బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయనపై సీఐడీ కేసు ఉంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఆరోపణలు చేసే ముందు.. ఆలోచన ఉండాలని.. అదేవిధంగా ఆధారాలు కూడా ఉండాలని పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఫ్యాషన్గా మారిందా? అని ప్రశ్నించడం గమనార్హం. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ఆరోపణలపై వివరణ …
Read More »కొత్త నిర్ణయం: ఏపీలో `షైనింగ్ స్టార్` అవార్డులు..
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్స హించేందుకు నడుం బిగించింది. కొత్తగా `షైనింగ్ స్టార్` అవార్డులను ప్రకటించింది. వీటిని 10, ఇంటర్ చదవి విద్యార్థులకు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు.. విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఈ …
Read More »నాడు ‘లడ్డూ’ తయారీకి వాడింది నెయ్యే కాదట!
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా ఓ మంచి గుర్తింపు ఉంది. తిరుమల లడ్డూకు ఉన్న రుచి మరే లడ్డూకు రాదు. రాబోదు కూడా. భక్త కోటి మహా ప్రసాదంగా పరిగణించే వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీకి ఎంపిక చేసిన విక్రయదారుల నుంచే దినుసులను టీటీడీ కొనుగోలు చేస్తుంది. 2019 దాకా అంతా బాగానే జరిగినా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పుణ్యమా అని తిరుమల లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యి …
Read More »ట్రంప్ తో కిరికిరి.. ఒక్కరోజే 12 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికాలో రాజకీయ రంగంలో మాటల యుద్ధం షేర్ మార్కెట్ను తాకుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య తెరపైకి వచ్చిన వివాదం టెస్లా షేర్లను మట్టికరిపించింది. ఒక్కరోజే టెస్లా షేర్లు 14 శాతం వరకు క్షీణించడంతో, కంపెనీ మార్కెట్ విలువ నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది. ఇది టెస్లా చరిత్రలోనే రోజు వ్యవధిలో వచ్చిన అతిపెద్ద నష్టం. 2024 చివరినుంచి తిరిగి ట్రాక్లోకి …
Read More »జూన్ 12న ఏపీలో మామూలుగా ఉండదు!
నిజమేనండోయ్… ఈ నెల 12న ఏపీలో మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదంటే ఏమిటీ? అంటారా? ఆనాడు ఏపీలో నెలకొనే సంబరాలకు సరిపడ పేరు తట్టడం లేదు మరి. అందుకే ఆ రోజు ఏపీలో మామూలుగా ఉండదని మాత్రం చెప్పగలం. అయినా ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటారా? జూన్ 12న ఏపీలో కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తి అయ్యి… కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భాన్ని …
Read More »బాబు మార్కు!… ఇకపై ‘సీడ్ రాఖీ’లదే ట్రెండ్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అంతా విజనరీ అని అంటూ ఉంటారు గానీ… బాబు విజనరీ మాత్రమే కాదు ట్రెండ్ సెట్టర్ కూడా. ఏ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తనదైన శైలి సూచనలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు నోట ఓ కొత్త మాట వినిపించింది. అదే సీడ్ రాఖీ. దేశంలో 2018లోనే సీడ్ రాఖీ మాట వినిపించినా ఇప్పటికీ అది దేశవ్యాప్తంగా విస్తరించలేదనే చెప్పాలి. మెజారిటీ జనం ఇప్పటిదాకా …
Read More »వైసీపీకి ఛాన్స్ ఇవ్వని కూటమి.. వాట్ నెక్ట్స్ … !
వైసీపీ ఒకటి అంటే.. కూటమి నాలుగు వాయించేస్తోంది. వైసీపీ నుంచి ఒక్కరు బయటకు వస్తే.. కూటమి పార్టీల నుంచి బలమైన నాయకులు నలుగురు వస్తున్నారు. వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే రాజకీయం. వైసీపీ ఏడాది పాటు మౌనంగా ఉండి.. తర్వాత.. చేపట్టిన కార్యక్రమం వెన్నుపోటు దినం. అయితే.. దీనికి పోటీగా కూటమి కూడా పలు కార్యక్రమాలు చేపట్టింది. పీడ విరగడైందని.. పేర్కొంటూ.. జనసేన నాయకులు రోడ్డెక్కారు. ఇక, సమతా …
Read More »నేతలు ఇలా పడిపోతున్నారేంటి?.. ఈ రోజు కొండా వంతు!
అదేంటో గానీ తెలుగు నేలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా కుప్పకూలి పడిపోతున్నారు. నిన్నటికి నిన్న ఏపీలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో మైకు పట్టుకుని మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా గురువారం తెలంగాణ వంతు వచ్చినట్టుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ మహిళా నేత, మంత్రి కొండా సురేఖ …
Read More »బెంగుళూరు విషాదం.. డిప్యూటీ సీఎం కన్నీళ్లు!
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ విషాదంగా మారిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన వేళ, గేటు నెం.7 వద్ద తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక …
Read More »జగన్ చెట్లు నరికిస్తే!… బాబు నాటుతున్నారు!
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు గురువారం రాజధాని అమరావతి పరిధిలోని అనంతవరంలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో కోటి మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించగా… పవన్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా చెట్లను నాటి బాబు, పవన్ లు ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ …
Read More »మాజీ ఐపీఎస్.. న్యాయ శాస్త్ర పరీక్ష – జగన్ కోసమేనా?
ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, గత 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన.. ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) తాజాగా న్యాయశాస్త్ర పరీక్షకు హాజరయ్యారు. ఏపీలో లాసెట్ ఎంట్రన్స్ టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ పరీక్షకు ఆయన రావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ ఎంట్రన్స్ను గురువారం నిర్వహించారు. లా చదివేందుకు వయో పరిమితి నిబంధనలు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏబీవీ …
Read More »జగన్కు ముందున్నది ముళ్ల దారే.. !
వైసీపీ అధినేత జగన్కు ముందున్నది ముళ్లదారే. ఈ విషయంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. ఆయన అనుకున్నట్టుగానో.. ఆయన ఊహించుకుంటున్నట్టుగానో.. ఏదీ సానుకూలంగా జరుగుతుందని భావించే పరిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా చేపట్టిన `వెన్నుపోటు దినం` దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే.. ఆయన అనుకున్న విధంగా అయితే.. ఈ నిరసన సాగలేదు. పైగా గతంలో వైసీపీ పాలనలో పదవులు పొందినవారే.. ఇప్పుడు తీవ్ర విమర్శలతో చెలరేగిపోయారు. జగన్ నేరచరిత్ర ఇదీ అంటూ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates