్లను రుణం తీసుకున్న వెంకట్రామిరెడ్డి ఆ భారీ మొత్తాన్ని తిరిగి …

Read More »

సోముకు అమిత్ షా క్లాస్‌.. రీజ‌నేంటి..?

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు కేంద్ర మంత్రి అమిత్ షా క్లాస్ ఇచ్చారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ సిట్టింగు స్థానాన్ని కోల్పోవ‌డం.. క‌న్నా లక్ష్మీనారాయ‌ణ స‌హా.. కేడ‌ర్ పార్టీకి దూరంగా ఉండ‌డం.. పార్టీ మారిపోవ‌డం స‌హా.. అనేక లోతుపాతుల గురించి.. అమిత్ షా కూలంక‌షంగా చ‌ర్చించార‌ని తెలిసింది. నిజానికి అమిత్‌షా విశాఖ ప‌ర్య‌ట‌న‌కు ముందు…త‌మిళ‌నాడులో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ చేశారు. …

Read More »

ఏపీలో బీజేపీ టార్గెట్ ఆ 5 లోక్‌స‌భ సీట్లేనా…!

తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. రాష్ట్రంలోని పార్ల‌మెంటు స్థానాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారా? ఇక్క‌డి పార్ల‌మెంటు స్థానాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంపై ఆయ‌న చ‌ర్చించారా? ఈ క్ర‌మంలో కొంద‌రి ప్రొఫైళ్ల‌ను కూడా ఆయ‌న సేక‌రించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయ బీజేపీ రాష్ట్ర నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు. రాష్ట్రంలో మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో వ‌చ్చే …

Read More »

డిసెంబరులో ఏపీ ఎన్నికలు… పవన్ బ్రేకింగ్ ఇది !

Pawan kalyan

జనసేన అధినేత నోటి నుంచి బ్రేకింగ్ న్యూస్ మాట వచ్చింది. మొన్నటికి మొన్న కేబినెట్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల్ని కొట్టిపారేయటం తెలిసిందే. కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న మాటను స్పష్టం చేశారు. ఇంత క్లారిటీగా ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి ఎన్నికల మాట వచ్చినప్పటికీ జనసేనాని మాత్రం అందుకు భిన్నంగా చేసిన తాజా వ్యాఖ్య …

Read More »

రెచ్చిపోయిన ప్రియాంక

Priyanka Gandhi

మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం కాంగ్రెస్ నేతలకు మంచి టానిక్ లాగ పనిచేస్తోంది. అదేఊపుతో ఈ ఏడాదిలో జరగబోయే నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణా, రాజస్ధాన్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్లో ప్రియాంక బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రియాంకను చూడటానికి జనాలు కూడా విరగబడ్డారు. ముఖ్యంగా …

Read More »

టీ కాంగ్రెస్ లో డీకే కీలక పాత్ర ?

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో డీకే జాతీయస్ధాయిలో బాగా పాపులర్ అయిపోయారు. ఇపుడు కాంగ్రెస్ రాజకీయాల్లోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా డీకే శివకుమార్ అంటే మంచి క్రేజ్ వచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో డీకే పడిన కష్టం అంతా ఇంతాకాదు. అలాంటి డీకేని అధిష్టానం తెలంగాణా ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ప్రస్తుతానికి డీకే మంత్రాంగమంతా ఫోన్లమీదే నడుస్తోందట. అవసరమైన నేతలు బెంగుళూరుకు …

Read More »

జగన్ ప్రకటనలో లాజిక్కుందా ?

పల్నాడులో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తనకు బీజేపీ మద్దతు కూడా ఉండదన్నారు. నిజానికి బీజేపీ-వైసీపీ మిత్రపక్షాలేమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అయితే కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య మంచి సఖ్యత లేదా అవగాహన ఉందన్నది వాస్తవం. మొదట్లో జగన్ విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోయినా కొంతకాలంగా బాగానే మద్దతిస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం ఏపీకి సుమారు రు. 24 వేల కోట్లు విడుదల చేయటం …

Read More »

‘జనం రావట్లేదని జగన్ కన్నీరు పెట్టుకున్నారు’

రాజకీయాల్లో బలమైన నేతల హవానే వేరు ఉంటుంది. కాలక్రమంలో కొన్ని రాజకీయ కుటుంబాల ఫేమ్ తగ్గొచ్చు. కానీ.. వారి గతాన్ని చూస్తే.. ఇన్ని జరిగాయా? అన్న విస్మయం కలుగక మానదు. వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలగటమే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నంతనే రెబల్ రాజకీయ కుటుంబంగా కొండా ఫ్యామిలీకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్ని కావు. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే కొండా దంపతులు.. తాజాగా …

Read More »

మోక్షజ్ఞ ఎంట్రీకి పూరి ?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రూట్ క్లియరయ్యేలా ఉంది. ఇప్పటికే బాగా సన్నబడిన లుక్స్ తో బాలయ్య ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచిన మోక్షజ్ఞ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ తరహాలో అతి తక్కువ టైంలో శరీరంలో తెచ్చుకున్న మార్పుకి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు తన తెరంగేట్రం ఎప్పుడనే దాని మీదే అందరి చూపూ ఉంది. సెప్టెంబర్ 6 …

Read More »

అమిత్ షాను అనే ధైర్యం ఉందా?

నాలుగేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ పేరుకే వైరి ప‌క్షాలు కానీ.. తెర వెనుక ఈ రెండు పార్టీలు ఒక‌దానికి ఒక‌టి స‌హ‌కారం అందించుకుంటున్నాయ‌న్న‌ది స్ప‌ష్టం. బీజేపీని వైసీపీ వాళ్లు ఎప్పుడూ గ‌ట్టిగా విమ‌ర్శించరు. అలాగే కేంద్రంలో ఎన్డీఏ స‌ర్కారుకు ఎప్పుడు ఏ మ‌ద్ద‌తు కావాల‌న్నా అందిస్తారు. అలాగే బీజేపీ కూడా జ‌గ‌న్ అండ్ కోకు ప‌రోక్షంగా త‌మ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న విష‌యం అనేక అంశాల్లో స్ప‌ష్టంగా వెల్ల‌డైంది. …

Read More »

జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల దించుకోవాలి: నిప్పులు చెరిగిన అమిత్ షా

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల‌దించుకో వాలని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పితే మరేం లేదని, జగన్‌ పాలనలో విశాఖపట్టణం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. షా అన్నారు. విశాఖపట్టణం రైల్వే గ్రౌండ్‌లో రాష్ట్ర బీజేపీ నిర్వ‌హించిన బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …

Read More »