Political News

లాంఛనం పూర్తి… 10 మంది ఏకగ్రీవం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదేసి స్థానాల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదికార కూటములకు ఏకంగా 9 స్థానాలు దక్కగా…విపక్షానికి సింగిల్ సీటు మాత్రమే దక్కడం గమనార్హం. అటు తెలంగాణతో పాటుగా ఇటు ఏపీలోనూ ఐదేసి స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా… వాటికోసం ఐదేసి నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దాఖలైన నామినేషన్లన్నీ సరిగానే ఉండటంతో వాటిని అనుమతించిన అధికారులు… ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఐదేసి …

Read More »

ఏయూ మాజీ వీసీ ప్రసాద రెడ్డిపై లోకేశ్ ఫైర్

వైసీపీ హయాంలో రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారిని యూనివర్సిటీలకు వీసీలుగా నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖలోని ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీని మాజీ వీసీ ప్రసాద రెడ్డి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆఫీసుగా మార్చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అనుకూలంగా …

Read More »

లోకేశ్ మాటిచ్చారంటే.. ఇలాగే ఉంటుంది

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఒక్కసారి మాటిచ్చారా? ఇక ఆ పని అయిపోయినట్టే. వాయిదా ఉండదు. జాప్యం అసలే ఉండదు. యుద్ధ ప్రాతిపదికన అంటాం కదా.. అలా గంటల వ్యవధిలోనే సదరు పనిని పూర్తి చేసే కార్యాచరణ ప్రారంభమైపోతుంది. అంతేనా… సదరు పని లోకేశ్ నిర్దేశించిన సమయంలోగానే పూర్తి అయి తీరుతుంది. అలా ఎందుకు అవుతుందంటే.. దానిపై లోకేశ్ అనుక్షణం ఓ కన్నేసి ఉంచుతారు …

Read More »

‘జయకేతనం’తో జనసేన రేంజి ఎల్లలు దాటినట్టే!

ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి జనసేన శుక్రవారంతో 11 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని చిత్రాడలో శుక్రవారం జనసేన ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు పవన్ కల్యాణ్ ‘జయకేతనం’ అనే పేరు పెట్టారు. జనసేన.. జయకేతనం… …

Read More »

బోరుమంటూ ఏడ్చేసినా బెయిల్ దక్కలేదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని సీఐడీ పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గుంటూరు కోర్టులో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు బెయిల్ ఇవ్వాల్సిందేనని… లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ పోసాని… న్యాయమూర్తి ముందు బోరుమంటూ విలపించారు. కళ్లల్లో కన్నీళ్లు ధారగా …

Read More »

సాయిరెడ్డిపైనా వైసీపీ దాడి షురూ!

వైసీపీ భవిష్యత్తు కోసం సలహాలు, సూచనలు ఇచ్చే వారిని ఆ పార్టీ నేతలు ఓ రకమైన దృష్టితో చూస్తుండటం అందరికీ తెలిసిందే. ఈ సలహాలు, సూచనలు తమకు అనుకూలంగా ఉన్నంత వరకు ఓకే… అవే సలహాలు తమను కాస్తంత ఇబ్బంది పెట్టాయన్న ఫీలింగ్ వచ్చిందంటే.. వైసీపీకి చెందిన నేతలు వరుసబెట్టి మరీ ఎదురు దాడికి దిగుతారు. అలాంటిది మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి… ఆపై రాజకీయాలనే వదిలేసి …

Read More »

ఆర్జీవీని ఎంత అడిగినా..

ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసి దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా వెలుగొందాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఆ తర్వాత ఆయన్నుంచి ఎంత నాసిరకం సినిమాలు వచ్చాయో తెలిసిందే. అది చాలదన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయోజనం పొందుతూ ఆ పార్టీ ప్రత్యర్థుల మీద చీప్ సినిమాలు తీయడం.. దారుణమైన కామెంట్లు చేయడం.. ఇలాంటి పనులెన్నో చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు వర్మ. కంటెంట్ అయిపోయి సరైన …

Read More »

గివేం మాటలన్నా?… ఇరువైపులా కట్టు దాటారే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజుననే రచ్చ సాగింది. ఈ రచ్చ జరిగింది సభలో కాదు. సభ ముగిసిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిన తర్వాత ఈ రచ్చకు రాష్ట్ర ముఖ్యమంత్రే తెర తీశారని చెప్పక తప్పదు. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు వచ్చారు. ఫలితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. కేసీఆర్ రాకతో ఈ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయన్న …

Read More »

కేసీఆర్ ఆట మొదలైనట్టేనా..?

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తన ఆట తిరిగి మొదలుపెట్టారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు అప్పుడే మొదలైపోయాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకే రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని ఎరవలి ఫాం హౌస్ లో చాలా …

Read More »

జగన్ పై సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి… ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన పేరుపడ్డ వేణుంబాక విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు షేర్ల బదిలీపై నమోదు అయిన కేసులో సాయిరెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి విచారణ అనంతరం విజయవాడలో మీడియాతో …

Read More »

జగన్ కు, కేసీఆర్ కు ఎంత తేడా..?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అధికార, విపక్షాల సభ్యులంతా దాదాపుగా హాజరయ్యారు. చాలా కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బుధవారం నాటి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును చూసిన వెంటనే… మొన్నామధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార …

Read More »

సంబరాల వేళ చెవిరెడ్డికి షాక్

Chevireddy Bhaskar Reddy

వైసీపీకి చెందిన కీలక నేతలకు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, చోటామోటా నేతలు కూడా విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలపై ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటుగా వారిలో కొందరిని అరెస్టు కూడా చేసింది. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు …

Read More »