అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మునిసిపాలిటీ పాలకవర్గాన్ని ఆ పార్టీ చేజిక్కించుకుంది. ఈ మేరకు శనివారం నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఏమంత శ్రమ పడకుండానే…పాలకవర్గం వైసీపీ నుంచి జనసేనకు అలా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. …
Read More »పిక్ ఆఫ్ ది డే… వర్మతో బాబు షేక్హ్యాండ్
ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ కీలక నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేయి చాపగా.. వర్మ చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఈ సన్నివేశం అక్కడున్న వారితో పాటుగా ఈ ఫొటోను చూసిన వారందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఈ సందర్భంగా వర్మ పక్కనే ఉన్న ఏపీ అసెంబ్లీ …
Read More »అమెరికాలో భారత సంతతికి చెందిన కౌన్సిలర్పై గ్యాంబ్లింగ్ ఆరోపణలు!
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా ఆపరేషన్ నడిపినట్టు ఆరోపణలు వచ్చాయి. న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఆనంద్ షా రాకెటీరింగ్, గ్యాంబ్లింగ్, మనీల్యాండరింగ్ లాంటి ఆరోపణలకు పాల్పడ్డారని వెల్లడించారు. మొత్తం 39 మందిపై కేసులు నమోదు కాగా, 42 ఏళ్ల ఆనంద్ షా ఆ లిస్టులో ఉన్నట్లు అధికారికంగా …
Read More »సుప్రీం తీర్పు : గవర్నర్ ఆమోదం లేకుండానే… చట్టాలుగా 10 తమిళ బిల్లులు
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ… అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా విచారణ సాగుతున్న ఓ కీలక అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం తమిళనాడులోని డీఎంకే సర్కారుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఆమోదంతో పని లేకుండానే… డీఎంకే సర్కారు ప్రతిపాదించిన 10 బిల్లులు చట్టాలుగా మారిపోయాయి. ఈ పరిణామం దేశంలోనే అరుదైన ఓ కొత్త సంస్కృతికి నాందీ పలికిందన్న వాదనలూ …
Read More »ఉచితాలతో మభ్యపెట్టాలని చూశారు: వెంకయ్య కామెంట్స్
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు. ఆయన మాటే.. సెటైర్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాస-యాస కలగలిపి కుమ్మేయడంలో వెంకయ్యను మించిన నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన ఇదే పంథాలో ముందుకు సాగారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. `అధికారం పోయిందని కొందరు …
Read More »అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ శనివారం ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని ఐడీ స్పష్టం చేశారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చనిపోయారని ప్రకటించారు. ఈ …
Read More »బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి అని.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాకారమని ఆయన స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఈ లక్ష్యంతోనే తీసుకువచ్చి నట్టు చంద్రబాబు చెప్పారు. కడప జిల్లా ఒంటిమిట్లలోని ప్రముఖ రామాలయంలో ప్రభుత్వం తరఫున శుక్రవారం రాత్రి సీతారా ముల కల్యాణం జరిగింది. వాస్తవానికి శ్రీరామ నవమి సందర్భంగా గత ఆదివారం …
Read More »తమిళనాడుకు మంచి రోజులు: పవన్ కల్యాణ్
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగతిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. పొత్తు ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను …
Read More »పవన్ కొడుకును కాపాడినోళ్లు భారతీయులే.. సింగపూర్ సత్కారం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరిన మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రమాదం నుంచి …
Read More »పవన్ కుమారుడిపై అనుచిత పోస్టు.. కేసులు నమోదు
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ మొన్న సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ రంగ ప్రముఖులు… చివరాఖరుకు పవన్ పై …
Read More »గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించిన గోరంట్లతో పాటు ఆయన ఐదుగురు అనుచరులకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వైసీపీకి చెందిన మరో నేత జైలు బాట పట్టినట్టైంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ …
Read More »అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. స్టాలిన్ కు కష్టమే
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే) అలియాస్ అన్నాడీఎంకేతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఈ ఒప్పందం కుదరింది. బీజేపీ రాష్ట్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates